టైటిల్ దిశగా గుకేశ్
క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో సంచలన ప్రదర్శనతో సాగిపోతున్న భారత యువ సంచలనం గుకేశ్ టైటిల్కు చేరువయ్యాడు. మరో రౌండ్ మాత్రమే మిగిలివున్న ఈ టోర్నీలో గ్రాండ్మాస్టర్ గుకేశ్ ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు.
టొరంటో: క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో సంచలన ప్రదర్శనతో సాగిపోతున్న భారత యువ సంచలనం గుకేశ్ టైటిల్కు చేరువయ్యాడు. మరో రౌండ్ మాత్రమే మిగిలివున్న ఈ టోర్నీలో గ్రాండ్మాస్టర్ గుకేశ్ ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. 13వ రౌండ్లో ఫిరౌజా అలీరెజా (ఫ్రాన్స్)పై గుకేశ్ విజయం సాధించాడు. మొత్తం 8.5 పాయింట్లతో ఒంటరిగా ఆధిక్యంలో నిలిచాడు. మరో గేమ్లో ఇయాన్ నెపోమ్నియాషి (8 పాయింట్లు- రష్యా)తో నకముర (8- అమెరికా) డ్రా చేసుకున్నాడు. నెపోమ్నియాషి, నకముర, ఫాబియానో కరువానా (అమెరికా) ఎనిమిదేసి పాయింట్లతో ఉమ్మడిగా ద్వితీయ స్థానంలో ఉన్నారు. ప్రజ్ఞానంద, విదిత్ గుజరాతి ఆరేసి పాయింట్లతో సంయుక్తంగా అయిదో స్థానంలో కొనసాగుతున్నారు. చివరి రౌండ్లో గెలిస్తే ఇతర సమీకరణాలతో సంబంధం లేకుండా క్యాండిడేట్స్ టైటిల్ గుకేశ్ సొంతమవుతుంది. అదే జరిగితే 17 ఏళ్ల గుకేశ్.. చైనా గ్రాండ్మాస్టర్ డింగ్ లిరెన్తో ప్రపంచ ఛాంపియన్షిప్ టైటిల్ పోరుకు అర్హత సాధిస్తాడు. మహిళల విభాగంలో వైశాలి వరుసగా నాలుగో విజయం నమోదు చేసింది. 13వ రౌండ్లో లీ టింగ్జీ (చైనా)పై వైశాలి (6.5) గెలుపొందింది. అనా ముజిచుక్ (ఉక్రెయిన్)తో కోనేరు హంపి (6.5) డ్రా చేసుకుంది. తాన్ జోంగ్యీ (చైనా) 8.5 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విజయాన్ని లాగేసుకున్నారు
వారెవ్వా ఏం మ్యాచ్! ఉప్పల్లో ఎన్ని మలుపులో! రాజస్థాన్, హైదరాబాద్లతో గెలుపు దోబూచులాడగా కడ బంతి వరకూ రసవత్తరంగా సాగిన పోరు అభిమానులను ఉర్రూతలూగించింది. హోరాహోరీ పోరులో పట్టువదలని సన్రైజర్స్.. రాయల్స్ నుంచి విజయాన్ని లాగేసుకుంది. -
నితీశ్ నిలకడగా
విశాఖ కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి నిలకడగా రాణిస్తూ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో కీలక ఆటగాడిగా ఎదుగుతున్నాడు. నిరుడు కేవలం పేసర్గా రెండు మ్యాచ్లాడిన అతను.. ఈ సీజన్లో టాప్ఆర్డర్ బ్యాటర్గా సత్తాచాటుతున్నాడు. -
అందుకే నలుగురు స్పిన్నర్లు
టీ20 ప్రపంచకప్కు నలుగురు స్పిన్నర్లు కావాలనే విషయంలో జట్టు మేనేజ్మెంట్ చాలా స్పష్టతతో ఉందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. టోర్నీ కోసం 15 మందిని ఖరారు చేయడంలో ఐపీఎల్ పాత్ర స్వల్పమని చెప్పాడు. -
భారత అమ్మాయిలదే సిరీస్
బంగ్లాదేశ్తో టీ20 సిరీస్లో భారత అమ్మాయిలు దూకుడు కొనసాగిస్తున్నారు. మరో రెండు మ్యాచ్లు మిగిలి ఉండగానే అయిదు టీ20ల సిరీస్ను 3-0తో కైవసం చేసుకున్నారు. -
భారత్కు షాక్
రెండేళ్ల కిందట.. ప్రపంచ పురుషుల టీమ్ ఛాంపియన్షిప్గా పరిగణించే థామస్ కప్లో భారత్ అద్భుత విజయం సాధించింది. మొట్టమొదటి సారి ఈ టైటిల్ను దక్కించుకుని చరిత్ర సృష్టించింది. -
సెమీస్లో నలుగురు భారత బాక్సర్లు
ఆసియా అండర్-22, యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో నలుగురు భారత బాక్సర్లు సెమీఫైనల్కు దూసుకెళ్లారు. గురువారం అండర్-22 విభాగంలో జాదుమణి (51 కేజీలు), నిఖిల్ (57 కేజీలు), -
మహిళల హాకీ కెప్టెన్గా సలీమా టెటె
గోల్కీపర్ సవిత పునియా స్థానంలో మిడ్ఫీల్డర్ సలీమా టెటె భారత మహిళల హాకీ కెప్టెన్గా నియమితురాలైంది. ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్ బెల్జియం, ఇంగ్లాండ్ అంచెలలో పోటీపడే 24 మంది సభ్యుల భారత జట్టుకు సలీమా నాయకత్వం వహించనుంది. -
పేద చిన్నారుల కోసం బోపన్న
భారత అగ్రశ్రేణి టెన్నిస్ ఆటగాడు రోహన్ బోపన్న ఓ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. వెనుకబడిన వర్గాలకు చెందిన పిల్లలకు శిక్షణ అందించేందుకు సిద్ధమయ్యాడు. -
పాక్ జట్టులో రవూఫ్
ఐర్లాండ్, ఇంగ్లాండ్లతో టీ20 సిరీస్లలో తలపడే పాకిస్థాన్ జట్టులో పేసర్ హారిస్ రవూఫ్ చోటు దక్కించుకున్నాడు. పాకిస్థాన్ సూపర్ లీగ్లో ఆరంభ మ్యాచ్ల్లో ఆడిన రవూఫ్ ఆ తర్వాత గాయంతో క్రికెట్కు దూరమయ్యాడు. -
వాళ్లకి క్రికెట్ పరిజ్ఞానం లేదేమో: ఏబీ
విరాట్ కోహ్లి స్ట్రైక్రేట్ గురించి.. అతడి ఆటతీరు గురించి మాట్లాడేవాళ్లకు క్రికెట్ పరిజ్ఞానం లేదని అనిపిస్తుందని దక్షిణాఫ్రికా మాజీ స్టార్ ఏబీ డివిలియర్స్ అన్నాడు. మిడిల్ ఓవర్లలో విరాట్ సరిగా రాణించలేకపోతున్నాడని..