ఈ కుర్రాడు.. అసామాన్యుడు
కాదు అనుకున్నది చేసి చూపించడం.. ఓటమి తప్పదు అనుకున్న చోట గెలిచి రావడం ఆ కుర్రాడి నైజం. అంచనాలకు మించి రాణించడం.. అద్భుతమైన ఆటతీరుతో అబ్బురపరచడం అతనికి అలవాటు.
కాదు అనుకున్నది చేసి చూపించడం.. ఓటమి తప్పదు అనుకున్న చోట గెలిచి రావడం ఆ కుర్రాడి నైజం. అంచనాలకు మించి రాణించడం.. అద్భుతమైన ఆటతీరుతో అబ్బురపరచడం అతనికి అలవాటు. 12 ఏళ్లకే గ్రాండ్మాస్టర్గా నిలిచినా.. 17 ఏళ్లకే ప్రపంచ ఛాంపియన్షిప్లో పోటీపడే ఛాన్స్ కొట్టేసినా అతనికే చెల్లింది. చెస్ బోర్డు ఎదురుగా ఉంటే.. ఆ పావులతో అతను గెలుపు ఎత్తులు వేస్తాడు. ప్రత్యర్థి ఎవరైనా సరే భయమన్నదే లేకుండా చిత్తుచేస్తాడు. ఆ కుర్రాడే దొమ్మరాజు గుకేశ్. ఎత్తుల్లో ఎదుగుతున్న అసామాన్యుడు అతడు.
ఈనాడు క్రీడావిభాగం
‘‘ఈ టోర్నీలో భారత అవకాశాలు స్వల్పమే. మన కుర్రాళ్లు గెలుస్తారని చెప్పలేం’’.. క్యాండిడేట్స్ టోర్నీ ఆరంభానికి ముందు దిగ్గజ క్రీడాకారుడు విశ్వనాథన్ ఆనంద్ చేసిన వ్యాఖ్యలివి. అయిదు సార్లు ప్రపంచ ఛాంపియన్గా నిలిచిన ఆనంద్ అలాంటి అభిప్రాయం వెల్లడించడం, టోర్నీలో 2018లో గెలిచిన కరువానా, వరుసగా గత రెండు సార్లు నెగ్గిన నెపోమ్నియాషి ఉండటంతో మన కుర్రాళ్లకు కష్టమే అనిపించింది. కానీ గుకేశ్ సవాళ్లను దాటి, అడ్డంకులను అధిగమించి అనుకున్నది సాధించాడు. ఫిడే సర్క్యూట్లో అత్యుత్తమ ప్రదర్శనతో క్యాండిడేట్స్ టోర్నీకి అర్హత సాధించిన గుకేశ్కు తెలుగు మూలాలున్నాయి. అతని ముత్తాతలు ఏపీలోని పుత్తూరు సమీపంలో ఉండేవాళ్లు. చెన్నైలో స్థిరపడ్డ రజినీకాంత్, పద్మ దంపతులకు 2006లో గుకేశ్ జన్మించాడు. ఇప్పుడీ స్థాయి వరకు చేరిన గుకేశ్ ప్రయాణంలో ఒడుదొడుకులున్నాయి. అతనితో పాటు తల్లిదండ్రులూ ఎన్నో త్యాగాలు చేశారు. ముఖ్యంగా ఈఎన్టీ సర్జన్ అయిన తండ్రి రజినీకాంత్ తన కెరీర్నే పక్కనపెట్టేశాడు. తనయుడి కెరీర్ కోసం, అతనితో కలిసి టోర్నీలకు విదేశాలకు వెళ్లేందుకు 2017-18లో ఆయన ప్రాక్టీస్ ఆపేశారు. మైక్రోబయాలజిస్ట్ అయిన తల్లి సంపాదనతోనే ఇల్లు గడిచేది. 2019లో గుకేశ్ గ్రాండ్మాస్టర్ కావడంతో అతనితో పాటు అమ్మానాన్న కూడా కొత్త లక్ష్యాలను పెట్టుకుని సాగారు.
అలా మొదలై: ఏడేళ్ల వయసులో చెస్కు పేరొందిన వేలమ్మల్ పాఠశాలలో ఆటపై గుకేశ్ ప్రేమ మొదలైంది. 64 గళ్ల బోర్డుపై ఇష్టం అతణ్ని కుదురుగా ఉండనివ్వలేదు. అతనిలో ప్రతిభను గుర్తించిన తల్లిదండ్రులు అండగా నిలిచారు. నాలుగో తరగతి తర్వాత గుకేశ్ పూర్తిస్థాయిలో పాఠశాలకు వెళ్లకుండా, ఆటపైనే దృష్టి పెట్టాడు. అక్కడి నుంచి గుకేశ్ అంచెలంచెలుగా ఎదిగాడు. ఎత్తులు వేయడంలో త్వరగానే పట్టు సాధించిన అతను అండర్-12 ప్రపంచ చెస్ యూత్ ఛాంపియన్గా నిలిచాడు. స్పాన్సర్లు లేకున్నా, ఆర్థికంగా ఇబ్బందులు ఎదురైనా ఆగిపోలేదు. గ్రాండ్మాస్టర్ అయ్యాక మరింత కష్టపడటం మొదలెట్టాడు. 2020 నుంచి వెస్ట్బ్రిడ్జ్ ఆనంద్ చెస్ ఆకాడమీ (వాకా)లో విశ్వనాథన్ ఆనంద్ మార్గనిర్దేశనంతో గుకేశ్ మరో స్థాయికి చేరాడు. స్పాన్సర్గా వెస్ట్బ్రిడ్జ్ క్యాపిటల్ కూడా ముందుకు రావడం కలిసొచ్చింది. గెలుపుతో స్ఫూర్తి పొందేవాళ్లను చూసుంటాం. కానీ ఓటమి నుంచి ప్రేరణ పొంది, కసిగా ఆడాలనేది గుకేశ్ మంత్రం. స్వీయ నమ్మకంతో ఎలాంటి కఠిన పరిస్థితుల్లోనే చెక్కుచెదరకుండా ఏకాగ్రతతో, ఆత్మవిశ్వాసంతో నిలబడుతున్నాడు. 2022లో దిగ్గజం కార్ల్సన్పై విజయం సాధించాడు. 2022 ఒలింపియాడ్లో మొదటి బోర్డుపై వ్యక్తిగత స్వర్ణం గెలిచాడు. నిరుడు ఆసియా క్రీడల్లో పురుషుల జట్టుతో రజతం సొంతం చేసుకున్నాడు. గతేడాది అత్యధికంగా 2,758 రేటింగ్ సాధించిన గుకేశ్.. ప్రస్తుతం 2,743 వద్ద ఉన్నాడు. ప్రపంచ చెస్లో 2750 రేటింగ్ దాటిన పిన్న వయస్సు క్రీడాకారుడూ అతనే.
అతనో రకం: ఇప్పుడు చెస్ శిక్షణలో కంప్యూటర్లది కీలక పాత్ర. ఓ గేమ్లోని పరిస్థితులను అంచనా వేసి, ఏ ఎత్తు సరైందో అని కంప్యూటర్ ప్రోగ్రాంతో కూడిన చెస్ ఇంజన్లు చెబుతున్నాయి. కరోనా తర్వాత చదరంగంలో కంప్యూటర్ల వాడకం ఇంకా పెరిగింది. కానీ గుకేశ్ మాత్రం మరో రకం. ఈ కంప్యూటర్ యుగంలోనూ సంప్రదాయ శిక్షణ, క్లాసికల్ ఫార్మాట్పై ప్రేమ అతణ్ని భిన్నంగా నిలుపుతోంది. పిన్న వయస్సు (12 ఏళ్ల 7 నెలల 17 రోజులు)లోనే గ్రాండ్మాస్టర్గా నిలిచిన భారత ఆటగాడిగా చరిత్ర సృష్టించిన గుకేశ్.. కేవలం 17 రోజుల తేడాతో ప్రపంచ రికార్డు కోల్పోయాడు. ప్రపంచంలో మూడో అతి పిన్న వయస్సు గ్రాండ్మాస్టర్గా నిలిచాడు. అలాంటి ఆటగాడు ఆరంభం నుంచి కోచ్ల శిక్షణలో, బోర్డుపై గేమ్లు ఆడుతూ ఎదిగాడు. ఎలో రేటింగ్ 2500 దాటిన తర్వాతే గుకేశ్ చెస్ ఇంజన్ల సాయం తీసుకున్నాడు. 36 ఏళ్లలో తొలిసారి విశ్వనాథన్ ఆనంద్ను వెనక్కినెట్టి నిరుడు గుకేశ్ భారత టాప్ ర్యాంకు ఆటగాడిగా నిలిచాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వన్డేలు - టీ20ల్లో టీమ్ఇండియాదే అగ్రస్థానం.. టెస్టుల్లో ఆసీస్ నంబర్ వన్
క్రికెట్లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన అత్యుత్తమ వార్షిక జట్ల ర్యాంకులను ఐసీసీ ప్రకటించింది. భారత్ ఎప్పటిలానే తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ అగ్రస్థానంలో నిలిచింది. -
ఆ ఒక్కడే.. ఐపీఎల్లో నన్ను భయపెట్టిన బ్యాటర్: గౌతమ్ గంభీర్
ముంబయితో మ్యాచ్కు ముందు ఓ క్రీడా ఛానెల్తో మాట్లాడిన కోల్కతా మెంటార్ గౌతమ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్లో అందరికంటే ఓ బ్యాటర్కు చాలా భయపడేవాడినని పేర్కొన్నాడు. -
రోహిత్ తర్వాత పాండ్యనే కెప్టెన్.. మరింత బాధ్యతగా ఆడాలి: మాజీ క్రికెటర్
వరల్డ్ కప్ కోసం స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యను ఎంపిక చేసిన బీసీసీఐ సెలక్షన్ కమిటీ.. అతడికే వైస్ కెప్టెన్సీని అప్పగించింది. -
నా స్థాయికి తగ్గ బౌలింగ్ చేయలేకపోయా: ముంబయి స్టార్ ఆల్రౌండర్
ఆల్రౌండర్గా జట్టులోకి వచ్చిన రొమారియో షెఫర్డ్ బౌలర్గా గొప్ప ప్రదర్శనేమీ ఇవ్వడం లేదు. కేవలం రెండు వికెట్లను మాత్రమే పడగొట్టిన అతడు మరోసారి అవకాశం వస్తే చెలరేగుతానని వ్యాఖ్యనించాడు. -
అత్యుత్తమ ఫామ్ అందుకోలేదు... నా బెస్ట్ ఇన్నింగ్స్ ఇది కాదు: రియాన్
రాజస్థాన్ తరఫున అద్భుతంగా ఆడుతున్న రియాన్ పరాగ్ తన ఫామ్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. హైదరాబాద్పై కీలక ఇన్నింగ్స్ ఆడినా.. తన బెస్ట్ మాత్రం ఇది కాదంటున్నాడు. -
ఆ ముగ్గురి వల్లే మేం గెలిచాం.. ప్రతి ఓవరూ సవాలే: ట్రావిస్ హెడ్
ఉత్కంఠపోరులో రాజస్థాన్ను ఓడించిన హైదరాబాద్ ప్లేఆఫ్స్ అవకాశాలను మెరుగుపర్చుకుంది. పాయింట్ల పట్టికలో టాప్-4లోకి దూసుకొచ్చింది. -
అన్నీ అనుకున్నట్లే జరగవు.. పాండ్య కెప్టెన్సీలో ఆడటంపై తొలిసారి స్పందించిన రోహిత్
చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్తో కలిసి నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్లో ముంబయి కెప్టెన్సీపైనా రోహిత్ శర్మ స్పందించాడు. -
ఓటమి లేదా టై.. మేం ఊహించిన ఫలితమిదే: థ్రిల్లింగ్ విక్టరీపై నితీశ్ రెడ్డి
ఐపీఎల్ 17వ సీజన్లో అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచుల్లో హైదరాబాద్ - రాజస్థాన్ పోరు నిలుస్తుంది. చివరి బంతి వరకూ సాగిన మ్యాచ్లో సన్రైజర్స్ విజయకేతనం ఎగురవేసింది. -
విజయాన్ని లాగేసుకున్నారు
వారెవ్వా ఏం మ్యాచ్! ఉప్పల్లో ఎన్ని మలుపులో! రాజస్థాన్, హైదరాబాద్లతో గెలుపు దోబూచులాడగా కడ బంతి వరకూ రసవత్తరంగా సాగిన పోరు అభిమానులను ఉర్రూతలూగించింది. హోరాహోరీ పోరులో పట్టువదలని సన్రైజర్స్.. రాయల్స్ నుంచి విజయాన్ని లాగేసుకుంది. -
నితీశ్ నిలకడగా
విశాఖ కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి నిలకడగా రాణిస్తూ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో కీలక ఆటగాడిగా ఎదుగుతున్నాడు. నిరుడు కేవలం పేసర్గా రెండు మ్యాచ్లాడిన అతను.. ఈ సీజన్లో టాప్ఆర్డర్ బ్యాటర్గా సత్తాచాటుతున్నాడు. -
అందుకే నలుగురు స్పిన్నర్లు
టీ20 ప్రపంచకప్కు నలుగురు స్పిన్నర్లు కావాలనే విషయంలో జట్టు మేనేజ్మెంట్ చాలా స్పష్టతతో ఉందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. టోర్నీ కోసం 15 మందిని ఖరారు చేయడంలో ఐపీఎల్ పాత్ర స్వల్పమని చెప్పాడు. -
భారత అమ్మాయిలదే సిరీస్
బంగ్లాదేశ్తో టీ20 సిరీస్లో భారత అమ్మాయిలు దూకుడు కొనసాగిస్తున్నారు. మరో రెండు మ్యాచ్లు మిగిలి ఉండగానే అయిదు టీ20ల సిరీస్ను 3-0తో కైవసం చేసుకున్నారు. -
భారత్కు షాక్
రెండేళ్ల కిందట.. ప్రపంచ పురుషుల టీమ్ ఛాంపియన్షిప్గా పరిగణించే థామస్ కప్లో భారత్ అద్భుత విజయం సాధించింది. మొట్టమొదటి సారి ఈ టైటిల్ను దక్కించుకుని చరిత్ర సృష్టించింది. -
సెమీస్లో నలుగురు భారత బాక్సర్లు
ఆసియా అండర్-22, యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో నలుగురు భారత బాక్సర్లు సెమీఫైనల్కు దూసుకెళ్లారు. గురువారం అండర్-22 విభాగంలో జాదుమణి (51 కేజీలు), నిఖిల్ (57 కేజీలు), -
మహిళల హాకీ కెప్టెన్గా సలీమా టెటె
గోల్కీపర్ సవిత పునియా స్థానంలో మిడ్ఫీల్డర్ సలీమా టెటె భారత మహిళల హాకీ కెప్టెన్గా నియమితురాలైంది. ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్ బెల్జియం, ఇంగ్లాండ్ అంచెలలో పోటీపడే 24 మంది సభ్యుల భారత జట్టుకు సలీమా నాయకత్వం వహించనుంది. -
పేద చిన్నారుల కోసం బోపన్న
భారత అగ్రశ్రేణి టెన్నిస్ ఆటగాడు రోహన్ బోపన్న ఓ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. వెనుకబడిన వర్గాలకు చెందిన పిల్లలకు శిక్షణ అందించేందుకు సిద్ధమయ్యాడు. -
పాక్ జట్టులో రవూఫ్
ఐర్లాండ్, ఇంగ్లాండ్లతో టీ20 సిరీస్లలో తలపడే పాకిస్థాన్ జట్టులో పేసర్ హారిస్ రవూఫ్ చోటు దక్కించుకున్నాడు. పాకిస్థాన్ సూపర్ లీగ్లో ఆరంభ మ్యాచ్ల్లో ఆడిన రవూఫ్ ఆ తర్వాత గాయంతో క్రికెట్కు దూరమయ్యాడు. -
వాళ్లకి క్రికెట్ పరిజ్ఞానం లేదేమో: ఏబీ
విరాట్ కోహ్లి స్ట్రైక్రేట్ గురించి.. అతడి ఆటతీరు గురించి మాట్లాడేవాళ్లకు క్రికెట్ పరిజ్ఞానం లేదని అనిపిస్తుందని దక్షిణాఫ్రికా మాజీ స్టార్ ఏబీ డివిలియర్స్ అన్నాడు. మిడిల్ ఓవర్లలో విరాట్ సరిగా రాణించలేకపోతున్నాడని..
తాజా వార్తలు (Latest News)
-
3 నెలల్లో 2 కోట్ల ఖాతాలపై వాట్సప్ నిషేధం
-
ఘట్కేసర్లో దారుణం.. ఆస్తికోసం భర్తను గొలుసులతో బంధించి చిత్రహింసలు
-
‘తుపాకీతో బెదిరించి.. అత్యాచారం చేసి..’ - ప్రజ్వల్పై మహిళ ఫిర్యాదు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
‘అప్రమత్తంగా ఉండండి’ : ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
-
ఎన్నికల వేళ.. ‘సూపర్ సీఎం’ సతీమణిపై బదిలీ వేటు