యువరాజు వచ్చేశాడు
భారత్లో ఆదివారం అర్ధరాత్రి. అందరూ గాఢ నిద్రలో ఉండగా.. అక్కడ కెనడాలో ఓ యువరాజు ప్రతిష్ఠాత్మకమైన కిరీటాన్ని ధరించాడు.
క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో గుకేశ్ గెలుపు
పిన్న వయసు విజేతగా ప్రపంచ రికార్డు
ప్రపంచ ఛాంపియన్షిప్కు అర్హత
భారత్లో ఆదివారం అర్ధరాత్రి. అందరూ గాఢ నిద్రలో ఉండగా.. అక్కడ కెనడాలో ఓ యువరాజు ప్రతిష్ఠాత్మకమైన కిరీటాన్ని ధరించాడు. 17 ఏళ్ల వయసులోనే 64 గళ్ల కురుక్షేత్రంలో.. 7 మంది బలమైన ప్రత్యర్థులను ఓడించి విజేతగా నిలిచాడు. ప్రపంచ మహా సమరానికి సై అంటున్న ఆ యువరాజు పేరు.. దొమ్మరాజు గుకేశ్. ఈ చెన్నై టీనేజర్ సంచలనం సృష్టించాడు. ప్రపంచంలోని అత్యుత్తమ చదరంగ క్రీడాకారులు తలపడ్డ క్యాండిడేట్స్ టోర్నీలో జయకేతనం ఎగురవేశాడు. ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్కు అర్హత సాధించాడు.
ఈ ఘనత సాధించిన అతి పిన్న వయసు ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.
టొరంటో
గుకేశ్ సాధించాడు. అవును.. ప్రపంచ చదరంగ వేదికపై మరోసారి భారత సత్తా చాటాడు. క్యాండిడేట్స్ టోర్నీలో విజేతగా నిలిచాడు. ప్రపంచ టైటిల్ కోసం డిఫెండింగ్ ఛాంపియన్ డిన్ లిరెన్ (చైనా)తో తలపడేందుకు అర్హత సాధించాడు. విశ్వనాథన్ ఆనంద్ (2014) తర్వాత క్యాండిడేట్స్ టోర్నీ గెలిచిన రెండో భారత ఆటగాడు గుకేశ్. ఆదివారం అర్ధరాత్రి తర్వాత జరిగిన చివరిదైన 14వ రౌండ్లో హికరు నకముర (అమెరికా)తో గేమ్ను డ్రా చేసుకున్న గుకేశ్ విజేతగా అవతరించాడు. మొత్తం 9 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. 13 రౌండ్లు ముగిసే సరికి గుకేశ్ 8.5 పాయింట్లతో నిలవగా.. నకముర, కరువానా (అమెరికా), నెపోమ్నియాషి (రష్యా) తలో 8 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నారు. గేమ్లో గెలిస్తే మిగతా వాళ్ల గేమ్లతో సంబంధం లేకుండా టైటిల్ గుకేశ్ సొంతమవుతుందనే పరిస్థితి. ఒకవేళ డ్రా చేసుకుంటే.. అప్పుడు కరువానా, నెపోమ్నియాషి మధ్య గేమ్లో ఎవరైనా గెలిస్తే అప్పుడు గుకేశ్తో సమానమయ్యేవాళ్లు. అలా జరిగితే విజేత తేలేవరకు టైబ్రేక్ నిర్వహించేవాళ్లు. చివరి రౌండ్లో నల్లపావులతో గుకేశ్ మెరుగైన ప్రదర్శన చేశాడు. నకమురాను నిలువరించాడు. 71 ఎత్తుల్లో ఈ గేమ్ డ్రాగా ముగిసింది. ఇక ఆ తర్వాత కరువాన, నెపోమ్నియాషి గేమ్ కూడా డ్రా కావడంతో గుకేశ్ ఖాతాలో టైటిల్ చేరింది. ఈ టోర్నీలో గుకేశ్ కేవలం ఒక్క గేమ్లోనే (ఏడో రౌండ్లో అలీరెజాతో) ఓడిపోయాడు. 5 గేమ్ల్లో గెలిచిన అతను, మరో 8 గేమ్లు డ్రా చేసుకున్నాడు. నకముర, నెపోమ్నియాషి, కరువానా తలో 8.5 పాయింట్లతో వరుసగా రెండు, మూడు, నాలుగు స్థానాల్లో నిలిచారు. ప్రజ్ఞానంద (7) అయిదు, విదిత్ గుజరాతి (6) ఆరో స్థానంతో టోర్నీని ముగించారు. గుకేశ్కు సుమారు రూ.78.5 లక్షల నగదు బహుమతి కూడా దక్కింది.
రన్నరప్గా హంపి
మహిళల క్యాండిడేట్స్ టోర్నీలో తెలుగమ్మాయి కోనేరు హంపి రన్నరప్గా నిలిచింది. ఆఖరి రౌండ్లో ఆమె 62 ఎత్తుల్లో తింగ్జీ లీ (చైనా)పై గెలిచింది. లీ, వైశాలి కూడా 7.5 పాయింట్లతో హంపికి సమంగా నిలిచారు. కానీ మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా హంపికి రెండో స్థానం దక్కింది. చైనా అమ్మాయి జ్యోంగి తాన్(9) టైటిల్ గెలుచుకుంది.
అందుకే క్యాండిడేట్స్..
ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్లో ఇద్దరే పోటీపడతారు. ఒకరు డిఫెండింగ్ ఛాంపియన్.. మరొకరు ఛాలెంజర్. క్యాండిడేట్స్ టోర్నమెంట్ నెగ్గిన ఆటగాడే ఛాలెంజర్. క్వాలిఫికేషన్ ప్రకియ ద్వారా ఎనిమిది మంది ఆటగాళ్లను క్యాండిడేట్స్ టోర్నీకి ఎంపిక చేస్తారు.
1
పిన్న వయసులో క్యాండిడేట్స్ టోర్నీ గెలిచి, ప్రపంచ ఛాంపియన్షిప్కు అర్హత సాధించిన ఆటగాళ్లలో గుకేశ్ (17 ఏళ్లు) స్థానం. కాస్పరోవ్ (1984లో 22 ఏళ్లు) రికార్డును గుకేశ్ బద్దలుకొట్టాడు.
ఫిడే క్యాండిడేట్స్ టోర్నీ గెలిచిన అత్యంత పిన్నవయస్కుడిగా గుకేశ్ నిలిచినందుకు భారత్ ఎంతో గర్విస్తోంది. టోర్నీలో గుకేశ్ సాధించిన ఘనత అతడి అసాధారణ ప్రతిభ, అంకితభావానికి నిదర్శనం. అతడి విశేష ప్రదర్శన, ప్రయాణం కోట్ల మందికి ప్రేరణ.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమెరికా జట్టులో మనోళ్లదే జోరు
టీ20 ప్రపంచకప్ కోసం శుక్రవారం ప్రకటించిన అమెరికా జట్టులో భారత సంతతి ఆటగాళ్లే ఎక్కువగా ఉన్నారు. 15 మంది ఆటగాళ్ల జాబితాలో ఏడుగురికి భారత మూలాలుండటం విశేషం. -
ముంబయి కథ ముగిసె!
ఐపీఎల్-17లో ఇక ముంబయి ఇండియన్స్ అభిమానులకు ఫలితాల గురించి బెంగ లేదు! ప్లేఆఫ్స్ సమీకరణాల గురించి వాళ్లు బుర్రలు బద్దలు కొట్టుకోవాల్సిన పని లేదు! ఈ సీజన్లో ముంబయి కథ ముగిసినట్లే. -
వన్డేలు, టీ20ల్లో భారత్ నం.1
ఐసీసీ ర్యాంకింగ్స్లో భారత జట్టు వన్డేలు, టీ20ల్లో అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. కానీ టెస్టుల్లో మాత్రం నంబర్వన్ ర్యాంకు టీమ్ఇండియా చేజారింది. ఆస్ట్రేలియా తిరిగి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. -
రెండో టైటిల్ ఎవరికో?
గతేడాది సెప్టెంబర్లో ఆరంభం.. ఆరు నెలలకు పైగా ఫుట్బాల్ వినోదం.. 12 జట్లు.. అలరించిన 138 మ్యాచ్లు. ఇంత సుదీర్ఘంగా సాగిన ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) పదో సీజన్లో ఆఖరి సమరానికి సమయం ఆసన్నమైంది. -
విదేశాల్లో పోటీలకు జ్యోతి
పారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించే దిశగా విదేశాల్లో పోటీల్లో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ సంచలన స్ప్రింటర్ జ్యోతి యర్రాజికి అనుమతి లభించింది. జ్యోతితో పాటు లాంగ్జంప్ అథ్లెట్ శైలి సింగ్ ప్రతిపాదనలకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. -
ఐపీఎల్లో అదే నా పాత్ర
ఆరంభంలో వికెట్లు కోల్పోయిన జట్టు ఇన్నింగ్స్ను నిర్మించడమే తన పాత్ర కర్తవ్యమని సన్రైజర్స్ హైదరాబాద్ యువ ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి చెప్పాడు. రాజస్థాన్ రాయల్స్తో మ్యాచ్లో 35/2తో కష్టాల్లో పడ్డ జట్టును 76 పరుగుల అజేయ ఇన్నింగ్స్తో నితీశ్ ఆదుకున్న సంగతి తెలిసిందే. -
ఇష్టమైన ఆటగాడిగా నితీశ్
తనకు ఇష్టమైన క్రికెటర్లలో ఒకడిగా సన్రైజర్స్ హైదరాబాద్ యువ ఆటగాడు నితీశ్ రెడ్డి మారుతున్నాడని ఆస్ట్రేలియా దిగ్గజ ఆల్రౌండర్ షేన్ వాట్సన్ పేర్కొన్నాడు. ‘‘కచ్చితంగా చూడగలిగే నాకిష్టమైన ఆటగాళ్లలో ఒకడిగా నితీశ్ మారుతున్నాడు. -
ప్రపంచ రిలే బరిలో ‘లక్ష్య’ జ్యోతిక
ప్రపంచ అథ్లెటిక్స్ రిలే టోర్నీలో భారత జట్టు తన అదృష్టం పరీక్షించుకోనుంది. శనివారం ప్రారంభమయ్యే ఈ పోటీల్లో పారిస్ ఒలింపిక్స్ బెర్తే లక్ష్యంగా భారత బృందం బరిలో దిగుతుంది. -
రింకుకు ఇది ఆరంభమే: గంగూలీ
టీ20 ప్రపంచకప్కు ఎంపిక కానంత మాత్రాన బాధపడక్కర్లేదని రింకు సింగ్కు ఇది ఆరంభం మాత్రమేనని భారత క్రికెట్ మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. ‘‘టీ20 ప్రపంచకప్లో ఎక్కువ మ్యాచ్లు జరిగేది వెస్టిండీస్లో. -
బంగ్లాదే తొలి టీ20
తంజిద్ హసన్ (67 నాటౌట్; 47 బంతుల్లో 8×4, 2×6) సత్తా చాటడంతో జింబాబ్వేతో టీ20 సిరీస్లో బంగ్లాదేశ్ బోణీ కొట్టింది. శుక్రవారం తొలి టీ20లో 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
తాజా వార్తలు (Latest News)
-
దళిత యువకుడికి పోలీసుల చిత్రహింసలు
-
గులకరాయి ఘటనను.. ఎన్నికల్లో లబ్ధికి వినియోగించుకోకుండా అడ్డుకోండి
-
గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో రోజుకో రికార్డు
-
తెలంగాణలో భూవివాదం.. తెరపైకి ఏపీ మంత్రి బొత్స కుమారుడి పేరు
-
హైదరాబాద్లో స్థానికేతరులకే పట్టం
-
అంతేలేని ప్రజ్వల్ రేవణ్ణ ఆగడాలు.. ఒక్కొక్కరుగా స్పందిస్తున్న బాధితులు