దీపాన్షుకు జావెలిన్ స్వర్ణం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు.
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్
దిల్లీ: ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ తొలి రోజు, బుధవారం భారత అథ్లెట్లు సత్తా చాటారు. పురుషుల జావెలిన్ త్రోలో దీపాన్షు శర్మ స్వర్ణం గెలుచుకున్నాడు. 70.29 మీటర్ల త్రోతో దీపాన్షు విజేతగా నిలిచాడు. రోహన్ (70.03) రజతం సాధించాడు. పురుషుల 1500మీ పరుగులో ప్రియాన్షు రజతం (3:50.85) గెలుచుకున్నాడు. పురుషుల డిస్కస్ త్రోలో రితిక్ రజతం సొంతం చేసుకున్నాడు. మహిళల 3000మీ పరుగులో ప్రాచి అంకుష్ త్రుటిలో కాంస్యం చేజార్చుకుంది. ఆమె నాలుగో స్థానంలో నిలిచింది.
ఫ్రెంచ్ ఓపెన్లో ఆడతానో లేదో..
మాడ్రిడ్: పూర్తిగా ఫిట్గా లేకున్నా రఫెల్ నాదల్ మాడ్రిడ్ ఓపెన్లో ఆడనున్నాడు. అతడు ఫ్రెంచ్ ఓపెన్లో ఆడడంపై మాత్రం అనిశ్చితి కొనసాగుతోంది. ఫిట్నెస్ ప్రస్తుతం ఉన్నట్లే ఉంటే ఫ్రెంచ్ ఓపెన్లో ఆడబోనని నాదల్ చెప్పాడు. ‘‘శారీరకంగా ఈ వారం అంత బాగా అనిపించట్లేదు. అది మాడ్రిడ్ కాకపోతే.. ఈ వారం ఆ టోర్నీలో ఆడేవాణ్ని కాదు. తర్వాతి మూడు వారాల్లో ఏం జరుగుతుందో తెలియదు. పోరాడుతూనే ఉంటా. పారిస్లో ఆడడం కోసం చేయాల్సిందంతా చేస్తా. ఇప్పుడున్నట్లే ఉంటే మాత్రం ఫ్రెంచ్ ఓపెన్లో ఆడను’’ అని అన్నాడు. టెన్నిస్లో తనకు ఇదే చివరి ఏడాది కావొచ్చని 37 ఏళ్ల నాదల్ ఇంతకుముందు చెప్పాడు.
ముంబయి విజయం
మార్గోవా: ఇండియన్ సూపర్ లీగ్ ఫుట్బాల్ తొలి అంచె సెమీఫైనల్లో ముంబయి సిటీ విజయం సాధించింది. బుధవారం 3-2తో గోవా ఎఫ్సీని ఓడించింది. బోరిస్ సింగ్ (16వ నిమిషం), బ్రాండన్ ఫెర్నాండెజ్ (56వ) గోల్స్తో ఆధిక్యంలోకి వెళ్లిన గోవానే గెలిచేలా కనిపించింది. ఆఖరి 6 నిమిషాల్లో అద్భుతంగా పుంజుకున్న ముంబయి అనూహ్య విజయాన్ని అందుకుంది. చాగటె స్వల్ప వ్యవధిలో రెండు గోల్స్ సాధించగా.. మరో గోల్ను విక్రమ్ కొట్టాడు.
రెజ్లింగ్ అథ్లెట్ల కమిషన్ ఛైర్మన్గా నర్సింగ్
వారణాసి: భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అథ్లెట్ల కమిషన్ ఛైర్మన్గా నర్సింగ్ యాదవ్ ఎన్నికయ్యాడు. ఈ కమిషన్లోని ఏడు స్థానాలకు ఎనిమిది మంది పోటీపడగా బుధవారం ఎన్నికలు నిర్వహించారు. ఇందులో గెలిచిన సాహిల్ (దిల్లీ), స్మిత (కేరళ), భార్తి (ఉత్తరప్రదేశ్), ఖుష్బు (గుజరాత్), నిక్కి (హరియాణా), శ్వేత (బెంగాల్) కలిసి నర్సింగ్ను అధ్యక్షుడిగా ఎంచుకున్నారు. డబ్ల్యూఎఫ్ఐపై నిషేధం ఎత్తివేసే సమయంలో ఈ ఏడాది జులై 1లోపు అథ్లెట్ల కమిషన్ను ఏర్పాటు చేయాలని యునైటెడ్ ప్రపంచ రెజ్లింగ్ షరతు విధించింది. ఈ నేపథ్యంలో డబ్ల్యూఎఫ్ఐ ఇప్పుడా ప్రక్రియ పూర్తిచేసింది. కామన్వెల్త్ క్రీడల్లో పసిడి గెలిచిన నర్సింగ్ యాదవ్ 2012 ఒలింపిక్స్లోనూ పోటీపడ్డాడు. 2016 రియో ఒలింపిక్స్కూ అర్హత సాధించాడు. కానీ గాయం కారణంగా అర్హత టోర్నీకి దూరమైన రెండు సార్లు ఒలింపిక్ పతక విజేత సుశీల్ కుమార్.. నర్సింగ్తో ట్రయల్ కోసం దిల్లీ కోర్టును ఆశ్రయించాడు. కానీ అతని విన్నపాన్ని కోర్టు తిరస్కరించింది. మరోవైపు ఒలింపిక్స్కు ముందు రెండు డోప్ పరీక్షల్లోనూ నర్సింగ్ పాజిటివ్గా తేలడంతో అతనిపై క్రీడా ఆర్బిట్రేషన్ కోర్టు నాలుగేళ్ల నిషేధం విధించింది. డోపీగా తేలేలా తనపై కుట్ర చేశారని జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా)కు నర్సింగ్ నివేదించడంతో అతణ్ని ఒలింపిక్స్కు పంపించారు. కానీ ఆర్బిట్రేషన్ కోర్టు తీర్పుతో నర్సింగ్ ఒలింపిక్స్లో పోటీపడకుండానే రియో నుంచి వచ్చేశాడు.
కాంట్రాక్టు పోతేనేం.. ఆడితే చాలు!
చెన్నై: క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) సెంట్రల్ కాంట్రాక్టుల నుంచి తనను తప్పించడంపై ఎలాంటి బాధా లేదని.. దేశానికి ఆడితే చాలని మార్కస్ స్టాయినిస్ అన్నాడు. ఐపీఎల్లో లఖË్నవూ సూపర్ జెయింట్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ ఆస్ట్రేలియా ఆల్రౌండర్.. మంగళవారం చెన్నైపై అద్భుత శతకం (63 బంతుల్లో 124 నాటౌట్)తో జట్టుకు సంచలన విజయాన్నందించాడు. అయితే ఐపీఎల్లో సత్తా చాటుతున్న స్టాయినిస్కు ఇటీవలే ప్రకటించిన సెంట్రల్ కాంట్రాక్టుల జాబితాలో సీఏ మొండిచేయి చూపించింది. కాంట్రాక్టులో ఉండడం కంటే ఆస్ట్రేలియాకు ప్రాతినిధ్యం వహించడమే తనకు ముఖ్యమని స్టాయినిస్ అన్నాడు. ‘‘ఆస్ట్రేలియా కోచ్ మెక్డొనాల్డ్తో నాకు మంచి సంబంధాలున్నాయి. నాకు కాంట్రాక్టు దక్కదని ముందే తెలుసు. నా స్థానంలో ఓ యువ ఆటగాడికి అవకాశం దక్కితే నేను సంతోషిస్తా. ఇది నాకు సమస్యే కాదు. కానీ ఆట పరంగా నేనెప్పుడూ జట్టుకు అందుబాటులో ఉండాలనుకుంటా. గొప్ప పోటీ ఉండే ఐపీఎల్ లాంటి టోర్నీ ఉండడం మా అదృష్టం. అందుకే నేను ఈ లీగ్ను ఎంతో ఇష్టపడతా’’ అని స్టాయినిస్ చెప్పాడు.
విజేతలు సిఫ్ట్, నీరజ్
దిల్లీ: ఒలింపిక్ సెలెక్షన్ ట్రయల్స్ 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్ విభాగంలో సిఫ్ట్ కౌర్ సమ్రా, నీరజ్ కుమార్ విజేతలుగా నిలిచారు. బుధవారం మహిళల ఫైనల్లో సిఫ్ట్ (466.3) ప్రథమ స్థానం సాధించింది. ఆశి చోక్సీ (462.6) రన్నరప్గా నిలిచింది. అంజుమ్ మౌద్గిల్ (449.2), నిశ్చల్ (433.6), శ్రియాంక సదాంగి (416.7) వరుసగా తర్వాతి స్థానాలు సాధించారు. పురుషుల విభాగంలో నీరజ్ (462.2), స్వప్నిల్ కుశాలె (460.9), ఐశ్వరి తోమర్ (450.5), చైన్ సింగ్ (439.8), అఖిల్ షెరాన్ (429.1) వరుసగా మొదటి అయిదు స్థానాల్లో నిలిచారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రింకుకు అందుకే చోటు దక్కలేదు.. బెస్ట్ టీమ్ సెలక్షన్: గంగూలీ
టీ20 ప్రపంచ కప్ కోసం ప్రకటించిన జట్టు గురించి భారత మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ కీలక వ్యాఖ్యలు చేశాడు. సరైన జట్టును ఎంపిక చేశారని సెలక్టర్లను అభినందించాడు. -
విరాట్ స్ట్రైక్రేట్పై విమర్శల్లో వారిది ద్వంద్వ వైఖరి: భారత మాజీ క్రికెటర్లు
భారీగా పరుగులు చేస్తున్నా.. విరాట్ కోహ్లీపై విమర్శలు మాత్రం ఆగడం లేదు. వాటిని భారత మాజీ క్రికెటర్లు ఇర్ఫాన్, కైఫ్ కొట్టిపడేశారు. -
రోహిత్కు ఏమైంది? ఇంపాక్ట్ ప్లేయర్గా రావడానికి కారణమిదే!
ముంబయి స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ కోల్కతాతో జరిగిన మ్యాచ్లో ఫీల్డింగ్కు రాలేదు. అతడిని ఇంపాక్ట్ సబ్స్టిట్యూట్గా వెల్లడించడం గమనార్హం. -
టోర్నీ నుంచి ఔట్.. చాలా ప్రశ్నలకు ఇప్పుడే సమాధానం చెప్పలేం: హార్దిక్
ఐపీఎల్ 2024 సీజన్ ముంబయికి కలిసిరాలేదు. ఆరంభం నుంచే ఓటములతో సతమతమవుతున్న ఆ జట్టు.. ప్లేఆఫ్స్ అవకాశాలను కోల్పోయింది. -
హైబ్రిడ్ పిచ్ల మీద ఐపీఎల్ మ్యాచ్లు... సరికొత్త ప్రయోగం ఫలిస్తుందా?
SisGrass Hybrid Pitch: ధర్మశాల వేదికగా జరగబోయే ఐపీఎల్ మ్యాచుల్లో హైబ్రిడ్ పిచ్లను వాడనున్నారు. ఏంటా పిచ్లు, ఎందుకు వాడుతున్నారు? -
అమెరికా జట్టులో మనోళ్లదే జోరు
టీ20 ప్రపంచకప్ కోసం శుక్రవారం ప్రకటించిన అమెరికా జట్టులో భారత సంతతి ఆటగాళ్లే ఎక్కువగా ఉన్నారు. 15 మంది ఆటగాళ్ల జాబితాలో ఏడుగురికి భారత మూలాలుండటం విశేషం. -
ముంబయి కథ ముగిసె!
ఐపీఎల్-17లో ఇక ముంబయి ఇండియన్స్ అభిమానులకు ఫలితాల గురించి బెంగ లేదు! ప్లేఆఫ్స్ సమీకరణాల గురించి వాళ్లు బుర్రలు బద్దలు కొట్టుకోవాల్సిన పని లేదు! ఈ సీజన్లో ముంబయి కథ ముగిసినట్లే. -
వన్డేలు, టీ20ల్లో భారత్ నం.1
ఐసీసీ ర్యాంకింగ్స్లో భారత జట్టు వన్డేలు, టీ20ల్లో అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. కానీ టెస్టుల్లో మాత్రం నంబర్వన్ ర్యాంకు టీమ్ఇండియా చేజారింది. ఆస్ట్రేలియా తిరిగి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. -
రెండో టైటిల్ ఎవరికో?
గతేడాది సెప్టెంబర్లో ఆరంభం.. ఆరు నెలలకు పైగా ఫుట్బాల్ వినోదం.. 12 జట్లు.. అలరించిన 138 మ్యాచ్లు. ఇంత సుదీర్ఘంగా సాగిన ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) పదో సీజన్లో ఆఖరి సమరానికి సమయం ఆసన్నమైంది. -
విదేశాల్లో పోటీలకు జ్యోతి
పారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించే దిశగా విదేశాల్లో పోటీల్లో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ సంచలన స్ప్రింటర్ జ్యోతి యర్రాజికి అనుమతి లభించింది. జ్యోతితో పాటు లాంగ్జంప్ అథ్లెట్ శైలి సింగ్ ప్రతిపాదనలకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. -
ఐపీఎల్లో అదే నా పాత్ర
ఆరంభంలో వికెట్లు కోల్పోయిన జట్టు ఇన్నింగ్స్ను నిర్మించడమే తన పాత్ర కర్తవ్యమని సన్రైజర్స్ హైదరాబాద్ యువ ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి చెప్పాడు. రాజస్థాన్ రాయల్స్తో మ్యాచ్లో 35/2తో కష్టాల్లో పడ్డ జట్టును 76 పరుగుల అజేయ ఇన్నింగ్స్తో నితీశ్ ఆదుకున్న సంగతి తెలిసిందే. -
ఇష్టమైన ఆటగాడిగా నితీశ్
తనకు ఇష్టమైన క్రికెటర్లలో ఒకడిగా సన్రైజర్స్ హైదరాబాద్ యువ ఆటగాడు నితీశ్ రెడ్డి మారుతున్నాడని ఆస్ట్రేలియా దిగ్గజ ఆల్రౌండర్ షేన్ వాట్సన్ పేర్కొన్నాడు. ‘‘కచ్చితంగా చూడగలిగే నాకిష్టమైన ఆటగాళ్లలో ఒకడిగా నితీశ్ మారుతున్నాడు. -
ప్రపంచ రిలే బరిలో ‘లక్ష్య’ జ్యోతిక
ప్రపంచ అథ్లెటిక్స్ రిలే టోర్నీలో భారత జట్టు తన అదృష్టం పరీక్షించుకోనుంది. శనివారం ప్రారంభమయ్యే ఈ పోటీల్లో పారిస్ ఒలింపిక్స్ బెర్తే లక్ష్యంగా భారత బృందం బరిలో దిగుతుంది. -
రింకుకు ఇది ఆరంభమే: గంగూలీ
టీ20 ప్రపంచకప్కు ఎంపిక కానంత మాత్రాన బాధపడక్కర్లేదని రింకు సింగ్కు ఇది ఆరంభం మాత్రమేనని భారత క్రికెట్ మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. ‘‘టీ20 ప్రపంచకప్లో ఎక్కువ మ్యాచ్లు జరిగేది వెస్టిండీస్లో. -
బంగ్లాదే తొలి టీ20
తంజిద్ హసన్ (67 నాటౌట్; 47 బంతుల్లో 8×4, 2×6) సత్తా చాటడంతో జింబాబ్వేతో టీ20 సిరీస్లో బంగ్లాదేశ్ బోణీ కొట్టింది. శుక్రవారం తొలి టీ20లో 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
తాజా వార్తలు (Latest News)
-
లైంగిక దౌర్జన్యం కేసు.. ప్రజ్వల్ రేవణ్ణ ఇంటికి సిట్
-
రింకుకు అందుకే చోటు దక్కలేదు.. బెస్ట్ టీమ్ సెలక్షన్: గంగూలీ
-
విరాట్ స్ట్రైక్రేట్పై విమర్శల్లో వారిది ద్వంద్వ వైఖరి: భారత మాజీ క్రికెటర్లు
-
ఉల్లి ఎగుమతులపై ఆంక్షలు ఎత్తివేత.. ఎన్నికల వేళ కేంద్రం నిర్ణయం
-
17మంది రోగులను హత్య చేసిన నర్సు..700 ఏళ్ల జైలు శిక్ష
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM