ట్రయల్స్ వద్దు.. పారిస్కు పంపండి
సెలెక్షన్ ట్రయల్స్లో పాల్గొనాలంటూ తమపై ఒత్తిడి తేవొద్దంటూ పారిస్ ఒలింపిక్ కోటా బెర్తులు సంపాదించిన క్రీడాకారిణులు భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)కు విజ్ఞప్తి చేశారు.
డబ్ల్యూఎఫ్ఐకి రెజ్లర్ల విజ్ఞప్తి
దిల్లీ: సెలెక్షన్ ట్రయల్స్లో పాల్గొనాలంటూ తమపై ఒత్తిడి తేవొద్దంటూ పారిస్ ఒలింపిక్ కోటా బెర్తులు సంపాదించిన క్రీడాకారిణులు భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)కు విజ్ఞప్తి చేశారు. ఈ సమయంలో చిన్న అడుగు, ప్రతి పని ఒలింపిక్స్లో భారత్ పతక అవకాశాలపై ప్రభావం చూపిస్తాయని అభిప్రాయపడ్డారు. అన్షు మలిక్ (57 కేజీలు), నిషా దహియా (68 కేజీలు), రీతిక హుడా (76 కేజీలు)తో సహా అయిదుగురు భారత రెజ్లర్లకు ఒలింపిక్ కోటా బెర్తులు లభించాయి. అయితే సెలెక్షన్ ట్రయల్స్ గురించి చర్చించేందుకు ఈనెల 21న డబ్ల్యూఎఫ్ఐ సమావేశం నిర్వహించనుంది. డబ్ల్యూఎఫ్ఐ వర్గాల ప్రకారం గత సెలెక్షన్స్లో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన క్రీడాకారిణుల మధ్య మ్యాచ్లు నిర్వహిస్తారు. వీరిలో మొదటి స్థానంలో నిలిచిన క్రీడాకారిణితో ఒలింపిక్ కోటా రెజ్లర్ పోటీపడాలి. విజయం సాధించిన వారికి ఒలింపిక్స్ అవకాశం లభిస్తుంది. ‘‘ప్రతి చిన్న పని, ప్రతి అడుగులో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటికే చాలా అంతర్జాతీయ, జాతీయ టోర్నీలు.. ట్రయల్స్లో పాల్గొన్నాం. ఈ ట్రయల్స్ ద్వారా మా ఫిట్నెస్ను అంచనా వేయాల్సిన అవసరం లేదు. ఒలింపిక్స్కు ముందు మాకు మానసిక ప్రశాంతత కావాలి. రెండు నెలల సన్నాహం చాలా తక్కువే. ఈ సమయంలో ప్రతి రోజూ కీలకం. ఇప్పుడు జాతీయ స్థాయి ట్రయల్స్కు పిలిస్తే ప్రణాళికలు దెబ్బతింటాయి. భారత్ పతక అవకాశాలు ప్రభావితం అవుతాయి’’ అని అన్షు, నిషా, రీతిక తెలిపారు.
అర్జున్కు మిశ్రమ ఫలితాలు
షార్జా: తెలంగాణ కుర్రాడు అర్జున్ ఇరిగేశికి షార్జా మాస్టర్స్ చెస్ టోర్నమెంట్లో మిశ్రమ ఫలితాలు లభించాయి. అతడు ఒక రౌండ్లో ఓడి.. మరో రౌండ్లో గెలిచాడు. రెండో రౌండ్లో నికోలాస్ థియోడ్రో (గ్రీస్) చేతిలో ఓటమి చవిచూసిన అర్జున్.. మూడో రౌండ్లో నికోల్జీ కచెరావా (స్విట్జర్లాండ్)పై విజయం సాధించాడు. రాజా రిత్విక్ రెండో రౌండ్లో లెవోన్ ల్యూక్.. మూడో రౌండ్లో సహచర ఆటగాడు సేతురామన్తో గేమ్లను డ్రా చేసుకున్నాడు. మరోవైపు రెండో రౌండ్లో మరీజీ (ఫ్రాన్స్) చేతిలో ఓడిన ద్రోణవల్లి హారిక.. మూడో రౌండ్లో ఫెర్నాండో (అర్జెంటీనా)తో గేమ్ను డ్రా చేసుకుంది.
బంగ్లాతో భారత్ వార్మప్
దుబాయ్: టీ20 ప్రపంచకప్ ఆరంభానికి ముందు టీమ్ఇండియా.. బంగ్లాదేశ్తో వార్మప్ మ్యాచ్ ఆడనుంది. జూన్ 1న అమెరికాలో ఈ సన్నాహక మ్యాచ్ జరుగనుంది. భారత్, బంగ్లా వార్మప్ మ్యాచ్ వేదిక, సమయాన్ని ఐసీసీ త్వరలోనే ప్రకటించనుంది. అమెరికా- వెస్టిండీస్ ఆతిథ్యమిచ్చే పొట్టి కప్పులో పాల్గొంటున్న 20 జట్లలో 17 టీమ్లు వార్మప్ మ్యాచ్లు ఆడతాయి. ఈనెల 27 నుంచి జూన్ 1 మధ్యలో టెక్సాస్, ఫ్లోరిడా, ట్రినిడాడ్ అండ్ టొబాగోలో మ్యాచ్లు నిర్వహిస్తారు. మ్యాచ్ల షెడ్యూల్ను శుక్రవారం ఐసీసీ ప్రకటించింది. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్, రన్నరప్ పాకిస్థాన్, సెమీఫైనలిస్ట్ న్యూజిలాండ్ వార్మప్ మ్యాచ్లు ఆడట్లేదు. ఈనెల 22న ప్రారంభమయ్యే నాలుగు మ్యాచ్ల ద్వైపాక్షిక సిరీస్లో పాక్కు ఇంగ్లాండ్ ఆతిథ్యమివ్వనుంది. అయిదు మ్యాచ్ల టీ20 సిరీస్ కోసం పాక్లో పర్యటించిన కివీస్.. జూన్ 8న అఫ్గానిస్తాన్తో జరిగే మ్యాచ్లో నేరుగా బరిలో దిగనుంది.
బాక్సింగ్లో నాలుగు కాంస్యాలు
అస్తానా (కజకిస్థాన్): ఎలోర్డా కప్ బాక్సింగ్లో భారత బాక్సర్లు నలుగురు కాంస్యాలతో సరిపెట్టుకున్నారు. శుక్రవారం సెమీఫైనల్స్లో యాయిఫాబా సింగ్ సోయ్బమ్ (48 కిలోలు) 3-4 తేడాతో అస్కత్ (కజకిస్థాన్) చేతిలో ఓడిపోగా.. 67 కిలోల విభాగంలో అభిషేక్ యాదవ్ 3-4 తేడాతో ముర్సల్ నుర్బెక్ (కజకిస్థాన్) చేతిలో పరాజయంపాలై కాంస్య పతకాలకు పరిమితమయ్యారు. విశాల్ (86 కిలోలు), గౌరవ్ చౌహాన్ (+92 కిలోలు) కూడా సెమీస్లో ఓడారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రోహిత్ కోచ్ వద్దే క్రికెట్ పాఠాలు నేర్చుకున్నా.. నా కెరీర్ను మార్చింది ఆయనే: హర్మిత్ సింగ్
భారత అండర్-19 వరల్డ్ కప్లో ఆడిన ఓ కుర్రాడు.. ఇప్పుడు యూఎస్ఏ జట్టు తరఫున టీ20 ప్రపంచ కప్లో ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. తొలిసారి సూపర్-8కి ఆ జట్టు దూసుకెళ్లడం గమనార్హం. -
స్టన్నింగ్ క్యాచ్.. మిస్సయితే తలకు గాయమయ్యేది!
ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న టీ20 బ్లాస్ట్ టోర్నీలో ఓ ఆటగాడు అద్భుతమైన క్యాచ్ అందుకోని అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. -
‘చిన్న’ దెబ్బ.. ‘పెద్ద’ గాయం
టీ20 ప్రపంచకప్ 2024లో మూడు పెద్ద జట్లు కనీసం తొలి రౌండ్ను అధిగమించకపోగా చిన్న జట్లు ముందుకెళ్లి సంచలనం సృష్టించాయి! -
మా నిష్క్రమణకు నాదే బాధ్యత.. పిచ్లపై నిందలేయను: హసరంగ
కనీసం సూపర్-8కి అర్హత సాధించడంలోనూ శ్రీలంక క్రికెట్ జట్టు విఫలమైంది. నాణ్యమైన క్రికెటర్లు ఉన్నప్పటికీ సమష్టిగా రాణించడంలో తేలిపోవడం ఆ జట్టు అభిమానులను నిరాశకు గురి చేసింది. -
పెంపుడు శునకాలతో ఆడుకుంటున్న ధోనీ.. వీడియో షేర్ చేసిన కుమార్తె జివా
ఫాదర్స్ డే సందర్భంగా మాజీ క్రికెటర్ ధోనీ కుమార్తె జివా తన ఇన్స్టాగ్రామ్లో ఓ వీడియోను పోస్టు చేసింది. ఇప్పుడు అది నెట్టంట వైరల్గా మారింది. ఎప్పుడూ చాలా సింపుల్గా ఉండే ధోనీ.. తన భార్య, కుమర్తెతో కలిసి రాంచీలోని ఫామ్హౌస్లో పెంపుడు శునకాలతో సరదాగా గడిపారు.
-
క్రికెట్లో మా ప్రాభవం తగ్గుతోంది.. పీసీబీ లుక్కేయాలి: పాక్ మాజీ కెప్టెన్ ఇంజమామ్
జట్టంతా కలసికట్టుగా ఆడితేనే విజయాలు సాధించే అవకాశం ఉంటుంది. కానీ, పాక్ మాత్రం ఈ సూత్రాన్ని విస్మరించినట్లుంది. టీ20 ప్రపంచకప్లో ఘోర ప్రదర్శనతో ఇంటిముఖం పట్టింది. -
నేను, సమైరా.. అతడి నుంచే క్రమశిక్షణ నేర్చుకుంటున్నాం: శుభ్మన్ గిల్
గిల్ స్వదేశానికి అర్ధంతరంగా తిరిగి రావడానికి కారణమేంటనే దానికి నెట్టింట విపరీతమైన చర్చ జరుగుతోంది. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా మేనేజ్మెంట్ ఈ నిర్ణయం తీసుకుందన్న వార్తలూ వచ్చాయి. -
11 మంది ఆటను నేను ఆడలేను కదా.. టీమ్గా విఫలమయ్యాం: బాబర్ అజామ్
పాకిస్థాన్ ఓటమికి కారణాలను ఆ జట్టు కెప్టెన్ బాబర్ అజామ్ వెల్లడించాడు. అభిమానులను తీవ్ర నిరాశపరిచినట్లు అంగీకరించాడు. -
ఛేజింగ్ల్లో కోహ్లీని ప్రత్యేకంగా నిలిపింది అదే.. విరాట్ సీక్రెట్ వెల్లడించిన అక్రమ్
విరాట్ కోహ్లీ ఛేజింగ్ల్లో అనుసరించే వ్యూహాన్ని ఇటీవల పాక్ మాజీ పేసర్ వసీం అక్రమ్ వెల్లడించాడు. -
అలాంటప్పుడు.. అక్కడ మ్యాచ్లు నిర్వహించొద్దు: సునీల్ గావస్కర్ ఆగ్రహం
తొలిసారి మెగా టోర్నీకి ఆతిథ్యమిస్తున్న అమెరికాలో సరైన సదుపాయాలు మాత్రం కానరావడం లేదు. ప్రాక్టీస్ చేసుకోవడానికి, జిమ్ చేసుకోవడానికి భారత ఆటగాళ్లు ఇబ్బంది పడిన సంగతి తెలిసిందే. మైదానం చిత్తడిగా ఉండటంతో మ్యాచ్ను రద్దు చేసిన పరిస్థితి తలెత్తింది. -
రెండు గ్రూప్లుగా సూపర్-8.. ఆ టీమ్లు ఇవే
టీ20 ప్రపంచ కప్లో టాప్-8 టీమ్లు ఏవో తేలిపోయాయి. సూపర్-8 పోరులో తలపడేందుకు సిద్ధమవుతున్నాయి. -
నేపాల్ను చిత్తు చేసిన బంగ్లాదేశ్.. సూపర్-8కి అర్హత
తన చివరి లీగ్ మ్యాచ్లో విజయం సాధించిన బంగ్లాదేశ్ టీ20 ప్రపంచ కప్ సూపర్-8కి అర్హత సాధించింది. -
గంభీరే టీమ్ఇండియా కోచ్!
టీమ్ఇండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ త్వరలోనే కొత్త పాత్రలో కనిపించబోతున్నాడు! భారత పురుషుల క్రికెట్ జట్టు ప్రధాన కోచ్గా అతని ఎంపిక ఖాయమైందని తెలిసింది. బీసీసీఐ అధికారికంగా ప్రకటించడమే మిగిలింది. -
గండాలు దాటి.. గట్టెక్కిన ఇంగ్లాండ్
వర్షం ఆగాలి.. మ్యాచ్ సాగాలి.. ఇంగ్లాండ్ జట్టుతో పాటు ఆ దేశ అభిమానులూ కోరుకున్నది ఇదే. ఒకవేళ వాన కారణంగా నమీబియాతో మ్యాచ్ రద్దయితే ఇంగ్లాండ్ ఇంటి ముఖం పట్టేదే. -
స్మృతి శతకం
భారత మహిళల క్రికెట్ జట్టుకు అదిరే విజయం! స్మృతి మంధాన శతకం..బంతితో శోభన, దీప్తి విజృంభణతో హర్మన్ప్రీత్ బృందం దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్లో ఘనంగా బోణీ కొట్టింది. -
ఆసీస్ అజేయంగా..
7 ఓవర్లలో 89 పరుగులు! ఇదీ స్కాట్లాండ్తో మ్యాచ్లో ఆస్ట్రేలియా విజయ సమీకరణం. చిన్నజట్టే అయినా స్కాట్లాండ్ బౌలర్లు క్రమశిక్షణతో బౌలింగ్ చేస్తూ.. బ్యాటర్లను కట్టడి చేశారు. దీంతో పొట్టి కప్లో మరో సంచలనం తప్పదేమో అనిపించింది. -
ఇటలీ శుభారంభం
యూరో కప్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇటలీ శుభారంభం చేసింది. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన గ్రూప్- బి మ్యాచ్లో ఆ జట్టు 2-1 తేడాతో అల్బేనియాను ఓడించింది. -
భజన్కు పారిస్ కోటా
భారత యువ ఆర్చర్ భజన్ కౌర్ పారిస్ ఒలింపిక్స్ కోటా స్థానాన్ని గెలిచింది. క్వాలిఫయర్స్ టోర్నీలో మహిళల రికర్వ్ సింగిల్స్లో స్వర్ణం సాధించిన ఆమె.. ఈ క్రమంలో దేశానికి కోటా స్థానాన్ని అందించింది. -
సంక్షిప్తవార్తలు(4)
టోక్యో ఒలింపిక్స్ కాంస్య విజేత లవ్లీనా బోర్గోహెయిన్ మరోసారి అంతర్జాతీయ వేదికపై మెరిసింది. చెక్ రిపబ్లిక్లో జరిగిన గ్రాండ్ ప్రి ఉస్తి నాద్ లేబం టోర్నీలో ఆమె రజతం సొంతం చేసుకుంది. -
అతడికి సెలవులు పొడిగించండి.. జీతం పెంచండి: ఒరాకిల్ సంస్థకు విజ్ఞప్తులు
అమెరికా తరఫున ఆడుతున్న భారత సంతతి ఆటగాడు నేత్రావల్కర్ ప్రదర్శనపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. -
కోహ్లీ ఆటతీరుపై ఎలాంటి ఆందోళన లేదు.. మద్దతుగా నిలిచిన బ్యాటింగ్ కోచ్
టీ20 ప్రపంచకప్లో విరాట్ కోహ్లీ పేలవ ప్రదర్శనపై పలువురు విమర్శలు గుప్పిస్తుండగా.. అతడికి బ్యాటింగ్ కోచ్ మద్దతుగా నిలిచాడు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
విమానాలకు.. ‘ఉష్ణోగ్రత’ సెగ.. రెండు గంటలు నిలిచిపోయిన విమానం
-
‘ఇండియా స్థానంలో భారత్’.. వివాదం అనవసరం - ఎన్సీఈఆర్టీ
-
రోహిత్ కోచ్ వద్దే క్రికెట్ పాఠాలు నేర్చుకున్నా.. నా కెరీర్ను మార్చింది ఆయనే: హర్మిత్ సింగ్
-
ఉత్తర కొరియా పర్యటనకు పుతిన్.. 24 ఏళ్లలో ఇదే తొలిసారి!
-
రూ.5లక్షలు పెట్టి టికెట్ కొన్నా..: విమాన ప్రయాణికుడి అసహనం
-
‘ఫాదర్స్ డే’ రోజే తండ్రిని కోల్పోయిన నిక్కీ హేలీ