అర్జున్‌ గేమ్‌ డ్రా

షార్జా మాస్టర్స్‌ చెస్‌ టోర్నమెంట్లో తెలంగాణ ఆటగాడు అర్జున్‌ ఇరిగేశి మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.

Published : 20 May 2024 01:59 IST

షార్జా: షార్జా మాస్టర్స్‌ చెస్‌ టోర్నమెంట్లో తెలంగాణ ఆటగాడు అర్జున్‌ ఇరిగేశి మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఆదివారం అయిదో రౌండ్లో వాల్డర్‌ మర్జిన్‌ (రష్యా)తో అర్జున్‌ డ్రాకు అంగీకరించాడు. దీంతో 3.5 పాయింట్లతో అర్జున్‌.. సంకల్ప్‌ గుప్తా, సలెమ్‌ (యూఏఈ) తదితరులతో కలిసి ఉమ్మడిగా మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. మరోవైపు ఇమెర్‌ కాన్‌ (టర్కీ) చేతిలో ద్రోణవల్లి హారిక ఓడిపోగా.. టర్కీ ఆటగాడు ముస్తాఫాతో రాజా రిత్విక్‌ డ్రా చేసుకున్నాడు. ఈ టోర్నీలో భారత గ్రాండ్‌మాస్టర్‌ అరవింద్‌ చిదంబరం (4.5) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అయిదో రౌండ్లో అతడు స్థానిక ఆటగాడు సలెమ్‌పై విజయం సాధించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని