దీప్తి.. విజయ స్ఫూర్తి
తల్లిదండ్రులు కూలి పని చేస్తేనే ఇళ్లు గడిచే నేపథ్యం ఆమెది. ఒకవైపు పేదరికం.. మరోవైపు మానసిక లోపం! చాలా ఇబ్బందులు పడింది.. అవమానాలు ఎదుర్కొంది.. అయినా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు.
తల్లిదండ్రులు కూలి పని చేస్తేనే ఇళ్లు గడిచే నేపథ్యం ఆమెది. ఒకవైపు పేదరికం.. మరోవైపు మానసిక లోపం! చాలా ఇబ్బందులు పడింది.. అవమానాలు ఎదుర్కొంది.. అయినా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. ఇంటిని.. ఊరును విడిచిపెట్టి సరికొత్త దారిలో పయనించింది. అకుంఠిత దీక్ష, మొక్కవోని పట్టుదలతో ప్రపంచ ఛాంపియన్గా నిలిచింది. అథ్లెటిక్స్లో అత్యున్నత శిఖరాలను అధిరోహించిన ఆ అమ్మాయే జీవాంజి దీప్తి.
ఈనాడు - హైదరాబాద్
దీప్తిది వరంగల్ జిల్లా కల్లెడ గ్రామం. తండ్రి యాదగిరి, తల్లి ధనలక్ష్మిని కుమార్తెకు ఎదురయ్యే అవమానాలు మరింత కుంగదీసేవి. అయితే భారత జూనియర్ జట్టు చీఫ్ కోచ్ నాగపురి రమేశ్ దృష్టిలో పడటం దీప్తి కెరీర్కు మలుపు. వరంగల్లో పాఠశాల మీట్లో దీప్తిని చూసిన అతడు శిక్షణ కోసం హైదరాబాద్కు పంపించమని తల్లిదండ్రులకు సూచించాడు. బస్సు ఛార్జీలకు కూడా డబ్బులు లేకపోవడంతో తానే భరించి ఆమెను హైదరాబాద్ తీసుకొచ్చి శిక్షణ ఇప్పించాడు. ‘లక్ష్య’ మార్గనిర్దేశకుడు పుల్లెల గోపీచంద్ చొరవతో ఆమె మానసిక లోపమున్న అథ్లెట్ల పోటీల్లో పాల్గొంది. అంతర్జాతీయ స్థాయిలో ఆ పోటీల్లో బరిలో దిగేందుకు అవసరమైన లైసెన్స్ కోసం మొరాకో, ఆస్ట్రేలియా టోర్నీల్లో పాల్గొనాల్సి వచ్చింది. అందుకోసం గోపీచంద్ రూ.3 లక్షలు వెచ్చించి దీప్తి భవితకు బాటలు వేశాడు.
మొరాకో నుంచి కోబె వరకు: ఆర్థికంగా మద్దతు, అత్యున్నత శిక్షణ దొరకడంతో దీప్తి ప్రదర్శన బాగా మెరుగైంది. అంతర్జాతీయ స్థాయిలో అదరగొట్టింది. 2022లో మొరాకోలో జరిగిన ప్రపంచ పారా గ్రాండ్ప్రిలో ఆమె టీ20, 400 మీటర్ల పరుగులో పసిడితో మెరిసింది. దీప్తికి తొలి అంతర్జాతీయ స్వర్ణమిదే. 400తో పాటు 200 మీటర్లలోనూ ఆమె సత్తా చాటింది. అదే ఏడాది బ్రిస్బేన్ వేదికగా వర్చుస్ ఆసియానియా క్రీడల్లో 200 మీటర్లలో 26.82 సెకన్లలో లక్ష్యాన్ని చేరి పసిడి గెలిచిన ఆమె.. 400 మీటర్లను 57.58 సెకన్లలో పూర్తి చేసి స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. అదే జోరు కొనసాగిస్తూ వెళ్లిన దీప్తి.. 2023 పారా ఆసియా క్రీడల ప్రదర్శనతో మరో ఎత్తుకు ఎదిగింది. ఈ క్రీడల్లో 400 మీటర్లను 56.69 సెకన్లలో రేసు పూర్తి చేసి అగ్రస్థానంతో పాటు ఆసియా రికార్డును సొంతం చేసుకుందామె. ఆ విజయం తర్వాత దీప్తిపై ప్రశంసల వర్షం కురిసింది. జిల్లా కలెక్టర్, ప్రజా ప్రతినిధులు ఇంటికొచ్చి అభినందించడం దీప్తి కుటుంబం కలలో కూడా ఊహించని దృశ్యాలే. గోపీచంద్ సిఫార్సుతో ‘లక్ష్య’ గొడుగు కిందకి వచ్చిన దీప్తికి మరింత మెరుగైన శిక్షణ లభించింది. అంతర్జాతీయ స్థాయి వసతులు, శిక్షణ అందించడంతో అత్యున్నత శిఖరాలకు చేరుకుంది. పారాలింపిక్స్కు అర్హత సాధించిన దీప్తి.. ‘లక్ష్య’ అండ, మద్దతుతో పతకం నెగ్గడం ఖాయమని గోపీచంద్, రమేశ్ ఆశాభావం వ్యక్తంజేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
జేడీ వాన్స్ వ్యాఖ్యలు వైరల్.. తీవ్రంగా ఖండించిన ప్రముఖ నటి
-
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
-
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం.. బాధితుడిని కాపాడిన మంత్రి లోకేశ్
-
అగ్నిపథ్ పథకంపై విపక్షాల విమర్శలు.. ఖండించిన మోదీ
-
మెక్సికన్ డ్రగ్ లార్డ్ ఇస్మాయిల్ ‘ఎల్ మాయో’ జంబాడ అరెస్ట్
-
26 మంది హత్య.. మృతదేహాలను నదిలోకి ఈడ్చుకెళ్లిన మొసళ్లు..!