రాణించిన సురేఖ

ఆర్చరీ ప్రపంచకప్‌ స్టేజ్‌-2 టోర్నీలో భారత స్టార్‌ క్రీడాకారిణి వెన్నం జ్యోతి సురేఖ ర్యాంకింగ్‌ రౌండ్లో నాలుగో స్థానం సాధించింది. గతనెల షాంఘైలో స్టేజ్‌-1 టోర్నీలో హ్యాట్రిక్‌ స్వర్ణాలు సాధించిన సురేఖకు మహిళల కాంపౌండ్‌ ర్యాంకింగ్‌ రౌండ్లో టాప్‌-3లో స్థానం త్రుటిలో చేజారింది.

Published : 22 May 2024 03:28 IST

యెచియాన్‌ (దక్షిణ కొరియా): ఆర్చరీ ప్రపంచకప్‌ స్టేజ్‌-2 టోర్నీలో భారత స్టార్‌ క్రీడాకారిణి వెన్నం జ్యోతి సురేఖ ర్యాంకింగ్‌ రౌండ్లో నాలుగో స్థానం సాధించింది. గతనెల షాంఘైలో స్టేజ్‌-1 టోర్నీలో హ్యాట్రిక్‌ స్వర్ణాలు సాధించిన సురేఖకు మహిళల కాంపౌండ్‌ ర్యాంకింగ్‌ రౌండ్లో టాప్‌-3లో స్థానం త్రుటిలో చేజారింది. అయితే సురేఖ ప్రదర్శనతో టీమ్‌ విభాగంలో భారత్‌కు రెండో సీడింగ్‌ లభించింది. సురేఖ 4, పర్ణీత్‌ కౌర్‌ 8, అదితి స్వామి 15వ స్థానాల్లో నిలవడంతో మొత్తంగా భారత్‌కు రెండో స్థానం దక్కింది. టీమ్‌ విభాగం క్వార్టర్‌ఫైనల్లో ఏడో సీడ్‌ ఇటలీతో భారత్‌ తలపడుతుంది. పురుషుల కాంపౌండ్‌ ర్యాంకింగ్‌ రౌండ్లో భారత ఆర్చర్లు విఫలమయ్యారు. ప్రియాంశ్‌ 16వ, ప్రథమేశ్‌ 20వ, అభిషేక్‌వర్మ 24వ స్థానాల్లో నిలిచారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని