వయసుకు మినహాయింపు ఉండదు
క్రికెటర్గా కొనసాగాలంటే కఠోర సాధన చేయడం.. వీలైనంతగా ఫిట్గా ఉండడమే కీలకమని వయసుకు ఎవరూ మినహాయింపు ఇవ్వరని మహేంద్రసింగ్ ధోని అన్నాడు. 43 ఏళ్లకు చేరువైన ధోనికి ఇదే చివరి ఐపీఎల్ అనే ఊహాగానాలు రేగుతున్న నేపథ్యంలో అతడిలా స్పందించాడు.
దిల్లీ: క్రికెటర్గా కొనసాగాలంటే కఠోర సాధన చేయడం.. వీలైనంతగా ఫిట్గా ఉండడమే కీలకమని వయసుకు ఎవరూ మినహాయింపు ఇవ్వరని మహేంద్రసింగ్ ధోని అన్నాడు. 43 ఏళ్లకు చేరువైన ధోనికి ఇదే చివరి ఐపీఎల్ అనే ఊహాగానాలు రేగుతున్న నేపథ్యంలో అతడిలా స్పందించాడు. ‘‘ఏడాది మొత్తం క్రికెట్ ఆడట్లేదు. అందుకే ఐపీఎల్ వచ్చేసరికి ఫిట్గా ఉండాలి. ఈ లీగ్లో అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్న యువ ఆటగాళ్లతో తలపడాల్సి ఉంటుంది. అందుకే ప్రొఫెషనల్ ఆట అంత తేలికేం కాదు. ఇందులో వయసుకు ఎవరూ మినహాయింపు ఇవ్వరు. ఆడాలని అనుకుంటే ఫిట్గా ఉండక తప్పదు. ఆహార అలవాట్లను మార్చుకోవడంతో పాటు కఠోర సాధన చేయాలి. మానసికంగా ప్రభావం చూపించే సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండాలి’’ అని ధోని పేర్కొన్నాడు. అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు చెప్పిన తర్వాత కుటుంబానికే ఎక్కువ సమయం కేటాయిస్తున్నట్లు తెలిపాడు. ‘‘అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాక కుటుంబంతో ఎక్కువ సమయం గడుపుతున్నా. నాకెంతో ఇష్టమైన వ్యవసాయంపై దృష్టి పెట్టా. మోటార్బైకులు, వింటేజ్ కార్లలో తిరుగుతున్నా. కుక్కలను పెంచడం అంటే కూడా ఎంతో ఇష్టం’’ అని మహి పేర్కొన్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
అతివేగం తీసింది ఇద్దరి ప్రాణం.. సాఫ్ట్వేర్ ఉద్యోగుల దుర్మరణం
-
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?