తుదిపోరుకు జ్యోతి బృందం
ఆర్చరీ ప్రపంచకప్ల్లో ప్రపంచ నంబర్వన్ భారత మహిళల కాంపౌండ్ జట్టు దూకుడు కొనసాగిస్తోంది. గత నెలలో షాంఘైలో జరిగిన తొలి అంచె ప్రపంచకప్లో పసిడి నెగ్గిన జ్యోతి సురేఖ, పర్ణీత్ కౌర్, అదితి స్వామి త్రయం.. తాజాగా రెండో అంచె పోటీల్లోనూ ఫైనల్కు దూసుకెళ్లింది.
ఆర్చరీ ప్రపంచకప్
యెచియాన్ (దక్షిణ కొరియా): ఆర్చరీ ప్రపంచకప్ల్లో ప్రపంచ నంబర్వన్ భారత మహిళల కాంపౌండ్ జట్టు దూకుడు కొనసాగిస్తోంది. గత నెలలో షాంఘైలో జరిగిన తొలి అంచె ప్రపంచకప్లో పసిడి నెగ్గిన జ్యోతి సురేఖ, పర్ణీత్ కౌర్, అదితి స్వామి త్రయం.. తాజాగా రెండో అంచె పోటీల్లోనూ ఫైనల్కు దూసుకెళ్లింది. బుధవారం సెమీస్లో భారత్ 233-229 తేడాతో ప్రపంచ నాలుగో ర్యాంకు అమెరికాపై విజయం సాధించింది. క్వాలిఫికేషన్లో రెండో స్థానం సాధించిన భారత్ త్రయానికి బై దక్కడంతో నేరుగా క్వార్టర్స్లో ఇటలీతో తలపడింది. ఆ మ్యాచ్లో మన ఆర్చర్లు 236-234తో గెలిచారు. పసిడి కోసం శనివారం ఏడో ర్యాంకు టర్కీతో భారత్ తలపడుతుంది. మరో సెమీస్లో టర్కీ 234-233తో టాప్సీడ్ దక్షిణ కొరియాకు షాకిచ్చింది. మరోవైపు పురుషుల కాంపాండ్ టీమ్ కాంస్య పతక పోరులో ప్రియాన్ష్, ప్రథమేశ్, అభిషేక్ శర్మతో కూడిన భారత్ 233-233 (30-30) షూటాఫ్లో ఆస్ట్రేలియా చేతిలో కంగుతింది. ప్రపంచ నంబర్వన్ భారత్ తనకంటే తక్కువ ర్యాంకు (21)లో ఉన్న ఆసీస్ ముందు తలవంచింది. 4 రౌండ్ల పోటీ ముగిసే సరికి రెండు జట్లు 233-233తో సమంగా నిలిచాయి. షూటాఫ్లోనూ రెండు జట్లు 30 పాయింట్ల చొప్పున సాధించాయి. కానీ ఆసీస్ ఆర్చర్లు విసిరిన బాణాల్లో రెండు లక్ష్యానికి అత్యంత చేరువగా ఉండటంతో భారత్కు పరాజయం తప్పలేదు. రికర్వ్ వ్యక్తిగత అర్హత రౌండ్లో పురుషుల్లో తరుణ్దీప్ రాయ్ (681) ఆరో, బొమ్మదేవర ధీరజ్ (678) 11వ స్థానాన్ని దక్కించుకున్నారు. మహిళల్లో దీపిక కుమారి (677) నాలుగో స్థానంలో నిలిచింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.