ప్రీతి రికార్డు పసిడి
ప్రపంచ యూత్ వెయిట్లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో భారత అమ్మాయి ప్రీతి స్మిత (40 కేజీలు) సత్తా చాటింది. ప్రపంచ రికార్డుతో సహా పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది.
లిమా (పెరూ): ప్రపంచ యూత్ వెయిట్లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో భారత అమ్మాయి ప్రీతి స్మిత (40 కేజీలు) సత్తా చాటింది. ప్రపంచ రికార్డుతో సహా పసిడి పతకాన్ని సొంతం చేసుకుంది. స్నాచ్లో 57 కేజీలు ఎత్తిన ప్రీతి.. క్లీన్ అండ్ జెర్క్లో 76 కేజీలు లిఫ్ట్ చేసి ప్రపంచ రికార్డు (75 కేజీలు)ను బద్దలుకొట్టింది. మొత్తం మీద 133 కేజీలతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. మరో భారత లిఫ్టర్ జోత్స్న 125 కేజీలతో (స్నాచ్ 56 + క్లీన్ అండ్ జెర్క్ 69 కేజీలు) రజతం.. టర్కీ అమ్మాయి ఫాతిమా 120 కేజీలతో (స్నాచ్ 55, క్లీన్ అండ్ జెర్క్ 65 కేజీలు) కాంస్యం సాధించారు. 45 కేజీల్లో పాయల్ (మొత్తం 147 కేజీలు) రజతం.. పురుషుల 49 కేజీల కేటగిరిలో బాబులాల్ (మొత్తం 193 కేజీలు) కాంస్యం గెలిచారు.
సెమీస్లో ప్రథమేశ్
ప్రపంచకప్ ఆర్చరీ
యెచియాన్ (దక్షిణ కొరియా): ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్-2 టోర్నమెంట్లో భారత యువ ఆర్చర్ ప్రథమేశ్ సెమీఫైనల్కు దూసుకెళ్లాడు. పురుషుల కాంపౌండ్ వ్యక్తిగత విభాగం క్వార్టర్ఫైనల్స్లో అతడు 146-145తో నికో వీనెర్ (ఆస్ట్రియా)ను ఓడించాడు. సెమీస్లో జేమ్స్ లూజ్ (అమెరికా)తో ప్రథమేశ్ తలపడనున్నాడు. మరోవైపు అభిషేక్వర్మ రెండో రౌండ్లో.. ప్రియాంశ్ ప్రిక్వార్టర్స్లో ఇంటిముఖం పట్టారు. మహిళల కాంపౌండ్లో టీమ్ విభాగంలో ఫైనల్ చేరిన తెలుగమ్మాయి జ్యోతి సురేఖ.. వ్యక్తిగత విభాగంలో క్వార్టర్స్లోనే ఓడింది. ఆమె 142-145తో సారా లోపెజ్ (కొలంబియా)కు తలొంచింది. రికర్వ్ టీమ్ విభాగం తొలి రౌండ్లో బొమ్మదేవర ధీరజ్, తరుణ్దీప్ రాయ్, మృనాల్ చౌహాన్లతో కూడిన భారత జట్టు 3-5తో కెనడా చేతిలో కంగుతింది. రికర్వ్ మహిళల టీమ్ విభాగంలోనూ భారత్కు చుక్కెదురైంది. తొలి రౌండ్లో దీపిక కుమారి, అంకిత బాకత్, భజన్ కౌర్లతో కూడిన బృందం 4-5తో షూటాఫ్లో వియత్నాం చేతిలో ఓడిపోయింది. నిర్ణీత సమయానికి భారత్-వియత్నాం చెరో రెండు సెట్లు గెలిచి సమానంగా నిలిచాయి. షూటాఫ్లో వియత్నాం 27-25తో భారత్పై పైచేయి సాధించింది.
ఫ్రెంచ్ ఓపెన్ బరిలో నాదల్
పారిస్: రెండేళ్లుగా వేధిస్తున్న గాయాలు. తుంటి శస్త్రచికిత్స కారణంగా ఫిట్నెస్ సమస్యలు. ఆటలో వెనుకబాటు. దీంతో ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్లో ఆడాలా? వద్దా? అని ఓ దశలో టెన్నిస్ దిగ్గజం రఫెల్ నాదల్ సందిగ్ధంలో పడ్డాడు. ముఖ్యంగా ఇటాలియన్ ఓపెన్లో పేలవ ఆటతీరుతో ఆలోచనల్లో మునిగిపోయాడు. కానీ తనకు అచ్చొచ్చిన, ఎంతో ఇష్టమైన ఫ్రెంచ్ ఓపెన్లో ఈ సారి అతను ఆడబోతున్నాడు. శస్త్రచికిత్స కారణంగా నిరుడు ఈ టోర్నీకి నాదల్ దూరమైన సంగతి తెలిసిందే. ఇక్కడ 14 సార్లు విజేతగా నిలిచిన అతను.. ఆదివారం ఆరంభమయ్యే ఈ ఎర్రమట్టి కోర్టు టోర్నీ కోసం ప్రాక్టీస్ చేస్తున్నాడు. అలాగే గురువారం విడుదల చేసిన టోర్నీ డ్రాలో అతని పేరుంది. అన్సీడెడ్గా ఆడబోతున్న నాదల్ తొలి రౌండ్లో నాలుగో ర్యాంకర్ జ్వెరెవ్ను ఢీకొడతాడు. 2022లో ఈ టోర్నీ సెమీస్లో వీళ్లిద్దరు తలపడగా.. గాయంతో జ్వెరెవ్ మధ్యలోనే తప్పుకున్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మట్టిచరియల బీభత్సంతో పెను విషాదం.. ఇథియోపియాలో 257కి చేరిన మృతులు
-
ప్రపంచంలోని గొప్ప ప్రదేశాల్లో హైదరాబాద్ ‘మనం చాక్లెట్’!
-
మదనపల్లె ఘటనలో ఉద్యోగులపై వేటు తప్పదు: ఆర్పీ సిసోదియా
-
కమలాహారిస్కు ఒబామా దంపతుల మద్దతు
-
దిగొచ్చిన బంగారం ధర.. దుకాణాల్లో కొనుగోళ్ల జోష్..!
-
పెద్దిరెడ్డి, మిథున్రెడ్డి మంచోళ్లు: మాజీ సీఎం జగన్