జైస్మిన్, ఫంగాల్పైనే దృష్టి
పారిస్ ఒలింపిక్స్లో బాక్సింగ్ బెర్తు సంపాదించడానికి ఆఖరి అవకాశం. శుక్రవారం బ్యాంకాక్లో ఆరంభమయ్యే ప్రపంచ క్వాలిఫికేషన్ టోర్నీలో భారత బాక్సర్లు అదృష్టం పరీక్షించుకోనున్నారు.
నేటి నుంచి బాక్సింగ్ క్వాలిఫయర్స్
బ్యాంకాక్: పారిస్ ఒలింపిక్స్లో బాక్సింగ్ బెర్తు సంపాదించడానికి ఆఖరి అవకాశం. శుక్రవారం బ్యాంకాక్లో ఆరంభమయ్యే ప్రపంచ క్వాలిఫికేషన్ టోర్నీలో భారత బాక్సర్లు అదృష్టం పరీక్షించుకోనున్నారు. వీరిలో జైస్మిన్ లాంబోరియా (57 కేజీ) పైనే అందరి దృష్టి ఉంది. 57 కిలోలో విభాగంలో పర్వీన్ హుడాపై ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) నిషేధం విధించడంతో కోల్పోయిన ఒలింపిక్స్ బెర్తును దక్కించుకునేందుకు భారత బాక్సింగ్ సమాఖ్య జైస్మిన్ను బరిలో దింపింది. గతంలో 60 కేజీల్లో పోటీపడే జైస్మిన్.. 57 కేజీల్లో ఎలా రాణిస్తుందో చూడాలి. ఆమెతో పాటు అంకుషిత బొరో (60 కేజీ), అరుంధతి చౌదరి (66 కేజీ) పోటీపడుతున్నారు. పురుషుల్లో అమిత్ ఫంగాల్ (51 కేజీ) బరిలో ఉన్నాడు. ఈ ఏడాది ఆరంభంలో స్ట్రాంజా టోర్నీలో పసిడితో ఫామ్లోకి వచ్చిన అమిత్.. ఆ జోరు కొనసాగిస్తాడా అనేది ఆసక్తికరం. అతడితో పాటు సచిన్ సివాచ్ (57 కేజీ), అభినాష్ (63.5 కేజీ), నిశాంత్ దేవ్ (71 కేజీ), అభిమన్యు (80 కేజీ), సంజీత్ (92 కేజీ), నరేందర్ (92 కేజీ +) కూడా పోటీపడుతున్నారు. ఇప్పటివరకు నిఖత్ జరీన్ (50 కేజీ), ప్రీతి పన్వర్ (54 కేజీ), లవ్లీనా (75 కేజీ) మాత్రమే పారిస్ టికెట్ సాధించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్మృతి మంధాన సెంచరీ.. దక్షిణాఫ్రికాను చిత్తుగా ఓడించిన భారత్
దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో భారత మహిళా జట్టు 143 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. -
అతడికి సెలవులు పొడిగించండి.. జీతం పెంచండి: ఒరాకిల్ సంస్థకు విజ్ఞప్తులు
అమెరికా తరఫున ఆడుతున్న భారత సంతతి ఆటగాడు నేత్రావల్కర్ ప్రదర్శనపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. -
టీమ్ఇండియా కోచ్గా గంభీర్ ఫిక్స్? ఆ డిమాండ్కు ఓకే చెప్పిన బీసీసీఐ!
భారత జట్టు కోచ్గా గౌతమ్ గంభీర్ ఎంపిక దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది. ఈ నెలఖారులో దీనిపై బీసీసీఐ అధికారిక ప్రకటన చేసే ఛాన్స్ ఉంది. -
క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన నమీబియా స్టార్ ఆల్రౌండర్
నమీబియా స్టార్ ఆల్రౌండర్ డేవిడ్ వీజ్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. -
క్రమశిక్షణ చర్యల్లో భాగంగా గిల్ను వెనక్కి పంపారా..? బ్యాటింగ్ కోచ్ ఏమన్నారంటే..
టీమ్ ఇండియా ట్రావెలింగ్ రిజర్వులో ఉన్న గిల్ను ప్రపంచకప్ టోర్నీ నుంచి వెనక్కి పంపడంపై బ్యాటింగ్ కోచ్ వివరణ ఇచ్చారు. -
స్కాట్లాండ్పై ఆస్ట్రేలియా గెలుపు.. సూపర్-8కు ఇంగ్లాండ్
Australia vs Scotland: ఆదివారం జరిగిన టీ20 వరల్డ్ కప్ మ్యాచ్లో స్కాట్లాండ్పై ఆస్ట్రేలియా 5 వికెట్ల తేడాతో గెలిచింది. దీంతో సూపర్8లో ఇంగ్లాండ్కు బెర్త్ ఖరారైంది. -
చివరిది వరుణుడికి
అనుకున్నదే జరిగింది. గ్రూప్- ఎ లో భారత్ చివరి మ్యాచ్ను వరుణుడు ఆడనివ్వలేదు. కీలకమైన సూపర్- 8 పోరుకు ముందు అన్ని విభాగాల్లోనూ మరోసారి సత్తాచాటాలని చూసిన టీమ్ఇండియా ఆశ తీరలేదు. -
చిన్నోళ్లు దమ్మున్నోళ్లు
ఎవరైనా ఊహించారా.. టీ20 ప్రపంచకప్లో పాకిస్థాన్ను వెనక్కినెట్టి అమెరికా సూపర్- 8కు చేరుతుందని! ఎవరైనా అనుకున్నారా.. ప్రపంచకప్ల్లో అత్యంత నిలకడగా ఆడే న్యూజిలాండ్ గ్రూప్ దశలోనే నిష్క్రమిస్తుందని! కానీ ఇవి జరిగాయి. -
నేపాల్ ఒక్క పరుగు తేడాతో..
టీ20 ప్రపంచకప్లో మరో సంచలనం కొద్దిలో తప్పింది. కూనల చేతిలో షాక్ తిన్న జట్ల జాబితాలో దక్షిణాఫ్రికా కూడా చేరేదే. నేపాల్పై ఆ జట్టు ఒక్క పరుగు తేడాతో అతికష్టంగా గట్టెక్కింది. -
కివీస్ తొలి గెలుపు
ఇప్పటికే టీ20 ప్రపంచకప్ సూపర్-8కు దూరమైన న్యూజిలాండ్ టోర్నీలో తొలి విజయాన్ని అందుకుంది. శనివారం గ్రూప్-సి పోరులో ఆ జట్టు 9 వికెట్ల తేడాతో ఉగాండాను చిత్తు చేసింది. -
జర్మనీ ఘన బోణీ
యూరో కప్ను ఆతిథ్య జర్మనీ విజయంతో మొదలెట్టింది. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన గ్రూప్- ఎ మ్యాచ్లో ఆ జట్టు 5-1 తేడాతో స్కాట్లాండ్ను చిత్తుచేసింది. -
ఏ జట్టునైనా ఓడించగలం
పూర్తి స్థాయిలో ఆడితే ఏ జట్టునైనా ఓడించగలమని అమెరికా వైస్ కెప్టెన్ అరోన్ జోన్స్ అన్నాడు. ‘‘సూపర్-8 సవాల్కు సిద్ధంగా ఉన్నాం. రెండో రౌండ్ చేరడం మాకో పెద్ద ఘనత. -
గంభీర్ సమర్థుడే కానీ..
టీమ్ఇండియా కోచ్ పదవి రేసులో గౌతమ్ గంభీర్ ముందున్నాడు. మెంటార్గా ఇటీవల కోల్కతా నైట్రైడర్స్ ఐపీఎల్ టైటిల్ గెలవడంలో గంభీర్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. -
సంక్షిప్త వార్తలు(5)
జాతీయ జట్టు తరపున ఇదే తనకు చివరి టీ20 ప్రపంచకప్ అని న్యూజిలాండ్ స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ ప్రకటించాడు. కానీ కివీస్ జట్టుతో అంతర్జాతీయ మ్యాచ్లు ఆడే విషయంపై మాత్రం అతను స్పష్టత ఇవ్వలేదు. -
మొదట ఆ ఐదుగురిని తప్పించండి! సీనియర్ ఆటగాళ్లపై తీవ్రంగా మండిపడ్డ పాక్ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ 2024లో పాకిస్థాన్ లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టనుంది. దీంతో పాక్ జట్టుపై సొంత దేశం ఆటగాళ్ల నుంచే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
స్మృతి మంధాన సెంచరీ.. దక్షిణాఫ్రికాను చిత్తుగా ఓడించిన భారత్
-
ప్రపంచంలోనే ఎత్తైన చినాబ్ రైల్వే వంతెనపై తొలి ట్రయల్ రన్.. వీడియో
-
అల్లర్ల గురించి పిల్లలకు బోధించడం ఎందుకు?: ఎన్సీఈఆర్టీ చీఫ్
-
పేటీఎం - జొమాటో రూ.1,500 కోట్ల డీల్?
-
అతడికి సెలవులు పొడిగించండి.. జీతం పెంచండి: ఒరాకిల్ సంస్థకు విజ్ఞప్తులు
-
కొత్తదనం, ప్రయోగాలకు రామోజీరావు చిరునామా.. బెంగళూరులో జర్నలిస్టుల ఘన నివాళి