జైస్మిన్, ఫంగాల్పైనే దృష్టి
పారిస్ ఒలింపిక్స్లో బాక్సింగ్ బెర్తు సంపాదించడానికి ఆఖరి అవకాశం. శుక్రవారం బ్యాంకాక్లో ఆరంభమయ్యే ప్రపంచ క్వాలిఫికేషన్ టోర్నీలో భారత బాక్సర్లు అదృష్టం పరీక్షించుకోనున్నారు.
నేటి నుంచి బాక్సింగ్ క్వాలిఫయర్స్
బ్యాంకాక్: పారిస్ ఒలింపిక్స్లో బాక్సింగ్ బెర్తు సంపాదించడానికి ఆఖరి అవకాశం. శుక్రవారం బ్యాంకాక్లో ఆరంభమయ్యే ప్రపంచ క్వాలిఫికేషన్ టోర్నీలో భారత బాక్సర్లు అదృష్టం పరీక్షించుకోనున్నారు. వీరిలో జైస్మిన్ లాంబోరియా (57 కేజీ) పైనే అందరి దృష్టి ఉంది. 57 కిలోలో విభాగంలో పర్వీన్ హుడాపై ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) నిషేధం విధించడంతో కోల్పోయిన ఒలింపిక్స్ బెర్తును దక్కించుకునేందుకు భారత బాక్సింగ్ సమాఖ్య జైస్మిన్ను బరిలో దింపింది. గతంలో 60 కేజీల్లో పోటీపడే జైస్మిన్.. 57 కేజీల్లో ఎలా రాణిస్తుందో చూడాలి. ఆమెతో పాటు అంకుషిత బొరో (60 కేజీ), అరుంధతి చౌదరి (66 కేజీ) పోటీపడుతున్నారు. పురుషుల్లో అమిత్ ఫంగాల్ (51 కేజీ) బరిలో ఉన్నాడు. ఈ ఏడాది ఆరంభంలో స్ట్రాంజా టోర్నీలో పసిడితో ఫామ్లోకి వచ్చిన అమిత్.. ఆ జోరు కొనసాగిస్తాడా అనేది ఆసక్తికరం. అతడితో పాటు సచిన్ సివాచ్ (57 కేజీ), అభినాష్ (63.5 కేజీ), నిశాంత్ దేవ్ (71 కేజీ), అభిమన్యు (80 కేజీ), సంజీత్ (92 కేజీ), నరేందర్ (92 కేజీ +) కూడా పోటీపడుతున్నారు. ఇప్పటివరకు నిఖత్ జరీన్ (50 కేజీ), ప్రీతి పన్వర్ (54 కేజీ), లవ్లీనా (75 కేజీ) మాత్రమే పారిస్ టికెట్ సాధించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్లో రకుల్ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
-
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?