గోల్డెన్ స్పైక్ మీట్కు నీరజ్ దూరం
భారత జావెలిన్త్రో స్టార్ నీరజ్ చోప్రా.. చెక్ రిపబ్లిక్లో జరిగే అస్ట్రావా గోల్డెన్ స్పైక్ మీట్కు దూరమయ్యాడు. గాయంతో అతడు తప్పుకున్నాడని మొదట వార్తలు వచ్చాయి. కానీ తనకు ఎలాంటి గాయం కాలేదని ముందు జాగ్రత్త చర్యగా పోటీ నుంచి వైదొలిగానని వివరణ ఇచ్చాడు.
దిల్లీ: భారత జావెలిన్త్రో స్టార్ నీరజ్ చోప్రా.. చెక్ రిపబ్లిక్లో జరిగే అస్ట్రావా గోల్డెన్ స్పైక్ మీట్కు దూరమయ్యాడు. గాయంతో అతడు తప్పుకున్నాడని మొదట వార్తలు వచ్చాయి. కానీ తనకు ఎలాంటి గాయం కాలేదని ముందు జాగ్రత్త చర్యగా పోటీ నుంచి వైదొలిగానని వివరణ ఇచ్చాడు. ‘‘ఇటీవల త్రోయింగ్ సెషన్ తర్వాత మే 28న ఆరంభమయ్యే గోల్డెన్ స్పైక్ టోర్నీలో బరిలో దిగకూడదని భావించా. తొడ కండరాల్లో ఏదో ఇబ్బందిగా అనిపించింది. నేనేమి గాయపడలేదు. ఒలింపిక్స్కు ముందు సాహసాలు చేయకూడదని అనుకుంటున్నా. పూర్తిగా ఫిట్గా ఉన్నా అనిపిస్తే బరిలో దిగుతా’’ అని నీరజ్ చెప్పాడు. దోహా డైమండ్ లీగ్లో రజతం గెలిచిన నీరజ్.. ఈ క్రమంలో జావెలిన్ను 88.36 మీటర్లు విసిరాడు. జూన్ 18న ఫిన్లాండ్లో ఆరంభమయ్యే పావో నూర్మి క్రీడల్లో ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ పోటీపడే అవకాశాలున్నాయి.
అమెరికాలో టీమ్ఇండియా
న్యూయార్క్: టీ20 ప్రపంచకప్ కోసం అమెరికాకు టీమ్ఇండియా చేరుకుంది. కెప్టెన్ రోహిత్ సహా జట్టులోని మరికొంత మంది ఆటగాళ్లు ఆదివారం న్యూయార్క్లో అడుగుపెట్టారు. బుమ్రా, సిరాజ్, సూర్యకుమార్, పంత్, శివమ్ దూబె, జడేజా, కుల్దీప్ యాదవ్, అక్షర్తో పాటు రిజర్వ్ ఆటగాళ్లు శుభమ్ గిల్, ఖలీల్ అహ్మద్ అక్కడికి వెళ్లారు. ప్రధాన కోచ్ ద్రవిడ్తో పాటు కోచింగ్ సిబ్బంది కూడా అమెరికా చేరుకున్నారు. కోహ్లి, హార్దిక్ పాండ్య ఈ జట్టుతో వెళ్లలేదు. ఐపీఎల్లో ఎలిమినేటర్ ఆడిన కోహ్లి రెండో విడత ఆటగాళ్ల బృందంతో కలిసి న్యూయార్క్కు పయనమయ్యే అవకాశముంది. యూకేలో ఉన్న వైస్కెప్టెన్ హార్దిక్ జట్టుతో ఎప్పుడు చేరతాడన్నదానిపై స్పష్టత లేదు. రెండో క్వాలిఫయర్ ఆడిన రాజస్థాన్ ఆటగాళ్లు యశస్వి జైస్వాల్, శాంసన్, చాహల్, అవేశ్ (రిజర్వ్) సోమవారం బయల్దేరనున్నారు.
అభినాష్, నిశాంత్ శుభారంభం
బ్యాంకాక్: ప్రపంచ బాక్సింగ్ క్వాలిఫయర్స్లో అభినాష్ జామ్వాల్ (63.5 కేజీ), నిశాంత్ దేవ్ (71 కేజీ) శుభారంభం చేశారు. ఆదివారం తొలి రౌండ్లో అభినాష్ 5-0తో లావ్రెనోవాస్ (లిథుయేనియా)ను చిత్తు చేశాడు. మరో బౌట్లో నిశాంత్ అంతే తేడాతో ఆర్నాండో బిగాఫా (గినియా బిసావూ)పై విజయం సాధించాడు. ఇప్పటికే సచిన్ సివాచ్ (57 కేజీ), అభిమన్యు (80 కేజీ) తొలి రౌండ్లో గెలిచారు. అమిత్ ఫంగాల్ (51 కేజీ), సంజీత్ (92 కేజీ), నరేందర్ (92 కేజీల+), జైస్మిన్ (57 కేజీ), అరుంధతి చౌదరి (66 కేజీ)లకు తొలి రౌండ్లో బై దక్కింది. అంకుషిత బొరో (60 కేజీ) సోమవారం తొలి రౌండ్ ఆడనుంది.
అమ్మాయిలకు మరో ఓటమి
ప్రొహాకీ లీగ్
ఆంట్వెర్ప్: ప్రొ హాకీ లీగ్ ఐరోపా అంచెలో భారత అమ్మాయిల జట్టు ఓటమి బాట వీడట్లేదు. సలీమా బృందం వరుసగా నాలుగో పరాజయాన్ని చవిచూసింది. ఆదివారం భారత్ 0-3తో అర్జెంటీనా చేతిలో ఓడింది. ఆరంభం నుంచే అర్జెంటీనా దాడి మొదలైంది. తొలి నిమిషంలో సెలీనా గోల్ కొట్టి అర్జెంటీనాను ఆధిక్యంలోకి తీసుకెళ్లింది. తర్వాత కాంపాయ్ (39వ), గ్రానాటో (47వ) గోల్స్తో ఆ జట్టు 3-0తో తిరుగులేని ఆధిక్యాన్ని సాధించింది. భారత్కు కూడా అవకాశాలు దక్కినా సద్వినియోగం చేసుకోలేకపోయింది. జూన్ 1న జర్మనీతో భారత్ తలపడనుంది.
హోల్డర్కు గాయం.. జట్టులోకి మెకాయ్
సెయింట్ జాన్స్: టీ20 ప్రపంచకప్కు ముందు వెస్టిండీస్కు ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆల్రౌండర్ జేసన్ హోల్డర్ గాయంతో ఈ పొట్టికప్కు దూరమయ్యాడు. అతని స్థానాన్ని మెకాయ్తో భర్తీ చేస్తున్నట్లు క్రికెట్ వెస్టిండీస్ ప్రకటించింది. కౌంటీ ఛాంపియన్షిప్లో ఆడుతూ హోల్డర్ గాయపడ్డాడు. ‘‘మా కూర్పులో జేసన్ అనుభవజ్ఞుడైన ఆటగాడు. మైదానం బయట, లోపల అతని గైర్హాజరీ కచ్చితంగా లోటే. పూర్తి ఫిట్నెస్తో జేసన్ తిరిగి వస్తాడని ఆశిస్తున్నాం. మెకాయ్ నైపుణ్యాలపై నమ్మకముంది’’ అని క్రికెట్ వెస్టిండీస్ తెలిపింది. మరోవైపు కైల్ మేయర్స్, ఫాబియన్ అలెన్, మాథ్యూ ఫోర్డ్, ఫ్లెచర్, హేడెన్ వాల్ష్ను రిజర్వ్ ప్లేయర్లుగా ప్రకటించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కేరళ, బెంగాల్ గవర్నర్ కార్యాలయాలకు సుప్రీం నోటీసులు
-
జాస్పర్ నగరం సగం భస్మీపటలం..!
-
నిరుద్యోగులూ నిరసనలు వద్దు.. మీ అన్నగా అండగా ఉంటా: సీఎం రేవంత్రెడ్డి
-
అంత డబ్బు నా వద్ద లేదు: జాన్వీకపూర్
-
జేడీ వాన్స్ వ్యాఖ్యలు వైరల్.. తీవ్రంగా ఖండించిన ప్రముఖ నటి
-
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు