PV Sindhu: సింధుకు నిరాశ

భారత స్టార్‌ షట్లర్‌ పి.వి.సింధు చాన్నాళ్ల తర్వాత ఓ టైటిల్‌ గెలిచే అవకాశాన్ని చేజేతులా దూరం చేసుకుంది. ఆదివారం మలేసియా మాస్టర్స్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ మహిళల సింగిల్స్‌ ఫైనల్‌ నిర్ణయాత్మక గేమ్‌లో 11-3తో ఆధిక్యంలో నిలిచి కూడా చివరికి ఆమె ఓటమి పాలైంది.

Published : 27 May 2024 03:23 IST

మలేసియా మాస్టర్స్‌లో రన్నరప్‌తో సరి

కౌలాలంపూర్‌: భారత స్టార్‌ షట్లర్‌ పి.వి.సింధు చాన్నాళ్ల తర్వాత ఓ టైటిల్‌ గెలిచే అవకాశాన్ని చేజేతులా దూరం చేసుకుంది. ఆదివారం మలేసియా మాస్టర్స్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ మహిళల సింగిల్స్‌ ఫైనల్‌ నిర్ణయాత్మక గేమ్‌లో 11-3తో ఆధిక్యంలో నిలిచి కూడా చివరికి ఆమె ఓటమి పాలైంది. తుది పోరులో ఆమె 21-16, 5-21, 16-21తో వాంగ్‌ జి యి (చైనా) చేతిలో పరాజయం పాలైంది. 79 నిమిషాల పాటు సాగిన ఫైనల్లో తొలి గేమ్‌ను కష్టపడి చేజిక్కించుకున్న సింధు.. రెండో గేమ్‌లో తేలిపోయింది. నిర్ణయాత్మక మూడో గేమ్‌లో విరామ సమయానికి 11-3తో ఆధిక్యంలో నిలవడంతో సింధుకు టైటిల్‌ ఖాయమైనట్లే అనిపించింది. కానీ రెండో అర్ధంలో విజృంభించిన వాంగ్‌.. సింధుకు   5 పాయింట్లు మాత్రమే ఇచ్చిన ఆమె.. 18 పాయింట్లతో మ్యాచ్‌ను ఎగరేసుకుపోయింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని