సాత్విక్ జోడీకి షాక్
భారత డబుల్స్ స్టార్లు సాత్విక్ సాయిరాజ్-చిరాగ్శెట్టిలకు షాక్! సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో ఈ నంబర్వన్ జంట తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టింది.
తొలి రౌండ్లోనే ఇంటిముఖం
సింగపూర్ ఓపెన్
సింగపూర్: భారత డబుల్స్ స్టార్లు సాత్విక్ సాయిరాజ్-చిరాగ్శెట్టిలకు షాక్! సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో ఈ నంబర్వన్ జంట తొలి రౌండ్లోనే ఇంటిముఖం పట్టింది. పారిస్ ఒలింపిక్స్ ముంగిట ఫామ్ చాటుకునే ఉద్దేశంతో బరిలో దిగిన సాత్విక్ ద్వయం తొలి రౌండ్లో 20-22, 18-21తో డానియల్ లాండ్గార్డ్-మాడ్స్ వెస్టర్గార్డ్ (డెన్మార్క్) జంట చేతిలో కంగుతింది. 47 నిమిషాల్లో ముగిసిన ఈ పోరులో స్వాతిక్ జంట పోరాడినా.. ఫినిషింగ్ చేయలేకపోయింది. తొలి గేమ్లో విరామ సమయానికి 6-11తో వెనుకబడిన భారత జోడీ.. తర్వాత పుంజుకుంది. 17-17తో స్కోరు సమం చేసింది. ఒక దశలో 20-18తో గేమ్ గెలిచేందుకు సిద్ధమైంది. ఈ స్థితిలో తడబడిన సాత్విక్ జంట.. ప్రత్యర్థికి పుంజుకునే అవకాశం ఇచ్చింది. దీంతో ఈ గేమ్ను డెన్మార్క్ జోడీ గెలుచుకుంది. రెండో గేమ్లోనూ సాత్విక్-చిరాగ్ సహజసిద్ధంగా ఆడలేకపోయారు. అనవసర తప్పిదాలతో 3-6తో వెనుకబడిన భారత ద్వయం.. ఆ తర్వాత గాడిలో పడింది. 17-16తో ఒక దశలో ఆధిక్యంలోకి కూడా వెళ్లింది. కానీ ఈ స్థితిలో మళ్లీ తడబడి గేమ్తో పాటు మ్యాచ్ కోల్పోయింది. పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రియాన్షు రజావత్ 21-23, 19-21తో లీ చెక్ (అమెరికా) చేతిలో ఓడగా.. మహిళల సింగిల్స్లో ఆకర్షి కశ్యప్ 19-21, 20-22తో చోయిక్వాంగ్ (థాయ్లాండ్)కు తలొంచింది. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో రుతుపర్ణా-శ్వేతపర్ణా 12-21, 21-12, 13-21తో చాంగ్చింగ్-యెం్ చింగ్ (చైనీస్ తైపీ) చేతిలో.. మిక్స్డ్ డబుల్స్ తొలి రౌండ్లో సూర్య-అమృత 8-21, 17-21తో లీచున్-జుయూ (కొరియా) చేతిలో ఓడారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
-
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?