సింధు పరాజయం
పారిస్ ఒలింపిక్స్కు ముందు ఫామ్లోకి రావాలని భావించిన భారత స్టార్ షట్లర్ పి.వి.సింధుకు నిరాశ ఎదురైంది. ఇండోనేసియా ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 1000 టోర్నీ నుంచి సింధు నిష్క్రమించింది.
జకార్త: పారిస్ ఒలింపిక్స్కు ముందు ఫామ్లోకి రావాలని భావించిన భారత స్టార్ షట్లర్ పి.వి.సింధుకు నిరాశ ఎదురైంది. ఇండోనేసియా ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 1000 టోర్నీ నుంచి సింధు నిష్క్రమించింది. బుధవారం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సింధు 15-21, 21-15, 14-21తో వెన్ సు (చైనీస్ తైపీ) చేతిలో పరాజయం చవిచూసింది. ఒక గంటా 10 నిమిషాల పాటు సాగిన మ్యాచ్లో సింధు పోరాడినా ఫలితం లేకపోయింది. ఇప్పటి వరకు వీరిద్దరు నాలుగు సార్లు తలపడగా.. మూడింట్లో సింధు నెగ్గగా, వెన్కు ఇదే తొలి విజయం. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో అశ్విని పొన్నప్ప- తనీషా క్రాస్టో జోడీ 21-15, 21-15తో జాకీ డెంట్ - క్రిస్టల్ లాయ్ (కెనడా) జంటపై గెలిచి ప్రిక్వార్టర్స్ చేరుకుంది. మరో మ్యాచ్లో రుతుపర్ణ పాండా- శ్వేతపర్ణ పాండా జంట 12-21, 9-21తో కిమ్ యియాంగ్- కాంగ్ యాంగ్ (కొరియా) జోడీ చేతిలో ఓడింది.
కార్ల్సన్ చేతిలో ప్రజ్ఞానంద ఓటమి
స్టావెంజర్: భారత గ్రాండ్మాస్టర్ ప్రజ్ఞానంద నార్వే చెస్ టోర్నీ ఎనిమిదో రౌండ్లో టాప్ సీడ్ కార్ల్సన్ చేతిలో పోరాడి ఓడాడు. ఈ గెలుపుతో నకముర (అమెరికా)పై ఒక పాయింట్ స్పష్టమైన ఆధిక్యంతో కార్ల్సన్ (నార్వే) అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. మరో రెండు రౌండ్లు మిగిలి ఉన్న టోర్నీలో అతడు ప్రస్తుతం 14.5 పాయింట్లతో ఉన్నాడు. నకముర (13.5) అలీరెజా (ఫ్రాన్స్) చేతిలో ఓడిపోయాడు. పేలవ ఫామ్ను కొనసాగించిన ప్రపంచ ఛాంపియన్ డింగ్ లిరెన్ (చైనా).. కరువానా (అమెరికా) చేతిలో కంగుతిన్నాడు. మహిళల విభాగంలో వైశాలి (11.5).. అనా ముజిచుక్ (ఉక్రెయిన్)పై గెలిచింది. తింగ్జీ లీ (చైనా) చేతిలో కోనేరు హంపి (8) ఓడిపోయింది.
పారాలింపిక్స్కు 13 మంది పారా షూటర్లు
దిల్లీ: పారిస్ పారాలింపిక్స్కు భారత్ నుంచి 13 మంది పారా షూటర్లు అర్హత సాధించారు. ఈ ఏడాది ఆగస్టు 28న ఆరంభమయ్యే పారాలింపిక్స్లో బ్యాడ్మింటన్లో 9 విభాగాల్లో వీళ్లు పోటీపడనున్నారు. కృష్ణ నగార్, శివరాజన్, నితేశ్ కుమార్, మనోజ్ సర్కార్, మానసి జోషి, మణ్దీప్ కౌర్, సుహాస్, సుకాంత్, తరుణ్, పలక్ కోహ్లి, తులసీమతి, మనీష, నిత్యశ్రీ పారాలింపిక్స్లో అదృష్టం పరీక్షించుకోనున్నారు. టోక్యో పారాలింపిక్స్లో పురుషుల సింగిల్స్ ఎస్హెచ్6లో కృష్ణ నగార్ పసిడి గెలిచిన సంగతి తెలిసిందే. ఈ సారి పారా బ్యాడ్మింటన్లో కొత్తగా మహిళల సింగిల్స్లో ఎస్ఎల్3, ఎస్హెచ్6.. మిక్స్డ్ డబుల్స్లో ఎస్హెచ్6 విభాగాలను చేర్చారు.
ఫైనల్లో సరబ్జోత్
మ్యూనిక్: ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ ప్రపంచకప్ పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్లో భారత షూటర్ సరబ్జోత్ సింగ్ ఫైనల్ చేరాడు. బుధవారం క్వాలిఫికేషన్లో 588 స్కోరుతో అతను అగ్రస్థానంలో నిలిచాడు. మరోవైపు 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్లో పురుషుల్లో చెయిన్ సింగ్, స్వప్నిల్, ఐశ్వరీ ప్రతాప్.. మహిళల్లో అంజుమ్, సిఫ్త్ కౌర్, ఆషి ఎలిమినేషన్ రౌండ్ దాటారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మట్టిచరియల బీభత్సంతో పెను విషాదం.. ఇథియోపియాలో 257కి చేరిన మృతులు
-
ప్రపంచంలోని గొప్ప ప్రదేశాల్లో హైదరాబాద్ ‘మనం చాక్లెట్’!
-
మదనపల్లె ఘటనలో ఉద్యోగులపై వేటు తప్పదు: ఆర్పీ సిసోదియా
-
కమలాహారిస్కు ఒబామా దంపతుల మద్దతు
-
దిగొచ్చిన బంగారం ధర.. దుకాణాల్లో కొనుగోళ్ల జోష్..!
-
పెద్దిరెడ్డి, మిథున్రెడ్డి మంచోళ్లు: మాజీ సీఎం జగన్