క్వార్టర్స్‌లో లక్ష్యసేన్‌

ఇండోనేసియా ఓపెన్‌ ప్రపంచ టూర్‌ సూపర్‌ 1000 టోర్నీలో భారత స్టార్‌ షట్లర్‌ లక్ష్యసేన్‌ క్వార్టర్‌ఫైనల్లోకి దూసుకెళ్లాడు.

Published : 07 Jun 2024 04:13 IST

జకార్త: ఇండోనేసియా ఓపెన్‌ ప్రపంచ టూర్‌ సూపర్‌ 1000 టోర్నీలో భారత స్టార్‌ షట్లర్‌ లక్ష్యసేన్‌ క్వార్టర్‌ఫైనల్లోకి దూసుకెళ్లాడు. గురువారం పురుషుల సింగిల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో లక్ష్యసేన్‌ 21-9, 21-15తో కెంటా నిషిమోటో (జపాన్‌)ను చిత్తుచేశాడు. మహిళల డబుల్స్‌ ప్రిక్వార్టర్స్‌లో గాయత్రి గోపీచంద్‌- ట్రీసా జాలీ 21-19, 19-21, 19-21తో మత్సుమోటో- నగహర (జపాన్‌) చేతిలో, అశ్విని పొన్నప్ప- తనీషా క్రాస్టో 13-21, 21-19, 13-21తో బేక్‌- లీ (కొరియా) చేతిలో పరాజయం చవిచూశారు. మిక్స్‌డ్‌ డబుల్స్‌ తొలి రౌండ్లో సుమీత్‌రెడ్డి- సిక్కిరెడ్డి 9-21, 11-21తో జెంగ్‌- హువాంగ్‌ (చైనా) చేతిలో ఓడారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని