రవూఫ్ బాల్ ట్యాంపరింగ్ చేశాడు: అమెరికా పేసర్
పాకిస్థాన్ పేసర్ హారిస్ రవూఫ్ బాల్ ట్యాంపరింగ్కు పాల్పడ్డాడంటూ అమెరికా బౌలర్ రస్టీ థెరాన్ సంచలన ఆరోపణ చేశాడు.
డలాస్: పాకిస్థాన్ పేసర్ హారిస్ రవూఫ్ బాల్ ట్యాంపరింగ్కు పాల్పడ్డాడంటూ అమెరికా బౌలర్ రస్టీ థెరాన్ సంచలన ఆరోపణ చేశాడు. ఇన్నింగ్స్ ముగియడానికి రెండు ఓవర్ల ముందు మార్చిన బంతిని రవూఫ్ గోటితో గీకడం వల్లే రివర్స్ స్వింగ్ సాధ్యమైందని విమర్శించాడు. ‘‘మ్యాచ్ మధ్యలో మార్చిన బంతిని పాక్ ట్యాంపర్ చేయలేదని నటిద్దామా? కేవలం 2 ఓవర్ల ముందు మార్చిన బంతితో రివర్స్ స్వింగా? రవూఫ్ తన బొటన వేలి గోటితో బంతిపై గీకడాన్ని స్పష్టంగా చూడొచ్చు’’ అని ఎక్స్లో ఐసీసీని ట్యాగ్ చేస్తూ థెరాన్ పేర్కొన్నాడు.
దయనీయమైన ప్రదర్శన: అక్రమ్చ్
డలాస్: టీ20 ప్రపంచకప్లో అమెరికా చేతిలో ఓడిన పాకిస్థాన్పై మాజీ ఆటగాడు వసీం అక్రమ్ విరుచుకుపడ్డాడు. ‘‘దయనీయమైన ప్రదర్శన. ఆటలో గెలుపోటములు భాగం. కాని చివరి బంతి వరకు పోరాడాలి. పాక్ క్రికెట్కు ఇదో మచ్చ. ఇక్కడ్నుంచి సూపర్ 8కు అర్హత సాధించడానికి పాక్ చాలా కష్టపడాలి. ఈనెల 9న భారత్.. ఆ తర్వాత మరో రెండు మంచి జట్లు ఐర్లాండ్, కెనడాతో పాక్ తలపడాలి’’ అని అక్రమ్ తెలిపాడు.
సిఫ్త్ కౌర్కు కాంస్యం
మ్యూనిక్: ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచకప్ షూటింగ్లో భారత క్రీడాకారిణి సిఫ్త్ కౌర్ శర్మ మెరిసింది. మహిళల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్లో కాంస్య పతకం సాధించింది. శుక్రవారం ఫైనల్లో సిఫ్త్ 452.9 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. కేవలం 0.1 పాయింటు తేడాతో రజతం కోల్పోయింది. ప్రపంచ నంబర్వన్ సియోనైడ్ మెకింతోష్ (466.7- ఇంగ్లాండ్) స్వర్ణం, ఎయిర్ రైఫిల్ ప్రపంచ ఛాంపియన్ హాన్ జియాయు (452.8- చైనా) రజత పతకాలు గెలిచారు. ఈ టోర్నీని భారత్ రెండు పతకాలతో ముగించింది.
లక్ష్యసేన్ ఔట్చ్
జకార్త: ఇండోనేసియా ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 1000 టోర్నీలో భారత స్టార్ ఆటగాడు లక్ష్యసేన్ పోరాటం ముగిసింది. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ఫైనల్లో లక్ష్యసేన్ 22-24, 18-21తో ఆండర్స్ ఆంథోన్సెన్ (డెన్మార్క్) చేతిలో పరాజయం చవిచూశాడు. 61 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన పోరులో చివరికి ప్రత్యర్థిదే పైచేయి అయింది.
ప్రజ్ఞానంద ఓటమి
స్టావెంజర్ (నార్వే): భారత గ్రాండ్మాస్టర్ ఆర్.ప్రజ్ఞానంద (13 పాయింట్లు)కు నార్వే చెస్ టోర్నీలో పరాజయం ఎదురైంది. తొమ్మిదో రౌండ్లో ఫాబియానో కరువానా (10.5- అమెరికా) చేతిలో ప్రజ్ఞానంద ఓటమి పాలయ్యాడు. ఫిరౌజా అలీరెజా (12- ఫ్రాన్స్)పై మాగ్నస్ కార్ల్సన్ (16- నార్వే) విజయం సాధించాడు. కార్ల్సన్, నకముర (14.5- అమెరికా), ప్రజ్ఞానంద వరుసగా తొలి మూడు స్థానాల్లో కొనసాగుతున్నారు. మహిళల విభాగంలో వెంజున్ జు (16- చైనా) చేతిలో కోనేరు హంపి (9) పరాజయంపాలైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే