అమెరికాకు ఆశలు..
భారత్, పాకిస్థాన్, అమెరికా, కెనడా, ఐర్లాండ్.. ఇవీ టీ20 ప్రపంచకప్లో గ్రూప్- ఎ జట్లు. ప్రతి గ్రూప్లోనూ ఒక్కో జట్టు.. మిగతా నాలుగు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతోంది.
డల్లాస్: భారత్, పాకిస్థాన్, అమెరికా, కెనడా, ఐర్లాండ్.. ఇవీ టీ20 ప్రపంచకప్లో గ్రూప్- ఎ జట్లు. ప్రతి గ్రూప్లోనూ ఒక్కో జట్టు.. మిగతా నాలుగు జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతోంది. గ్రూప్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్-8కు అర్హత సాధిస్తాయి. ఈ నేపథ్యంలో గ్రూప్- ఎ నుంచి భారత్, పాకిస్థాన్ కచ్చితంగా ముందంజ వేస్తాయనే అంచనాలు నెలకొన్నాయి. కానీ పాక్పై సంచలన విజయంతో సమీకరణాలను అమెరికా మార్చేసింది. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత ముగిసిన ఈ మ్యాచ్లో.. సూపర్ ఓవర్లో యుఎస్ అద్భుత విజయాన్ని అందుకుంది. మొదట పాక్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 159 పరుగులు చేసింది. ఛేదనలో యుఎస్ కూడా 20 ఓవర్లలో 3 వికెట్లకు 159 పరుగులే చేసింది. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ కెప్టెన్ మోనాంక్ పటేల్ (50) విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. ఆండ్రీస్ గౌస్ (35), ఆరోన్ జోన్స్ (36 నాటౌట్) కీలక పరుగులు చేశారు. అనంతరం సూపర్ ఓవర్లో మొదట అమెరికా 18 పరుగులు చేసింది. అమీర్ వేసిన ఈ ఓవర్లో వైడ్ల రూపంలోనే 7 పరుగులు రావడం గమనార్హం. ఆ తర్వాత సౌరభ్ గొప్పగా బౌలింగ్ చేయడంతో పాక్ 13 పరుగులకే పరిమితమైంది. అమెరికా ఇప్పటికే కెనడాపై గెలిచింది. రెండు విజయాలతో గ్రూప్లో అగ్రస్థానంలో ఉంది. ఇంకా భారత్, ఐర్లాండ్తో ఆడాల్సి ఉంది. ఒకవేళ భారత్తో ఓడిపోయినా.. ఐర్లాండ్పై గెలిస్తే అమెరికా సూపర్-8కు అర్హత సాధించడం తేలికే. మిగతా రెండు మ్యాచ్ల్లో ఓడినా ఆ జట్టు అవకాశాలను కొట్టిపారేయలేం. పాక్ ఇంకా భారత్, కెనడా, ఐర్లాండ్తో ఆడాల్సి ఉంది. టీమ్ఇండియా చేతిలో ఓడి, మిగతా మ్యాచ్ల్లో గెలిచినా పాక్ ముందంజ వేయడం కష్టమే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
-
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?