GGT vs RCBW: లూరా అర్ధశతకం.. ఆర్సీబీ టార్గెట్ ఫిక్స్
ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో గుజరాత్ ఇన్నింగ్స్ ముగిసింది. ప్రత్యర్థి జట్టుకు 189 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
ముంబయి: డబ్ల్యూపీఎల్లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్లో గుజరాత్ జెయింట్స్ ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 188 పరుగులు చేసింది. ఓపెనర్ లూరా వోల్వార్డ్ (68; 42 బంతుల్లో 9×4,2×6) అర్ధశతకంతో చెలరేగగా.. సబ్బినేని మేఘన (31; 32 బంతుల్లో 4×4), గార్డెనర్ (41; 26 బంతుల్లో 6×4, 1×6) రాణించారు. ఆర్సీబీ బౌలర్లలో శ్రేయంక పాటిల్ 2 వికెట్లు పడగొట్టగా.. సోఫీ డివైన్, ప్రీతి బోస్ చెరో వికెట్ తీశారు.
బ్యాటింగ్ ప్రారంభించిన గుజరాత్ ప్రారంభంలోనే వికెట్ కోల్పోయింది. డివైన్ వేసిన మూడో ఓవర్ నాలుగో బంతికి ఓపెనర్ డంక్లీ (16) బౌల్డయ్యింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన మేఘనతో కలిసి మరో ఓపెనర్ వోల్వార్డ్ ఇన్నింగ్స్ నిర్మించింది. వీరిద్దరూ కలిసి రెండో వికెట్కు 90 పరుగులు జోడించారు. జోరు మీదున్న ఈ జోడీని ప్రీతి బోస్ విడగొట్టింది. 12వ ఓవర్ చివరి బంతికి రిచా ఘోష్కు క్యాచ్ ఇచ్చి మేఘన వెనుదిరిగింది. అయితే, మరో ఎండ్లో ఉన్న వోల్వార్డ్ మాత్రం ధైర్యం కోల్పోలేదు. తర్వాతి బ్యాటర్ గార్డెనర్తో కలిసి వరుస బౌండరీలు బాదుతూ.. స్కోరు బోర్డును పరుగులు పెట్టించింది. అయితే, శ్రేయాంక పాటిల్ వేసిన 17వ ఓవర్ చివరి బంతికి ప్రీతికి క్యాచ్ ఇచ్చి వోల్వార్డ్ పెవిలియన్ బాట పట్టింది. అప్పటికీ జట్టు స్కోరు 142 పరుగులు. కొద్ది వ్యవధిలోనే 41 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద గార్డెనర్ కూడా వెనుదిరగడంతో ఒక్కసారిగా స్కోరు వేగం మందగించింది. ఆ తర్వాత హేమలత (16*), డియోల్ (12*) పరుగులు చేయడంతో గుజరాత్ జెయింట్స్ 189 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం