GGT vs RCBW: లూరా అర్ధశతకం.. ఆర్సీబీ టార్గెట్ ఫిక్స్
ఆర్సీబీతో జరిగిన మ్యాచ్లో గుజరాత్ ఇన్నింగ్స్ ముగిసింది. ప్రత్యర్థి జట్టుకు 189 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
ముంబయి: డబ్ల్యూపీఎల్లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్లో గుజరాత్ జెయింట్స్ ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 188 పరుగులు చేసింది. ఓపెనర్ లూరా వోల్వార్డ్ (68; 42 బంతుల్లో 9×4,2×6) అర్ధశతకంతో చెలరేగగా.. సబ్బినేని మేఘన (31; 32 బంతుల్లో 4×4), గార్డెనర్ (41; 26 బంతుల్లో 6×4, 1×6) రాణించారు. ఆర్సీబీ బౌలర్లలో శ్రేయంక పాటిల్ 2 వికెట్లు పడగొట్టగా.. సోఫీ డివైన్, ప్రీతి బోస్ చెరో వికెట్ తీశారు.
బ్యాటింగ్ ప్రారంభించిన గుజరాత్ ప్రారంభంలోనే వికెట్ కోల్పోయింది. డివైన్ వేసిన మూడో ఓవర్ నాలుగో బంతికి ఓపెనర్ డంక్లీ (16) బౌల్డయ్యింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన మేఘనతో కలిసి మరో ఓపెనర్ వోల్వార్డ్ ఇన్నింగ్స్ నిర్మించింది. వీరిద్దరూ కలిసి రెండో వికెట్కు 90 పరుగులు జోడించారు. జోరు మీదున్న ఈ జోడీని ప్రీతి బోస్ విడగొట్టింది. 12వ ఓవర్ చివరి బంతికి రిచా ఘోష్కు క్యాచ్ ఇచ్చి మేఘన వెనుదిరిగింది. అయితే, మరో ఎండ్లో ఉన్న వోల్వార్డ్ మాత్రం ధైర్యం కోల్పోలేదు. తర్వాతి బ్యాటర్ గార్డెనర్తో కలిసి వరుస బౌండరీలు బాదుతూ.. స్కోరు బోర్డును పరుగులు పెట్టించింది. అయితే, శ్రేయాంక పాటిల్ వేసిన 17వ ఓవర్ చివరి బంతికి ప్రీతికి క్యాచ్ ఇచ్చి వోల్వార్డ్ పెవిలియన్ బాట పట్టింది. అప్పటికీ జట్టు స్కోరు 142 పరుగులు. కొద్ది వ్యవధిలోనే 41 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద గార్డెనర్ కూడా వెనుదిరగడంతో ఒక్కసారిగా స్కోరు వేగం మందగించింది. ఆ తర్వాత హేమలత (16*), డియోల్ (12*) పరుగులు చేయడంతో గుజరాత్ జెయింట్స్ 189 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
261..మిగల్లేదు
ఏం విధ్వంసమది! ఏం బాదుడది. అంత లక్ష్యాన్ని చూసి డీలా పడకుండా పంజాబ్ పరుగుల వేట సాగించిన తీరు అద్భుతం. తొలి బంతి నుంచి ఆఖరి బంతి వరకు ఆ జట్టు పైచేయిలోనే నిలిచింది. -
పొట్టి కప్పులో ఎవరెవరో?
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టు ఎంపికకు సమయం ఆసన్నమైంది. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని భారత సీనియర్ సెలక్షన్ కమిటీ శనివారం దిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. -
ప్రపంచకప్లో వాళ్లిద్దరూ ఉంటారు
టీ20 ప్రపంచకప్లో పాల్గొనే భారత జట్టులో ఆల్రౌండర్ అక్షర్ పటేల్, వికెట్ కీపర్ రిషబ్ పంత్ చోటు దక్కించుకుంటారని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. -
సింగిల్స్.. సింగిల్స్.. సింగిల్స్
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నెల రోజుల తర్వాత ఐపీఎల్లో విజయాన్నందుకుంది. గురువారం 35 పరుగుల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించింది. -
సూర్య, బుమ్రానే కీలకం
రాబోయే టీ20 ప్రపంచకప్లో సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కీలకం కానున్నారని.. వాళ్లిద్దరికి మ్యాచ్ స్వరూపాన్ని మార్చే సత్తా ఉండడమే ఇందుకు కారణమని టీమ్ఇండియా మాజీ స్టార్ యువరాజ్ సింగ్ అన్నాడు. -
సురేఖ జోడీకి పతకం ఖాయం
ర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో తెలుగమ్మాయి వెన్నం జ్యోతి సురేఖ జోడీ సత్తాచాటుతోంది. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో సురేఖ- అభిషేక్ వర్మ జోడీ ఫైనల్లోకి దూసుకెళ్లి భారత్కు నాలుగో పతకం ఖాయం చేసింది. -
లక్షితకు రజతం.. శ్రీయకు కాంస్యం
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది. శుక్రవారం లక్షిత వినోద్ రజతం.. శ్రీయ రాజేశ్ కాంస్యం గెలుచుకున్నారు. -
రెండో టైటిల్పై భారత్ గురి
ప్రతిష్టాత్మక థామస్ అండ్ ఉబెర్ కప్కు రంగం సిద్ధమైంది. స్టార్ ఆటగాళ్లతో కూడిన భారత పురుషుల జట్టు థామస్ కప్ టైటిల్ నిలబెట్టుకుంటామన్న ఆత్మవిశ్వాసంతో ఉండగా.. -
సెంచరీ చేసిన బ్యాట్లన్నీ దాచుకున్నా
71 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు ఆస్ట్రేలియా మాజీ స్టార్ రికీ పాంటింగ్! శతకం చేసిన ప్రతి బ్యాట్ని అతడు ఇప్పటికీ దాచుకున్నాడట. -
‘రెజ్లింగ్ సంఘంపై మళ్లీ నిషేధం విధిస్తాం’
ఆట వ్యవహారాలను చూసే బాధ్యతలను అడ్హాక్ కమిటీకి అప్పగిస్తే భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)పై మళ్లీ నిషేధాన్ని విధిస్తామని ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) హెచ్చరించింది. -
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
టీ20 ప్రపంచ కప్ కోసం జట్టును ప్రకటించేందుకు సమయం ఆసన్నమవుతోంది. దీంతో మాజీ క్రికెటర్లు తమ స్క్వాడ్లను వెల్లడిస్తూ ఎవరిని తీసుకుంటే బాగుంటుందనే సూచనలు చేస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు
-
వైకాపా ప్రభుత్వ విలేజీ క్లినిక్.. కాలేదు క్లిక్
-
రెండు కిలోమీటర్లకే రూ.9 వ్యత్యాసమా..!
-
ఇచ్చేది మెతుకంత.. చిందరవందరే బతుకంతా!!