Rohit Sharma: అప్పుడే కాదు.. ప్రపంచకప్ లక్ష్యానికి ఇంకా సగం దూరంలోనే ఉన్నాం..: రోహిత్
పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్నా.. ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) వ్యాఖ్యానించాడు. కివీస్పై విజయం అనంతరం కీలక వ్యాఖ్యలు చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: వరల్డ్ కప్లో (ODI World Cup 2023) న్యూజిలాండ్ను ఓడించడంలో విరాట్ కోహ్లీ-జడ్డూ, రోహిత్, మహమ్మద్ షమీ కీలక పాత్ర పోషించారు. ఒక దశలో కివీస్ బ్యాటర్ల దూకుడు చూస్తే 300కిపైగా పరుగులు చేస్తారనిపించిందని.. కానీ, ఆ తర్వాత షమీతోపాటు ఇతర బౌలర్లు వారిని అద్భుతంగా కట్టడి చేశారని భారత కెప్టెన్ రోహిత్ శర్మ వ్యాఖ్యానించాడు. అలాగే విరాట్ కోహ్లీ నుంచి ఇలాంటి ఇన్నింగ్స్లు గతంలోనూ ఎన్నో వచ్చాయని కొనియాడాడు. వరల్డ్ కప్ టోర్నీల్లో (2003 తర్వాత) న్యూజిలాండ్పై తొలిసారి టీమ్ఇండియా విజయం సాధించడం ఆనందంగా ఉందని తెలిపాడు.
‘‘టోర్నీలో ఒక్కో మ్యాచ్ గెలుచుకుంటూ ముందుకు సాగుతున్నాం. అయితే, ప్రపంచకప్ విజయంలో ఇప్పటికీ ఇంకా సగం లక్ష్యమే పూర్తయింది. జట్టును సమతూకంగా ఉంచడం చాలా కీలకం. తర్వాత ఏంటనేది ఇప్పుడే ఆలోచించడం లేదు. వర్తమానంలో ఉండటమే ముఖ్యం. షమీ తనకొచ్చిన ఛాన్స్ను రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు. ఇలాంటి క్లాస్ బౌలర్కు ధర్మశాల వంటి పిచ్ మరింత అనుకూలంగా ఉంటుందని నిరూపించాడు. ఒకదశలో కివీస్ 300+ స్కోరు చేస్తుందని భావించాం. కానీ, షమీతో సహా ఇతర బౌలర్లు ప్రత్యర్థిని కట్టడి చేశారు. లక్ష్య ఛేదనలో నేనెప్పుడూ బ్యాటింగ్ను ఆస్వాదిస్తా. అంతిమంగా విజయం సాధించడం ఆనందంగా ఉంది. విరాట్ కోహ్లీ గత కొన్నేళ్లుగా తన ఆటతీరుతో జట్టుకు అండగా నిలుస్తున్నాడు. కివీస్పైనా జడ్డూతో కలిసి కీలక భాగస్వామ్యం నిర్మించాడు.
మా ఫీల్డింగ్లో కొన్ని తప్పిదాలు చోటు చేసుకున్నాయి. జడేజా చేతిలోకి వచ్చిన క్యాచ్ను వదిలేయడం నిరాశపరిచినా.. అతడు ప్రపంచస్థాయి అత్యుత్తమ ఫీల్డర్. కొన్నిసార్లు జరుగుతుంటాయి. అయితే, ఫీల్డింగ్ మ్యాచ్ ఫలితాన్ని తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశముంది. కాబట్టి, వాటన్నింటి నుంచి నేర్చుకుని ముందుకు సాగుతాం. వరల్డ్ కప్లో విభిన్న ప్రాంతాల్లో తొమ్మిది మ్యాచ్లు ఆడనుండటాన్ని మేం కూడా ఆస్వాదిస్తున్నాం’’ అని రోహిత్ శర్మ వెల్లడించాడు.
చివరి 10 ఓవర్లలో రాణించలేకపోయాం: టామ్ లేథమ్
‘‘ఇలాంటి పిచ్పై బాగానే ఆడామనిపించింది. కానీ, బ్యాటింగ్లో చివరి 10 ఓవర్లలో మరికొన్ని పరుగులు రాబడితే బాగుండేది. అక్కడ కాస్త వెనుబడ్డాం. అయితే, భారత బౌలర్లను ఈ సందర్భంగా అభినందించాల్సిందే. కీలక సమయంలో మాపై నిలకడగా ఒత్తిడి పెంచి వికెట్లు పడగొట్టారు. రచిన్, డారిల్ మిచెల్ అద్భుత ఆటతీరు ఆకట్టుకుంది. డారిల్ శతకం చేయడం బాగుంది. అయితే, ఓడిపోవడం నిరాశపరిచింది. తప్పకుండా తదుపరి మ్యాచ్లో పుంజుకుని విజయం సాధిస్తాం. ఇదే స్టేడియంలో మరో మ్యాచ్ ఆడబోతున్నాం. డే మ్యాచ్ కావడం మాకు కలిసొస్తుందని ఆశిస్తున్నా’’ అని న్యూజిలాండ్ కెప్టెన్ టామ్ లేథమ్ వ్యాఖ్యానించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘తప్పు జరిగింది.. క్షమించండి’: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
Paris Olympics 2024: ఒలింపిక్స్ వేడుకలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో జరిగిన పొరపాటుపై నిర్వాహకులు క్షమాపణలు కోరారు. -
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
టెస్టుల్లో సచిన్ తెందూల్కర్ అత్యధిక పరుగుల రికార్డును ఇంగ్లాండ్ బ్యాటర్ జో రూట్ (Joe Root) బ్రేక్ చేసే అవకాశముందని భారత మాజీ వికెట్కీపర్ దినేశ్ కార్తిక్ (Dinesh Karthik) అభిప్రాయపడ్డాడు. -
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
Paris Olympics 2024: 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ క్వాలిఫికేషన్ పురుషుల విభాగంలో షూటర్లు సరబ్జోత్ సింగ్, అర్జున్ చీమా నిరాశపర్చారు. -
తూటా గురితప్పింది.. మిక్స్డ్ డబుల్స్లో నిరాశపర్చిన షూటర్లు
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజు భారత షూటర్లు నిరాశపర్చారు. మిక్స్డ్ డబుల్స్లో ఫైనల్కు చేరుకోలేకపోయారు. -
ఇప్పుడు చేసేద్దాం.. గంభీర్ పశ్చాత్తాప వ్యాఖ్యలపై సూర్య కామెంట్
Gautam Gambhir-Suryakumar Yadav: సూర్య విషయంలో విచారం వ్యక్తం చేస్తూ గతంలో గంభీర్ చేసిన వ్యాఖ్యలపై టీమ్ ఇండియా టీ20 కెప్టెన్ తాజాగా స్పందించాడు. -
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘తప్పు జరిగింది.. క్షమించండి’: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్