IPL 2023: ఐపీఎల్ 2023 లీగ్ స్టేజ్.. సగం ముగిశాయి.. అవే మురిశాయి..!
దాదాపు రెండు నెలలపాటు జరిగే ఐపీఎల్ 16వ సీజన్లో (IPL 2023) లీగ్ దశలోని సగం మ్యాచ్లు ముగిశాయి. ప్లేఆఫ్స్ రేసులో పెద్ద జట్లు అనుకున్నవి కూడా కాస్త వెనుకబడ్డాయి. ఇప్పటి వరకు పాయింట్ల పట్టికలో దూసుకొచ్చిన జట్లేవో ఓసారి చూద్దాం..
ఇంటర్నెట్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2023) 16వ సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ఆరంభంలో కాస్త డల్గా అనిపించిన మ్యాచ్లు.. ఆ తర్వాత చివరి బంతి వరకూ ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. మొత్తం 70 లీగ్ మ్యాచుల్లో ఇప్పటికి 35 మ్యాచ్లు ముగిశాయి. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో చెన్నై సూపర్ కింగ్స్ (10 పాయింట్లు) ఉండగా.. గుజరాత్ టైటాన్స్ (10 పాయింట్లు), రాజస్థాన్ రాయల్స్ (8 పాయింట్లు), లఖ్నవూ సూపర్ జెయింట్స్ (8 పాయింట్లు) టాప్-4లో కొనసాగుతున్నాయి. మరి పది జట్ల విజయాలు, ఓటములు ఏంటో ఓసారి తెలుసుకుందాం..
- చెన్నై సూపర్ కింగ్స్ (CSK): గుజరాత్పై ఓటమితో సీజన్ను ప్రారంభించిన చెన్నై టాప్ స్థానంలోకి రావడం విశేషం. ఆడిన ఏడు మ్యాచుల్లో కేవలం రెండు మాత్రమే ఓడింది. కెప్టెన్ ధోనీ నాయకత్వంలోని సీఎస్కే ఐదు మ్యాచుల్లో గెలిచి 10 పాయింట్లను దక్కించుకుంది. గతేడాది ఫైనలిస్టులు గుజరాత్, రాజస్థాన్ చేతిలోనే సీఎస్కే ఓడిపోయింది.
- గుజరాత్ టైటాన్స్ (GT): డిఫెండింగ్ ఛాపింయన్ ఇప్పటి వరకు ఏడు మ్యాచ్లు ఆడింది. ఐదు మ్యాచుల్లో విజయం సాధించిన జీటీ రెండింట్లో ఓడిపోయింది. దీంతో పది పాయిట్లను సాధించినా.. నెట్ రన్రేట్ కారణంగా గుజరాత్ రెండో స్థానానికి పరిమితమైంది. కోల్కతా నైట్రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ చేతిలో గుజరాత్ టైటాన్స్ పరాజయంపాలైంది.
- రాజస్థాన్ రాయల్స్ (RR): సన్రైజర్స్ హైదరాబాద్పై ఘన విజయం సాధించి రాజస్థాన్ రాయల్స్ ఈ సీజన్ను అద్భుతంగా ప్రారంభించింది. అయితే, వెంటనే పంజాబ్ కింగ్స్ చేతిలో ఓటమిపాలైంది. మళ్లీ హ్యాట్రిక్ విజయాలతో పుంజుకొన్న ఆర్ఆర్కు మళ్లీ వరుసగా రెండు పరాజయాలు నమోదు కావడం గమనార్హం. ప్రస్తుతం ఏడు మ్యాచుల్లో నాలుగు విజయాలతో 8 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతోంది.
- లఖ్నవూ సూపర్ జెయింట్స్ (LSG): కెప్టెన్ కేఎల్ రాహుల్ అర్ధ శతకాలు చేసినా విమర్శలపాలవుతూ తన జట్టును నడిపిస్తున్నాడు. తక్కువ స్ట్రైక్రేట్తో పరుగులు చేస్తున్నాడని ఆరోపణలు వచ్చాయి. తాజాగా గుజరాత్పై ఏడో మ్యాచ్ ఆడిన ఎల్ఎస్జీ కేవలం ఏడు పరుగుల తేడాతో ఓడింది. ఏడింట్లో నాలుగు విజయాలు, మూడు ఓటములతో లఖ్నవూ (8 పాయింట్లు) నాలుగో స్థానంలో నిలిచింది.
- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB): కేవలం ముగ్గురు బ్యాటర్ల ప్రదర్శనపైనే ఇప్పటి వరకు విజయాలను నమోదు చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (8) పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతోంది. ముంబయి ఇండియన్స్ను ఓడించి జోరు మీదున్న ఆర్సీబీ.. కోల్కతా, లఖ్నవూ, సీఎస్కే చేతిలో ఓటమిపాలైంది. అయితే దిల్లీ, పంజాబ్, రాజస్థాన్పై గెలిచి మళ్లీ ప్లేఆఫ్స్ రేసులోకి వచ్చింది.
- పంజాబ్ కింగ్స్ (PBKS): వరుసగా రెండు మ్యాచుల్లో గెలిచి సీజన్ను అద్భుతంగా ప్రారంభించిన పంజాబ్ కింగ్స్ మళ్లీ వెనుకబడిపోయిది. రెండు ఓటములతో కాస్త డీలా పడింది. అయితే ముంబయి, లఖ్నవూపై గెలిచి తన పాయింట్లను పెంచుకుంది. ఇప్పటి వరకు ఏడు మ్యాచుల్లో నాలుగు విజయాలు సాధించి 8 పాయింట్లతో ఆరో స్థానంలో కొనసాగుతోంది. లఖ్నవూ, ఆర్సీబీ కంటే నెట్రన్రేట్ తక్కువగా ఉండటంతో పంజాబ్ ఆరో స్థానంలో ఉంది.
- ముంబయి ఇండియన్స్ (MI): ఐదుసార్లు ఛాంపియన్ ముంబయి ఈసారి సీజన్ తొలి రెండు మ్యాచుల్లో ఓడింది. ఈసారి కూడా ఆ జట్టు పనైపోయిందనే వ్యాఖ్యలు వినిపించాయి. అనూహ్యంగా హ్యాట్రిక్ విజయాలు సాధించి రేసులోకి వచ్చిన ముంబయి.. మళ్లీ పంజాబ్, గుజరాత్ చేతిలో ఓడి వెనుకబడిపోయింది. ప్రస్తుతం ఏడు మ్యాచుల్లో కేవలం మూడు విజయాలను మాత్రమే నమోదు చేసి 6 పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచింది. ప్లేఆఫ్స్ అవకాశాలు ఉండాలంటే ప్రతి మ్యాచ్లోనూ గెలవాల్సిందే.
- కోల్కతా నైట్రైడర్స్ (KKR): తొలి మ్యాచ్లో అదృష్టం కలిసిరాక డక్వర్త్లూయిస్ పద్ధతిలో పంజాబ్ మీద ఓడింది. ఆ తర్వాత రెండు మ్యాచుల్లో విజయఢంకా మోగించింది. డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్పై చివరి ఓవర్లో ఐదు సిక్స్లు కొట్టి మరీ కోల్కతాను రింకు సింగ్ గెలిపించాడు. అయితే, అప్పటి నుంచి ఆడిన నాలుగు మ్యాచుల్లోనూ ఓడి పాయింట్ల పట్టికలో కిందికి దిగజారిపోయింది. ప్రస్తుతం నాలుగు పాయింట్లతో 8వ స్థానంలో కొనసాగుతోంది.
- సన్రైజర్స్ హైదరాబాద్ (SRH): పేరులో ఉన్న రైజింగ్.. విజయాల్లో మాత్రం లేదు. కనీసం పోరాడకుండానే మ్యాచ్లను సమర్పించేసుకుంటూ సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలపాలవుతున్న ఏకైక జట్టు సన్రైజర్స్ హైదరాబాద్. ఆడిన ఏడు మ్యాచుల్లో రెండు విజయాలతో నాలుగు పాయింట్లను ఖాతాలో వేసుకుని తొమ్మిదో స్థానంలో కొనసాగుతోంది. ఇలాగే కొనసాగితే అట్టడుగు స్థానం కూడా ఎస్ఆర్హెచ్దే అవుతుందని అభిమానులు నిరాశపడుతున్నారు.
- దిల్లీ క్యాపిటల్స్ (DC): రిషభ్ పంత్ లేని లోటు దిల్లీ క్యాపిటల్స్కు తెలుస్తోంది. మిడిల్ ఆర్డర్లో ఎన్నోసార్లు జట్టును కాపాడిన అనుభవం రిషభ్ పంత్ సొంతం. వరుసగా ఐదు మ్యాచుల్లో ఓడిన దిల్లీ.. ఎట్టకేలకు విజయాల బాట పట్టింది. కోల్కతా, సన్రైజర్స్ హైదరాబాద్ను ఓడించి నాలుగు పాయింట్లను సాధించింది. ప్రస్తుతం ఆఖరి స్థానంలో కొనసాగుతోంది.
(పాయింట్ల పట్టిక)
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
ఆసియా కప్లో భారత మహిళల జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సెమీస్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు చేరింది. -
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘నేనుండగా ఆమె పిల్లలు లేనివారు ఎలా అవుతారు..?’: కమలాహారిస్కు సవతి కుమార్తె మద్దతు
-
17ఏళ్ల నాటి హత్య కేసు.. ఒకే ఫ్యామిలీలో తొమ్మిది మంది సహా 14మందికి జీవిత ఖైదు
-
రెడ్ బుక్ తెరవకముందే జగన్ గగ్గోలు పెడుతున్నారు: మంత్రి నారా లోకేశ్
-
విడుదలై బయటకు..తిరిగి జైలుకు
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
-
కేసీఆర్, కేటీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి: మంత్రి ఉత్తమ్