IPL : అది ఎంతో అతి.. అలా చేసుండాల్సింది కాదు : లఖ్నవూ ఆటగాడు
ఈ ఐపీఎల్(IPL 2023) సీజన్లో ఓ మ్యాచ్లో తన ప్రవర్తనతో విమర్శలపాలయ్యాడు లఖ్నవూ ఆటగాడు ఆవేశ్ఖాన్(Avesh Khan). తాజాగా ఆ ఘటన పట్ల విచారం వ్యక్తం చేశాడు.
ఇంటర్నెట్డెస్క్ : ఇటీవల ముగిసిన ఐపీఎల్(IPL 2023)లో.. బెంగళూరు(Royal Challengers Bangalore)తో జరిగిన మ్యాచ్లో లఖ్నవూ(Lucknow Super Giants) పేసర్ ఆవేశ్ ఖాన్(Avesh Khan) హెల్మెట్ను నేలకేసి విసిరి సంబరాలు చేసుకున్న విషయం తెలిసిందే. అతడి ప్రవర్తనపై ఆ తర్వాత విమర్శలు వెల్లువెత్తాయి. సోషల్మీడియాలో ట్రోలింగ్కూ గురయ్యాడు. తాజాగా ఆ ఘటనపై ఆవేశ్ స్పందించాడు. తాను అలా చేసి ఉండాల్సింది కాదని .. విచారం వ్యక్తం చేశాడు.
ఏం జరిగిందంటే.. లీగ్ దశలో లఖ్నవూ, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ చివరి బంతి వరకూ ఉత్కంఠగా సాగింది. ఆర్సీబీ నిర్దేశించిన 213 పరుగుల లక్ష్యాన్ని లఖ్నవూ ఛేదించి వికెట్ తేడాతో గెలుపొందింది. అయితే.. చివరి బంతికి ఒక పరుగు అవసరమైన వేళ.. హర్షల్ పటేల్ బౌలింగ్లో ఆవేశ్ షాట్ ఆడేందుకు ప్రయత్నించి మిస్సయ్యాడు. దీంతో నాన్స్ట్రైకర్ ఎండ్ వైపు పరుగెత్తాడు. అదే సమయంలో కీపర్ దినేశ్ కార్తిక్ రనౌట్ చేయలేకపోయాడు. ఉత్కంఠ పరిస్థితుల్లో చివరి బంతికి విజయం సాధించడంతో.. తన హెల్మెట్ను తీసి నేలకేసి కొట్టి ఆవేశ్ సంబరాలు చేసుకున్నాడు. అంతకుముందు.. బెంగళూరు మైదానంలో ఆర్సీబీ అభిమానులను నిశ్శబ్దంగా ఉండాలంటూ లఖ్నవూ మెంటార్ గంభీర్ సంజ్ఞ చేయడంతో.. అప్పటికే ఇరు జట్ల మధ్య వేడి వాతావరణం నెలకొంది.
తాజాగా ఈ ఘటనపై ఆవేశ్ ఓ మీడియా ఇంటర్వ్యూలో స్పందించాడు. ‘అది ఎంతో అతిగా అనిపించింది. అలా చేసి ఉండాల్సింది కాదు. ఆ తర్వాత నేను చేసిన తప్పు తెలుసుకున్నాను. ఆ పరిస్థితుల్లో అలా జరిగిపోయిందంతే. ప్రస్తుతం నేను ఆ ఘటన పట్ల ఎంతో బాధపడుతున్నాను’ అంటూ వివరించాడు.
ఇక ఈ మ్యాచ్ అనంతరం.. ఇరు జట్ల మధ్య లఖ్నవూ వేదికగా జరిగిన మరో మ్యాచ్లో విరాట్ కోహ్లీ, గౌతమ్ గంభీర్ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కేరళ, బెంగాల్ గవర్నర్ కార్యాలయాలకు సుప్రీం నోటీసులు
-
జాస్పర్ నగరం సగం భస్మీపటలం..!
-
నిరుద్యోగులూ నిరసనలు వద్దు.. మీ అన్నగా అండగా ఉంటా: సీఎం రేవంత్రెడ్డి
-
అంత డబ్బు నా వద్ద లేదు: జాన్వీకపూర్
-
జేడీ వాన్స్ వ్యాఖ్యలు వైరల్.. తీవ్రంగా ఖండించిన ప్రముఖ నటి
-
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు