Harbhajan: పీసీఏ అధ్యక్షుడిపై హర్భజన్ సింగ్ తీవ్ర ఆరోపణలు
పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ చీఫ్ గుల్జరిందర్ సింగ్ చాహల్పై ప్రధాన సలహాదారుడు, ఎంపీ హర్భజన్ సింగ్ తీవ్ర ఆరోపణలతో కూడిన బహిరంగ లేఖను విడుదల చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: రాజ్యసభ సభ్యుడు, మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ బహిరంగ లేఖ తీవ్ర చర్చకు దారితీసింది. పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ (పీసీఏ) అధ్యక్షుడు గుల్జరిందర్ సింగ్ చాహల్ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు ఆరోపిస్తూ పీసీఏ సభ్యులకు హర్భజన్ రాశారు. ప్రస్తుతం హర్భజన్ కూడా పీసీఏ ప్రధాన సలహాదారుడిగా వ్యవహరిస్తున్నారు. చాహల్కు ఇష్టం వచ్చినట్టుగా కొత్త సభ్యులను తీసుకొనేందుకు ప్రయత్నిస్తున్నట్లు భజ్జీ ఆరోపించారు. సత్వరమే బోర్డు సభ్యులు సమావేశమై అలాంటి కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయాలని సూచించారు.
‘‘క్రికెట్ పరిపాలన, పారదర్శకతను పక్కన పెట్టి మరీ సభ్యుల నియామకం చేపడుతున్నట్లు ప్రస్తుత పీసీఏ అధ్యక్షుడు గుల్జరిందర్పై గత పది రోజులుగా అభిమానులు, ఇతర సభ్యుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి. అలాగే అంబుడ్స్మన్కి ఫిర్యాదులు అందాయని నాకు తెలిసింది. ఇదంతా బీసీసీఐ రాజ్యాంగం, మార్గదర్శకాలకు విరుద్ధం. క్రీడా పరిపాలన విభాగంలో పారదర్శకతకు సంబంధించిన నియమాలను పీసీఏ అధ్యక్షుడు ఉల్లంఘిస్తున్నారు. పీసీఏ సాధారణ సమావేశాలూ నిర్వహించడం లేదు. సుమోటోగా తమకు కావాల్సిన విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు’’ అని హర్భజన్ లేఖలో పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బెంగళూరు గెలిచిందోచ్..
విధ్వంసక బ్యాటింగ్తో ప్రత్యర్థులను హడలెత్తిస్తున్న సన్రైజర్స్ హైదరాబాద్తో వరుస ఓటములతో సతమతమవుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ అంటే ఫేవరెట్ ఎవరో చెప్పాల్సిన పని లేదు. -
చదరంగ యువరాజుకు ఘన స్వాగతం
సమయం తెల్లవారుజామున 3 గంటలు. చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం. సాధారణంగా రాత్రి వేళ ప్రయాణికులతో మాత్రమే కాస్త సందడిగా ఉండే ఆ విమానాశ్రయంలో గురువారం మాత్రం ఎంతో హడావుడి నెలకొంది. -
దిల్లీ జట్టులోకి గుల్బాదిన్
గాయంతో ఐపీఎల్ 17వ సీజన్ నుంచి అర్ధంతరంగా తప్పుకొన్న మిచెల్ మార్ష్ స్థానాన్ని అఫ్గానిస్థాన్ పేస్ ఆల్రౌండర్ గుల్బాదిన్ నయీబ్తో దిల్లీ క్యాపిటల్స్ భర్తీ చేసింది. -
ఫైనల్లో ధీరజ్ బృందం
ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత పురుషుల రికర్వ్ జట్టు సత్తా చాటింది. -
ఆ నిబంధనతో ప్రమాదమే
ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్ల ఆల్రౌండర్ పాత్ర ప్రమాదంలో పడుతోందని స్పిన్నర్ అక్షర్ పటేల్ అన్నాడు. -
ట్రయల్స్లో అర్జున్ రికార్డు స్కోరు
ఒలింపిక్ షూటింగ్ ట్రయల్స్ 10మీ ఎయిర్ రైఫిల్లో అర్జున్ బబూత ప్రపంచ రికార్డు స్కోరు (254) సాధించాడు. -
భారత అథ్లెట్ల జోరు
ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో భారత అథ్లెట్ల జోరు కొనసాగుతోంది.