Virat Kohli: ‘సచిన్ 100 సెంచరీల రికార్డును కోహ్లీ బ్రేక్ చేస్తాడు’
సచిన్ తెందూల్కర్ 100 సెంచరీల రికార్డును టీమ్ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ (Virat Kohli) బ్రేక్ చేస్తాడని భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ధీమా వ్యక్తం చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) టెస్టుల్లో తిరిగి ఫామ్లోకి వచ్చాడు. 40 నెలల నిరీక్షణకు తెరదించుతూ సుదీర్ఘ ఫార్మాట్లో ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టెస్టులో భారీ శతకం (186) బాదాడు. ఈ నేపథ్యంలో కోహ్లీపై భారత్ మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ (Harbhajan Singh)ప్రశంసలు కురిపించాడు. క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ నెలకొల్పిన 100 సెంచరీల రికార్డును విరాట్ బ్రేక్ చేస్తాడని హర్భజన్ ధీమా వ్యక్తం చేశాడు. 34 ఏళ్ల పరుగుల రారాజు.. ఫిట్నెస్పరంగా 24 ఏళ్ల కుర్రాడిలా కనిపిస్తున్నాడని పేర్కొన్నాడు.
‘ఇది కచ్చితంగా సాధ్యమే. విరాట్ కోహ్లీ అంతకంటే (100 సెంచరీలు) ఎక్కువ శతకాలు చేయగలడని అనుకుంటున్నాను. ఇక్కడ రెండు విషయాలు విరాట్కు అనుకూలంగా ఉన్నాయి. ఒకటి అతని వయస్సు, రెండోది ఫిట్నెస్. కోహ్లీ వయస్సు ఇప్పుడు 34. కానీ, అతని ఫిట్నెస్ 24 ఏళ్ల క్రికెటర్లా ఉంది. ఫిట్నెస్పరంగా అతడు చాలా ముందున్నాడు. విరాట్ ఇప్పటికే 75 సెంచరీలు బాదాడు. అతను కనీసం ఇంకా 50 కంటే ఎక్కువ సెంచరీలు చేస్తాడు. కోహ్లీకి తన ఆట గురించి తెలుసు. అతను అన్ని ఫార్మాట్లలో ఆడతాడు. ఈ విషయంలో నేను అతి విశ్వాసం ప్రదర్శిస్తున్నానని మీరు భావించొచ్చు. కానీ, కచ్చితంగా ఇది సాధ్యమే. ఈ రికార్డును బద్దలుకొట్టేవారు ఎవరైనా ఉన్నారంటే అది విరాట్ కోహ్లీనే. మిగిలిన వారంతా అతని వెనుక ఉన్నారు’ అని హర్భజన్ సింగ్ చెప్పాడు.
ఇక, ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ గురించి భజ్జీ మాట్లాడాడు. సీఎస్కేకు మహేంద్ర సింగ్ ధోనీ అతిపెద్ద బలమని, జట్టుకు అతడు గుండె లాంటి వాడని పేర్కొన్నాడు. రవీంద్ర జడేజా ప్రపంచంలోనే ఉత్తమమైన ఆల్రౌండర్ అని, వచ్చే ఐపీఎల్ సీజన్లో సీఎస్కే అతడు కీలకంగా మారతాడని భజ్జీ అభిప్రాయపడ్డాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ముంబయి లక్ష్య ఛేదన దిశగా వస్తుందని భావించారా? ప్యాట్ కమిన్స్ సమాధానమిదే!
ఐపీఎల్ 17వ సీజన్లో హైదరాబాద్ బోణీ కొట్టింది. ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్లో ముంబయిని చిత్తు చేసింది. -
హైదరాబాద్, ముంబయి మ్యాచ్లో నమోదైన రికార్డులివీ..
ఉప్పల్ వేదికగా ముంబయితో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ 31 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో పలు రికార్డులు నమోదు అయ్యాయి. -
ఉప్పల్ ఊగిపోయింది
ఐపీఎల్ చరిత్రలో నిలిచిపోయే మ్యాచ్లో సన్రైజర్స్ అద్వితీయమైన బ్యాటింగ్తో అదరగొట్టింది. బ్యాటర్లు మెషీన్ గన్నుల్లా పేలడంతో ఐపీఎల్లో రికార్డు స్కోరుతో సత్తాచాటింది. తొలి మ్యాచ్లో త్రుటిలో ఓడినా.. రెండో పోరులో చిరస్మరణీయ విజయం అందుకుంది. -
ఇది సన్రైజర్సేనా?
సన్రైజర్స్ అంటే.. నత్తనడక బ్యాటింగ్కు మారు పేరు! సన్రైజర్స్ బ్యాటర్లది.. స్ట్రైక్రేట్లో ఎప్పుడూ వెనుకంజే! సన్రైజర్స్ మెరుపులన్నీ బౌలింగ్ వరకే! కానీ ఇదంతా పాత కథ! -
సింధు శుభారంభం
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు శుభారంభం చేసింది. -
సెమీస్లో బోపన్న జోడీ
44 ఏళ్ల వయసులోనూ అద్భుతమైన ఆటతీరుతో అదరగొడుతున్న భారత టెన్నిస్ వెటరన్ డబుల్స్ స్టార్ రోహన్ బోపన్న మరో టైటిల్ దిశగా సాగుతున్నాడు. -
ఎఫ్ఐహెచ్ అథ్లెట్ల కమిటీలో శ్రీజేష్
అంతర్జాతీయ హాకీ సమాఖ్య నూతన ఎఫ్ఐహెచ్ అథ్లెట్ల కమిటీ సహ అధ్యక్షుడిగా భారత హాకీ వెటరన్ గోల్కీపర్ శ్రీజేష్ నియమితుడయ్యాడు. -
‘ఇంపాక్ట్ ప్లేయర్’ వల్లే ధోని అలా..
కెప్టెన్సీ నుంచి తప్పుకొన్నాడు. ఆటగాడిగా కూడా ఇదే చివరి సీజన్ అని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మహేంద్ర ధోని బ్యాటు పట్టి కొన్ని మెరుపులు మెరిపిస్తే చూడాలన్నది అభిమానుల ఆశ. -
కోచ్కు జకోవిచ్ టాటా
కోచ్ గోరాన్ ఇవానిసెవిచ్తో ఆరేళ్ల బంధానికి జకోవిచ్ వీడ్కోలు పలికాడు. 2018లో ఇవానిసెవిచ్తో కలిసి జకోవిచ్ ప్రయాణం ప్రారంభించాడు. -
సచిన్ గోల్ఫాట
క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ గోల్ఫ్ స్టిక్ చేతబట్టాడు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని బౌల్డర్హిల్స్ క్లబ్లో బుధవారం గోల్ఫ్ ఆడాడు. -
భారత్-పాక్ సిరీస్.. ఆసీస్ ఆసక్తి
భారత్, పాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక టెస్టు సిరీస్కు ఆతిథ్యమివ్వడానికి ఆస్ట్రేలియా మరోసారి ఆసక్తి వ్యక్తం చేసింది. -
ముంబయిలో హార్దిక్కు మరింతగా..
రోహిత్ శర్మ స్థానంలో ముంబయి ఇండియన్స్ కెప్టెన్గా ఎంపికైన హార్దిక్ పాండ్యకు సామాజిక మాధ్యమాల్లోనే కాదు మైదానాల్లోనూ తీవ్ర వ్యతిరేకత తప్పడం లేదు. -
మళ్లీ బాబర్కే పగ్గాలు!
పాకిస్థాన్ క్రికెట్ జట్టు పగ్గాలు మళ్లీ బాబర్ అజామ్ చేతికి దక్కే సూచనలు కనిపిస్తున్నాయి. అతణ్ని మరోసారి జట్టు కెప్టెన్గా నియమించేందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఆసక్తితో ఉన్నట్లు తెలుస్తోంది. -
స్టిమాక్ను తప్పించాల్సిందే
ఫుట్బాల్ ప్రపంచకప్ క్వాలిఫయర్స్లో చిన్న జట్టు అఫ్గానిస్థాన్ చేతిలో భారత్ అనూహ్య ఓటమితో కోచ్ స్టిమాక్ను తప్పించాలని మాజీ ఆటగాళ్లు డిమాండ్ చేస్తున్నారు.