IPL 2024: ముంబయి ఫ్రాంచైజీకి రావడంపై పాండ్య పోస్టు... గిల్కు గుజరాత్ టైటాన్స్ కెప్టెన్సీ
ముంబయి ఇండియన్స్కు హార్దిక్ పాండ్య వెళ్లపోవడం అధికారికంగా ఖరారైంది. దీంతో గుజరాత్ టైటాన్స్కు కెప్టెన్గా శుభ్మన్ గిల్ను నియమించారు.
ముంబయి: టీమ్ఇండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య (Hardik Pandya) ముంబయి ఇండియన్స్కు వచ్చేయడం అధికారికంగా ఖరారైంది. ఐపీఎల్ 2024 సీజన్లో గుజరాత్ టైటాన్స్కు కెప్టెన్గా శుభ్మన్ గిల్ను ఆ ఫ్రాంచైజీ ప్రకటించింది. గత రెండు సీజన్లలో కెప్టెన్గా గుజరాత్ టైటాన్స్ను ఫైనల్స్ చేర్చడమే కాక, 2022లో విజేతగా కూడా నిలిపిన అతను.. వచ్చే సీజన్ నుంచి తిరిగి ముంబయికి ఆడబోతున్నాడు. ఐపీఎల్లో (IPL) గుజరాత్ టైటాన్స్ (GT) కెప్టెన్గా జట్టుకు టైటిల్ అందించిన హార్దిక్ను ట్రేడింగ్లో ముంబయి దక్కించుకుంది. ఈ సందర్భంగా హార్దిక్ పాండ్య స్పందించాడు. సొంత ఇంటికి వచ్చినట్లు ఉందని సోషల్ మీడియా వేదికగా ఆనందం వ్యక్తం చేశాడు. ‘‘ఎన్నో అద్భుతమైన జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి. ముంబయి, వాంఖడే, పల్టాన్.. ఇలా ప్రతిదీ ప్రత్యేకమే. వెనక్కి తిరిగి వచ్చినందుకు ఆనందంగా ఉంది’’ అని ఇన్స్టాగ్రామ్లో పోస్టు పెట్టాడు.
థ్రిల్గా ఫీలవుతున్నాం: నీతా అంబానీ
‘‘హార్దిక్ పాండ్య తిరిగి ముంబయి ఇండియన్స్ జట్టుకు రావడం థ్రిల్గా ఫీలవుతున్నాం. ఎంఐ ఫ్యామిలీలోకి అతడిని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. యువకుడిగా ఉన్న పాండ్యను ముంబయి ఇండియన్స్ గుర్తించి ప్రోత్సహించింది. ఇప్పుడు స్టార్గా ఎదిగాడు. ముంబయి ఇండియన్స్ తరఫున అతడికి మంచి భవిష్యత్తు ఉంటుంది’’ అని నీతా అంబానీ ప్రత్యేక సందేశం పోస్టు చేశారు.
అతడు ఉంటే జట్టు సమతూకం: ఆకాశ్ అంబానీ
ముంబయి ఇండియన్స్ ఫ్రాంచైజీ ఓనర్ ఆకాశ్ అంబానీ కూడా హార్దిక్ రాకపై స్పందించారు. ‘‘హార్దిక్ పాండ్యను మళ్లీ ముంబయి జట్టులో చూడనుండటం ఆనందంగా ఉంది. అతడు సొంత ఇంటికి వచ్చినట్లే. పాండ్య జట్టులో ఉంటే ఎప్పుడూ సమతూకం వస్తుంది. పాండ్య ముంబయితో కలిసి ఆడిన తొలి భాగమంతా విజయవంతమైంది. ఇప్పుడు అదే కొనసాగుతుందని ఆశిస్తున్నాం’’ అని ఆకాశ్ అంబానీ తెలిపారు.
వీరందరితో మరింత పటిష్ఠంగా మారుతున్నాం: ముంబయి ఇండియన్స్
‘‘ హార్దిక్ పాండ్య తన సొంత ఇంటికి తిరిగొచ్చాడు. వచ్చే ఏడాది సీజన్లో ముంబయి జట్టుతో కలబోతున్నాడు. రోహిత్ శర్మ, బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్తో జత కలుస్తాడు. దీంతో మరింత బలంగా మారబోతున్నాం. ముంబయి విజయాల్లో హార్దిక్ పాండ్య కీలక పాత్ర పోషించాడు’’ అని ముంబయి ఇండియన్స్ పోస్టు చేసింది.
గుజరాత్ టైటాన్స్ కెప్టెన్గా శుభ్మన్ గిల్
హార్దిక్ పాండ్య ముంబయి జట్టుకు వెళ్లిపోవడంతో గుజరాత్ టైటాన్స్కు కొత్త సారథిగా శుభ్మన్ గిల్ను నియమిస్తూ ఆ ఫ్రాంచైజీ కీలక ప్రకటన వెలువరించింది. గుజరాత్ తొలిసారి టైటిల్ను నెగ్గడంలో ఓపెనర్గా శుభ్మన్ గిల్ కూడా కీలక పాత్ర పోషించాడు. ‘‘శుభ్మన్ గిల్ గత రెండేళ్లుగా మెరుగవుతూ వస్తున్నాడు. క్రికెట్ను అత్యున్నత స్థాయికి తీసుకెళ్లడంలో కీలకంగా మారాడు. బ్యాటర్గానే కాకుండా నాయకత్వ లక్షణాలూ అతడిలో ఉన్నాయి. గుజరాత్ టైటాన్స్ను విజేతగా నిలవడంలో అవెంతో ఉపయోగపడ్డాయి. యువ కెప్టెన్ నాయకత్వంలో గుజరాత్ కొత్త ప్రయాణం మొదలు కానుంది’’ అని గుజరాత్ టైటాన్స్ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ విక్రమ్ సోలంకీ ట్వీట్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం