Hardik Pandya : వారెవ్వా హార్దిక్.. ఏమా మార్పు..!
భారత జట్టులో పేస్ బౌలింగ్తోపాటు బ్యాటింగ్ చేయగలిగే ఆటగాళ్లు చాలా తక్కువ. స్పిన్ బౌలింగ్ వేయగలిగేవారు. అయితే టీమ్ఇండియాకు తొలి వన్డే ప్రపంచకప్ను..
సూపర్ రికార్డు సాధించిన టీమ్ఇండియా ఆల్రౌండర్
ఇంటర్నెట్ డెస్క్: భారత జట్టులో పేస్ బౌలింగ్తోపాటు బ్యాటింగ్ చేయగలిగే ఆటగాళ్లు చాలా తక్కువ. టీమ్ఇండియాకు తొలి వన్డే ప్రపంచకప్ను అందించిన మాజీ సారథి కపిల్దేవ్ జట్టులో ఆల్రౌండర్ పాత్రనే పోషించాడు. అటు తర్వాత చాన్నాళ్లకు హార్దిక్ పాండ్య రూపంలో మరొకరు దొరికారని అభిమానులు సంబరపడిపోయారు.
అభిమానుల ఆకాంక్షకు తగ్గట్టుగానే ఆరంభంలో టీమ్ఇండియా తరఫున, టీ20 లీగ్లో కీలక పాత్ర పోషించాడు. అయితే రెండేళ్ల కిందట ఎప్పుడైతే వెన్నముకకు గాయమైందో.. అప్పటి నుంచి క్రమంగా పాండ్య ఫామ్తోపాటు కెరీర్ గ్రాఫ్ పడిపోయింది. జట్టుకు భారంగా మారాడని విమర్శలు.. ఇంకో కీలకమైన ఆటగాడిని ఎంపిక చేసినా బాగుండేదని వ్యాఖ్యలు.. అప్పటికీ బ్యాటింగ్, బౌలింగ్లో విఫలమైన గతేడాది టీ20 ప్రపంచకప్లో కీలకమైన మ్యాచుల్లో రాణించలేకపోయాడు. బౌలింగ్లోనూ ప్రభావం చూపలేకపోయాడు. దీంతో శ్రీలంక, విండీస్ జట్లతో సిరీస్లకు ఎంపిక కాలేకపోయాడు.
ఘనంగా పునరాగమనం..
గోడకేసి కొట్టిన బంతిలా హార్దిక్ పాండ్య కూడా వేగంగా ఫిట్నెస్ సాధించి గత టీ20 లీగ్లో ఘనంగా పునరాగమనం చేశాడు. ఇటు బ్యాటింగ్తోపాటు తనలోని నాయకుడి లక్షణాలను వెలుగులోకి తీసుకొచ్చి గుజరాత్ను టైటిల్ విన్నర్గా నిలిపాడు. బౌలింగ్లో ఎక్కువగా ఓవర్లు వేయకపోయినా.. అవసరమైనప్పుడు మాత్రం బంతిని అందుకొని వికెట్లు పడగొట్టి తనేంటో నిరూపించుకున్నాడు. ఐర్లాండ్పై కెప్టెన్గానూ, ఆటగాడిగా రాణించాడు. తాజాగా ఇంగ్లాండ్తో రోహిత్ నాయకత్వంలోని టీమ్ఇండియా మూడు టీ20ల సిరీస్ను ఆడుతోంది. అందులో భాగంగా తొలి టీ20 మ్యాచ్లో ఆల్రౌండ్ షోతో అదరగొట్టిన హార్దిక్ పాండ్య అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకొన్నాడు.
ఇదీ రికార్డు..
ఇంగ్లాండ్తో జరిగిన తొలి టీ20 మ్యాచ్లో హార్దిక్ పాండ్య హాఫ్ సెంచరీ (51), బౌలింగ్లో 4/33 ప్రదర్శనతో రాణించాడు. ఈ క్రమంలో హార్దిక్ పాండ్య ఓ ఘనతను సాధించాడు. ఓ టీ20 మ్యాచ్లో అర్ధశతకంతోపాటు నాలుగు వికెట్లను పడగొట్టిన నాలుగో బౌలర్గా రికార్డుకెక్కాడు. ఇక ఈ ఘనత సాధించిన తొలి భారత బౌలర్ హార్దిక్ పాండ్య కావడం విశేషం. గతంలో టీమ్ఇండియా మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్ కూడా ఇలాంటి ఫీట్కు చేరువగా వచ్చి మిస్ చేసుకొన్నాడు. శ్రీలంకతో 2009లో టీ20 సిరీస్ సందర్భంగా యువీ హాఫ్ సెంచరీ సాధించాడు. అయితే మూడు వికెట్లను మాత్రమే తీశాడు.
హార్దిక్ కంటే ముందు ఎవరు..?
ఐసీసీ గుర్తింపు వచ్చిన దేశాల నుంచి ఒకే టీ20 మ్యాచ్లో అర్ధశతకంతోపాటు నాలుగు వికెట్లు తీసింది ఇప్పటి వరకు పాండ్యతో కలుపుకొని నలుగురు మాత్రమే. తొలుత విండీస్ మాజీ ఆటగాడు డ్వేన్ బ్రావో (2009) భారత్పైనే (66* పరుగులు, 4/38) సాధించడం గమనార్హం. జింబాబ్వే మీద 2011లో పాక్ మాజీ ప్లేయర్ మహమ్మద్ హఫీజ్ (71 పరుగులు, 4/10), 2011లో ఆసీస్ మాజీ ఆటగాడు షేన్ వాట్సన్ (59 పరుగులు, 4/15) ఇంగ్లాండ్పై సాధించారు. అఫ్గానిస్థాన్ ఆటగాడు సమిముల్లా షిన్వారి (61 పరుగులు, 4/14) కెనడా మీద 2012లో సాధించినా పరిగణనలోకి రాదు. ఎందుకంటే అప్పటికి అఫ్గానిస్థాన్కు ఐసీసీ గుర్తింపు లేదు.
ఇంత మార్పు ఎలా సాధ్యం.. ?
మ్యాచ్ అనంతరం హార్దిక్ మాట్లాడుతూ.. ‘‘ఫిట్నెస్పై చాలా సమయం వెచ్చించా. నా శరీరాన్ని సిద్ధంగా ఉంచుకునేందుకు కష్టపడ్డా. ఎలాగైనా సరే రిథమ్లోకి రావాలని బలంగా అనుకున్నా. కొంతకాలంపాటు ఆటకు దూరం కావడం కూడా మంచిది అయింది. బ్రేక్ తీసుకొని బరిలోకి దిగడం వల్ల బాగా ఆడగలుగుతున్నా. ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉంది. ఎప్పుడైనా బాధ్యతలను తీసుకొనేందుకు సిద్ధంగా ఉంటా. భారత టీ20 లీగ్లో కెప్టెన్సీ చేయడం నా బాధ్యతను మరింత పెంచింది’’ అని పేర్కొన్నాడు. వెన్నెముక గాయం కారణంగా ఇబ్బంది పడిన తర్వాత అతడి ఆటను చూస్తే హార్దిక్ పాండ్య వ్యాఖ్యలు అక్షర సత్యం. జట్టు ప్రయోజనాల కోసం అవసరమైతే వ్యక్తిగత లక్ష్యాలను పక్కన పెట్టి మరీ ఆడతాడు. వచ్చే టీ20 ప్రపంచకప్లో భారత్ తరఫున కీలక ఆటగాడిగా మారతాడనేదాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఆల్రౌండర్లు ఎంతమంది ఉంటే ఆ జట్టుకు అంత బలం.. కాబట్టే టీమ్ఇండియాకు హార్దిక్తోపాటు అశ్విన్, జడేజా, దీపక్ హుడా వంటి ఆల్రౌండర్లు కీలకంగా మారే అవకాశం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
ఆసియా కప్లో భారత మహిళల జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సెమీస్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు చేరింది. -
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఎల్ఆర్ఎస్ అమలుకు కొత్త జిల్లాల వారీగా ప్రత్యేక బృందాలు: డిప్యూటీ సీఎం భట్టి
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
ఐఐటీ ఖరగ్పూర్ నుంచి.. సుందర్ పిచాయ్కి గౌరవ డాక్టరేట్
-
పేర్లు ప్రదర్శించమని బలవంతం చేయలేం: సుప్రీం
-
ఆ రాష్ట్రాలను విభజించే కుట్ర - మమతా బెనర్జీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM