Hardik Pandya-Mumbai Indians: హార్దిక్ పాసవుతాడా?ముంబయి కెప్టెన్గా కఠిన పరీక్ష
ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన జట్టుగా ఉన్న ముంబయి ఇండియన్స్ (Mumbai Indians)కు రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్ పాండ్య (Hardik Pandya)ను కెప్టెన్గా నియమించారు.
ముంబయి ఇండియన్స్ (Mumbai Indians).. ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన జట్టు. అత్యధిక టైటిళ్లు గెలిచిన జట్టుగా చెన్నై సూపర్ కింగ్స్తో కలిసి ఉమ్మడిగా నంబర్వన్గా కొనసాగుతోంది. అయిదు టైటిళ్లు గెలిచిన ఆ జట్టుకు ఉండే ఫాలోయింగే వేరేగా ఉంటుంది. ఆటలో, ఆదరణలో ఆ జట్టుకు తిరుగులేదు. అలాంటి జట్టుకు కెప్టెన్ అంటే గొప్ప అవకాశమనే చెప్పాలి. ఆ లెవలే వేరు. ఇప్పుడు హార్దిక్ పాండ్య(Hardik Pandya)కు ఆ అవకాశం వచ్చింది. 2024 ఐపీఎల్ సీజన్ కోసం హార్దిక్ను ముంబయి ఇండియన్స్ కెప్టెన్గా నియమించారు. అయితే ఆ హోదాతో వచ్చే సవాళ్లు, ఆ గౌరవంతో వచ్చే కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ముంబయి సారథ్యం అనేది హార్దిక్కు పెద్ద పరీక్ష. మరి ఈ పరీక్షలో అతను పాసవుతాడా?
గుజరాత్ వేరు..
2015లో ముంబయి ఇండియన్స్తోనే హార్దిక్ ఐపీఎల్ కెరీర్ మొదలైంది. భారీ షాట్లతో హార్డ్ హిట్టర్గా, మంచి పేస్ బౌలింగ్తో వికెట్లు కూలుస్తూ ఆల్రౌండర్గా హార్దిక్ ఎదిగాడు. జాతీయ జట్టులోకి వచ్చాడు. 2021 వరకు ముంబయితోనే హార్దిక్ ఆడాడు. కానీ వెన్నెముకకు శస్త్రచికిత్స కారణంగా లీగ్లో అనుకున్నంతగా రాణించలేకపోయాడు. దీంతో 2022 సీజన్కు ముందు హార్దిక్ను ముంబయి వదిలేసింది. కానీ అతని సామర్థ్యాలపై నమ్మకముంచిన కొత్త జట్టు గుజరాత్ టైటాన్స్.. హార్దిక్ను తీసుకోవడమే కాకుండా కెప్టెన్నూ చేసింది. ఆ జట్టు తొలి సీజన్ (2022)లోనే హార్దిక్ కెప్టెన్గా, ఆల్రౌండర్గా అదరగొట్టాడు. యువ ఆటగాళ్లతో నిండిన జట్టును నడిపించడాన్ని సవాలుగా తీసుకున్నాడు. మంచి నాయకత్వ నైపుణ్యాలతో మెప్పించాడు. యువ ఆటగాళ్లతో కలిసిపోయి జట్టును నడిపించాడు. కెప్టెన్గా తొలి సీజన్లోనే గుజరాత్ను విజేతగా నిలపడంతో హార్దిక్ పేరు మార్మోగింది. దీంతో అంతర్జాతీయ టీ20ల్లో టీమ్ఇండియా సారథ్య బాధ్యతలు దక్కాయి. ఈ ఏడాది కూడా అదే జోరు కొనసాగించిన హార్దిక్.. గుజరాత్ను రన్నరప్గా నిలిపాడు. దీంతో హార్దిక్ను ముంబయి తిరిగి దక్కించుకుంది. వద్దనుకున్న జట్టే తిరిగి అతని కోసం వచ్చేలా హార్దిక్ చేశాడంటే అతని ప్రతిభ ఏమిటో తెలుస్తోంది.
ముంబయి వేరు..
గుజరాత్ అంటే కొత్త జట్టు. పైగా యువ ఆటగాళ్లు. కాబట్టి ఎలాంటి ఒత్తిడి అన్నది లేకుండా స్వేచ్ఛగా హార్దిక్ జట్టును నడిపించాడు. కానీ ముంబయి ఇండియన్స్ జట్టులో అలాంటి వాతావరణం ఉండకపోవచ్చు. ఎందుకంటే జట్టులో రోహిత్ శర్మ (Rohit Sharma), బుమ్రా, సూర్యకుమార్ యాదవ్ లాంటి స్టార్లు ఉన్నారు. వీళ్లందరూ హార్దిక్ కంటే సీనియర్లే. వీళ్లను సమన్వయం చేసుకుంటూ జట్టును ముందుకు తీసుకెళ్లడం హార్దిక్కు కత్తిమీద సాములాంటిదే. మరోవైపు గత కొన్ని సీజన్లుగా ముంబయి ప్రదర్శన ఆశాజనకంగా లేదు. 2021, 2022లో ప్లేఆఫ్స్ కూడా చేరలేదు. ఈ ఏడాది రెండో క్వాలిఫయర్లో గుజరాత్ చేతిలోనే ఓడింది. కాబట్టి ముందుగా జట్టు ప్రదర్శన మెరుగుపడేలా, మరో టైటిల్ సాధించేలా చేసే అతిపెద్ద బాధ్యత హార్దిక్పై ఉంది. అంతే కాకుండా సారథ్యంలో రోహిత్ను మరిపించాల్సి కూడా ఉంటుంది. 2013 మధ్యలో నుంచి 2023 వరకు 11 సీజన్లపాటు ముంబయిని నడిపించిన రోహిత్ ఏకంగా అయిదు టైటిళ్లు అందించాడు. ముంబయి గెలిచిన ట్రోఫీలన్నీ రోహిత్ కెప్టెన్సీలో వచ్చినవే. కెప్టెన్గా రోహిత్ లేని ముంబయిని చూడటం కష్టమే. ముఖ్యంగా రోహిత్, ముంబయి ఇండియన్స్ అభిమానులు ఈ విషయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కెప్టెన్గా రోహిత్ ప్లేస్లో హార్దిక్ను నియమించారనే తెలియగానే గంటలోపే ముంబయి ఇండియన్స్ ఎక్స్ ఖాతాను 4 లక్షల మంది అన్ఫాలో చేశారు. ఇన్స్టాగ్రామ్లోనూ ఇదే జరుగుతోంది. దీన్ని బట్టి ముంబయి కెప్టెన్గా రోహిత్ వేసిన ముద్ర ఎలాంటిదో స్పష్టమవుతోంది. అందుకే రోహిత్ వారసత్వాన్ని నిలబెట్టడం హార్దిక్పై ముందున్న అతిపెద్ద సవాల్. మరోవైపు టీమ్ఇండియా టీ20 కెప్టెన్గా హార్దిక్ నిలబడాలంటే కూడా.. ముంబయికి కెప్టెన్గా అతని ప్రదర్శన కచ్చితంగా ప్రభావం చూపుతుంది. మరి ఈ సవాళ్లను దాటి.. ఈ కఠిన పరీక్షలో హార్దిక్ ఎలా నెగ్గుకువస్తాడో చూడాలి.
- ఈనాడు క్రీడా విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
-
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
-
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
-
మట్టిచరియల బీభత్సంతో పెను విషాదం.. ఇథియోపియాలో 257కి చేరిన మృతులు
-
ప్రపంచంలోని గొప్ప ప్రదేశాల్లో హైదరాబాద్ ‘మనం చాక్లెట్’!
-
మదనపల్లె ఘటనలో ఉద్యోగులపై వేటు తప్పదు: ఆర్పీ సిసోదియా