Hardik Pandya-Mumbai Indians: హార్దిక్ పాసవుతాడా?ముంబయి కెప్టెన్గా కఠిన పరీక్ష
ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన జట్టుగా ఉన్న ముంబయి ఇండియన్స్ (Mumbai Indians)కు రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్ పాండ్య (Hardik Pandya)ను కెప్టెన్గా నియమించారు.
ముంబయి ఇండియన్స్ (Mumbai Indians).. ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన జట్టు. అత్యధిక టైటిళ్లు గెలిచిన జట్టుగా చెన్నై సూపర్ కింగ్స్తో కలిసి ఉమ్మడిగా నంబర్వన్గా కొనసాగుతోంది. అయిదు టైటిళ్లు గెలిచిన ఆ జట్టుకు ఉండే ఫాలోయింగే వేరేగా ఉంటుంది. ఆటలో, ఆదరణలో ఆ జట్టుకు తిరుగులేదు. అలాంటి జట్టుకు కెప్టెన్ అంటే గొప్ప అవకాశమనే చెప్పాలి. ఆ లెవలే వేరు. ఇప్పుడు హార్దిక్ పాండ్య(Hardik Pandya)కు ఆ అవకాశం వచ్చింది. 2024 ఐపీఎల్ సీజన్ కోసం హార్దిక్ను ముంబయి ఇండియన్స్ కెప్టెన్గా నియమించారు. అయితే ఆ హోదాతో వచ్చే సవాళ్లు, ఆ గౌరవంతో వచ్చే కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ముంబయి సారథ్యం అనేది హార్దిక్కు పెద్ద పరీక్ష. మరి ఈ పరీక్షలో అతను పాసవుతాడా?
గుజరాత్ వేరు..
2015లో ముంబయి ఇండియన్స్తోనే హార్దిక్ ఐపీఎల్ కెరీర్ మొదలైంది. భారీ షాట్లతో హార్డ్ హిట్టర్గా, మంచి పేస్ బౌలింగ్తో వికెట్లు కూలుస్తూ ఆల్రౌండర్గా హార్దిక్ ఎదిగాడు. జాతీయ జట్టులోకి వచ్చాడు. 2021 వరకు ముంబయితోనే హార్దిక్ ఆడాడు. కానీ వెన్నెముకకు శస్త్రచికిత్స కారణంగా లీగ్లో అనుకున్నంతగా రాణించలేకపోయాడు. దీంతో 2022 సీజన్కు ముందు హార్దిక్ను ముంబయి వదిలేసింది. కానీ అతని సామర్థ్యాలపై నమ్మకముంచిన కొత్త జట్టు గుజరాత్ టైటాన్స్.. హార్దిక్ను తీసుకోవడమే కాకుండా కెప్టెన్నూ చేసింది. ఆ జట్టు తొలి సీజన్ (2022)లోనే హార్దిక్ కెప్టెన్గా, ఆల్రౌండర్గా అదరగొట్టాడు. యువ ఆటగాళ్లతో నిండిన జట్టును నడిపించడాన్ని సవాలుగా తీసుకున్నాడు. మంచి నాయకత్వ నైపుణ్యాలతో మెప్పించాడు. యువ ఆటగాళ్లతో కలిసిపోయి జట్టును నడిపించాడు. కెప్టెన్గా తొలి సీజన్లోనే గుజరాత్ను విజేతగా నిలపడంతో హార్దిక్ పేరు మార్మోగింది. దీంతో అంతర్జాతీయ టీ20ల్లో టీమ్ఇండియా సారథ్య బాధ్యతలు దక్కాయి. ఈ ఏడాది కూడా అదే జోరు కొనసాగించిన హార్దిక్.. గుజరాత్ను రన్నరప్గా నిలిపాడు. దీంతో హార్దిక్ను ముంబయి తిరిగి దక్కించుకుంది. వద్దనుకున్న జట్టే తిరిగి అతని కోసం వచ్చేలా హార్దిక్ చేశాడంటే అతని ప్రతిభ ఏమిటో తెలుస్తోంది.
ముంబయి వేరు..
గుజరాత్ అంటే కొత్త జట్టు. పైగా యువ ఆటగాళ్లు. కాబట్టి ఎలాంటి ఒత్తిడి అన్నది లేకుండా స్వేచ్ఛగా హార్దిక్ జట్టును నడిపించాడు. కానీ ముంబయి ఇండియన్స్ జట్టులో అలాంటి వాతావరణం ఉండకపోవచ్చు. ఎందుకంటే జట్టులో రోహిత్ శర్మ (Rohit Sharma), బుమ్రా, సూర్యకుమార్ యాదవ్ లాంటి స్టార్లు ఉన్నారు. వీళ్లందరూ హార్దిక్ కంటే సీనియర్లే. వీళ్లను సమన్వయం చేసుకుంటూ జట్టును ముందుకు తీసుకెళ్లడం హార్దిక్కు కత్తిమీద సాములాంటిదే. మరోవైపు గత కొన్ని సీజన్లుగా ముంబయి ప్రదర్శన ఆశాజనకంగా లేదు. 2021, 2022లో ప్లేఆఫ్స్ కూడా చేరలేదు. ఈ ఏడాది రెండో క్వాలిఫయర్లో గుజరాత్ చేతిలోనే ఓడింది. కాబట్టి ముందుగా జట్టు ప్రదర్శన మెరుగుపడేలా, మరో టైటిల్ సాధించేలా చేసే అతిపెద్ద బాధ్యత హార్దిక్పై ఉంది. అంతే కాకుండా సారథ్యంలో రోహిత్ను మరిపించాల్సి కూడా ఉంటుంది. 2013 మధ్యలో నుంచి 2023 వరకు 11 సీజన్లపాటు ముంబయిని నడిపించిన రోహిత్ ఏకంగా అయిదు టైటిళ్లు అందించాడు. ముంబయి గెలిచిన ట్రోఫీలన్నీ రోహిత్ కెప్టెన్సీలో వచ్చినవే. కెప్టెన్గా రోహిత్ లేని ముంబయిని చూడటం కష్టమే. ముఖ్యంగా రోహిత్, ముంబయి ఇండియన్స్ అభిమానులు ఈ విషయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కెప్టెన్గా రోహిత్ ప్లేస్లో హార్దిక్ను నియమించారనే తెలియగానే గంటలోపే ముంబయి ఇండియన్స్ ఎక్స్ ఖాతాను 4 లక్షల మంది అన్ఫాలో చేశారు. ఇన్స్టాగ్రామ్లోనూ ఇదే జరుగుతోంది. దీన్ని బట్టి ముంబయి కెప్టెన్గా రోహిత్ వేసిన ముద్ర ఎలాంటిదో స్పష్టమవుతోంది. అందుకే రోహిత్ వారసత్వాన్ని నిలబెట్టడం హార్దిక్పై ముందున్న అతిపెద్ద సవాల్. మరోవైపు టీమ్ఇండియా టీ20 కెప్టెన్గా హార్దిక్ నిలబడాలంటే కూడా.. ముంబయికి కెప్టెన్గా అతని ప్రదర్శన కచ్చితంగా ప్రభావం చూపుతుంది. మరి ఈ సవాళ్లను దాటి.. ఈ కఠిన పరీక్షలో హార్దిక్ ఎలా నెగ్గుకువస్తాడో చూడాలి.
- ఈనాడు క్రీడా విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీ20 ప్రపంచకప్నకు ఉగ్ర ముప్పు..! స్పందించిన ట్రినిడాడ్ పీఎం, ఐసీసీ
ఐపీఎల్ ముగిసిన వారం రోజులకే మరో క్రికెట్ సంగ్రామం ప్రారంభం కానుంది. కానీ, దానిపై ఉగ్రమూకలు కన్నేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలపై ఐసీసీ స్పందించింది. -
కుర్రాళ్లు ఇంకా నేర్చుకోవాలి.. ఒత్తిడిని తట్టుకోవాలి: కేఎల్ రాహుల్
కోల్కతా చేతిలో భారీ ఓటమితో లఖ్నవూ పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి పడిపోయింది. మిగిలిన మూడు మ్యాచుల్లోనూ గెలిస్తేనే ఆ జట్టుకు ప్లేఆఫ్స్ బెర్తు ఖాయమవుతుంది. -
ధోనీకి ఎవరైనా చెప్పండి.. కనీసం 4 ఓవర్లు బ్యాటింగ్ చేయమని!: భారత మాజీ క్రికెటర్లు
తన టీ20 కెరీర్లో తొలిసారి ధోనీ 9వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చాడు. ఐపీఎల్ 17వ సీజన్లో పంజాబ్తో జరిగిన మ్యాచ్లో క్రీజ్లోకి వచ్చిన ధోనీ మొదటి బంతికే ఔటయ్యాడు. -
టాస్ ఓడితేనేం.. మ్యాచ్లు గెలుస్తున్నాం కదా: శ్రేయస్ అయ్యర్
హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసిన కోల్కతా ప్లేఆఫ్స్ బెర్తుకు దగ్గరైంది. తన చివరి మూడు మ్యాచుల్లో ఒక్కటి గెలిస్తే నాకౌట్ దశకు చేరుకోవడం ఖాయం. ఇప్పటికే అందరికంటే ముందున్న ఆ జట్టు ఓడినా ఇబ్బంది ఉండకపోవచ్చు. -
పంజాబ్తో మ్యాచ్.. ధోనీ రికార్డును అధిగమించిన రవీంద్ర జడేజా
పంజాబ్ను చిత్తు చేయడంలో చెన్నై ఆల్రౌండర్ రవీంద్ర జడేజా కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. -
జ్వరం బారిన ప్లేయర్లు.. ఎవరు ఆడతారో తెలియలేదు: రుతురాజ్
పంజాబ్పై చెన్నై ప్రతీకార విజయం సాధించింది. చెపాక్లో జరిగిన పరాభావానికి ధర్మశాలలో బదులు తీర్చుకుంది. ప్లేఆఫ్స్ రేసులో ముందుకు దూసుకొచ్చింది. -
కోల్కతా నం.1
కోల్కతాది అదే జోరు. ఈ సీజన్లో అదిరే ప్రదర్శనతో దూసుకుపోతున్న నైట్రైడర్స్.. వరుసగా మూడో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. అంతే కాక ఎనిమిదో విజయంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుని ప్లేఆఫ్స్ స్థానాన్ని దాదాపుగా ఖాయం చేసుకుంది. -
చెన్నై చుట్టేసింది
చివరి నాలుగు మ్యాచ్ల్లో ఒక్కటే గెలుపు! పంజాబ్తో మ్యాచ్లో చేసింది 167 పరుగులే! ఆడుతోంది తటస్థ వేదిక ధర్మశాలలో! అయినా చెన్నై గట్టెక్కింది. కట్టుదిట్టమైన బౌలింగ్తో ప్రత్యర్థిని చుట్టేసి కీలక విజయం సాధించింది. -
బజ్రంగ్పై వేటు
స్టార్ రెజ్లర్ బజ్రంగ్ పునియాను జాతీయ డోపింగ్ నిరోధ సంస్థ (నాడా) సస్పెండ్ చేసింది. ఇటీవల ట్రయల్స్ సందర్భంగా డోప్ టెస్టు కోసం నమూనా ఇవ్వడానికి అతడు తిరస్కరించడంతో నాడా ఈ నిర్ణయం తీసుకుంది. -
జ్యోతికశ్రీ బృందానికి నిరాశ
పారిస్ ఒలింపిక్స్కు అర్హత టోర్నీగా జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ రిలే తొలి అంచె టోర్నీలో తెలుగమ్మాయి దండి జ్యోతికశ్రీ బృందానికి నిరాశ ఎదురైంది. -
అక్టోబరు 6న పాక్తో భారత్ ఢీ
బంగ్లాదేశ్ ఆతిథ్యమివ్వనున్న మహిళల టీ20 ప్రపంచకప్లో భారత్ గ్రూప్ ‘ఎ’లో పోటీ పడనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్థాన్, ఓ క్వాలిఫయర్ ఈ గ్రూప్లోని ఇతర జట్లు. -
బంగ్లాకు మరో విజయం
జింబాబ్వేతో అయిదు టీ20ల సిరీస్లో బంగ్లాదేశ్ వరుసగా రెండో విజయం సాధించింది. ఆదివారం రెండో టీ20లో ఆ జట్టు 6 వికెట్ల తేడాతో నెగ్గింది. మొదట జింబాబ్వే 20 ఓవర్లలో 7 వికెట్లకు 138 పరుగులే చేసింది. -
అవే సిరాజ్ బలాలు
తనపై తనకి నమ్మకం, వెనుదీయని తత్వం పేసర్ మహ్మద్ సిరాజ్ నిజమైన బలాలని సునీల్ గావస్కర్ అన్నాడు. ‘‘మైదానంలో సిరాజ్ సర్వశక్తులూ ఒడ్డుతాడు. -
పుజారా శతకం
భారత టెస్టు జట్టులోకి పునరాగమనం చేయాలని ఆశిస్తున్న సీనియర్ బ్యాటర్ చెతేశ్వర్ పుజారా ఈ కౌంటీ సీజన్లో తొలి శతకం సాధించాడు. ససెక్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న పుజారా..
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు ఉగ్ర ముప్పు..! స్పందించిన ట్రినిడాడ్ పీఎం, ఐసీసీ
-
ఏపీ నూతన డీజీపీ కోసం ముగ్గురు పేర్లతో ఈసీకి సిఫార్సు
-
పలు పాఠశాలలకు బెదిరింపులు..విదేశీ ఐపీ అడ్రెస్ నుంచి మెయిల్స్..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
సమంత ఫొటోపై చర్చ.. ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న అభిమానులు
-
దిల్లీ మద్యం కేసు.. కవితకు మళ్లీ చుక్కెదురు