Harman-Powar: మా మధ్య ఎలాంటి అభిప్రాయభేదాలు లేవు.. అది బీసీసీఐ నిర్ణయం: హర్మన్
మహిళల టీ20 ప్రపంచకప్ 2023 మరో రెండు నెలల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ క్రమంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. మహిళల జట్టు ప్రధాన కోచ్ రమేశ్ పొవార్ను తప్పించి ఎన్సీఏకి పంపించింది. కెప్టెన్ హర్మన్తోపాటు క్రికెటర్లతో విభేదాలే కారణమనే చర్చ కొనసాగుతోంది. దీనికి హర్మన్ సమాధానం ఇచ్చింది.
ఇంటర్నెట్ డెస్క్: భారత మహిళల క్రికెట్ ప్రధాన కోచ్ పదవి నుంచి రమేశ్ పొవార్ను తప్పిస్తూ గత వారం బీసీసీఐ నిర్ణయం తీసుకొన్న విషయం తెలిసిందే. ఇప్పటికీ కోచ్ పేరును ప్రకటించలేదు. అయితే బ్యాటింగ్ కోచ్గా హృషికేష్ కనిత్కర్ను నియమించింది. టీమ్ఇండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్తో పడకపోవడమే రమేశ్ పొవార్ పదవి పోవడానికి ప్రధాన కారణమనే చర్చ నడుస్తోంది. దీనిపై తాజాగా హర్మన్ స్పందించింది. మాజీ కోచ్తో ఎలాంటి వివాదం లేదని స్పష్టం చేసింది. పొవార్తో కలిసి జట్టు విజయం కోసం ఆనందంగా కలిసిమెలిసి పని చేసినట్లు గుర్తు చేసుకొంది.
ఆస్ట్రేలియాతో ఐదు టీ20ల సిరీస్ సందర్భంగా హర్మన్ ప్రెస్ కాన్ఫెరెన్స్లో పాల్గొంది. గురువారం నుంచి ముంబయి వేదికగా సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా హర్మన్ మాట్లాడుతూ.. ‘‘రమేశ్ పొవార్ పని విధానం మాకు నచ్చలేదనే రూమర్లు అవాస్తవం. అతడితో ఎలాంటి వివాదం లేదు. మేమెంతో చాలా సంతోషంగా వర్క్ చేశాం. ఎన్నో విషయాలను నేర్చుకొని టీమ్గా ఎదిగాం. ఇప్పుడు పొవార్ను ప్రధాన కోచ్ పదవి నుంచి తీసేసి ఎన్సీఏ (జాతీయ క్రికెట్ అకాడమీ)కి బీసీసీఐ పంపించింది. అక్కడ స్పిన్ కోచ్గా బాధ్యతలు నిర్వర్తిస్తారు. మేం వెళ్లినప్పుడు తప్పకుండా అందుబాటులో ఉంటారు. అలాగే కనిత్కర్ నిశ్శబ్దంగా ఉంటారు. శ్రీలంక పర్యటనకు వెళ్లినప్పుడు ఆయనతో పనిచేసిన అనుభవం మాకుంది. ఎలాంటి సందర్భంలోనైనా అందుబాటులో ఉండే వ్యక్తి. బీసీసీఐ తీసుకొనే ఎలాంటి నిర్ణయానికైనా కట్టుబడి ఉంటాం’’ అని హర్మన్ వెల్లడించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు