Avinash Sable: స్టీపుల్ఛేజ్.. భారతీయులూ గెలవగలరని నిరూపించాడతడు..!
‘‘లాంగ్ డిస్టెన్స్ రేసుల్లో ఆఫ్రికన్లు, కెన్యన్లు, ఇథోపియన్లే కాదు.. భారతీయులు కూడా పతకాలు సాధించగలరని నిరూపించి చూపించాను’’ అంటున్నాడు 27ఏళ్ల అవినాశ్ ముకుంద్ సాబలే. గత శనివారం జరిగిన పురుషుల 3000
ఇంటర్నెట్డెస్క్: ‘‘లాంగ్ డిస్టెన్స్ రేసుల్లో ఆఫ్రికన్లు, కెన్యన్లు, ఇథోపియన్లే కాదు.. భారతీయులు కూడా పతకాలు సాధించగలరని నిరూపించి చూపించాను’’ అంటున్నాడు 27ఏళ్ల అవినాశ్ ముకుంద్ సాబలే. గత శనివారం జరిగిన పురుషుల 3000 మీటర్ల స్టీపుల్ ఛేజ్లో అవినాష్ రజత పతకం సాధించాడు. కామన్వెల్త్ క్రీడల్లో లాంగ్ డిస్టెన్స్లో పతకం నెగ్గిన తొలి భారత పురుష అథ్లెట్గా సరికొత్త చరిత్ర లిఖించాడు. ఇంతకీ ఏంటీ స్టీపుల్ ఛేజ్ ప్రత్యేకత.. కెన్యన్లను వెనక్కి నెట్టి సాబలే ఎలా విజయం సాధించాడో చూద్దాం..
స్టీపుల్చేజ్ రేసు ఇలా..
అథ్లెటిక్స్లో ఓ విభాగమైన స్టీపుల్ఛేజ్ అడ్డంకులతో కూడుకున్న సుదీర్ఘ పరుగుపందెం. ఇందులో ఎక్కువగా నిర్వహించేది 3000 మీటర్ల స్టీపుల్ఛేజ్ ఈవెంటే. ఇందులో ట్రాక్పై పలు చోట్ల అడ్డంకులను ఏర్పాటు చేస్తారు. అవి దాటుకుంటూ అందరికంటే ముందు రేసును పూర్తిచేసిన వారు విజేతగా నిలుస్తారు. 3000 మీటర్ల స్టీపుల్ఛేజ్ ట్రాక్పై 28 బారియర్లు, ఏడు వాటర్ జంప్స్ ఉంటాయి. ఒక్కో బారియర్ 914 మిల్లీమీటర్ల ఎత్తులో ఉంటుంది. ఒక్కో ల్యాప్కు 400 మీటర్ల చొప్పున మొత్తం ఏడున్నర ల్యాప్లు ఉంటాయి. ప్రతీ ల్యాప్కు ఒక వాటర్ జంప్ ఉంటుంది. ఈ లాంగ్డిస్టెన్స్ రేసులో ఎక్కువగా ఆఫ్రికా దేశస్థులే పతకాలు సాధిస్తున్నారు. 2018లో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లోనూ కెన్యాకు చెందిన కిప్రుటో కేవలం 8 నిమిషాల 10.08 సెకన్లలోనే ఈ రేసును పూర్తిచేసి స్వర్ణం నెగ్గాడు. రెండో స్థానంలోనూ కెన్యా అథ్లెట్ అబ్రహం కిబివోట్ రజతం గెలుచుకున్నాడు.
సాబలే.. 0.05 సెకన్ల తేడాతో స్వర్ణం చేజారి..
శనివారం జరిగిన 3000 మీటర్ల స్టీపుల్ఛేజ్లో అవినాశ్ సాబలేపై ఏ మాత్రం అంచనాల్లేవ్. ఇటీవల జరిగిన ప్రపంచ ఛాంపియన్షిప్లోనూ అతడు నిరాశపర్చాడు. కానీ, గతవారం జరిగిన రేసులో సాబలే చెలరేగిపోయాడు. రేసు మొదలైన వెంటనే సాబలే అందరికంటే ముందే పరిగెత్తాడు. దాదాపు 2 నిమిషాల పాటు ఆధిపత్యం కొనసాగించి మొదటి అడ్డంకిని దాటేశాడు. అయితే ఆ తర్వాత కెన్యన్ అథ్లెట్లు ముగ్గురు ఒక్కొక్కరిగా సాబలేను దాటుకుంటూ వెళ్లిపోయారు. దీంతో అవినాశ్ నాలుగో స్థానంతో వెనుకబడ్డాడు. 2400 మీటర్ల వరకు కెన్యాకు చెందిన ముగ్గురు తొలి మూడు స్థానాల్లో పరిగెత్తారు. ఇక, అవినాశ్కు పతకం అసాధ్యమే అనుకున్నారంతా.
కానీ, అప్పుడే సాబలే అద్భుతం చేశాడు. వెనుకంజలో ఉన్నప్పటికీ పతకమే లక్ష్యంగా దూసుకెళ్లాడు. ఆరో ల్యాప్ దగ్గర నెమ్మదిగా తన వేగాన్ని పుంజుకున్నాడు. మూడో స్థానానికి.. ఆ వెంటనే రెండో స్థానంలోకి వచ్చాడు. చివర్లో ఒక దశలో అవినాశ్ తొలి స్థానంలోకి వచ్చినట్లే వచ్చి వెనక్కి వెళ్లాడు. చివరి హర్డిల్ సమయంలో ఒకింత కంగారు పడటంతో పాటు.. మొదటి స్థానంలో ఉన్న ప్రత్యర్థి అబ్రహం కిబివోట్ సడెన్గా తన దిశను మార్చుకోవడంతో గందరగోళానికి గురయ్యాడు. దీంతో రెండో స్థానంతో రేసును ముగించి రజత పతకం సాధించాడు. 8 నిమిషాల 11.20 సెకన్ల టైమింగ్తో తన జాతీయ రికార్డు (8.12.48 )ను మెరుపుపర్చుకుని పతకం నెగ్గాడు. అయితే 0.05 సెకన్ల తేడాతో అతడు పసిడి కోల్పోయాడు. అబ్రహం 8.11.15 నిమిషాల్లో స్వర్ణం గెలుచుకున్నాడు.
కామన్వెల్త్ క్రీడల్లో కెన్యా దేశస్థులు కాకుండా మరో దేశానికి చెందిన అథ్లెట్ ఈ లాంగ్ డిస్టెన్స్ రేసులో పతకం సాధించడం 1994 తర్వాత ఇదే తొలిసారి కావడం విశేషం. 2014లో గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్లో కెన్యన్లు పతకం సాధించిన సమయంలో అవినాశ్ కనీసం ఈ రేసులో అడుగైనా పెట్టలేదు. 2015 నుంచి ఈ పోటీల్లో పాల్గొనడం మొదలుపెట్టిన సాబలే.. తక్కువ సమయంలోనే దేశానికి పతకం అందించి సరికొత్త ఘనత సాధించాడు.
6కి.మీలు పరిగెత్తి స్కూల్కెళ్లి..
27 ఏళ్ల అవినాశ్ సాబలే స్వస్థలం మహారాష్ట్రలోని బీద్ జిల్లా. వీరిది పేద కుటుంబం. పొట్టకూటి కోసం సాబలే తల్లిదండ్రులు ఇటుకల బట్టీలో కూలీలుగా పనిచేసేవారు. చదువుకోవాలని ఉన్నప్పటికీ.. బస్సెక్కి వెళ్లేందుకు డబ్బుల్లేక రోజూ 6 కిలోమీటర్లు స్కూల్కు పరిగెత్తుకుంటూ వెళ్లేవాడు. కాలేజీకి కూడా 8 కిలోమీటర్లు పరిగెత్తుకుంటూ వెళ్లేవాడు. అతడి టాలెంట్ను గుర్తించిన ఓ టీచర్.. రన్నింగ్ పోటీల్లో పాల్గొనేలా ప్రోత్సహించారు. ఆ తర్వాత 18ఏళ్ల వయసులో భారత సైన్యంలో చేరిన అతడు.. టీనేజ్లోనే సియాచిన్లో విధులు నిర్వర్తించాడు. ఆర్మీలో ఉండగానే అనేక రన్నింగ్ ఛాంపియన్షిప్లలో పాల్గొని విజేతగా నిలిచాడు. ఆ తర్వాత స్టీపుల్ఛేజ్లో శిక్షణ తీసుకుని ఇప్పుడు దేశానికి తొలి పతకం తీసుకొచ్చాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
ఆసియా కప్లో భారత మహిళల జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సెమీస్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు చేరింది. -
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
ఐఐటీ ఖరగ్పూర్ నుంచి.. సుందర్ పిచాయ్కి గౌరవ డాక్టరేట్
-
పేర్లు ప్రదర్శించమని బలవంతం చేయలేం: సుప్రీం
-
ఆ రాష్ట్రాలను విభజించే కుట్ర - మమతా బెనర్జీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
‘మేం ఉండగా ఆమె పిల్లలు లేనివారు ఎలా అవుతారు?’: కమలాహారిస్కు సవతి కుమార్తె మద్దతు