SA vs IND: ఇండియా అంటే చాలు... చెలరేగిపోతారు
టీమ్ ఇండియాతో మ్యాచ్ అంటే కొంతమంది బ్యాటర్లు ఎన్నాళ్లుగానో కోల్పోయిన ఫామ్ను తిరిగి అందిపుచ్చుకుంటారు అంటుంటారు. ఫామ్లో ఉన్నవాళ్లయితే శతకాల మోత మోగిస్తుంటారు.
కొంతమంది క్రికెటర్లకు కొన్ని జట్లపై ఆడడం అంటే మహా ఇష్టం. ఒకప్పుడు సచిన్ తెందుల్కర్, వీవీఎస్ లక్ష్మణ్ ఆస్ట్రేలియాపై ఆడటాన్ని ఆస్వాదించేవాళ్లు. సహచరులంతా విఫలమైనా ఎన్నో మరుపురాని ఇన్నింగ్స్లు ఆడారు. దక్షిణాఫ్రికా బ్యాటర్ డీన్ ఎల్గర్ (Dean Elgar) కూడా ఇదే కోవకు చెందుతాడు. భారత్ (Team India) అంటే చాలు అతడు భలే ఆడేస్తాడు. గత దక్షిణాఫ్రికా పర్యటనలో టీమ్ఇండియా జోరును అడ్డుకున్న అతడు.. ఇప్పుడు కూడా సుదీర్ఘ ఇన్నింగ్స్తో అదరగొట్టి దక్షిణాఫ్రికా (South Africa Cricket) విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ సిరీస్ (India vs South Africa) తర్వాత రిటైర్ అయ్యే ఆలోచనలో ఉన్న ఎల్గర్.. తన చివరి సిరీస్ను చిరస్మణీయం చేసుకున్నాడు.
అప్పుడలా.. ఇప్పుడిలా
భారత్పై ఆడటమంటే ఎల్గర్ ఎంతగా ఇష్టపడతాడంటే అతడి టాప్-5 టెస్టు ఇన్నింగ్స్లను తీసుకుంటే వాటిలో మూడు టీమ్ఇండియాపైనే ఉన్నాయి. 2022లో కెప్టెన్ కూడా అయిన అతడు ముందుండి నడిపించాడు. తొలి మ్యాచ్లో భారత్ చేతిలో ఓడినా ఆ సిరీస్ను దక్షిణాఫ్రికా సమం చేయగలిగిందంటే అందుకు కారణం ఎల్గర్ అద్భుత బ్యాటింగే. రెండో టెస్టులో గెలవాలంటే 240 పరుగులు చేయాల్సి ఉండగా.. భారత బౌలర్ల జోరు మీదున్నా, ఎల్గర్ మాత్రం అలవోకగా ఆడేశాడు. చక్కటి ఫుట్వర్క్, డిఫెన్స్తో నాణ్యమైన భారత పేస్ బౌలర్లను అతడు దీటుగా ఎదుర్కొన్నాడు. 96 పరుగులతో అజేయంగా నిలిచి భారత్ విజయాన్ని అడ్డుకున్నాడు. ఏడాది తర్వాత మళ్లీ ఎల్గర్ భారత్కు అడ్డుగా నిలిచాడు. ప్రత్యర్థిని వీలైనంత తక్కువ స్కోరుకు కట్టడి చేద్దామనుకున్న టీమ్ఇండియా ఆశలపై నీళ్లు చల్లుతూ భారీ శతకంతో అదరగొట్టాడు. సొంతగడ్డపైనే కాదు భారత్లోనూ భారత్పై ఎల్గర్ ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు. 2019లో విశాఖపట్నంలో జరిగిన టెస్టులో అతడు 160 పరుగులు చేశాడు. స్పిన్కు దాసోహమంటున్న పిచ్పై అశ్విన్, జడేజాలను ఎదుర్కొంటూ ఆడిన ఈ ఇన్నింగ్స్ ఎల్గర్ సత్తాకు నిదర్శనం.
వాళ్లు కూడా..
ఎల్గర్ మాత్రమే కాదు భారత్ అంటే చెలరేగే ఆటగాళ్లు చరిత్రలో చాలామందే ఉన్నారు. అప్పటివరకు ఫామ్ లేక తంటాలు పడిన వాళ్లు కూడా టీమ్ఇండియాతో సిరీస్ అనగానే పూనకాలు వచ్చినట్లు ఆడిన సందర్భాలు ఉన్నాయి. శివ్ నారాయణ్ చందర్పాల్ (వెస్టిండీస్), రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా), ఆండీ ఫ్లవర్ (జింబాబ్వే), జాక్వెస్ కలిస్ (దక్షిణాఫ్రికా), సనత్ జయసూర్య (శ్రీలంక) అలాంటి వారే. వీరిలో కొందరు ఒకే ఫార్మాట్లో రాణిస్తే.. ఇంకొందరు అటు టెస్టు, ఇటు వన్డేల్లోనూ మెరిశారు. భారత్పై జయసూర్య 89 వన్డేల్లో 2899 పరుగులు సాధించాడు. ఇందులో 7 సెంచరీలు, 14 అర్ధసెంచరీలు ఉన్నాయి. టెస్టుల్లో ఒక ట్రిపుల్ సెంచరీ (340) కూడా కొట్టేశాడు.
ఇక వెస్టిండీస్ బ్యాటర్ చందర్పాల్ 63 సగటుతో 25 టెస్టుల్లో 2171 పరుగులు సాధించాడు. భారత్తో మ్యాచ్ అనగానే చందర్పాల్ వేరే మోడ్లోకి వెళ్లిపోయేవాడు. ఎన్నో మ్యాచ్ల్లో ఒంటిచేత్తో జట్టు కుప్పకూలకుండా రక్షించిన సందర్భాలు ఉన్నాయి. భారత్ విజయాలను అడ్డుకున్న సందర్భాలూ లేకపోలేదు. జింబాబ్వే మాజీ స్టార్ ఆండీ ఫ్లవర్ ఏడిపించినట్టు ఎవరూ ఏడిపించలేదు. భారత్ అనగానే ఫ్లవర్ పాతుకుపోయేవాడు. అతడు 9 టెస్టుల్లో 1138 పరుగులు చేశాడు. ఒక సిరీస్లో డబుల్ సెంచరీతో అదరగొట్టాడు. ఇక రికీ పాంటింగ్, జాక్వెస్ కలిస్, కుమార సంగక్కర భారత్పై ఆడటాన్ని ఎంతో ఆస్వాదించేవాళ్లు తాజాగా ఎల్గర్ ఆడినట్లుగానే కీలక సమయాల్లో అదరగొట్టేసి మ్యాచ్లను మలుపు తిప్పిన సందర్భాలు చాలానే ఉన్నాయి.
- ఈనాడు క్రీడా విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
-
మట్టిచరియల బీభత్సంతో పెను విషాదం.. ఇథియోపియాలో 257కి చేరిన మృతులు
-
ప్రపంచంలోని గొప్ప ప్రదేశాల్లో హైదరాబాద్ ‘మనం చాక్లెట్’!
-
మదనపల్లె ఘటనలో ఉద్యోగులపై వేటు తప్పదు: ఆర్పీ సిసోదియా
-
కమలాహారిస్కు ఒబామా దంపతుల మద్దతు
-
దిగొచ్చిన బంగారం ధర.. దుకాణాల్లో కొనుగోళ్ల జోష్..!