Mumbai Indians: ముంబయికి మాత్రమే ఈ రికార్డులు సాధ్యం.. ఓ లుక్కేస్తారా?
ముంబయి - ఐపీఎల్.. ఈ రెండూ భలే సింక్లో ఉంటాయి. అందుకే ఇప్పటివరకు ఐదుసార్లు ఈ ట్రోఫీ ఆ ఫ్రాంచైజీకే దక్కింది. ఈ క్రమంలో అనేక రికార్డులు కూడా నమోదయ్యాయి. (Mumbai Indianas - IPL)
ముంబయి ఇండియన్స్.. ఐపీఎల్లో ఓ జట్టు మాత్రమే కాదు, విన్నింగ్ మెషీన్ అని చెప్పొచ్చు. ప్రిమియర్ లీగ్లో ఆ జట్టు (Mumbai Indians) ప్రదర్శన అలా ఉంటుంది మరి. అయితే ఇటీవల కాస్త నెమ్మదించింది అనుకోండి. అయితే ఒకసారి కుదరుకుంటే ఈ జట్టును కప్ నుంచి దూరం చేయడం కష్టం అంటుంటారు. 16వ ఐపీఎల్ (IPL 2023) త్వరలో ప్రారంభమవుతున్న నేపథ్యంలో ముంబయికి మాత్రమే సాధ్యమైన కొన్ని రికార్డులు చూద్దాం!
- ఐపీఎల్లో ముంబయి ఇప్పటివరకు 186 మ్యాచ్లు ఆడగా.. అందులో 108 మ్యాచ్ల్లో గెలుపొందింది.
- ఐపీఎల్ చరిత్రలో 100 లీగ్ మ్యాచ్లు గెలిచిన ఏకైక జట్టు ముంబయి మాత్రమే.
- ప్రత్యర్థిని 146 పరుగుల తేడాతో ఓడించిన ఘనత ముంబయిది. దిల్లీపై ముంబయి 2017లో ఈ ఫీట్ నమోదు చేసింది.
- ముంబయి ఇప్పటివరకు ఐదు ట్రోఫీలు గెలుచుకుంది. 2013, 2015, 2017, 2019, 2020ల్లో ముంబయి టోర్నీ విన్నర్గా నిలిచింది.
- ఐపీఎల్లో ముంబయి బౌలర్ల దూకుడు మామూలుగా ఉండదు. అన్ని టీమ్ల కంటే మేటిగా 40 మెయిడిన్ ఓవర్లు వేశారు మరి.
- కొడితే ఫోర్, లేదంటే సిక్స్.. ఇదీ ముంబయి పల్టాన్ బ్యాటింగ్. ఇప్పటివరకు టోర్నీలో 1308 సిక్స్లు బాదగా, 2980 ఫోర్లు కొట్టారు. ఐపీఎల్ చరిత్రలో ఇదే అత్యధికం.
- ఐపీఎల్లో ఫాస్టెస్ట్ ఛేజింగ్ కూడా ముంబయిదే. 87 బంతులు మిగిలి ఉండగానే కోల్కతా మీద 2008లో గెలుపొందింది.
- ఇక చెన్నై చెపాక్ స్టేడియంలో గత పదేళ్లుగా ముంబయిని ఓడించిన జట్టే లేదు. ఆడిన ప్రతి మ్యాచ్లో విజయఢంకా మోగించింది ముంబయి.
- వందకు పైగా వికెట్లు పడగొట్టిన ముగ్గురు బౌలర్లు ముంబయి జట్టులో ఉన్నారు. లసిత్ మలింగ (122 వికెట్లు), హర్భజన్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా (120) ఆ ఘనత సాధించారు.
- ఒక ఇన్నింగ్స్లో బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ కూడా ముంబయి బౌలర్దే. అల్జారీ జోసెఫ్ 2019లో హైదరాబాద్ మీద 6/12తో అద్భుత ప్రదర్శన చేశాడు.
- ఇంటర్నెట్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విజయాన్ని లాగేసుకున్నారు
వారెవ్వా ఏం మ్యాచ్! ఉప్పల్లో ఎన్ని మలుపులో! రాజస్థాన్, హైదరాబాద్లతో గెలుపు దోబూచులాడగా కడ బంతి వరకూ రసవత్తరంగా సాగిన పోరు అభిమానులను ఉర్రూతలూగించింది. హోరాహోరీ పోరులో పట్టువదలని సన్రైజర్స్.. రాయల్స్ నుంచి విజయాన్ని లాగేసుకుంది. -
నితీశ్ నిలకడగా
విశాఖ కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి నిలకడగా రాణిస్తూ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో కీలక ఆటగాడిగా ఎదుగుతున్నాడు. నిరుడు కేవలం పేసర్గా రెండు మ్యాచ్లాడిన అతను.. ఈ సీజన్లో టాప్ఆర్డర్ బ్యాటర్గా సత్తాచాటుతున్నాడు. -
అందుకే నలుగురు స్పిన్నర్లు
టీ20 ప్రపంచకప్కు నలుగురు స్పిన్నర్లు కావాలనే విషయంలో జట్టు మేనేజ్మెంట్ చాలా స్పష్టతతో ఉందని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. టోర్నీ కోసం 15 మందిని ఖరారు చేయడంలో ఐపీఎల్ పాత్ర స్వల్పమని చెప్పాడు. -
భారత అమ్మాయిలదే సిరీస్
బంగ్లాదేశ్తో టీ20 సిరీస్లో భారత అమ్మాయిలు దూకుడు కొనసాగిస్తున్నారు. మరో రెండు మ్యాచ్లు మిగిలి ఉండగానే అయిదు టీ20ల సిరీస్ను 3-0తో కైవసం చేసుకున్నారు. -
భారత్కు షాక్
రెండేళ్ల కిందట.. ప్రపంచ పురుషుల టీమ్ ఛాంపియన్షిప్గా పరిగణించే థామస్ కప్లో భారత్ అద్భుత విజయం సాధించింది. మొట్టమొదటి సారి ఈ టైటిల్ను దక్కించుకుని చరిత్ర సృష్టించింది. -
సెమీస్లో నలుగురు భారత బాక్సర్లు
ఆసియా అండర్-22, యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో నలుగురు భారత బాక్సర్లు సెమీఫైనల్కు దూసుకెళ్లారు. గురువారం అండర్-22 విభాగంలో జాదుమణి (51 కేజీలు), నిఖిల్ (57 కేజీలు), -
మహిళల హాకీ కెప్టెన్గా సలీమా టెటె
గోల్కీపర్ సవిత పునియా స్థానంలో మిడ్ఫీల్డర్ సలీమా టెటె భారత మహిళల హాకీ కెప్టెన్గా నియమితురాలైంది. ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్ బెల్జియం, ఇంగ్లాండ్ అంచెలలో పోటీపడే 24 మంది సభ్యుల భారత జట్టుకు సలీమా నాయకత్వం వహించనుంది. -
పేద చిన్నారుల కోసం బోపన్న
భారత అగ్రశ్రేణి టెన్నిస్ ఆటగాడు రోహన్ బోపన్న ఓ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. వెనుకబడిన వర్గాలకు చెందిన పిల్లలకు శిక్షణ అందించేందుకు సిద్ధమయ్యాడు. -
పాక్ జట్టులో రవూఫ్
ఐర్లాండ్, ఇంగ్లాండ్లతో టీ20 సిరీస్లలో తలపడే పాకిస్థాన్ జట్టులో పేసర్ హారిస్ రవూఫ్ చోటు దక్కించుకున్నాడు. పాకిస్థాన్ సూపర్ లీగ్లో ఆరంభ మ్యాచ్ల్లో ఆడిన రవూఫ్ ఆ తర్వాత గాయంతో క్రికెట్కు దూరమయ్యాడు. -
వాళ్లకి క్రికెట్ పరిజ్ఞానం లేదేమో: ఏబీ
విరాట్ కోహ్లి స్ట్రైక్రేట్ గురించి.. అతడి ఆటతీరు గురించి మాట్లాడేవాళ్లకు క్రికెట్ పరిజ్ఞానం లేదని అనిపిస్తుందని దక్షిణాఫ్రికా మాజీ స్టార్ ఏబీ డివిలియర్స్ అన్నాడు. మిడిల్ ఓవర్లలో విరాట్ సరిగా రాణించలేకపోతున్నాడని..
తాజా వార్తలు (Latest News)
-
ఎండలిలా.. ప్రచారమెలా..!
-
బకాయిలు కట్టకపోతే కరెంట్ కట్!.. ఉద్యోగులకు ప్రభుత్వం హెచ్చరిక
-
రివ్యూ: శబరి.. వరలక్ష్మీ శరతకుమార్ నటించిన థ్రిల్లర్ ఎలా ఉంది?
-
ఐదేళ్లలో ఉద్యోగులపై 1500కుపైగా కేసులు
-
ఏడాది పొడవునా బీఈడీ ప్రవేశాలా?ఉన్నత విద్యామండలిపై వెల్లువెత్తుతున్న విమర్శలు
-
ఎట్టకేలకు శంషాబాద్ విమానాశ్రయంలో చిక్కిన చిరుత