Hockey India: ఇలాగే సాగితే.. హాకీలో మళ్లీ
హాకీ ఇండియా అద్భుతమైన ప్రదర్శనతో చెలరేగిపోతోంది. తాజాగా ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో అదరగొట్టి విజేతగా నిలిచింది. ఇలా నాలుగోసారి ఛాంపియన్గా మారిన హాకీ ఇండియా జట్టు భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలకు చేరాలని ఆశిద్దాం..
మన హాకీ (Hockey) మళ్లీ ఆశలు రేకెత్తిస్తోంది. భవిష్యత్ ‘స్వర్ణ’ మయం అవుతుందనే నమ్మకాన్ని కలిగిస్తోంది. ఇటీవల భారత హాకీ జట్ల నిలకడైన ప్రదర్శనే అందుకు కారణం. అంతర్జాతీయ వేదికపై మహిళలు, పురుషుల జట్లు అదరగొడుతున్నాయి. ముఖ్యంగా పురుషుల జట్టు సంచలన ప్రదర్శనతో సాగుతోంది. ఇటీవల ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ను నాలుగోసారి ముద్దాడింది. ఈ టోర్నీలో విజేతగా నిలవడం కంటే కూడా.. టైటిల్ దిశగా మన జట్టు ప్రదర్శన మరింత సంతృప్తినిచ్చేదే. ఆతిథ్య భారత్ సహా డిఫెండింగ్ ఛాంపియన్ దక్షిణ కొరియా, జపాన్, పాకిస్థాన్, మలేసియా, చైనా పోటీపడ్డ టోర్నీలో మన జట్టు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ను 4-0తో చిత్తు చేయడంతో పాటు లీగ్ దశను అజేయంగా ముగించింది. ఫైనల్లో ఓ దశలో 1-3తో వెనుకబడ్డప్పటికీ.. బలంగా పుంజుకుని, అద్భుతమైన పోరాట పటిమతో 4-3తో మలేసియాను మట్టికరిపించి.. అత్యధికంగా నాలుగు టైటిళ్లతో ఆసియాలో భారత్కు తిరుగులేదని మన ఆటగాళ్లు చాటారు.
మళ్లీ ఆ రోజులు చూస్తామా?
భారత హాకీ అంటే.. ఒకప్పటి స్వర్ణయుగం గుర్తుకువస్తుంది. ఒకటి కాదు రెండు కాదు ఒలింపిక్స్లో ఏకంగా 8 స్వర్ణాలు. ప్రపంచ హాకీని భారత్ ఏలిన కాలమది. 8 స్వర్ణాలతో పాటు ఓ రజతం, రెండు కాంస్యాలు అప్పుడు దక్కాయి. కానీ 1980 ఒలింపిక్స్లో స్వర్ణం తర్వాత మన హాకీ పతనం దిశగా సాగింది. ఆటలో ప్రమాణాలు పడిపోయి.. ప్రదర్శన దిగజారి.. ఒకానొక దశలో ఒలింపిక్స్కు అర్హత సాధించలేని స్థాయికి చేరింది. హాకీ పాలనలో రాజకీయాలు, ఆటగాళ్లకు ప్రోత్సాహం కొరవడడం దెబ్బతీసింది. మళ్లీ హాకీ కోలుకోవడం కష్టమేననిపించింది. కానీ టోక్యో ఒలింపిక్స్ (2021)లో కాంస్యంతో ఆశలు చిగురించాయి. ఈ పోటీల్లో అద్భుత ప్రదర్శనతో భారత పురుషుల జట్టు కంచు పతకం గెలిచి.. 41 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించింది. అమ్మాయిల జట్టు కూడా స్ఫూర్తిదాయక ప్రదర్శనతో నాలుగో స్థానంలో నిలిచింది. అక్కడి నుంచి హాకీలో ప్రదర్శన క్రమంగా మెరుగవుతోంది. మధ్యలో ఒకటి రెండు టోర్నీల్లో ప్రదర్శన మినహాయిస్తే మన జట్టు నిలకడగా రాణిస్తోంది. ఇదే జోరు కొనసాగిస్తే మళ్లీ పాత రోజులను చూసే అవకాశముంది.
సరైన దారిలోనే..
ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో విజేతగా నిలవడంతో భారత్ ప్రపంచ ర్యాంకింగ్స్లో మూడో స్థానానికి చేరుకుంది. సొంతగడ్డపై 2023 ప్రపంచకప్లో నిరాశపర్చినప్పటికీ.. పడిన తర్వాత బలంగా లేవడం అలవాటు చేసుకున్న జట్టు మళ్లీ లయ అందుకుంది. కోచ్ క్రెయిగ్ ఫుల్టన్ జట్టుకు దూకుడు నేర్పారు. కెప్టెన్ హర్మన్ప్రీత్ సింగ్ ప్రపంచంలోనే అత్యుత్తమ డ్రాగ్ఫ్లికర్లో ఒకరు. ఆకాశ్దీప్ సింగ్, మన్ప్రీత్ సింగ్, మన్దీప్ సింగ్, గుర్జంత్ సింగ్, జర్మన్ప్రీత్ సింగ్.. ఇలా ప్రతిభావంతులైన ఆటగాళ్లతో నిండి ఉన్న జట్టు మానసికంగానూ దృఢంగా ఉంది. అవకాశం కోసం వేచి చూడకుండా.. గోల్స్ అవకాశాలు సృష్టించుకుంటోంది. దేశంలో హాకీలో ప్రతిభకు కొదవలేదు. కానీ వీళ్లను సరైన దారిలో నడిపిస్తూ.. మార్గనిర్దేశనం చేసేవాళ్లు కావాలి. ఇప్పుడు హాకీ ఇండియా అధ్యక్షుడిగా మాజీ ఆటగాడు దిలీప్ టిర్కీ అదే పని చేస్తున్నారు. అండర్-17 జట్లను ఏర్పాటు చేసి యువతను ప్రోత్సహిస్తామని ఆయన ప్రకటించారు. మళ్లీ హాకీ ఇండియా లీగ్ను ప్రారంభిస్తామన్నారు. ఇక ఆట పరంగా చూసుకుంటే ముందుగా వచ్చే నెలలో చైనాలో ఆరంభమయ్యే ఆసియా క్రీడలు భారత్కు సవాలు విసరనున్నాయి. ఇందులో స్వర్ణం నెగ్గి వచ్చే ఏడాది జరిగే పారిస్ ఒలింపిక్స్కు నేరుగా అర్హత సాధించడమే ఇప్పుడు జట్టు లక్ష్యం. ఆ తర్వాత ఒలింపిక్స్లోనూ పతకం రంగు మారిస్తే అంతకుమించి ఆనందం ఇంకేముంటుంది!
- ఈనాడు క్రీడా విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శాంసన్ మెరిసినా.. మురిసింది దిల్లీనే
27 బంతుల్లో 60 పరుగులు చేయాలి. తక్కువేమీ కాదు. కానీ కెప్టెన్ సంజు శాంసన్ నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడుతుండడంతో రాజస్థాన్ రాయల్స్ రేసులోనే ఉంది. 222 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించినా.. అప్పుడు ఒత్తిడంతా దిల్లీపైనే. -
ఐపీఎల్.. మళ్లీ భారమేనా?
ఐపీఎల్, అంతర్జాతీయ క్రికెట్లో తీరిక లేకుండా మ్యాచ్లు ఆడడం.. ఆ వెంటనే టీ20 ప్రపంచకప్ వేటకు వెళ్లడం.. అలసటకు గురైన ఆటగాళ్లు అక్కడ అంతంతమాత్రంగా ఆడడం.. టీమ్ఇండియా పోరాటం మధ్యలోనే ముగిసిపోవడం.. గత కొన్ని పర్యాయాల నుంచి ఇదే వరస! -
నేడు ఫ్రాన్స్ చేరనున్న ఒలింపిక్ జ్యోతి
ఒలింపిక్ స్ఫూర్తికి ప్రతీకగా నిలిచే జ్యోతి రిలే.. ఆతిథ్య దేశం ఫ్రాన్స్లో అడుగుపెట్టనుంది. బుధవారం మార్సె దక్షిణ సముద్ర తీర ప్రాంతానికి చేరుకోనుంది. ఏప్రిల్ 16న గ్రీస్లోని ప్రాచీన ఒలింపియాలో మొదలైన ఈ రిలే.. సముద్ర మార్గం గుండా ఏథెన్స్ను దాటి మార్సెకి చేరువైంది. -
వారిద్దరి విషయంలో ద్రవిడ్కు ప్రణాళికలు ఉండాలి
భారత కెప్టెన్ రోహిత్శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి విషయంలో టీమ్ఇండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్కు స్పష్టమైన ప్రణాళికలు ఉండాలని దిగ్గజ క్రికెటర్ బ్రయాన్ లారా అభిప్రాయపడ్డాడు. -
భారత్కు ఏడు స్వర్ణాలు
ఆసియా అండర్-22, యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో భారత బాక్సర్లు మరో ఏడు పసిడి పతకాలు కైవసం చేసుకున్నారు. పోటీల చివరిరోజు ప్రీతి (54 కేజీలు), నిఖిల్ (57 కేజీలు), ఆకాశ్ గోర్కా (60 కేజీలు), పూనమ్ (57 కేజీలు), ప్రాచి (63 కేజీలు), ముస్కాన్ (75 కేజీలు), విశ్వనాథ్ (48 కేజీలు) ఫైనల్లో విజయాలు అందుకున్నారు. -
బంగ్లాదే సిరీస్
జింబాబ్వేతో అయిదు టీ20ల సిరీస్ను బంగ్లాదేశ్ మరో రెండు మ్యాచ్లు ఉండగానే సొంతం చేసుకుంది. మంగళవారం మూడో టీ20లో 9 పరుగుల తేడాతో జింబాబ్వేను ఓడించింది. -
కేకేఆర్ ఆటగాళ్ల ఇక్కట్లు
ప్రతికూల వాతావరణం కారణంగా కోల్కతా నైట్రైడర్స్ ఆటగాళ్లు తీవ్రంగా ఇబ్బందిపడ్డారు. లఖ్నవూ నుంచి కోల్కతా వెళ్లాల్సిన క్రికెటర్ల ప్రత్యేక విమానాన్ని పదే పదే మళ్లించడంతో వారు ఒక రాత్రి వారణాసిలో గడపాల్సి వచ్చింది. -
ఒత్తిడిలోనూ రోహిత్ మంచి నిర్ణయాలు
ఒత్తిడి సమయాల్లోనూ కెప్టెన్ రోహిత్ శర్మ మంచి నిర్ణయాలు తీసుకుంటాడని భారత మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ అన్నాడు. టీ20 ప్రపంచకప్లో భారత్కు రోహిత్ కీలకమవుతాడని తెలిపాడు. -
సమవుజ్జీల సమరం
11 మ్యాచ్లు.. 6 విజయాలు.. 5 ఓటములు.. 12 పాయింట్లు. ఇప్పటి వరకు ఐపీఎల్లో సన్రైజర్స్ హైదరాబాద్, లఖ్నవూ సూపర్ జెయింట్స్ జట్ల ప్రదర్శన ఇది. స్వల్ప నెట్ రన్రేటు తేడాతో పాయింట్ల పట్టికలో నాలుగు, అయిదు స్థానాల్లో ఉన్న సమవుజ్జీలు మరో పోరుకు సిద్ధమయ్యాయి.
తాజా వార్తలు (Latest News)
-
ఆడపిల్ల పుడితే రూ.2వేల డిపాజిట్.. ఎండ్రియల్లో యువ జంట వినూత్న నిర్ణయం
-
హలో.. మీ ఓటు ఎటు?.. సర్వే ఏజెన్సీల నుంచి ఫోన్లు
-
మాయావతి కీలక ప్రకటన.. వారసుడిగా మేనల్లుడు ఆకాశ్ ఆనంద్ తొలగింపు
-
‘జే బ్రాండ్’ మద్యం తాగి వృద్ధుడి మృతి
-
పెద్దపల్లి పోరు.. తండ్రీకొడుకులపై పోటీ
-
మాట తప్పిన జోగి.. మా సొమ్ములేవి?