Hockey India: ఇలాగే సాగితే.. హాకీలో మళ్లీ
హాకీ ఇండియా అద్భుతమైన ప్రదర్శనతో చెలరేగిపోతోంది. తాజాగా ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో అదరగొట్టి విజేతగా నిలిచింది. ఇలా నాలుగోసారి ఛాంపియన్గా మారిన హాకీ ఇండియా జట్టు భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలకు చేరాలని ఆశిద్దాం..
మన హాకీ (Hockey) మళ్లీ ఆశలు రేకెత్తిస్తోంది. భవిష్యత్ ‘స్వర్ణ’ మయం అవుతుందనే నమ్మకాన్ని కలిగిస్తోంది. ఇటీవల భారత హాకీ జట్ల నిలకడైన ప్రదర్శనే అందుకు కారణం. అంతర్జాతీయ వేదికపై మహిళలు, పురుషుల జట్లు అదరగొడుతున్నాయి. ముఖ్యంగా పురుషుల జట్టు సంచలన ప్రదర్శనతో సాగుతోంది. ఇటీవల ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ను నాలుగోసారి ముద్దాడింది. ఈ టోర్నీలో విజేతగా నిలవడం కంటే కూడా.. టైటిల్ దిశగా మన జట్టు ప్రదర్శన మరింత సంతృప్తినిచ్చేదే. ఆతిథ్య భారత్ సహా డిఫెండింగ్ ఛాంపియన్ దక్షిణ కొరియా, జపాన్, పాకిస్థాన్, మలేసియా, చైనా పోటీపడ్డ టోర్నీలో మన జట్టు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ను 4-0తో చిత్తు చేయడంతో పాటు లీగ్ దశను అజేయంగా ముగించింది. ఫైనల్లో ఓ దశలో 1-3తో వెనుకబడ్డప్పటికీ.. బలంగా పుంజుకుని, అద్భుతమైన పోరాట పటిమతో 4-3తో మలేసియాను మట్టికరిపించి.. అత్యధికంగా నాలుగు టైటిళ్లతో ఆసియాలో భారత్కు తిరుగులేదని మన ఆటగాళ్లు చాటారు.
మళ్లీ ఆ రోజులు చూస్తామా?
భారత హాకీ అంటే.. ఒకప్పటి స్వర్ణయుగం గుర్తుకువస్తుంది. ఒకటి కాదు రెండు కాదు ఒలింపిక్స్లో ఏకంగా 8 స్వర్ణాలు. ప్రపంచ హాకీని భారత్ ఏలిన కాలమది. 8 స్వర్ణాలతో పాటు ఓ రజతం, రెండు కాంస్యాలు అప్పుడు దక్కాయి. కానీ 1980 ఒలింపిక్స్లో స్వర్ణం తర్వాత మన హాకీ పతనం దిశగా సాగింది. ఆటలో ప్రమాణాలు పడిపోయి.. ప్రదర్శన దిగజారి.. ఒకానొక దశలో ఒలింపిక్స్కు అర్హత సాధించలేని స్థాయికి చేరింది. హాకీ పాలనలో రాజకీయాలు, ఆటగాళ్లకు ప్రోత్సాహం కొరవడడం దెబ్బతీసింది. మళ్లీ హాకీ కోలుకోవడం కష్టమేననిపించింది. కానీ టోక్యో ఒలింపిక్స్ (2021)లో కాంస్యంతో ఆశలు చిగురించాయి. ఈ పోటీల్లో అద్భుత ప్రదర్శనతో భారత పురుషుల జట్టు కంచు పతకం గెలిచి.. 41 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించింది. అమ్మాయిల జట్టు కూడా స్ఫూర్తిదాయక ప్రదర్శనతో నాలుగో స్థానంలో నిలిచింది. అక్కడి నుంచి హాకీలో ప్రదర్శన క్రమంగా మెరుగవుతోంది. మధ్యలో ఒకటి రెండు టోర్నీల్లో ప్రదర్శన మినహాయిస్తే మన జట్టు నిలకడగా రాణిస్తోంది. ఇదే జోరు కొనసాగిస్తే మళ్లీ పాత రోజులను చూసే అవకాశముంది.
సరైన దారిలోనే..
ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో విజేతగా నిలవడంతో భారత్ ప్రపంచ ర్యాంకింగ్స్లో మూడో స్థానానికి చేరుకుంది. సొంతగడ్డపై 2023 ప్రపంచకప్లో నిరాశపర్చినప్పటికీ.. పడిన తర్వాత బలంగా లేవడం అలవాటు చేసుకున్న జట్టు మళ్లీ లయ అందుకుంది. కోచ్ క్రెయిగ్ ఫుల్టన్ జట్టుకు దూకుడు నేర్పారు. కెప్టెన్ హర్మన్ప్రీత్ సింగ్ ప్రపంచంలోనే అత్యుత్తమ డ్రాగ్ఫ్లికర్లో ఒకరు. ఆకాశ్దీప్ సింగ్, మన్ప్రీత్ సింగ్, మన్దీప్ సింగ్, గుర్జంత్ సింగ్, జర్మన్ప్రీత్ సింగ్.. ఇలా ప్రతిభావంతులైన ఆటగాళ్లతో నిండి ఉన్న జట్టు మానసికంగానూ దృఢంగా ఉంది. అవకాశం కోసం వేచి చూడకుండా.. గోల్స్ అవకాశాలు సృష్టించుకుంటోంది. దేశంలో హాకీలో ప్రతిభకు కొదవలేదు. కానీ వీళ్లను సరైన దారిలో నడిపిస్తూ.. మార్గనిర్దేశనం చేసేవాళ్లు కావాలి. ఇప్పుడు హాకీ ఇండియా అధ్యక్షుడిగా మాజీ ఆటగాడు దిలీప్ టిర్కీ అదే పని చేస్తున్నారు. అండర్-17 జట్లను ఏర్పాటు చేసి యువతను ప్రోత్సహిస్తామని ఆయన ప్రకటించారు. మళ్లీ హాకీ ఇండియా లీగ్ను ప్రారంభిస్తామన్నారు. ఇక ఆట పరంగా చూసుకుంటే ముందుగా వచ్చే నెలలో చైనాలో ఆరంభమయ్యే ఆసియా క్రీడలు భారత్కు సవాలు విసరనున్నాయి. ఇందులో స్వర్ణం నెగ్గి వచ్చే ఏడాది జరిగే పారిస్ ఒలింపిక్స్కు నేరుగా అర్హత సాధించడమే ఇప్పుడు జట్టు లక్ష్యం. ఆ తర్వాత ఒలింపిక్స్లోనూ పతకం రంగు మారిస్తే అంతకుమించి ఆనందం ఇంకేముంటుంది!
- ఈనాడు క్రీడా విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
ఆసియా కప్లో భారత మహిళల జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సెమీస్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు చేరింది. -
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
విడుదలై బయటకు..తిరిగి జైలుకు
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
-
కమీషన్ల కోసమే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిలిపేశారు: ఉత్తమ్
-
ఫ్రెండ్తో వివాహం.. కీర్తి సురేశ్ ఏమన్నారంటే..?
-
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటాం: అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన
-
భారీ లాభాల్లో సూచీలు.. మదుపర్ల సంపద ₹7 లక్షల కోట్లు జంప్