Hockey: వందన 300 నాటౌట్.. కష్టాలను దాటుకొని స్టార్గా ఎదిగి
క్రికెట్ అయినా ఏ ఆట అయినా 300 మ్యాచ్లు ఆడటమంటే మామూలు విషయం కాదు! అదే అంతర్జాతీయ మ్యాచ్లు అంటే మరింత గొప్ప విషయం. అలాంటిది హాకీలో 300 మ్యాచ్లు ఆడడం.. అందులోనూ మహిళల హాకీలో కావడం నిజంగా చిత్రమే. ఈ ఘనతను సాధించిన అమ్మాయి భారత ప్లేయర్ కావడమే ఇక్కడ విశేషం. ఆమే వందన కటారియా (Vandana Katariya).
క్రికెట్ అయినా ఏ ఆట అయినా 300 మ్యాచ్లు ఆడటమంటే మామూలు విషయం కాదు! అదే అంతర్జాతీయ మ్యాచ్లు అంటే మరింత గొప్ప విషయం. అలాంటిది హాకీలో 300 మ్యాచ్లు ఆడడం.. అందులోనూ మహిళల హాకీలో కావడం నిజంగా చిత్రమే. ఈ ఘనతను సాధించిన అమ్మాయి భారత ప్లేయర్ కావడమే ఇక్కడ విశేషం. ఆమే వందన కటారియా (Vandana Katariya). ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో జపాన్తో మ్యాచ్ ఆడడం ద్వారా వందన భారత్ తరఫున అత్యధిక మ్యాచ్ల రికార్డు సృష్టించింది.
అలా వచ్చి స్టార్గా మారి
ఉత్తర్ప్రదేశ్లోని రోహన్బాద్కు చెందిన వందన హాకీ స్టిక్ పట్టే సమయానికి ప్రస్తుత జట్టులో చాలామంది పుట్టనే లేదు. ఆమె ఒక స్టార్గా ఎదిగే సమయానికి జట్టులో కొందరు హాకీ ఆటలోకే రాలేదు. భారత్లో మహిళల హాకీ పరాజయాల బాటలో ఉన్నప్పుడు జట్టులోకొచ్చి స్థిరంగా రాణిస్తూ యువ క్రీడాకారిణులకు స్ఫూర్తిగా నిలిచింది వందన. 2011లో భారత సీనియర్ జట్టులోకి వచ్చిన వందన.. స్థిరంగా రాణిస్తూ స్థానాన్ని సుస్థిరం చేసుకుంది.
పేద కుటుంబంలో పుట్టిన వందన చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడింది. అయితే హాకీ ఆమెను ఆకర్షించింది. తండ్రి నహర్ సింగ్ ఆమెకు ఎంతో మద్దతుగా నిలిచాడు. రెజ్లర్ అయిన అతడు కుమార్తెను క్రీడాకారిణిని చేయాలనుకున్నాడు. డబ్బులు లేకపోయినా అప్పులు తెచ్చి మరీ హాకీ క్రీడాకారిణిగా ఎదిగేందుకు కృషి చేశాడు. కానీ ఆమెకు సరైన క్రీడా పరికరాలు అందుబాటులో ఉండేవి కావు. కోచ్ ప్రదీప్ చినోయిటీ అండగా నిలవడంతో హాకీలో వందన ఎదిగింది. జాతీయ జట్టులో చోటు దక్కించుకుంది.
2005లో జూనియర్ భారత జట్టుకు ఎంపికైన వందన.. ఆరంభంలోనే తన ముద్ర వేసింది. స్థిరంగా రాణించడంతో 2011లో సీనియర్ జట్టులోకి వచ్చింది. సీనియర్ జట్టులో కొనసాగుతూనే 2013లో జర్మనీలో జరిగిన జూనియర్ ప్రపంచకప్లో ఆడిన వందన.. భారత్ చరిత్రాత్మక కాంస్యం గెలవడంలో కీలకపాత్ర పోషించింది. ఈ టోర్నీలో అయిదు గోల్స్తో భారత్ తరఫున టాప్ స్కోరర్గా నిలిచింది. వేగం, నైపుణ్యం, సామర్థ్యం కలబోసి అదరగొట్టిన వందన ప్రధాన క్రీడాకారిణిగా ఎదిగింది. 2016లో సీనియర్ విభాగంలో ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టుకు కెప్టెన్గా వ్యవహరించి కప్ సాధించిపెట్టింది.
వందన అంటే భరోసా
జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకునే స్ట్రెకర్గా పేరు తెచ్చుకున్న వందన.. ఎన్నో మ్యాచ్ల్లో భారత్ను గెలిపించింది. ఏ కెప్టెన్ అయినా అవసరమైన సమయంలో తనవైపు చూసే భరోసాను కల్పించింది. సుదీర్ఘ కెరీర్లో వరుస ఓటములతో భారత్ కుంగిపోయిన దశను చూసింది.. ఒక్కో ర్యాంకూ మెరుగుపడుతూ ముందుకెళుతున్న దశనూ చూస్తోంది. అయితే టోక్యో ఒలింపిక్స్కు ముందు ఆమె జీవితంలో పెద్ద షాక్ తగిలింది. తన కెరీర్కు అన్నీ తానై నిలిచిన తండ్రి సహర్ సింగ్ కన్నుమూశాడు. కానీ దేశానికి ఆడాలన్న తండ్రి ఆశను తీర్చడానికి ఒలింపిక్స్ బరిలో నిలిచిన వందన భారత్ జట్టు చరిత్రాత్మక ప్రదర్శనలో కీలకపాత్ర పోషించింది. భారత్ నాలుగో స్థానంలో నిలవడం వందనను ఎంతో సంతోషంలో నిలిపింది. తాజాగా ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో జపాన్పై కెరీర్లో 300వ మ్యాచ్ ఆడి అరుదైన మైలురాయి దాటింది. ఇప్పటిదాకా 153 అంతర్జాతీయ గోల్స్ చేసిన వందనకు వచ్చే ఒలింపిక్స్లో భారత్ పతకం గెలవాలన్నది కల.
- ఈనాడు క్రీడా విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓటీటీ డీల్.. భారీ ధరకు ‘డబుల్ ఇస్మార్ట్’ రైట్స్
-
ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు.. చిక్కుకుపోయిన 50 మంది యాత్రికులు
-
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
-
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
-
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
-
మట్టిచరియల బీభత్సంతో పెను విషాదం.. ఇథియోపియాలో 257కి చేరిన మృతులు