Ravindra Jadeja: అమ్మో.. అతణ్ని ఆడలేం.. డాట్ బాల్స్, వికెట్లతో రెచ్చిపోతున్న జడేజా
వన్డే ప్రపంచకప్లో జడ్డూ ఊపు మామూలుగా లేదు. డాట్ బాల్స్తో ప్రతర్థి జట్టు ఆటగాళ్లను ఉక్కిరిబిక్కిరి చేస్తూ నిలకడగా వికెట్లు తీస్తున్నాడు. మరోవైపు లోయర్ మిడిలార్డర్లో హార్దిక్ లేని లోటు తెలియకుండా కీలక పాత్ర పోషిస్తున్నాడు.
వన్డే ప్రపంచకప్ (ODI World Cup 2023)లో భారత బౌలర్లు ఎంత గొప్ప ప్రదర్శన చేస్తున్నారో తెలిసిందే. బ్యాటింగ్లో భారత్ ఎప్పుడూ బలమైన జట్టే కానీ.. బౌలింగ్లో మన జట్టుది కొంచెం వెనుకంజే. కానీ ఈ ప్రపంచకప్లో మాత్రం మన బౌలర్లు మామూలుగా రెచ్చిపోవట్లేదు. దూకుడుగా ఆడుతూ అలవోకగా 350 ప్లస్ స్కోర్లు చేస్తున్న దక్షిణాఫ్రికా సైతం భారత్ ముందు నిలవలేకపోయింది. కేవలం 83 పరుగులకే కుప్పకూలి ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. స్పిన్నర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) అయిదు వికెట్ల ప్రదర్శనతో ఆ జట్టు పతనాన్ని శాసించాడు. ఈ మ్యాచ్ అనే కాదు.. టోర్నీలో జడ్డూ ఊపు మామూలుగా లేదు. డాట్ బాల్స్తో ఉక్కిరిబిక్కిరి చేస్తూ నిలకడగా వికెట్లు తీస్తూ ప్రత్యర్థులకు చెక్ పెడుతున్నాడతను.
8 మ్యాచ్లు.. 14 వికెట్లు.. 17.35 సగటు.. 3.76 ఎకానమీ.. ఈ గణాంకాలు చూస్తేనే జడేజా ఈ ప్రపంచకప్లో ఎంత గొప్ప ప్రదర్శన చేస్తున్నాడో అర్థమవుతుంది. టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో అతడిది ఏడో స్థానం. అగ్రస్థానంలో ఉన్న ఆడమ్ జంపాకు అతడికి అంతరం నాలుగు వికెట్లే. అయితే తనకంటే ముందున్న ఆరుగురు బౌలర్లలో అయిదుగురి కంటే ఉత్తమ ఎకానమీ నమోదు చేశాడు జడ్డూ. టోర్నీలో ఒక్క బుమ్రా (3.65) మాత్రమే జడ్డూ కన్నా పొదుపుగా బౌలింగ్ చేశాడు. ఈ ప్రపంచకప్లో 4 లోపు ఎకానమీతో సాగుతున్న బౌలర్లు ఈ ఇద్దరు మాత్రమే. బ్యాటర్ల ఆధిపత్యం సాగే పరిమిత ఓవర్ల క్రికెట్లో ఎనిమిది మ్యాచ్లు ఆడి 3.76 ఎకానమీ నమోదు చేయడం అంటే చిన్న విషయం కాదు.
డాట్బల్స్తో బిగిస్తున్నాడు
భారత్తో ఆడే ప్రతి జట్టూ మధ్య ఓవర్లలో స్పిన్నర్ల ధాటికి ఉక్కిరి బిక్కిరి అయిపోతోంది. ముఖ్యంగా జడేజాను ఎదుర్కొని పరుగులు చేయడం ప్రత్యర్థి బ్యాటర్లకు శక్తికి మించిన పనే అవుతోంది. అతడి బౌలింగ్లో డిఫెన్స్ ఆడటానికే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు. స్పిన్నర్ అయినప్పటికీ జడేజా బంతుల్లో వేగం ఎక్కువ. షాట్ ఆడాలని చూసి కొంచెం గతి తప్పినా ఎల్బీ అయిపోతారు. అందుకే జాగ్రత్తగా ఆడుకుని ఓవర్ ముగించడానికి చూస్తున్నారు. దీంతో జడేజా ఓవర్లలో డాట్ బాల్స్ బాగా ఎక్కువగా ఉంటున్నాయి. 8 మ్యాచ్ల్లో జడేజా మొత్తంగా 387 బంతులు వేస్తే.. అందులో పరుగే రాని బంతులు 242 కావడం విశేషం. అంటే అతడి బంతుల్లో దాదాపుగా మూడింట రెండొంతులు డాట్ బాల్సే అన్నమాట. దీన్ని బట్టే అతడి బౌలింగ్ ఆడటానికి ప్రత్యర్థి బ్యాటర్లు ఎంత కష్టపడుతున్నారో.. అతను ఎంతగా ఒత్తిడి పెంచుతున్నాడో అర్థం చేసుకోవచ్చు. ఆస్ట్రేలియాతో తొలి మ్యాచ్లోనే 10 ఓవర్లలో 28 పరుగులే ఇచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టాడు. ఆ మ్యాచ్లో అతను 38 డాట్ బాల్స్ వేయడం విశేషం. పాకిస్థాన్, బంగ్లాదేశ్ల పైనా పొదుపుగా బౌలింగ్ చేసి రెండేసి వికెట్లు పడగొట్టిన జడ్డూ.. తాజాగా దక్షిణాఫ్రికాను ఈడెన్ గార్డెన్స్లో ఒక ఆట ఆడుకున్నాడు. అయిదు వికెట్లతో ఆ జట్టు నడ్డి విరిచాడు.
బ్యాటింగ్లోనూ..
ప్రపంచకప్లో హార్దిక్ పాండ్యను టీమ్ఇండియాకు ఎంతో కీలకమైన ఆటగాడిగా విశ్లేషకులు అంచనా వేశారు. టోర్నీ ఆరంభ దశలో హార్దిక్ అందుకు తగ్గట్లే చక్కగా రాణించాడు. బ్యాటింగ్లో అతడికి పెద్దగా అవకాశాలు రాలేదు కానీ.. బౌలింగ్లో నిలకడగా రాణించాడు. అయితే బంగ్లాదేశ్తో మ్యాచ్లో గాయపడి అర్ధంతరంగా అతను జట్టుకు దూరం కాగా.. ఆ లోటు కనబడనివ్వకుండా చూడటంలో జడేజాది కీలక పాత్ర. బౌలింగ్లో నిలకడగా రాణిస్తూనే.. లోయర్ మిడిలార్డర్లో బ్యాటింగ్లోనూ సత్తా చాటుతున్నాడు. స్లాగ్ ఓవర్లలో హార్దిక్ పాత్రను అతను విజయవంతంగా భర్తీ చేస్తున్నాడు. న్యూజిలాండ్తో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో 39 పరుగుల అజేయ ఇన్నింగ్స్తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత లంకపై 35 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. తాజాగా దక్షిణాఫ్రికాతో మ్యాచ్లోనూ 15 బంతుల్లోనే 29 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఆఖర్లో షాట్లు ఆడలేక కోహ్లి కూడా ఇబ్బంది పడుతుంటే.. తనే స్ట్రైక్ తీసుకుని మెరుపు షాట్లు ఆడాడు. ఫినిషర్ పాత్రలో జడేజా రాణిస్తుండటంతో మిడిలార్డర్లో హార్దిక్ లేని లోటు కనిపించడం లేదు.
-ఈనాడు క్రీడా విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
జూమ్ కాల్లో 1.64 లక్షల మంది.. ₹16 కోట్ల విరాళాలు : కమలా హారిస్ సరికొత్త రికార్డ్
-
రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓటీటీ డీల్.. భారీ ధరకు ‘డబుల్ ఇస్మార్ట్’ రైట్స్
-
ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు.. చిక్కుకుపోయిన 50 మంది యాత్రికులు
-
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
-
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
-
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?