Rohit Sharma: రోహిత్ కెప్టెన్సీని అలా ఎలా వదులుకుంది MI?
ఐపీఎల్లో (IPL) సంచలన నిర్ణయంతో ముంబయి ఇండియన్స్ (Mumbai Indians) సర్వత్రా విమర్శలు ఎదుర్కొంటోంది. రోహిత్ శర్మను (Rohit Sharma) కెప్టెన్సీ నుంచి తప్పించి హార్దిక్ పాండ్యకు అప్పగించింది.
టీ20 ఫార్మాట్కు కావాల్సింది దూకుడైన ఆట. ఆ కోణంలో చూస్తే రోహిత్శర్మ బాదుడుకు సాటి ఏముంది? బౌలర్లపై కనికరం లేకుండా విరుచుకుపడే రోహిత్కు క్రికెట్ ప్రపంచం ‘హిట్మ్యాన్’ అని పేరు పెట్టేసింది. ప్రపంచ క్రికెట్లో అత్యధిక సిక్సర్లు బాదిన రోహిత్శర్మ (Rohit Sharma) రికార్డును ఇప్పట్లో ఎవరూ దాటలేరు. వ్యక్తిగత రికార్డులను ఖాతరు చేయడు. 99 పరుగుల దగ్గర కూడా లాఫ్టెడ్ షాట్స్ (గాల్లోకి లేపి మరీ) ఆడే తెగింపు తనది. డజన్ల సెంచరీలు, హాఫ్ సెంచరీలు మిస్ అయినా జట్టుకు వేగంగా పరుగులు అందించి.. తర్వాత వచ్చే బ్యాటర్లపై ఒత్తిడి తగ్గించడమే అతడి ధ్యేయం. తన సమర్థ నాయకత్వంతో ఐపీఎల్లో (IPL) ముంబయి ఇండియన్స్ను (Mumbai Indians) ఐదుసార్లు ఛాంపియన్గా నిలిపాడు. ముంబై ఇండియన్స్ (MI) అత్యధిక బ్రాండ్ ఇమేజ్ ఉన్న జట్టుగా నిలిపాడు.
రోహిత్ బ్రాండ్ ఇమేజ్
ఇండియన్ క్రికెట్ టీమ్ కెప్టెన్ ఒక ఐపీఎల్ టీమ్కు కెప్టెన్గా ఉన్నాడంటే కచ్చితంగా అది ఆ జట్టు బ్రాండ్ ఇమేజ్ ఎంతో పెంచుతుంది. మూడున్నరేళ్ల క్రితం రిటైర్ అయిన ధోని (MS DHoni) ఇంకా ఐపీఎల్లో చెన్నై కెప్టెన్గా (CSK) కొనసాగుతున్నాడు. అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన చాలామంది ప్లేయర్లు ఐపీఎల్ ఆడారు, ఆడుతున్నారు. ఇంకా ప్రపంచ క్రికెట్లో ఆడుతున్న రోహిత్ను (Rohit Sharma) ముంబై కెప్టెన్సీ నుంచి తప్పించి ఓ సాధారణ ఆటగాడిగా పరిగణించటం క్రికెట్ అభిమానులకు షాకింగ్ నిర్ణయం. మరో రెండు సీజన్లు రోహిత్ను కెప్టెన్గా ఆడిస్తే బాగుండేదని చాలా మంది భావన. ఈలోపు జట్టులో సీనియర్లు బుమ్రా, సూర్యకుమార్ను వారసులుగా తీర్చిదిద్దే అవకాశం కూడా ముంబయి జట్టుకు ఉంది. అవేం పరిశీలించకుండా హార్దిక్ పాండ్యాను గుజరాత్ జట్టు నుంచి తీసుకు వచ్చేసి.. ముంబయి జట్టులో చేర్చడం సరైంది కాదనే మెజార్టీ అభిప్రాయం. ఇప్పటిదాకా జట్టులో ఆటగాళ్లకు అండగా ఉండి, ముంబయి ఇండియన్స్లో కుటుంబ వాతావరణాన్ని తీసుకొని వచ్చిన వ్యక్తిని ఇలా తప్పించడం జట్టు సభ్యులకు కూడా రుచించలేదనే వార్తలూ వస్తున్నాయి.
ముంబయి ఆటగాళ్ల మౌనం వెనుక?
హార్దిక్ పాండ్యాకు (Hardik Pandya) కెప్టెన్సీ బాధ్యతలపై జట్టులోని సభ్యులు పెద్దగా స్పందించలేదు. సూర్యకుమార్ మాత్రం రోహిత్ను తప్పించడంపై ‘హృదయం ముక్కలైంది’ అనే అర్థం వచ్చేలా ట్వీట్ చేశాడు. కానీ, ఏ సందర్భాన్ని అనేది వెల్లడించకుండా పోస్టు చేయడంతో అభిమానులు పలురకాలుగా భావిస్తున్నారు. తాజా వన్డే ఇంటర్నేషనల్ వరల్డ్కప్లో ఆటగాడిగా, కెప్టెన్గా రోహిత్ దేశాన్ని ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ముంబయి ఇండియన్స్ (Mumbai Indians) తాజా నిర్ణయం కారణంగా ఆ జట్టు సోషల్ మీడియా ఖాతాల నుంచే కాకుండా.. ఫ్రాంచైజీకి లక్షలమంది అభిమానులు గుడ్బై చెబుతున్నారు. ఒకప్పుడు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మధ్య వ్యక్తిగత విభేదాలు ఉన్నాయనే ప్రచారం అందరికీ తెలిసిందే.టీమ్ ఇండియా కెప్టెన్గా కోహ్లీ వైదొలగగానే బలవంతంగా రోహిత్కు ఆ బాధ్యతలు అప్పగించారు. బీసీసీఐ మాజీ అధ్యక్షుడు గంగూలీ ఈ విషయాన్ని ఇటీవలే వెల్లడించాడు. రోహిత్ గురించి విరాట్ కోహ్లీ ఓ సందర్భంలో చేసిన వ్యాఖ్యలు ‘హిట్మ్యాన్’ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో గుర్తు చేస్తున్నారు.
ఇంతకీ కోహ్లీ ఏమన్నాడంటే...
‘‘టీ20 వరల్డ్కప్ జట్టులోకి రోహిత్శర్మ (Rohit Sharma) అనే యంగ్ ప్లేయర్ వస్తున్నాడు, అతను అంత గొప్ప, ఇంత గొప్ప అన్నట్టుగా అందరూ మాట్లాడుకుంటున్నారు. అరే! మనం కూడా యంగ్ ప్లేయరే కదా? ఎందుకు నా గురించి మాట్లాడుకోవట్లేదు అనుకున్నాను. కానీ టీ20 మ్యాచ్లో రోహిత్ బాదుడు చూస్తే మాటలు రాలేదు నాకు. ఆ తర్వాత ఇంకెప్పుడు రోహిత్శర్మ గురించి మరోలా ఆలోచించలేదు’’ ఈ మాటలు చెప్పింది స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli). ప్రత్యక్షంగా దగ్గరుండి అతడి ఆటను చూసిన సహచరుడి నుంచే ఇలాంటి వ్యాఖ్యలు రావడం రోహిత్ సత్తాకు నిదర్శనం. టీ20 జట్టులోకి రోహిత్ అరంగేట్రం సమయంలో జ్ఞాపకాలను కోహ్లీ ఒక ఇంటర్వ్యూలో చెప్పిన విషయం తెలిసిందే. అందులో అతిశయోక్తి లేదని తాజా వరల్డ్ కప్లోనూ నిరూపితమైంది. ఇలాంటి రోహిత్ శర్మను సడెన్గా కెప్టెన్సీ నుంచి తప్పించడం మాత్రం సరైంది కాదనేది అభిమానులతోపాటు మాజీల అభిప్రాయం.
- ఈటీవీ క్రీడా విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
-
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
-
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
-
మట్టిచరియల బీభత్సంతో పెను విషాదం.. ఇథియోపియాలో 257కి చేరిన మృతులు
-
ప్రపంచంలోని గొప్ప ప్రదేశాల్లో హైదరాబాద్ ‘మనం చాక్లెట్’!
-
మదనపల్లె ఘటనలో ఉద్యోగులపై వేటు తప్పదు: ఆర్పీ సిసోదియా