IND vs AUS: 2 - 0, 3 - 0, 3 - 1, 4 - 0... భారత్ ఎలా గెలిస్తే ఏమవుతుంది..?
భారత్ - ఆస్ట్రేలియా (Ind vs Aus) టెస్టు సిరీస్ను ప్రపంచమంతా ఆసక్తిగా చూస్తోంది. ఇప్పటికే 2-0 ఆధిక్యంలో నిలిచిన టీమ్ఇండియా (Team India).. ఈ సిరీస్ను గెలిస్తే రెండు ఘనతలను సొంతం చేసుకొనేందుకు వీలుంది.
ఇంటర్నెట్ డెస్క్: ఆస్ట్రేలియాతో (IND vs AUS) నాలుగు టెస్టుల సిరీస్.. రెండు మెట్లు ఎక్కేందుకు భారత్కు (team india) సువర్ణవకాశం. అందులో ఒకటి ఐసీసీ ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలోకి దూసుకెళ్లేందుకు ఛాన్స్.. మరొకటి ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్కు వెళ్లేందుకు మార్గం. ఇప్పటికే 2-0 ఆధిక్యంలో కొనసాగుతున్న భారత్.. మిగతా రెండు టెస్టుల్లో ఎలాంటి ప్రదర్శన ఇస్తే రెండు ఘనతలు ఖాతాలో పడతాయో తెలుసుకొందాం..
మిగతా రెండింట్లో..
బోర్డర్ - గావస్కర్ టెస్టు సిరీస్కు ముందు ఆసీస్ ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ రేసులో ఆస్ట్రేలియా 75.56 శాతంతో అగ్రస్థానంలో ఉంది. ఇప్పుడు వరుసగా రెండు టెస్టులను ఓడిపోవడం వల్ల 66.67 శాతానికి పడిపోయింది. ఇప్పుడు భారత్ విజయాల శాతం 64.06 శాతానికి చేరింది. దీంతో టెస్టు సిరీస్ను కోల్పోవడం మాత్రం జరగదు. మిగతా రెండు మ్యాచ్లను డ్రా చేసినా చాలు భారత్ ఫైనల్కు చేరుతుంది. ఆసీస్పై రోహిత్ శర్మ నాయకత్వంలోని భారత్ కనీసం 3-1 ఆధిక్యంతో సిరీస్ను సొంతం చేసుకొంటే ఇతర జట్ల మ్యాచ్ ఫలితాలపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా ఫైనల్కు చేరుకున్నట్టే. ప్రస్తుతం 66.67 శాతంతో ఉన్న ఆసీస్ సిరీస్ కోల్పోయినప్పటికీ కనీసం ఒక్క టెస్టు గెలిచినా.. భారత్తోపాటు డబ్ల్యూటీసీ ఫైనల్లో అడుగు పెడుతుంది.
ఎలా గెలిస్తే ఏమవుతుంది?
- నాలుగు టెస్టుల తర్వాత 2 - 0తో భారత్ గెలిస్తే.. ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలుస్తాం.
- 3 - 0తో గెలిస్తే పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరతాం.
- 3 - 1తో సిరీస్ను గెలిచినా ఫైనల్కు చేరుకోవడం ఖాయం.
- 4 - 0తో సిరీస్ను క్లీన్స్వీప్ చేస్తే భారత్ డబ్ల్యూటీసీలో తొలి ఫైనలిస్ట్గా మారుతుంది.
అప్పుడు ఆసీస్ అవకాశాలు న్యూజిలాండ్ - శ్రీలంక సిరీస్పై ఆధారపడి ఉంటుంది.
మూడు ఫార్మాట్లలోనూ ..
ఇప్పటికే వన్డే, టీ20 ఫార్మాట్లలో భారత్దే అగ్రస్థానం. వరుసగా వన్డేలు, టీ20 సిరీస్లను కైవసం చేసుకొని మరీ టాప్ ర్యాంక్కు చేరుకొంది. ఇప్పుడు టెస్టు ర్యాకింగ్స్పై టీమ్ఇండియా దృష్టిసారించింది. డబ్ల్యూటీసీ ఫైనల్కు వెళ్లాలన్నా.. ఐసీసీ టాప్ ర్యాంక్కు చేరుకోవాలన్నా ఆసీస్తో నాలుగు టెస్టుల సిరీసే కీలకమనే విషయం తెలిసిందే. కనీసం 3-1తో సిరీస్ను కైవసం చేసుకొంటే చాలు సుదీర్ఘ ఫార్మాట్లోనూ భారత్ అగ్రస్థానానికి చేరుకొనేందుకు వీలుఉంది. ఇప్పటికే 2-0 ఆధిక్యంలో కొనసాగుతున్న భారత్ ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం ఆసీస్ 126 పాయింట్లతో తొలి ర్యాంక్లో ఉండగా.. భారత్ 115 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. అంటే కేవలం 11 పాయింట్లు మాత్రమే తేడా ఉంది. ఇప్పటికే రెండు టెస్టులు గెలవడంతో దాదాపు అగ్రస్థానానికి టీమ్ఇండియా చేరువైంది. మరో రెండు రోజుల్లో ర్యాంకుల గణాంకాలను ఐసీసీ అధికారికంగా విడుదల చేయనుంది. మూడో టెస్టును భారత్ గెలిస్తే అగ్రస్థానానికి చేరుతుంది. 4 - 0తో సిరీస్ను క్లీన్స్వీప్ చేస్తే మాత్రం టాప్ ర్యాంక్ భారత్ సొంతమవుతుంది. ఆసీస్ ఇంకా కిందికి దిగిజారిపోతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
ఆసియా కప్లో భారత మహిళల జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సెమీస్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు చేరింది. -
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
‘మేం ఉండగా ఆమె పిల్లలు లేనివారు ఎలా అవుతారు?’: కమలాహారిస్కు సవతి కుమార్తె మద్దతు
-
17ఏళ్ల నాటి హత్య కేసు.. ఒకే ఫ్యామిలీలో తొమ్మిది మంది సహా 14మందికి జీవిత ఖైదు
-
రెడ్ బుక్ తెరవకముందే జగన్ గగ్గోలు పెడుతున్నారు: మంత్రి నారా లోకేశ్
-
విడుదలై బయటకు..తిరిగి జైలుకు
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు