Net Run Rate: క్రికెట్లో నెట్ రన్రేట్ను ఎలా లెక్కిస్తారో తెలుసా?
భారత టీ20 లీగ్ చివరి అంకానికి చేరింది. గుజరాత్ 20 పాయింట్లతో ఇప్పటికే తొలి స్థానాన్ని కైవసం చేసుకొని ప్లేఆఫ్స్ బెర్తును ఖరారు చేసుకుంది...
భారత టీ20 లీగ్ చివరి అంకానికి చేరింది. గుజరాత్ 20 పాయింట్లతో ఇప్పటికే తొలి స్థానాన్ని కైవసం చేసుకొని ప్లేఆఫ్స్ బెర్తును ఖరారు చేసుకుంది. ఇక మిగిలిన మూడు స్థానాలకే పోటీ అధికమైంది. ఈ ఉత్కంఠకర పరిస్థితుల్లో ఏయే జట్లు చోటు దక్కించుకుంటాయనేది ఆసక్తిగా మారింది. అయితే.. లఖ్నవూ, రాజస్థాన్ ప్రస్తుతం చెరో 16 పాయింట్లతో కొనసాగుతుండగా.. నెట్ రన్రేట్ మెరుగ్గా ఉంది. దీంతో ఈ రెండు జట్లు కూడా దాదాపు ప్లేఆఫ్స్లో బెర్తులు సొంతం చేసుకున్నట్లే. ఇక చివరగా మిగిలిన నాలుగో స్థానం కోసమే.. దిల్లీ, బెంగళూరు జట్లు ప్రధానంగా పోటీలో ఉన్నాయి. వాటితో పాటు కోల్కతా, పంజాబ్, హైదరాబాద్ సైతం పోటీలో ఉన్నా అవి అనేక సమీకరణాలపై ఆధారపడి ఉన్నాయి. దీంతో నాలుగో స్థానంలో నిలవాలంటే ఏ జట్టుకైనా నెట్ రన్రేట్ కీలకం కానుంది.
నెట్రన్రేట్ ఎలా కీలకం..?
క్రికెట్లో ఏ మెగా టోర్నీలో అయినా నెట్రన్రేట్ కీలకంగా ఉంటుందనే సంగతి తెలిసిందే. గ్రూప్ లేదా లీగ్ స్టేజ్లో టాప్లో నిలిచిన జట్లు తేలిగ్గా నాకౌట్ లేదా ప్లేఆఫ్స్ చేరుకుంటాయి. అయితే, దిగువస్థాయిలో నిలిచే జట్లు ఒక్కోసారి ఇతరులతో సమాన పాయింట్లతో నిలిస్తే.. అప్పుడు నెట్ రన్రేట్ను పరిగణనలోకి తీసుకుంటారు. అదే ఆయా జట్ల భవిష్యత్ను నిర్దేశిస్తుంది. గతేడాది భారత టీ20 లీగ్లో.. లీగ్ స్టేజ్ పూర్తయ్యేసరికి కోల్కతా, ముంబయి చెరో 14 పాయింట్లు సాధించాయి. అయితే, రన్రేట్లో కోల్కతా (+0.587).. ముంబయి (+0.116) కన్నా కాస్త మెరుగ్గా ఉండటంతో ప్లేఆఫ్స్కు చేరింది. అక్కడి నుంచి ఫైనల్కు దూసుకెళ్లి త్రుటిలో కప్పు చేజార్చుకుంది. దీన్ని బట్టి నెట్ రన్రేట్ ఎంత కీలకమో అర్థమవుతుంది.
ఎలా లెక్కిస్తారు..?
ఉదాహరణకు.. ఒక జట్టు ఏదైనా టోర్నీలో 10 మ్యాచ్లు ఆడితే.. అందులో మొత్తం మ్యాచ్ల్లో కలిపి ఎన్ని పరుగులు చేసిందో.. దానికి ఎన్ని ఓవర్ల బంతులు ఎదుర్కుందో లెక్కిస్తారు. చివరికి మొత్తం పరుగుల్ని ఎదుర్కొన్న ఓవర్లతో విభజించి సగటు పరుగుల్ని లెక్కిస్తారు. ఆ వచ్చిన మొత్తాన్నే రన్స్ పర్ ఓవర్గా నిర్ణయిస్తారు. అలాగే అదే జట్టుపై ఇతర జట్లు ఎన్ని పరుగులు చేస్తాయో.. ఆ జట్లు ఎన్ని ఓవర్లను ఎదుర్కొంటాయో లెక్కిస్తారు. ఒకవేళ ప్రత్యర్థి జట్లు ఆ మ్యాచ్లో నిర్దేశించిన ఓవర్లకన్నా తక్కువ ఓవర్లకే ఆలౌటైతే అప్పుడు కూడా వాటిని పూర్తి ఓవర్ల కోటా కిందే లెక్కిస్తారు. ఇక్కడ కూడా సగటు పరుగులు లెక్కిస్తారు. ఆ రెండింటి మధ్య ఉన్న తేడానే నెట్రన్రేట్.
ఉదాహరణ:
* ఒక టీ20 టోర్నీలో A అనే జట్టు B అనే జట్టుతో తలపడిన మ్యాచ్లో 17.2 ఓవర్లలో 180/6 పరుగులు చేసిందని అనుకుందాం..
* అలాగే C అనే జట్టుతో ఆడిన మ్యాచ్లో A టీమ్ మొత్తం 20 ఓవర్లలో 145/5 పరుగులు చేసిందని భావిద్దాం..
* ఇక D అనే జట్టుతో ఆడిన మ్యాచ్లోనూ A మొత్తం 20 ఓవర్లలో 156/5 పరుగులు చేసిందని తీసుకుందాం..
ఇప్పుడు A అనే జట్టు మొత్తం మూడు మ్యాచ్ల్లో కలిపి చేసిన పరుగులు.. 180+145+156= 481.
అలాగే ఎదుర్కొన్న ఓవర్లు కలిపితే.. 17.2+20+20=57.2
ఇప్పుడు మొత్తం చేసిన పరుగుల నుంచి ఆడిన ఓవర్లను తీసుకొని సగటు లెక్కిస్తే రన్ రేట్ పర్ ఓవర్ ఇలా వస్తుంది.. 481/57.2= 8.4090.
* ఇక A జట్టుతో B ఆడిన మ్యాచ్లో సాధించిన పరుగులు 20 ఓవర్లలో 179/6 అనుకుందాం..
* అలాగే A జట్టుతో C ఆడిన మ్యాచ్లో చేసిన పరుగులు 15.2 ఓవర్లలో 110 ఆలౌటైందని భావిద్దాం..
* ఇక A జట్టుతో D ఆడిన మ్యాచ్లో చేసిన పరుగులు 18 ఓవర్లలో 125 ఆలౌటైందని తీసుకుందాం..
ఇక్కడ C, D జట్లు తమకు కేటాయించిన 20 ఓవర్ల కన్నా తక్కువ ఓవర్లలోనే ఆలౌటయ్యాయి. అలాంటప్పుడు రన్రేట్ను లెక్కించాలంటే.. ఆ పూర్తి ఓవర్ల కోటాతోనే విభజించాలి.
ఇక్కడ కూడా ఇతర జట్లు మొత్తం సాధించిన పరుగులు.. 179+110+125=414
అలాగే ఇతర జట్లు ఆడిన లేదా ఆడాల్సిన ఓవర్లు.. 20+20+20=60
ఇప్పుడు A జట్టుపై మొత్తం ఇతర జట్ల రన్రేట్ లెక్కిస్తే.. 414/60=6.9
ఇప్పుడు వచ్చిన రెండు రన్రేట్ల మధ్య ఉన్నా తేడా లెక్కిస్తే.. A జట్టు నెట్ రన్రేట్ తెలుస్తుంది.. 8.4090-6.9000= +1.509.
-ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
ఆసియా కప్లో భారత మహిళల జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సెమీస్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు చేరింది. -
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ధరణి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలి: సీఎం రేవంత్రెడ్డి
-
కొత్తింటికి రాహుల్ గాంధీ.. ఆఫర్ చేసిన హౌస్ కమిటీ!
-
ఎల్ఆర్ఎస్ అమలుకు కొత్త జిల్లాల వారీగా ప్రత్యేక బృందాలు: డిప్యూటీ సీఎం భట్టి
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
ఐఐటీ ఖరగ్పూర్ నుంచి.. సుందర్ పిచాయ్కి గౌరవ డాక్టరేట్
-
పేర్లు ప్రదర్శించమని బలవంతం చేయలేం: సుప్రీం