Net Run Rate: క్రికెట్లో నెట్ రన్రేట్ను ఎలా లెక్కిస్తారో తెలుసా?
భారత టీ20 లీగ్ చివరి అంకానికి చేరింది. గుజరాత్ 20 పాయింట్లతో ఇప్పటికే తొలి స్థానాన్ని కైవసం చేసుకొని ప్లేఆఫ్స్ బెర్తును ఖరారు చేసుకుంది...
భారత టీ20 లీగ్ చివరి అంకానికి చేరింది. గుజరాత్ 20 పాయింట్లతో ఇప్పటికే తొలి స్థానాన్ని కైవసం చేసుకొని ప్లేఆఫ్స్ బెర్తును ఖరారు చేసుకుంది. ఇక మిగిలిన మూడు స్థానాలకే పోటీ అధికమైంది. ఈ ఉత్కంఠకర పరిస్థితుల్లో ఏయే జట్లు చోటు దక్కించుకుంటాయనేది ఆసక్తిగా మారింది. అయితే.. లఖ్నవూ, రాజస్థాన్ ప్రస్తుతం చెరో 16 పాయింట్లతో కొనసాగుతుండగా.. నెట్ రన్రేట్ మెరుగ్గా ఉంది. దీంతో ఈ రెండు జట్లు కూడా దాదాపు ప్లేఆఫ్స్లో బెర్తులు సొంతం చేసుకున్నట్లే. ఇక చివరగా మిగిలిన నాలుగో స్థానం కోసమే.. దిల్లీ, బెంగళూరు జట్లు ప్రధానంగా పోటీలో ఉన్నాయి. వాటితో పాటు కోల్కతా, పంజాబ్, హైదరాబాద్ సైతం పోటీలో ఉన్నా అవి అనేక సమీకరణాలపై ఆధారపడి ఉన్నాయి. దీంతో నాలుగో స్థానంలో నిలవాలంటే ఏ జట్టుకైనా నెట్ రన్రేట్ కీలకం కానుంది.
నెట్రన్రేట్ ఎలా కీలకం..?
క్రికెట్లో ఏ మెగా టోర్నీలో అయినా నెట్రన్రేట్ కీలకంగా ఉంటుందనే సంగతి తెలిసిందే. గ్రూప్ లేదా లీగ్ స్టేజ్లో టాప్లో నిలిచిన జట్లు తేలిగ్గా నాకౌట్ లేదా ప్లేఆఫ్స్ చేరుకుంటాయి. అయితే, దిగువస్థాయిలో నిలిచే జట్లు ఒక్కోసారి ఇతరులతో సమాన పాయింట్లతో నిలిస్తే.. అప్పుడు నెట్ రన్రేట్ను పరిగణనలోకి తీసుకుంటారు. అదే ఆయా జట్ల భవిష్యత్ను నిర్దేశిస్తుంది. గతేడాది భారత టీ20 లీగ్లో.. లీగ్ స్టేజ్ పూర్తయ్యేసరికి కోల్కతా, ముంబయి చెరో 14 పాయింట్లు సాధించాయి. అయితే, రన్రేట్లో కోల్కతా (+0.587).. ముంబయి (+0.116) కన్నా కాస్త మెరుగ్గా ఉండటంతో ప్లేఆఫ్స్కు చేరింది. అక్కడి నుంచి ఫైనల్కు దూసుకెళ్లి త్రుటిలో కప్పు చేజార్చుకుంది. దీన్ని బట్టి నెట్ రన్రేట్ ఎంత కీలకమో అర్థమవుతుంది.
ఎలా లెక్కిస్తారు..?
ఉదాహరణకు.. ఒక జట్టు ఏదైనా టోర్నీలో 10 మ్యాచ్లు ఆడితే.. అందులో మొత్తం మ్యాచ్ల్లో కలిపి ఎన్ని పరుగులు చేసిందో.. దానికి ఎన్ని ఓవర్ల బంతులు ఎదుర్కుందో లెక్కిస్తారు. చివరికి మొత్తం పరుగుల్ని ఎదుర్కొన్న ఓవర్లతో విభజించి సగటు పరుగుల్ని లెక్కిస్తారు. ఆ వచ్చిన మొత్తాన్నే రన్స్ పర్ ఓవర్గా నిర్ణయిస్తారు. అలాగే అదే జట్టుపై ఇతర జట్లు ఎన్ని పరుగులు చేస్తాయో.. ఆ జట్లు ఎన్ని ఓవర్లను ఎదుర్కొంటాయో లెక్కిస్తారు. ఒకవేళ ప్రత్యర్థి జట్లు ఆ మ్యాచ్లో నిర్దేశించిన ఓవర్లకన్నా తక్కువ ఓవర్లకే ఆలౌటైతే అప్పుడు కూడా వాటిని పూర్తి ఓవర్ల కోటా కిందే లెక్కిస్తారు. ఇక్కడ కూడా సగటు పరుగులు లెక్కిస్తారు. ఆ రెండింటి మధ్య ఉన్న తేడానే నెట్రన్రేట్.
ఉదాహరణ:
* ఒక టీ20 టోర్నీలో A అనే జట్టు B అనే జట్టుతో తలపడిన మ్యాచ్లో 17.2 ఓవర్లలో 180/6 పరుగులు చేసిందని అనుకుందాం..
* అలాగే C అనే జట్టుతో ఆడిన మ్యాచ్లో A టీమ్ మొత్తం 20 ఓవర్లలో 145/5 పరుగులు చేసిందని భావిద్దాం..
* ఇక D అనే జట్టుతో ఆడిన మ్యాచ్లోనూ A మొత్తం 20 ఓవర్లలో 156/5 పరుగులు చేసిందని తీసుకుందాం..
ఇప్పుడు A అనే జట్టు మొత్తం మూడు మ్యాచ్ల్లో కలిపి చేసిన పరుగులు.. 180+145+156= 481.
అలాగే ఎదుర్కొన్న ఓవర్లు కలిపితే.. 17.2+20+20=57.2
ఇప్పుడు మొత్తం చేసిన పరుగుల నుంచి ఆడిన ఓవర్లను తీసుకొని సగటు లెక్కిస్తే రన్ రేట్ పర్ ఓవర్ ఇలా వస్తుంది.. 481/57.2= 8.4090.
* ఇక A జట్టుతో B ఆడిన మ్యాచ్లో సాధించిన పరుగులు 20 ఓవర్లలో 179/6 అనుకుందాం..
* అలాగే A జట్టుతో C ఆడిన మ్యాచ్లో చేసిన పరుగులు 15.2 ఓవర్లలో 110 ఆలౌటైందని భావిద్దాం..
* ఇక A జట్టుతో D ఆడిన మ్యాచ్లో చేసిన పరుగులు 18 ఓవర్లలో 125 ఆలౌటైందని తీసుకుందాం..
ఇక్కడ C, D జట్లు తమకు కేటాయించిన 20 ఓవర్ల కన్నా తక్కువ ఓవర్లలోనే ఆలౌటయ్యాయి. అలాంటప్పుడు రన్రేట్ను లెక్కించాలంటే.. ఆ పూర్తి ఓవర్ల కోటాతోనే విభజించాలి.
ఇక్కడ కూడా ఇతర జట్లు మొత్తం సాధించిన పరుగులు.. 179+110+125=414
అలాగే ఇతర జట్లు ఆడిన లేదా ఆడాల్సిన ఓవర్లు.. 20+20+20=60
ఇప్పుడు A జట్టుపై మొత్తం ఇతర జట్ల రన్రేట్ లెక్కిస్తే.. 414/60=6.9
ఇప్పుడు వచ్చిన రెండు రన్రేట్ల మధ్య ఉన్నా తేడా లెక్కిస్తే.. A జట్టు నెట్ రన్రేట్ తెలుస్తుంది.. 8.4090-6.9000= +1.509.
-ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కోహ్లీకి అరుదైన గౌరవం.. జైపుర్ మ్యూజియంలో మైనపు విగ్రహం
టీమ్ఇండియా స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీకి మరో అరుదైన గౌరవం దక్కింది. -
ఐపీఎల్లో ఆ రూల్ నాకు నచ్చలేదు: రోహిత్ శర్మ
ఐపీఎల్లో అనుసరిస్తున్న ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ తనకు అంతగా నచ్చలేదని ముంబయి స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ (Rohit Sharma) అన్నాడు. -
స్వదేశంలో జోఫ్రా ఆర్చర్ వరల్డ్ కప్ ఆడటం కష్టమేనా..?
ఐపీఎల్ ముగిసిన వారం తర్వాత టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానుంది. అయితే, ఇంగ్లాండ్ స్టార్ పేసర్ మాత్రం ఆడే అవకాశాలు తక్కువే. -
ముంబయి గెలవాలంటే.. హార్దిక్ ఫామ్ అందుకోవడం అత్యవసరం: ఫించ్
ముల్లాన్పుర్ వేదికగా పంజాబ్తో తలపడేందుకు ముంబయి సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ఆ జట్టు విజయం సాధించాలంటే కెప్టెన్ రాణించాలని మాజీ క్రికెటర్ ఫించ్ వ్యాఖ్యానించాడు. -
అనుమానిత బుకీలను గుర్తించిన బీసీసీఐ యాంటీ కరప్షన్ యూనిట్!
ఐపీఎల్లో ఎలాంటి అనైతిక కార్యకలాపాలు జరగకుండా చూసేందుకు ఏర్పాటైన యాంటీ కరప్షన్ యూనిట్ తన పనిని మొదలు పెట్టింది. -
డేవన్ కాన్వే ఔట్.. మరో సీనియర్ ప్లేయర్కు చెన్నై అవకాశం
న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు డేవన్ కాన్వే ప్రస్తుత ఐపీఎల్ సీజన్ నుంచి వైదొలిగాడు. గాయం కారణంగా ఆటడం లేదని ఐపీఎల్ మేనేజ్మెంట్ వెల్లడించింది. -
భారత క్రికెట్లో నీ భాగస్వామ్యం ఏంటి?: హర్షా భోగ్లేపై మాజీ క్రికెటర్ ఆగ్రహం
ఐపీఎల్లో చెన్నై జట్టును తక్కువ చేయడం సరికాదని భారత మాజీ క్రికెటర్ శివరామకృష్ణన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. -
అదంతా ఫేక్ న్యూస్.. నేనెవరినీ కలవలేదు: రోహిత్ శర్మ
పొట్టి కప్ కోసం జట్టు ఎంపికపై ఇప్పటి వరకు తానెవరినీ కలవలేదని భారత కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) స్పష్టం చేశాడు. -
ఆ లక్ష్యంతోనే బరిలోకి దిగాం : రిషభ్ పంత్
భారీ విజయంతో దిల్లీ పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మెరుగు పర్చుకుంది. సొంతమైదానంలోనే గుజరాత్ను చిత్తు చేసి ఈ సీజన్ ఐపీఎల్లో దిల్లీ మూడో విజయాన్ని నమోదు చేసింది. -
అత్యంత ప్రభావశీలుర జాబితాలో సాక్షి
టైమ్ మ్యాగజైన్ 2024 అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో భారత రెజ్లర్ సాక్షి మలిక్ చోటు దక్కించుకుంది. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ శరణ్ సింగ్పై పోరాటానికి గాను సాక్షికి ఈ గౌరవం లభించింది. -
భళా పంత్!.. అదరగొడుతున్న దిల్లీ కెప్టెన్
రోడ్డు ప్రమాదం కారణంగా 15 నెలల విరామం తర్వాత పంత్ మైదానంలో అడుగుపెడుతుంటే.. అతనెలా ఆడతాడో అని ఎన్నో సందేహాలు! కానీ ఈ ఐపీఎల్లో అతను అదరగొడుతున్నాడు. -
గుజరాత్ ఢమాల్
ఓవైపు ముంబయి ఇండియన్స్ కెప్టెన్ అయ్యాక హార్దిక్ పాండ్య తేలిపోతున్నాడు. మరోవైపు హార్దిక్ సారథ్యంలో గత రెండు సీజన్లలో అద్భుత ప్రదర్శన చేసిన గుజరాత్ టైటాన్స్.. అతను దూరమయ్యాక ఇబ్బంది పడుతోంది. -
ఒలింపిక్స్లో రష్యా అథ్లెట్లు ఉంటారా?
మరో వంద రోజుల్లోనే పారిస్ ఒలింపిక్స్ ఆరంభమవుతాయి. జులై 26న ప్రారంభోత్సవ వేడుకలు జరుగుతాయి. ఒలింపిక్స్ కోసం దేశాలన్నీ సిద్ధమవుతున్న తరుణంలో రష్యా ఈ మెగా క్రీడల్లో పాల్గొనడంపై సందిగ్ధత నెలకొంది. -
నరైన్ కోసం..
టీ20 ప్రపంచకప్ నేపథ్యంలో అంతర్జాతీయ రిటైర్మెంట్ వీడాలని సునీల్ నరైన్కు నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నామని వెస్టిండీస్ కెప్టెన్ రోమన్ పావెల్ అన్నాడు. నరైన్ ఐపీఎల్లో కోల్కతా తరఫున విశేషంగా రాణిస్తోన్న సంగతి తెలిసిందే. -
షారుక్ను కలిసిన వేళ
యశస్వి జైస్వాల్.. ఇప్పుడీ యువ ఓపెనర్ పేరు తెలియని క్రికెట్ అభిమానులు ఉండరంటే అతిశయోక్తి కాదు. దూకుడైన ఆటతీరుతో ఎంతోమంది అభిమానులను అతను సంపాదించుకున్నాడు. -
శీతల్ మళ్లీ అదుర్స్
భారత సంచలన పారా ఆర్చర్ శీతల్ దేవి మళ్లీ అదుర్స్ అనిపించింది. రెండు చేతులు లేకపోయినా ఆర్చరీలో పతకాల పంట పండిస్తున్న ఈ 17 ఏళ్ల అమ్మాయి.. తాజాగా సాధారణ (అన్ని శరీర భాగాలు సక్రమంగా ఉన్న) ఆర్చర్లతో పోటీపడి మరీ సత్తాచాటింది. -
ఫైనల్లో దీప
భారత స్టార్ జిమ్నాస్ట్ దీప కర్మాకర్ జిమ్నాస్టిక్స్ ప్రపంచకప్ వాల్ట్ విభాగంలో ఫైనల్కు అర్హత సాధించింది. 30 ఏళ్ల దీప క్వాలిఫయింగ్ రౌండ్ తొలి వాల్ట్లో 12.5, రెండో వాల్ట్లో 13.066.. మొత్తంగా 12.783 సగటు స్కోరు సాధించి నాలుగో స్థానంలో నిలిచింది. -
శ్రీజ, మనిక పరాజయం
ఐటీటీఎఫ్ ప్రపంచకప్లో భారత టేబుట్ టెన్నిస్ క్రీడాకారిణులు ఆకుల శ్రీజ, మనిక బాత్రా పోరాటం గ్రూపు దశలోనే ముగిసింది. గ్రూపు దశలో ఒక్కో విజయం, ఓటమితో ద్వితీయ స్థానాల్లో నిలిచిన శ్రీజ, మనిక నాకౌట్కు అర్హత సాధించలేకపోయారు. -
ధోని, కోహ్లీని అనుకరించా: బట్లర్
భారీ లక్ష్యాన్ని ఛేదించడం కోసం భారత స్టార్లు మహేంద్రసింగ్ ధోని, విరాట్ కోహ్లీని అనుకరించినట్లు రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ జోస్ బట్లర్ అన్నాడు. గాయం కారణంగా పంజాబ్ కింగ్స్తో మ్యాచ్ ఆడలేకపోయిన బట్లర్..
తాజా వార్తలు (Latest News)
-
కిమ్ ‘జీవాయుధ’ కార్యక్రమం.. వ్యాధుల వ్యాప్తికి ‘విషపు పెన్నులు’, స్ప్రేలు!
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
‘కేజ్రీవాల్ హత్యకు కుట్ర’.. ఆప్ తీవ్ర ఆరోపణలు
-
దక్షిణాదిలో ఈసారి భాజపా అత్యుత్తమ పనితీరు: అమిత్ షా
-
సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై సస్పెన్షన్ వేటు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM