Vinesh Phogat: వివాదాలు దాటుకొని చరిత్ర సృష్టించిన వినేశ్ ఫొగాట్
పట్టుదల ఉంటే ఏదైనా సాధించొచ్చు. ఈ మాటలు మనం ఎన్నోసార్లు విన్నా.. అది ఆచరణలో పెట్టడం అంత తేలికకాదు. దాన్ని ఆచరణలో పెట్టాలే కానీ అద్భుతాలు సాధించొచ్చు...
పట్టుదల ఉంటే ఏదైనా సాధించొచ్చు. ఈ మాటలు మనం ఎన్నోసార్లు విన్నా.. అది ఆచరణలో పెట్టడం అంత తేలికకాదు. దాన్ని ఆచరణలో పెట్టాలే కానీ అద్భుతాలు సాధించొచ్చు. అదే చేసింది భారత రెజ్లర్ వినేశ్ ఫొగాట్. గతేడాది ఒలింపిక్స్లో భారీ అంచనాలతో బరిలోకి దిగి అనూహ్య పరిస్థితుల నడుమ ఓటమిపాలైంది. అయితే.. అంత తేలిగ్గా జీవితానికి తల వంచలేదు. పట్టుదలతో ముందుకు సాగింది. ఏడాది తిరగకుండానే కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం సాధించింది.
కామన్వెల్త్లో హ్యాట్రిక్ స్వర్ణాలు..
మనసు అత్యంత శక్తిమంతమైంది. ఓటమి అంచున ఉన్నవారిని గెలిపించగలదు. విజయం ముంగిట ఉన్నా ఓడించగలదు. ఏ ప్లేయర్ అయినా బరిలోకి దిగే ముందు ఎలా ఉన్నా.. ఆ సమయానికి ఎంత ప్రశాంతంగా ఉన్నామనే దానిపైనే విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. ఈ మాటలు అక్షరసత్యం అని నిరూపించింది వినేశ్ ఫొగాట్. శనివారం నిర్వహించిన మహిళల 53 కేజీల ఫ్రీస్టైల్ ఈవెంట్లో నలుగురు మాత్రమే పోటీపడటంతో నోర్డిక్ విధానంలో ఈ మ్యాచ్లను కొనసాగించారు. దీంతో ఎక్కువ మ్యాచ్లు గెలిచినవాళ్లే విజేతగా నిలుస్తారు. అలా వినేశ్ ఈ పోటీల్లో వరుసగా మెర్సీ (నైజీరియా), సమంత (కెనడా)ను ఓడించి.. చివరి మ్యాచ్లో కేశాని (శ్రీలంక)పై గెలిచింది. ఆరంభం నుంచి ఎంతో ప్రశాంతంగా కనిపించిన వినేశ్ ప్రత్యర్థులపై పూర్తి ఆధిపత్యం చెలాయించింది. దీంతో తుదిపోరులో 4-0 తేడాతో ఆధిక్యంలోకి దూసుకెళ్లి ప్రత్యర్థిని కిందపడేసి, పైకి లేవకుండా అదిమిపట్టింది. దీంతో మొత్తం 13 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచింది. వినేశ్ 2014, 2018 క్రీడల్లోనూ ఛాంపియన్గా నిలిచి స్వర్ణాలు సాధించింది. ఈ ఘనత సాధించిన తొలి భారతీయురాలిగా నిలిచింది.
ఒలింపిక్స్ అప్పుడు ఏం జరిగింది..
వినేశ్ గతేడాది ఒలింపిక్స్లో భారీ అంచనాల నడుమ బరిలోకిదిగింది. అయితే, పతకం తేకుండానే ఇంటిముఖం పట్టింది. ఆ సమయంలో ఆమె కుంగుబాటుకు గురైంది. 2017లో వినేశ్ తలకు బలమైన గాయమవడంతో కొన్ని సందర్భాల్లో తీవ్రమైన గందరగోళానికి గురయ్యేది. ఈ సమస్య ఉన్న వారు తీవ్రమైన ఒత్తిడికి లోనవడం, వాంతి వస్తున్నట్లు అనిపించడం, చూపు ఒక్కసారిగా తగ్గిపోవడం. వెలుతురు, చప్పుడుకు ఇబ్బంది పడటం వంటివి ఎదుర్కొంటారు. వీటిల్లోని కొన్ని సమస్యలను సైతం ఆమె ఒలింపిక్స్కు ముందు అనుభవించింది. కానీ, వాటిని పెద్దగా పట్టించుకోలేదు. గతేడాది ఒలింపిక్స్కు ముందు మెరుగైన శిక్షణ తీసుకుంది. కానీ, కీలకమైన బౌట్కు ముందు రోజు ఆహారం తీసుకోలేదు.. కేవలం పోషకాలు ఉన్న డ్రింక్ను మాత్రమే తాగింది. ఒలింపిక్స్లో పోటీపడే రోజు నిద్రలేస్తూనే కొంత ఇబ్బంది పడింది. అక్కడ తన ఫిజియోను సంప్రదించి తర్వాత వార్మప్ కూడా చేసింది. అయినా ఫలితం కనిపించలేదు. అలానే బరిలోకి దిగింది. తొలిబౌట్ తర్వాత మరింత కంగారు పడింది. అలానే రెండో బౌట్ను మొదలుపెట్టి ఓటమిపాలైంది.
అంతకుముందే రెండు సార్లు కొవిడ్ బారినపడి..
వినేశ్ రెండు సార్లు కొవిడ్ బారిన పడింది. 2020లో ఆమెకు తొలిసారి కొవిడ్ సోకింది. కోలుకొన్న తర్వాత ప్రొటీన్లు ఉన్న ఆహారం తీసుకోవడంలో ఆమెకు సమస్యలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే కజకస్థాన్లో ఆసియా ఛాంపియన్షిప్ పోటీల నుంచి వచ్చాక ఆమె మరోసారి కొవిడ్ బారిన పడింది. కొన్నాళ్లకు కుటుంబం మొత్తానికీ కొవిడ్ సోకింది. తర్వాత హంగేరియాలో శిక్షణ పొందింది. అక్కడి నుంచే నేరుగా టోక్యోకు చేరుకుంది. కొవిడ్ భయంతోనే ఆమె టోక్యోకు వెళ్లాక కూడా టీమ్ఇండియా బృందానికి దూరంగా ఉంది. ఆ భయాల నడుమే ఆమె ఒలింపిక్స్లో పోటీపడింది.
వివాదాల నుంచి బయటపడి..
వినేశ్ ఓటమి తర్వాత భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ తీవ్రంగా మండిపడ్డారు. హంగేరియన్ శిక్షకుడు వాలెర్ తమను మోసం చేశాడని ఆరోపించారు. వినేశ్కు శిక్షణ పేరుతో అతని భార్య మారియాన సస్టైన్కు శిక్షణ ఇచ్చాడని పేర్కొన్నారు. వినేశ్ అంకుల్, రెజ్లర్ అయిన మహావీర్ కూడా తప్పంతా కోచ్దేనని పేర్కొన్నారు. వచ్చే నాలుగేళ్లలో తానే స్వయంగా వినేశ్కు శిక్షణ ఇస్తానని పేర్కొన్నారు. వాస్తవానికి వాలెర్ భార్య మారియాన కూడా ఒలింపిక్స్లో పాల్గొని ఓటమిపాలైంది. ఇదిలా ఉండగా.. తర్వాత టోక్యో క్రీడల్లో భారత జట్టు మేనేజ్మెంట్ ఆదేశాలను పాటించలేదన్న కారణంతో వినేశ్ను సస్పెండ్ చేశారు. ఈ క్రమంలోనే వినేశ్ మరోసారి ఒత్తిడికి గరై.. ఇకపై తాను మ్యాట్పై కనపడతానో లేదోననే వ్యాఖ్యలు చేసింది. దీంతో ఆమె కెరీర్ ఇక ముగిసినట్లే అని అంతా అనుకున్నారు. తర్వాత తన ప్రవర్తన పట్ల ఆమె డబ్ల్యూఎఫ్ఐకు క్షమాపణలు చెప్పింది. ఈ నేపథ్యంలోనే వినేశ్ మళ్లీ తన శిక్షణ కొనసాగించింది. దీంతో కామన్వెల్త్ క్రీడల్లో వరుసగా మూడో స్వర్ణం సాధించి.. పట్టుదలతో ముందుకు సాగితే విజయాలు వాటంతట అవే వస్తాయని నిరూపించింది.
-ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
ఆసియా కప్లో భారత మహిళల జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సెమీస్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు చేరింది. -
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
ఐఐటీ ఖరగ్పూర్ నుంచి.. సుందర్ పిచాయ్కి గౌరవ డాక్టరేట్
-
పేర్లు ప్రదర్శించమని బలవంతం చేయలేం: సుప్రీం
-
ఆ రాష్ట్రాలను విభజించే కుట్ర - మమతా బెనర్జీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
‘మేం ఉండగా ఆమె పిల్లలు లేనివారు ఎలా అవుతారు?’: కమలాహారిస్కు సవతి కుమార్తె మద్దతు