Vinesh Phogat: వివాదాలు దాటుకొని చరిత్ర సృష్టించిన వినేశ్ ఫొగాట్
పట్టుదల ఉంటే ఏదైనా సాధించొచ్చు. ఈ మాటలు మనం ఎన్నోసార్లు విన్నా.. అది ఆచరణలో పెట్టడం అంత తేలికకాదు. దాన్ని ఆచరణలో పెట్టాలే కానీ అద్భుతాలు సాధించొచ్చు...
పట్టుదల ఉంటే ఏదైనా సాధించొచ్చు. ఈ మాటలు మనం ఎన్నోసార్లు విన్నా.. అది ఆచరణలో పెట్టడం అంత తేలికకాదు. దాన్ని ఆచరణలో పెట్టాలే కానీ అద్భుతాలు సాధించొచ్చు. అదే చేసింది భారత రెజ్లర్ వినేశ్ ఫొగాట్. గతేడాది ఒలింపిక్స్లో భారీ అంచనాలతో బరిలోకి దిగి అనూహ్య పరిస్థితుల నడుమ ఓటమిపాలైంది. అయితే.. అంత తేలిగ్గా జీవితానికి తల వంచలేదు. పట్టుదలతో ముందుకు సాగింది. ఏడాది తిరగకుండానే కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం సాధించింది.
కామన్వెల్త్లో హ్యాట్రిక్ స్వర్ణాలు..
మనసు అత్యంత శక్తిమంతమైంది. ఓటమి అంచున ఉన్నవారిని గెలిపించగలదు. విజయం ముంగిట ఉన్నా ఓడించగలదు. ఏ ప్లేయర్ అయినా బరిలోకి దిగే ముందు ఎలా ఉన్నా.. ఆ సమయానికి ఎంత ప్రశాంతంగా ఉన్నామనే దానిపైనే విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. ఈ మాటలు అక్షరసత్యం అని నిరూపించింది వినేశ్ ఫొగాట్. శనివారం నిర్వహించిన మహిళల 53 కేజీల ఫ్రీస్టైల్ ఈవెంట్లో నలుగురు మాత్రమే పోటీపడటంతో నోర్డిక్ విధానంలో ఈ మ్యాచ్లను కొనసాగించారు. దీంతో ఎక్కువ మ్యాచ్లు గెలిచినవాళ్లే విజేతగా నిలుస్తారు. అలా వినేశ్ ఈ పోటీల్లో వరుసగా మెర్సీ (నైజీరియా), సమంత (కెనడా)ను ఓడించి.. చివరి మ్యాచ్లో కేశాని (శ్రీలంక)పై గెలిచింది. ఆరంభం నుంచి ఎంతో ప్రశాంతంగా కనిపించిన వినేశ్ ప్రత్యర్థులపై పూర్తి ఆధిపత్యం చెలాయించింది. దీంతో తుదిపోరులో 4-0 తేడాతో ఆధిక్యంలోకి దూసుకెళ్లి ప్రత్యర్థిని కిందపడేసి, పైకి లేవకుండా అదిమిపట్టింది. దీంతో మొత్తం 13 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచింది. వినేశ్ 2014, 2018 క్రీడల్లోనూ ఛాంపియన్గా నిలిచి స్వర్ణాలు సాధించింది. ఈ ఘనత సాధించిన తొలి భారతీయురాలిగా నిలిచింది.
ఒలింపిక్స్ అప్పుడు ఏం జరిగింది..
వినేశ్ గతేడాది ఒలింపిక్స్లో భారీ అంచనాల నడుమ బరిలోకిదిగింది. అయితే, పతకం తేకుండానే ఇంటిముఖం పట్టింది. ఆ సమయంలో ఆమె కుంగుబాటుకు గురైంది. 2017లో వినేశ్ తలకు బలమైన గాయమవడంతో కొన్ని సందర్భాల్లో తీవ్రమైన గందరగోళానికి గురయ్యేది. ఈ సమస్య ఉన్న వారు తీవ్రమైన ఒత్తిడికి లోనవడం, వాంతి వస్తున్నట్లు అనిపించడం, చూపు ఒక్కసారిగా తగ్గిపోవడం. వెలుతురు, చప్పుడుకు ఇబ్బంది పడటం వంటివి ఎదుర్కొంటారు. వీటిల్లోని కొన్ని సమస్యలను సైతం ఆమె ఒలింపిక్స్కు ముందు అనుభవించింది. కానీ, వాటిని పెద్దగా పట్టించుకోలేదు. గతేడాది ఒలింపిక్స్కు ముందు మెరుగైన శిక్షణ తీసుకుంది. కానీ, కీలకమైన బౌట్కు ముందు రోజు ఆహారం తీసుకోలేదు.. కేవలం పోషకాలు ఉన్న డ్రింక్ను మాత్రమే తాగింది. ఒలింపిక్స్లో పోటీపడే రోజు నిద్రలేస్తూనే కొంత ఇబ్బంది పడింది. అక్కడ తన ఫిజియోను సంప్రదించి తర్వాత వార్మప్ కూడా చేసింది. అయినా ఫలితం కనిపించలేదు. అలానే బరిలోకి దిగింది. తొలిబౌట్ తర్వాత మరింత కంగారు పడింది. అలానే రెండో బౌట్ను మొదలుపెట్టి ఓటమిపాలైంది.
అంతకుముందే రెండు సార్లు కొవిడ్ బారినపడి..
వినేశ్ రెండు సార్లు కొవిడ్ బారిన పడింది. 2020లో ఆమెకు తొలిసారి కొవిడ్ సోకింది. కోలుకొన్న తర్వాత ప్రొటీన్లు ఉన్న ఆహారం తీసుకోవడంలో ఆమెకు సమస్యలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే కజకస్థాన్లో ఆసియా ఛాంపియన్షిప్ పోటీల నుంచి వచ్చాక ఆమె మరోసారి కొవిడ్ బారిన పడింది. కొన్నాళ్లకు కుటుంబం మొత్తానికీ కొవిడ్ సోకింది. తర్వాత హంగేరియాలో శిక్షణ పొందింది. అక్కడి నుంచే నేరుగా టోక్యోకు చేరుకుంది. కొవిడ్ భయంతోనే ఆమె టోక్యోకు వెళ్లాక కూడా టీమ్ఇండియా బృందానికి దూరంగా ఉంది. ఆ భయాల నడుమే ఆమె ఒలింపిక్స్లో పోటీపడింది.
వివాదాల నుంచి బయటపడి..
వినేశ్ ఓటమి తర్వాత భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ తీవ్రంగా మండిపడ్డారు. హంగేరియన్ శిక్షకుడు వాలెర్ తమను మోసం చేశాడని ఆరోపించారు. వినేశ్కు శిక్షణ పేరుతో అతని భార్య మారియాన సస్టైన్కు శిక్షణ ఇచ్చాడని పేర్కొన్నారు. వినేశ్ అంకుల్, రెజ్లర్ అయిన మహావీర్ కూడా తప్పంతా కోచ్దేనని పేర్కొన్నారు. వచ్చే నాలుగేళ్లలో తానే స్వయంగా వినేశ్కు శిక్షణ ఇస్తానని పేర్కొన్నారు. వాస్తవానికి వాలెర్ భార్య మారియాన కూడా ఒలింపిక్స్లో పాల్గొని ఓటమిపాలైంది. ఇదిలా ఉండగా.. తర్వాత టోక్యో క్రీడల్లో భారత జట్టు మేనేజ్మెంట్ ఆదేశాలను పాటించలేదన్న కారణంతో వినేశ్ను సస్పెండ్ చేశారు. ఈ క్రమంలోనే వినేశ్ మరోసారి ఒత్తిడికి గరై.. ఇకపై తాను మ్యాట్పై కనపడతానో లేదోననే వ్యాఖ్యలు చేసింది. దీంతో ఆమె కెరీర్ ఇక ముగిసినట్లే అని అంతా అనుకున్నారు. తర్వాత తన ప్రవర్తన పట్ల ఆమె డబ్ల్యూఎఫ్ఐకు క్షమాపణలు చెప్పింది. ఈ నేపథ్యంలోనే వినేశ్ మళ్లీ తన శిక్షణ కొనసాగించింది. దీంతో కామన్వెల్త్ క్రీడల్లో వరుసగా మూడో స్వర్ణం సాధించి.. పట్టుదలతో ముందుకు సాగితే విజయాలు వాటంతట అవే వస్తాయని నిరూపించింది.
-ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
ఎప్పుడూ కూల్గా కనిపించే ఎంఎస్ ధోనీ (MS Dhoni) గురించి ఎవరికీ తెలియని ఓ విషయాన్ని సురేశ్ రైనా ఇటీవల బయటపెట్టాడు. -
టీ20 వరల్డ్ కప్తో రీ ఎంట్రీ?.. తలుపులు మూసుకుపోయాయన్న సునీల్ నరైన్
మళ్లీ అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టే ఆలోచన లేదని వెస్టిండీస్ మాజీ ఆటగాడు సునీల్ నరైన్ (Sunil Narine) అన్నాడు. -
కొంతమంది ముంబయి ఆటగాళ్లు రోహిత్ శర్మనే కెప్టెన్ అనుకుంటున్నారు: ఇర్ఫాన్ పఠాన్
ముంబయి ఇండియన్స్ గురించి భారత మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆ జట్టులోని కొంతమంది ఆటగాళ్లు ఇప్పటికీ రోహిత్ శర్మ (Rohit Sharma)నే కెప్టెన్గా భావిస్తున్నారని వ్యాఖ్యానించాడు. -
రోహిత్తో ఓపెనింగ్ చేసేది ఎవరు? మీ ఛాయిస్ ఎవరు?
త్వరలో జరగబోయే టీ20 ప్రపంచకప్లో రోహిత్ శర్మకు ఓపెనింగ్ జోడీగా ఎవరైతే బాగుంటారు. -
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య
రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో ముంబయి తొమ్మిది వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. అనంతరం ముంబయి కెప్టెన్ హార్దిక్ పాండ్య (Hardik Pandya) మాట్లాడాడు. -
టీ20 వరల్డ్ కప్లో ఓపెనర్లుగా గంగూలీ ఛాయిస్ వీళ్లే..!
T20 World Cup: రాబోయే టీ20 వరల్డ్ కప్ను దృష్టిలో ఉంచుకొని సౌరభ్ గంగూలీ పలు సూచనలు చేశాడు. ఓపెనర్లుగా ఎవరు ఆడితే బాగుంటుందో తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు. అలాగే జట్టు ఎంపిక ఎలా ఉండాలో కూడా సూచించాడు. -
చెపాక్లో చూసుకుందాం.. లఖ్నవూపై చెన్నై ప్రతీకారం తీరేనా?
మళ్లీ మ్యాచ్ చెపాక్కు వచ్చేసింది. లఖ్నవూతో తలపడేందుకు చెన్నై సిద్ధమవుతోంది. ఇరు జట్ల మధ్య జరిగిన గత మ్యాచ్లో కేఎల్ రాహుల్ నాయకత్వంలోని లఖ్నవూ విజయం సాధించింది. -
ఈ కుర్రాడు.. అసామాన్యుడు
కాదు అనుకున్నది చేసి చూపించడం.. ఓటమి తప్పదు అనుకున్న చోట గెలిచి రావడం ఆ కుర్రాడి నైజం. అంచనాలకు మించి రాణించడం.. అద్భుతమైన ఆటతీరుతో అబ్బురపరచడం అతనికి అలవాటు. -
యువరాజు వచ్చేశాడు
భారత్లో ఆదివారం అర్ధరాత్రి. అందరూ గాఢ నిద్రలో ఉండగా.. అక్కడ కెనడాలో ఓ యువరాజు ప్రతిష్ఠాత్మకమైన కిరీటాన్ని ధరించాడు. -
ఆ ఓటమి కసిని పెంచింది
భారత చదరంగ చరిత్రలో అత్యుత్తమ విజయాలు, అసాధారణ ప్రదర్శన అంటే దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ గుర్తుకొస్తాడు. ప్రపంచ చెస్ యవనికపై విషీ ముద్ర అలాంటిది. -
రాయల్స్.. తగ్గేదేలే
ఐపీఎల్-17లో పెద్దగా అంచనాల్లేకుండా బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్.. మ్యాచ్ మ్యాచ్కూ బలపడుతూ వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సీజన్లో ఒక్కసారే ఓడిన రాయల్స్.. ఏడో విజయాన్ని నమోదు చేసింది. -
దూకుడు ఫలితాన్నిచ్చింది
క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో మునుపెన్నడూ లేనంత పోటీ ఎదురైనట్లు భారత గ్రాండ్మాస్టర్ కోనేరు హంపి తెలిపింది. క్రీడాకారులంతా అత్యుత్తమ సన్నద్ధతతో బరిలో దిగినట్లు చెప్పింది. -
కోహ్లికి జరిమానా
కోల్కతాతో ఐపీఎల్ మ్యాచ్లో అనుచితంగా ప్రవర్తించినందుకు బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లికి మ్యాచ్ ఫీజులో 50 శాతం కోత పడింది. -
ఇషాకు మూడో స్థానం
ఒలింపిక్ షూటింగ్ సెలక్షన్ ట్రయల్స్లో హైదరాబాదీ అమ్మాయి ఇషాసింగ్ మూడో స్థానంలో నిలిచింది. -
కష్ట కాలంలో కోహ్లి మాటలే..
ఒకప్పుడు ఐపీఎల్లో పేలవ ప్రదర్శనతో విమర్శలెదుర్కొన్న రాజస్థాన్ రాయల్స్ ఆల్రౌండర్ రియాన్ పరాగ్.. ఈ సీజన్లో నిలకడగా రాణిస్తూ ఆశ్చర్యపరుస్తున్నాడు. -
శతకం బాదిన జైస్వాల్.. ముంబయిపై రాజస్థాన్ ఘన విజయం
ముంబయితో జరిగిన పోరులో రాజస్థాన్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 180 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ 18.4 ఓవర్లలో కేవలం ఒక వికెట్ కోల్పోయి ఛేదించింది. ఆజట్టు ఆటగాడు యశస్వి జైస్వాల్ (104*) శతకంతో అదరగొట్టాడు.
తాజా వార్తలు (Latest News)
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
-
నిర్మాతల నుంచి పవన్కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్
-
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM