Virat Kohli: డెత్ ఓవర్లలో టాప్ గేర్.. కింగ్ ఊచకోత
ఒత్తిడిని తట్టుకొని ఛేజింగ్ చేసి ప్రత్యర్థిని ఎలా చిత్తుచేయాలో కోహ్లీ ప్రాక్టికల్గా చూపించాడు. యువక్రికెటర్లకు ఈ ఇన్నింగ్స్ నిస్సందేహంగా ఓ పాఠం. తరానికొక్కటిగా నిలిచే ఇన్నింగ్స్ను ఆడి భారత్కు అపూర్వ విజయాన్ని అందించాడు.
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
‘‘మూడేళ్లు మూడంకెల స్కోర్ చేయని ఏ ఆటగాడైనా జట్టులో కొనసాగడం కష్టం. అయితే.. విరాట్కే అది సాధ్యమైంది’’.. 71వ శతకం పూర్తి చేశాక ఓ మాజీ నుంచి వచ్చిన వెటకారంతో కూడిన ప్రశంస ఇది..! మరోవైపు ‘ఆ..అఫ్గాన్ మీద శతకమేగా..’ అంటూ విరాట్పై హేటర్స్ చిన్నచూపు..! ఇక ఆచితూచి ఆడుతూ ఆసియాకప్లో మంచి స్కోర్లు చేస్తున్న సమయంలో ఆత్మవిశ్వాసంతో ఉండే ‘కింగ్’ బాడీ లాంగ్వేజ్ కనిపించలేదు. దీంతో ‘ఒక్కటి తగ్గింది’ అని అభిమానులు కలవరపడుతున్న సమయం..! రెండు పర్యటనలకు విశ్రాంతి తీసుకొని.. మునపటి లయను అందిపుచ్చుకోవడానికి విరాట్ మెల్లగా అడుగులు వేస్తున్న సమయంలో వినిపించిన కామెంట్లివీ..!
స్థిమితంగా నిలదొక్కుకొని..
తాజాగా పాకిస్థాన్పై మెల్బోర్న్లో జరిగిన మ్యాచ్లో ‘కింగ్ కోహ్లీ’ ఒక్కసారిగా తన విశ్వరూపం చూపించాడు. ఈ ఆట మొత్తంలో విరాట్ బాడీలాంగ్వేజ్ ఓ ఛాంపియన్లా ఉంది. కళ్లముందే టీమ్ఇండియా టాప్ ఆర్డర్ పేకమేడలా కూలుతున్నా.. ప్రశాంతంగా ఉన్నాడు. ఏడు ఓవర్లకు టీమిండియా స్కోర్ 33/4 వద్ద హార్దిక్తో శతక భాగస్వామ్యానికి పునాదులు వేయడం మొదలుపెట్టాడు. పది ఓవర్లు ముగిసేసరికి విరాట్ 21 బంతుల్లో 12 పరుగులు మాత్రమే సాధించాడు. ఒక్క ఫోర్గానీ, సిక్స్గానీ లేదు. ఈ రన్రేట్ చూసి.. టెస్టు మ్యాచ్ ఆడుతున్నారా ఏంటీ..? అనుకొంటూ అభిమానులు నీరసపడి పోయారు. ఈ సమయంలో విరాట్పై ఒత్తిడి పెంచేందుకు పాక్ 11 ఓవర్లో నవాజ్ బౌలింగ్లో ఓ క్యాచ్ అప్పీల్ రివ్యూకి తీసుకెళ్లింది. కోహ్లీ ముఖంలో ఏ మాత్రం టెన్షన్ కనిపించలేదు. అతడు ఊహించినట్లే.. నిర్ణయం పాక్కు ప్రతికూలంగా వచ్చింది. ఆ తర్వాతి బంతిని లాంగ్ ఆన్ మీదుగా సిక్సర్ కొట్టి బౌలర్ ఆత్మవిశ్వాసాన్ని పటాపంచలు చేశాడు.
డెత్ ఓవర్లలో టాప్గేర్లోకి..
ఇక అక్కడి నుంచి ఎక్కడా వెనక్కి తిరిగి చూడలేదు.. కోహ్లీ బాడీ లాంగ్వేజ్ కూడా ఒక్కసారిగా దూకుడుగా మారిపోయింది. షాట్లు కొట్టినప్పుడల్లా హార్దిక్తో ఫిస్ట్ బంప్స్ కొడుతూ.. గాల్లోకి పంచ్లు విసురుతూ విరాట్ సమరోత్సాహంతో కనిపించాడు. 11-16 ఓవర్ల మధ్యలో కోహ్లీ 18 బంతులు ఆడి 31 పరుగులు చేశాడు. దానిలో మూడు ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. ఆ ఓవర్లలో స్ట్రైక్ రేటు 172..! ఇక డెత్ ఓవర్లు వచ్చేటప్పటికి కోహ్లీలోని ‘కింగ్’ బయటకు రావడంతో పాక్ బౌలింగ్ దళం కకావికలమైంది. 17-20 ఓవర్ల మధ్యలో 14 బంతులు ఆడిన కోహ్లీ ఏకంగా 278 స్ట్రైక్ రేట్తో 39 పరుగులు చేశాడు. వీటిల్లో మూడు ఫోర్లు.. మూడు సిక్స్లు ఉండటం కింగ్ ఊచకోతను తెలియజేస్తోంది. ఒత్తిడిలో చెలరేగిపోవడం విరాట్ సహజశైలి..! గత మూడేళ్లుగా మిస్సైన ఆ ఆత్మవిశ్వాసాన్ని విరాట్ మళ్లీ అందిపుచ్చుకొన్నాడు.
పాక్ ఆత్మవిశ్వాసంపై పంచ్..
ఇటీవల ఓ ప్రాక్టిస్ మ్యాచ్లో షహీన్ అఫ్రిది ఓ అఫ్గాన్ బ్యాటర్ను గాయపర్చాడు. భారత బ్యాటర్లకు ఈ గతి తప్పదంటూ మ్యాచ్కు ముందు పాక్ మాజీలు హేళనకు దిగారు. షహీన్ బౌలింగ్ను మెల్బోర్న్ పిచ్పై ఎదుర్కోవడం ఆషామాషీ కాదు. కానీ.. అవతల ఉన్నది కోహ్లీ. షహీన్ బౌలింగ్ను ఉతికారేశాడు. అదీ ఒత్తిడితో కూడిన డెత్ ఓవర్లలో..! వాస్తవానికి భారత్ సాధించాల్సిన రన్రేట్ బాగా పెరుగుతుండటంతో.. చివరి ఓవర్ కంటే ముందే మ్యాచ్ను ముగించేలా పాక్ కెప్టెన్ బాబర్ ప్లాన్ చేశాడు. ఈ క్రమంలో షహీన్, రవూఫ్ల చేత 18, 19 ఓవర్లు వేయించాడు. కోహ్లీ హిట్టింగ్ దెబ్బకు ఈ వ్యూహం బెడిసికొట్టింది. 18వ ఓవర్లో మూడు ఫోర్లు, 19వ ఓవర్లో రెండు సిక్స్లతో పాక్ ప్రధాన బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఎంసీజీని సొంత మైదానంగా చెప్పుకొని ప్రగల్భాలు పలికిన రవూఫ్ కూడా విరాట్ ధాటికి చివర్లో తేలిపోయాడు. ఫలితంగా చివరి ఓవర్ స్పిన్నర్ నవాజ్ చేత వేయించాల్సి వచ్చింది.
చెక్కుచెదరని ఏకాగ్రత..!
ఈ మ్యాచ్లో కోహ్లీ ఏకాగ్రత ఎక్కడా చెక్కు చెదరలేదు. మిడిల్ ఓవర్లలో పాండ్యాతో కలిసి వికెట్ పడకుండా సింగిల్స్, డబుల్స్ తీస్తూ స్కోర్ బోర్డును కదిలించాడు. చివరి రెండు ఓవర్లలో కూడా లక్ష్యాన్ని ఛేదించడానికి అవసరమైన షాట్లను అత్యంత కచ్చితత్వంతో ఆడాడు. టార్గెట్ను ఎలా ఛేజ్ చేయాలనే దానిపై అతడి బ్రెయిన్లో స్పష్టమైన ప్లాన్ ఉన్నట్లు కనిపించింది. రవూఫ్ ఓవర్ ముగుస్తుండగా.. చివరి ఓవర్లో అవసరమైన రన్రేట్ ఒత్తిడి పెరగనీయకుండా రెండు సిక్సులు బాదాడు. 19.4 ఓవర్లో కోహ్లీ బౌల్డ్ అయిన బంతి నోబాల్. అంపైర్ దానిని డెడ్బాల్గా ప్రకటిస్తారన్న ఆశతో పాక్ ఫీల్డర్లు వదిలేశారు. కోహ్లీ మాత్రం దాని నుంచి మూడు పరుగులు రాబట్టాడు.
ఈ ఇన్నింగ్స్ మొత్తంలో విరాట్ ఫిట్నెస్ కూడా కీలక పాత్ర పోషించింది. కోహ్లీ వికెట్ల మధ్య పరుగులు తీసే సమయంలో చాలా చురుగ్గా ఉన్నాడు. 2021-2022లో ఒక్కసారి కూడా ఫిట్నెస్ విషయంలో.. విరాట్ నేషనల్ క్రికెట్ అకాడమీకి వెళ్లలేదు. కాదు.. కాదు.. అసలు ఆ అవసరమే రానీయకుండా ఫిట్నెస్ను మెరుగుపర్చుకొన్నాడు.
ఇక లక్ష్యఛేదన సమయంలో విరాట్ అజేయంగా ఉన్నాడంటే మ్యాచ్ గెలిచినట్లే అన్న అభిమానుల అంచనాలను మరోసారి నిజం చేశాడు. వాస్తవానికి అతడు అజేయంగా ఉన్న18 ఛేజింగ్ల్లోనూ భారత్ విజయం సాధించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
ఆసియా కప్లో భారత మహిళల జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సెమీస్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు చేరింది. -
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పేర్లు ప్రదర్శించమని బలవంతం చేయలేరు: సుప్రీం
-
ఆ రాష్ట్రాలను విభజించే కుట్ర - మమతా బెనర్జీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
‘మేం ఉండగా ఆమె పిల్లలు లేనివారు ఎలా అవుతారు?’: కమలాహారిస్కు సవతి కుమార్తె మద్దతు
-
17ఏళ్ల నాటి హత్య కేసు.. ఒకే ఫ్యామిలీలో తొమ్మిది మంది సహా 14మందికి జీవిత ఖైదు
-
రెడ్ బుక్ తెరవకముందే జగన్ గగ్గోలు పెడుతున్నారు: మంత్రి నారా లోకేశ్