Asia Cup 2023: ఆసియా కప్.. టీమ్ఇండియా కూర్పు ఎలా ఉండనుందో..?
విండీస్ పర్యటన తర్వాత ఆసియా కప్.. అటు పిమ్మటే వన్డే ప్రపంచకప్.. ఇదీ భారత్ (Team India) బిజీ షెడ్యూల్. జులై 12 నుంచి ఆగస్టు 13 వరకు విండీస్ పర్యటన కాగా.. ఆగస్ట్ 31న ఆసియా కప్ మొదలుకానుంది.
ఇంటర్నెట్ డెస్క్: మరో రెండు వారాల్లో వెస్టిండీస్తో (WI vs IND) రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లతో కూడిన భారత పర్యటన ప్రారంభం కానుంది. జులై 12 నుంచి ఆగస్టు 13వ తేదీ వరకు విండీస్ పర్యటనలోనే టీమ్ఇండియా (Team India) గడిపేస్తుంది. ఆ తర్వాత ఆగస్టు 31 నుంచి పాకిస్థాన్, శ్రీలంక వేదికలుగా ‘హైబ్రిడ్ మోడల్’లో ఆసియా కప్ 2023 (Asia Cup 2023) టోర్నమెంట్ జరగనుంది. అయితే, ఇప్పటికీ భారత జట్టును బీసీసీఐ సెలెక్షన్ కమిటీ ప్రకటించలేదు. విండీస్తో వన్డే సిరీస్ ముగిశాక లేదా కీలక ఆటగాళ్లు బుమ్రా, కేఎల్ రాహుల్ ఫిట్నెస్ నిరూపించుకున్న తర్వాత జట్టును వెల్లడించే అవకాశం ఉంది. ఇందులో ఆడిన జట్టులో పెద్దగా మార్పుల్లేకుండానే వన్డే ప్రపంచ కప్లో ఆడేందుకు ఎక్కువ ఛాన్స్ ఉంది. ఈ క్రమంలో ఆసియా కప్ కోసం భారత తుది జట్టు ఎలా ఉంటుందో ఓసారి పరిశీలిద్దాం..
ఓపెనర్లుగా వారిద్దరే!
ఇటీవల కాలంలో టెస్టు, వన్డే, టీ20 ఫార్మాట్లలో అదరగొట్టేస్తున్న భారత ఆటగాళ్లలో శుభ్మన్ గిల్ ఒకడు. గత ఐపీఎల్లో గిల్దే టాప్ స్కోర్. దీంతో కెప్టెన్ రోహిత్ శర్మతో ఇన్నింగ్స్ను ప్రారంభించే అవకాశం గిల్కే ఇవ్వడం ఖాయం. ఇక ఓపెనర్గా రిజర్వ్లో ఉన్న ఆటగాడిగా రుతురాజ్ గైక్వాడ్కు ఛాన్స్ ఉంటుంది. మరో ఆటగాడు యశస్వి కూడా ఇదే రేసులో ఉన్నాడు.
మిడిలార్డర్లో వీరే కీలకం..
భారత్ మిడిలార్డర్లో ఆటగాళ్లకు కొదవేం లేదు. ఒకరిద్దరు నిలబడినా భారీ స్కోరు చేయగల సత్తా ఉంది. విరాట్ కోహ్లీ వన్డౌన్లో వస్తాడు. ఫిట్నెస్ సాధించి తుది జట్టులో ఉంటే కేఎల్ రాహుల్ నాలుగో స్థానంలో ఆడగలడు. కీపింగ్ కూడా చేయడం అదనపు అర్హత. సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ ఎంపికలో మాత్రం కాస్త గందరగోళం ఉండే అవకాశం ఉంది. వన్డేల్లో డబుల్ సెంచరీ సాధించిన బ్యాటర్ ఇషాన్ కిషన్ స్వతహాగా వికెట్ కీపర్. అలాగే సంజూ శాంసన్ వైపు కూడా మొగ్గు చూపే అవకాశాలు లేకపోలేదు. పేస్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య ఉండనే ఉన్నాడు.
విరాట్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్, హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా/అక్షర్ పటేల్
స్పెషలిస్ట్ స్పిన్నర్లు..
రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ వీరిద్దరూ జట్టులో ఉంటే ఇతర స్పిన్నర్లతో అవసరం ఉండదు. బ్యాటింగ్ కూడా చేయగల సత్తా వారికుంది. అయితే, స్పెషలిస్ట్ స్పిన్నర్ కనీసం ఒక్కరైనా ఉండాలి. చాహల్ / కుల్దీప్ యాదవ్ వీరిద్దరూ స్పెషలిస్ట్ స్పిన్నర్లు. వారిలో ఒకరిని మాత్రమే తీసుకొనేందుకు అవకాశం ఉంది. ఇద్దరినీ తీసుకోవాలనుకుంటే జడ్డూను లేదా అక్షర్ను పక్కనపెట్టాల్సిందే.
పేస్ దళం ఇదేనా..?
ఆసియా కప్లో భారత్ మ్యాచ్లు శ్రీలంక వేదికగానే జరుగుతాయి. కాబట్టి లంక పిచ్లపై ఇద్దరు స్పెషలిస్ట్ పేసర్లు ఉన్నా సరిపోతుంది. హార్దిక్ రూపంలో పేస్ ఆల్రౌండర్ ఉండనే ఉన్నాడు. ఒకవేళ బుమ్రా ఫిట్నెస్ సాధించి వస్తే అతడికి చోటు ఖాయం. మరో స్థానం కోసం షమీ - సిరాజ్ మధ్య తీవ్ర పోటీ ఉంటుంది. అర్ష్దీప్సింగ్, ఉమ్రాన్ మాలిక్ ఉన్నప్పటికీ వారిద్దరికి అవకాశం రావడం కష్టమే. అయితే విండీస్తో టీ20 సిరీస్లో మాత్రం తుది జట్టులో ఉండొచ్చు.
ఆసియా కప్ కోసం తుది జట్టు (అంచనా): రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, చాహల్, బుమ్రా, షమీ/సిరాజ్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
ఆసియా కప్లో భారత మహిళల జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సెమీస్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు చేరింది. -
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రెడ్ బుక్ తెరవకముందే జగన్ గగ్గోలు పెడుతున్నారు: మంత్రి నారా లోకేశ్
-
విడుదలై బయటకు..తిరిగి జైలుకు
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
-
కమీషన్ల కోసమే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిలిపేశారు: ఉత్తమ్
-
ఫ్రెండ్తో వివాహం.. కీర్తి సురేశ్ ఏమన్నారంటే..?
-
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటాం: అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన