Asia Cup 2023: ఆసియా కప్.. టీమ్ఇండియా కూర్పు ఎలా ఉండనుందో..?
విండీస్ పర్యటన తర్వాత ఆసియా కప్.. అటు పిమ్మటే వన్డే ప్రపంచకప్.. ఇదీ భారత్ (Team India) బిజీ షెడ్యూల్. జులై 12 నుంచి ఆగస్టు 13 వరకు విండీస్ పర్యటన కాగా.. ఆగస్ట్ 31న ఆసియా కప్ మొదలుకానుంది.
ఇంటర్నెట్ డెస్క్: మరో రెండు వారాల్లో వెస్టిండీస్తో (WI vs IND) రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లతో కూడిన భారత పర్యటన ప్రారంభం కానుంది. జులై 12 నుంచి ఆగస్టు 13వ తేదీ వరకు విండీస్ పర్యటనలోనే టీమ్ఇండియా (Team India) గడిపేస్తుంది. ఆ తర్వాత ఆగస్టు 31 నుంచి పాకిస్థాన్, శ్రీలంక వేదికలుగా ‘హైబ్రిడ్ మోడల్’లో ఆసియా కప్ 2023 (Asia Cup 2023) టోర్నమెంట్ జరగనుంది. అయితే, ఇప్పటికీ భారత జట్టును బీసీసీఐ సెలెక్షన్ కమిటీ ప్రకటించలేదు. విండీస్తో వన్డే సిరీస్ ముగిశాక లేదా కీలక ఆటగాళ్లు బుమ్రా, కేఎల్ రాహుల్ ఫిట్నెస్ నిరూపించుకున్న తర్వాత జట్టును వెల్లడించే అవకాశం ఉంది. ఇందులో ఆడిన జట్టులో పెద్దగా మార్పుల్లేకుండానే వన్డే ప్రపంచ కప్లో ఆడేందుకు ఎక్కువ ఛాన్స్ ఉంది. ఈ క్రమంలో ఆసియా కప్ కోసం భారత తుది జట్టు ఎలా ఉంటుందో ఓసారి పరిశీలిద్దాం..
ఓపెనర్లుగా వారిద్దరే!
ఇటీవల కాలంలో టెస్టు, వన్డే, టీ20 ఫార్మాట్లలో అదరగొట్టేస్తున్న భారత ఆటగాళ్లలో శుభ్మన్ గిల్ ఒకడు. గత ఐపీఎల్లో గిల్దే టాప్ స్కోర్. దీంతో కెప్టెన్ రోహిత్ శర్మతో ఇన్నింగ్స్ను ప్రారంభించే అవకాశం గిల్కే ఇవ్వడం ఖాయం. ఇక ఓపెనర్గా రిజర్వ్లో ఉన్న ఆటగాడిగా రుతురాజ్ గైక్వాడ్కు ఛాన్స్ ఉంటుంది. మరో ఆటగాడు యశస్వి కూడా ఇదే రేసులో ఉన్నాడు.
మిడిలార్డర్లో వీరే కీలకం..
భారత్ మిడిలార్డర్లో ఆటగాళ్లకు కొదవేం లేదు. ఒకరిద్దరు నిలబడినా భారీ స్కోరు చేయగల సత్తా ఉంది. విరాట్ కోహ్లీ వన్డౌన్లో వస్తాడు. ఫిట్నెస్ సాధించి తుది జట్టులో ఉంటే కేఎల్ రాహుల్ నాలుగో స్థానంలో ఆడగలడు. కీపింగ్ కూడా చేయడం అదనపు అర్హత. సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ ఎంపికలో మాత్రం కాస్త గందరగోళం ఉండే అవకాశం ఉంది. వన్డేల్లో డబుల్ సెంచరీ సాధించిన బ్యాటర్ ఇషాన్ కిషన్ స్వతహాగా వికెట్ కీపర్. అలాగే సంజూ శాంసన్ వైపు కూడా మొగ్గు చూపే అవకాశాలు లేకపోలేదు. పేస్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య ఉండనే ఉన్నాడు.
విరాట్, కేఎల్ రాహుల్, సూర్యకుమార్, హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా/అక్షర్ పటేల్
స్పెషలిస్ట్ స్పిన్నర్లు..
రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ వీరిద్దరూ జట్టులో ఉంటే ఇతర స్పిన్నర్లతో అవసరం ఉండదు. బ్యాటింగ్ కూడా చేయగల సత్తా వారికుంది. అయితే, స్పెషలిస్ట్ స్పిన్నర్ కనీసం ఒక్కరైనా ఉండాలి. చాహల్ / కుల్దీప్ యాదవ్ వీరిద్దరూ స్పెషలిస్ట్ స్పిన్నర్లు. వారిలో ఒకరిని మాత్రమే తీసుకొనేందుకు అవకాశం ఉంది. ఇద్దరినీ తీసుకోవాలనుకుంటే జడ్డూను లేదా అక్షర్ను పక్కనపెట్టాల్సిందే.
పేస్ దళం ఇదేనా..?
ఆసియా కప్లో భారత్ మ్యాచ్లు శ్రీలంక వేదికగానే జరుగుతాయి. కాబట్టి లంక పిచ్లపై ఇద్దరు స్పెషలిస్ట్ పేసర్లు ఉన్నా సరిపోతుంది. హార్దిక్ రూపంలో పేస్ ఆల్రౌండర్ ఉండనే ఉన్నాడు. ఒకవేళ బుమ్రా ఫిట్నెస్ సాధించి వస్తే అతడికి చోటు ఖాయం. మరో స్థానం కోసం షమీ - సిరాజ్ మధ్య తీవ్ర పోటీ ఉంటుంది. అర్ష్దీప్సింగ్, ఉమ్రాన్ మాలిక్ ఉన్నప్పటికీ వారిద్దరికి అవకాశం రావడం కష్టమే. అయితే విండీస్తో టీ20 సిరీస్లో మాత్రం తుది జట్టులో ఉండొచ్చు.
ఆసియా కప్ కోసం తుది జట్టు (అంచనా): రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, చాహల్, బుమ్రా, షమీ/సిరాజ్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Mumbai Vs Hyderabad: ‘‘పొలార్డ్.. నువ్వేం మారలేదు.. నీ ఫీల్డింగ్ ఇప్పటికీ సూపర్’’
ఐపీఎల్ 17 సీజన్లో భాగంగా మే 6న ముంబయి, హైదరాబాద్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్లో విజయం కోసం ఇరు జట్లు వ్యూహాలు రచిస్తున్నాయి. ముంబయి బ్యాటింగ్ కోచ్ కీరన్ పొలార్డ్ మంచి ఫీల్డర్ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆరెంజ్ ఆర్మీతో మ్యాచ్ సందర్భంగా తమ జట్టు ఆటగాళ్లకు పొలార్డ్ బౌండరీ లైన్ వద్ద క్యాచ్లు ఎలా అందుకోవాలో శిక్షణ ఇచ్చాడు.
-
Mumbai Vs Hyderabad: ముంబయి, హైదరాబాద్ మ్యాచ్.. ఆటగాళ్ల సరదా సంభాషణ
ఐపీఎల్ 17 సీజన్లో భాగంగా మే 6న వాంఖడే స్టేడియం వేదికగా ముంబయి, హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. మైదానంలో ప్రాక్టీస్ సెషన్లో ఇరుజట్ల ఆటగాళ్లు సరదాగా ముచ్చటించుకున్నారు.
-
హైదరాబాద్ ‘ప్లేఆఫ్స్’ ఛాన్స్కు ముంబయి ఎసరు పెడుతుందా ?
ఐపీఎల్లో వాంఖడే వేదికగా మరో మ్యాచ్ జరగనుంది. హైదరాబాద్తో ముంబయి తలపడేందుకు సిద్ధమవుతోంది. -
Lucknow vs Kolkata: కృష్ణప్ప గౌతమ్ సూపర్ రన్నింగ్ క్యాచ్.. ఫీల్డింగ్ కోచ్ రియాక్షన్ చూశారా?
ఐపీఎల్ 17 సీజన్లో భాగంగా ఆదివారం కోల్కతాతో జరిగిన మ్యాచ్లో లఖ్నవూ 98 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. కానీ, ఈ మ్యాచ్లో లఖ్నవూ ఫీల్డర్ కృష్ణప్ప గౌతమ్ ఓ అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు.
-
టీ20 ప్రపంచకప్నకు ఉగ్ర ముప్పు..! స్పందించిన ట్రినిడాడ్ పీఎం, ఐసీసీ
ఐపీఎల్ ముగిసిన వారం రోజులకే మరో క్రికెట్ సంగ్రామం ప్రారంభం కానుంది. కానీ, దానిపై ఉగ్రమూకలు కన్నేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలపై ఐసీసీ స్పందించింది. -
కుర్రాళ్లు ఇంకా నేర్చుకోవాలి.. ఒత్తిడిని తట్టుకోవాలి: కేఎల్ రాహుల్
కోల్కతా చేతిలో భారీ ఓటమితో లఖ్నవూ పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి పడిపోయింది. మిగిలిన మూడు మ్యాచుల్లోనూ గెలిస్తేనే ఆ జట్టుకు ప్లేఆఫ్స్ బెర్తు ఖాయమవుతుంది. -
ధోనీకి ఎవరైనా చెప్పండి.. కనీసం 4 ఓవర్లు బ్యాటింగ్ చేయమని!: భారత మాజీ క్రికెటర్లు
తన టీ20 కెరీర్లో తొలిసారి ధోనీ 9వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చాడు. ఐపీఎల్ 17వ సీజన్లో పంజాబ్తో జరిగిన మ్యాచ్లో క్రీజ్లోకి వచ్చిన ధోనీ మొదటి బంతికే ఔటయ్యాడు. -
టాస్ ఓడితేనేం.. మ్యాచ్లు గెలుస్తున్నాం కదా: శ్రేయస్ అయ్యర్
హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసిన కోల్కతా ప్లేఆఫ్స్ బెర్తుకు దగ్గరైంది. తన చివరి మూడు మ్యాచుల్లో ఒక్కటి గెలిస్తే నాకౌట్ దశకు చేరుకోవడం ఖాయం. ఇప్పటికే అందరికంటే ముందున్న ఆ జట్టు ఓడినా ఇబ్బంది ఉండకపోవచ్చు. -
పంజాబ్తో మ్యాచ్.. ధోనీ రికార్డును అధిగమించిన రవీంద్ర జడేజా
పంజాబ్ను చిత్తు చేయడంలో చెన్నై ఆల్రౌండర్ రవీంద్ర జడేజా కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. -
జ్వరం బారిన ప్లేయర్లు.. ఎవరు ఆడతారో తెలియలేదు: రుతురాజ్
పంజాబ్పై చెన్నై ప్రతీకార విజయం సాధించింది. చెపాక్లో జరిగిన పరాభావానికి ధర్మశాలలో బదులు తీర్చుకుంది. ప్లేఆఫ్స్ రేసులో ముందుకు దూసుకొచ్చింది. -
కోల్కతా నం.1
కోల్కతాది అదే జోరు. ఈ సీజన్లో అదిరే ప్రదర్శనతో దూసుకుపోతున్న నైట్రైడర్స్.. వరుసగా మూడో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. అంతే కాక ఎనిమిదో విజయంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుని ప్లేఆఫ్స్ స్థానాన్ని దాదాపుగా ఖాయం చేసుకుంది. -
చెన్నై చుట్టేసింది
చివరి నాలుగు మ్యాచ్ల్లో ఒక్కటే గెలుపు! పంజాబ్తో మ్యాచ్లో చేసింది 167 పరుగులే! ఆడుతోంది తటస్థ వేదిక ధర్మశాలలో! అయినా చెన్నై గట్టెక్కింది. కట్టుదిట్టమైన బౌలింగ్తో ప్రత్యర్థిని చుట్టేసి కీలక విజయం సాధించింది. -
బజ్రంగ్పై వేటు
స్టార్ రెజ్లర్ బజ్రంగ్ పునియాను జాతీయ డోపింగ్ నిరోధ సంస్థ (నాడా) సస్పెండ్ చేసింది. ఇటీవల ట్రయల్స్ సందర్భంగా డోప్ టెస్టు కోసం నమూనా ఇవ్వడానికి అతడు తిరస్కరించడంతో నాడా ఈ నిర్ణయం తీసుకుంది. -
జ్యోతికశ్రీ బృందానికి నిరాశ
పారిస్ ఒలింపిక్స్కు అర్హత టోర్నీగా జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ రిలే తొలి అంచె టోర్నీలో తెలుగమ్మాయి దండి జ్యోతికశ్రీ బృందానికి నిరాశ ఎదురైంది. -
అక్టోబరు 6న పాక్తో భారత్ ఢీ
బంగ్లాదేశ్ ఆతిథ్యమివ్వనున్న మహిళల టీ20 ప్రపంచకప్లో భారత్ గ్రూప్ ‘ఎ’లో పోటీ పడనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్థాన్, ఓ క్వాలిఫయర్ ఈ గ్రూప్లోని ఇతర జట్లు. -
బంగ్లాకు మరో విజయం
జింబాబ్వేతో అయిదు టీ20ల సిరీస్లో బంగ్లాదేశ్ వరుసగా రెండో విజయం సాధించింది. ఆదివారం రెండో టీ20లో ఆ జట్టు 6 వికెట్ల తేడాతో నెగ్గింది. మొదట జింబాబ్వే 20 ఓవర్లలో 7 వికెట్లకు 138 పరుగులే చేసింది. -
అవే సిరాజ్ బలాలు
తనపై తనకి నమ్మకం, వెనుదీయని తత్వం పేసర్ మహ్మద్ సిరాజ్ నిజమైన బలాలని సునీల్ గావస్కర్ అన్నాడు. ‘‘మైదానంలో సిరాజ్ సర్వశక్తులూ ఒడ్డుతాడు. -
పుజారా శతకం
భారత టెస్టు జట్టులోకి పునరాగమనం చేయాలని ఆశిస్తున్న సీనియర్ బ్యాటర్ చెతేశ్వర్ పుజారా ఈ కౌంటీ సీజన్లో తొలి శతకం సాధించాడు. ససెక్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న పుజారా..
తాజా వార్తలు (Latest News)
-
ఏపీ నూతన డీజీపీగా హరీశ్కుమార్ గుప్తా
-
సీఎం రేవంత్ స్థాయి మరిచి మాట్లాడుతున్నారు: డీకే అరుణ
-
ఓటీటీలోకి హారర్ కామెడీ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
-
హైదరాబాద్ ‘ప్లేఆఫ్స్’ ఛాన్స్కు ముంబయి ఎసరు పెడుతుందా ?
-
టీ20 ప్రపంచకప్నకు ఉగ్ర ముప్పు..! స్పందించిన ట్రినిడాడ్ పీఎం, ఐసీసీ
-
ఏపీ నూతన డీజీపీ కోసం ముగ్గురు పేర్లతో ఈసీకి సిఫార్సు