Jasprit Bumrah: ధోనీనే స్ఫూర్తి.. బుమ్రా కూడా అతడి లాగే..!
జస్ప్రిత్ బుమ్రా ఒక ఫాస్ట్ బౌలర్గా జట్టులోకి వచ్చి.. అనతికాలంలోనే మంచి పేరు సాధించి.. ప్రపంచంలోనే మేటి డెత్ ఓవర్ల స్పెషలిస్టుగా ఎదిగాడు...
జస్ప్రిత్ బుమ్రా ఫాస్ట్ బౌలర్గా జట్టులోకి వచ్చి.. అనతికాలంలోనే మంచి పేరు సంపాదించుకున్నాడు. ప్రపంచంలోనే మేటి డెత్ ఓవర్ల స్పెషలిస్టుగా ఎదిగాడు. అయితే, కొంత కాలంగా తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేక తీవ్ర ఇబ్బందులు పడిన అతడు ఇప్పుడు భారత టెస్టు క్రికెట్ పగ్గాలు అందుకున్నాడు. ఈ నేపథ్యంలో బుమ్రా గురించి ప్రత్యేక కథనం..
ధోనీనే స్ఫూర్తి..
బుమ్రా ఇంతకుముందెప్పుడూ, ఏ స్థాయిలో కెప్టెన్గా పనిచేయలేదు. ఇప్పుడు నేరుగా టీమ్ఇండియాకే నాయకత్వం వహించబోతున్నాడు. టీమ్ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ 2007లో భారత టీ20 జట్టుకు కెప్టెన్సీ చేపట్టకముందు ఆ బాధ్యతలు నిర్వర్తించలేదు. ఈ విషయాన్ని ధోనీనే స్వయంగా బుమ్రాకు చెప్పాడట. ఆ తర్వాత అంతర్జాతీయ స్థాయిలో మహీ గొప్ప సారథిగా ఎదిగాడు. ప్రపంచ క్రికెట్లో మరే సారథికీ సాధ్యంకాని మూడు ఐసీసీ ట్రోఫీలు సాధించి ఎవరూ తనకు సాటిలేరని నిరూపించుకున్నాడు. ఇప్పుడు బుమ్రా కూడా అదే బాటలో పయనించాలని చూస్తున్నాడు. కొత్త బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధమేనని. అందుకు తన మాజీ సారథే స్ఫూర్తిగా నిలిచాడని బుమ్రా చెప్పాడు.
కపిల్ దేవ్ తర్వాత..
ఇక భారత దిగ్గజ సారథి కపిల్ దేవ్ తర్వాత టీమ్ఇండియా కెప్టెన్గా ఒక ప్రధాన ఫాస్ట్ బౌలర్ బాధ్యతలు చేపట్టడం ఇదే తొలిసారి. 1987లో చివరిసారి కపిల్ భారత జట్టు టెస్టు పగ్గాలు చేపట్టాడు. తర్వాత దిలిప్ వెంగ్సర్కార్, రవిశాస్త్రి, కృష్ణమాచారి శ్రీకాంత్, మహ్మద్ అజహరుద్దీన్, సచిన్ తెందూల్కర్, సౌరభ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్, వీరేందర్ సెహ్వాగ్, అనిల్ కుంబ్లే, మహేంద్రసింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ, అజింక్య రహానె, కేఎల్ రాహుల్, రోహిత్ శర్మలు ఆ బాధ్యతలు నిర్వర్తించారు. ఇందులో గంగూలీ మీడియం పేస్ వేయగలిగినా అతడు ప్రధాన పేసర్ కాదు. దీంతో కపిల్ తర్వాత ఆ బాధ్యతలు చేపడుతోన్న తొలి ఫాస్ట్ బౌలర్గా బుమ్రా రికార్డులకు ఎక్కనున్నాడు.
పంత్, రాహుల్లా కాకుండా..
టెస్టు క్రికెట్లో విరాట్ కోహ్లీ టీమ్ఇండియాను అత్యున్నత శిఖరాలకు చేర్చిన తర్వాత గతేడాది దక్షిణాఫ్రికా పర్యటనలో సిరీస్ కోల్పోయింది. ఈ నేపథ్యంలో అతడు ఆ బాధ్యతల నుంచి తప్పుకొన్నాడు. అనంతరం రోహిత్ శర్మ అన్ని ఫార్మాట్ల సారథిగా ఎంపికైనా వివిధ కారణాల చేత కొన్ని మ్యాచ్లకు ఆడలేకపోతున్నాడు. గాయాల సమస్య ఒకటైతే.. ఇప్పుడు కరోనాబారిన పడటం మరొకటి. దీంతో రోహిత్ అందుబాటులో లేని సమయాల్లో తాత్కాలిక కెప్టెన్లుగా వ్యవహరించిన కేఎల్ రాహుల్, రిషభ్ పంత్ పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. గతేడాది దక్షిణాఫ్రికా పర్యటనలోనే రాహుల్ ఒక టెస్టు, మూడు వన్డేలకు కెప్టెన్సీ చేసి ఒక్క మ్యాచ్ కూడా గెలిపించలేకపోయాడు. అతడి ప్రదర్శన కూడా ఏమాత్రం బాలేదు. మరోవైపు అదే జట్టుతో ఇటీవల స్వదేశంలో జరిగిన ఐదు టీ20ల సిరీస్లో పంత్ కెప్టెన్సీ చేశాడు. కానీ, తొలి రెండు మ్యాచ్ల్లో సరైన నిర్ణయాలు తీసుకోలేక తడబడ్డాడు. తర్వాత రెండు మ్యాచ్లు గెలిచాడు. అయితే ఇతర ఆటగాళ్లు అద్భుతంగా రాణించినా.. పంత్ బ్యాట్స్మన్గా తేలిపోయాడు. దీంతో బుమ్రా.. వాళ్లలా కాకుండా జట్టును ముందుండి నడిపించాలి.
అవసరమైతే కోహ్లీ నుంచి..
సహజంగానే బుమ్రా బౌలింగ్ యూనిట్కు పెద్ద అండగా నిలుస్తాడు. ఇప్పుడు జట్టు మొత్తాన్ని నడిపించడం కొత్త సవాలే. రోహిత్, రాహుల్ లాంటి టాప్ఆర్డర్ బ్యాట్స్మన్ లేకపోవడం.. కోహ్లీ అంతగా ఫామ్లో లేకపోవడం.. పుజారా కౌంటీ క్రికెట్లో రాణించినా కీలక పోరులో ఏమేరకు రాణిస్తాడో తెలియని పరిస్థితి నెలకొనడం.. పంత్ బ్యాటింగ్ కూడా కాస్త ఆందోళన కలిగిస్తున్న పరిస్థితుల్లో.. ఇప్పుడు ఆశలన్నీ బౌలింగ్ యూనిట్పైనే ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఏమాత్రం కెప్టెన్సీ అనుభవం లేని బుమ్రా జట్టును ఎలా నడిపిస్తాడన్నది ఆసక్తికరం. అయితే అతడు పంత్, రాహుల్లా తడబాటుకు గురికాకుండా ఉంటే మంచిది. అవసరమైతే కోహ్లీ లాంటి అనుభవజ్ఞుడి నుంచి సలహాలు, సూచనలు తీసుకోవడం ఉత్తమం. ఇప్పటికే టీమ్ఇండియా 2-1 తేడాతో ఈ సిరీస్లో ఆధిక్యంలో నిలవగా.. ఈ టెస్టు కూడా గెలిస్తే ఇంతకుముందు ఎప్పుడూ లేని విధంగా ఇంగ్లాండ్ గడ్డపై 3-1 తేడాతో చారిత్రక విజయం సాధించే సువర్ణావకాశం ఉంది. మరోవైపు రాహుల్ ద్రవిడ్ లాంటి మేటి ఆటగాడు కోచ్గా ఉండటం అతడికి కలిసొచ్చే అంశం. అయితే, ఇంగ్లాండ్ జట్టు ఇప్పుడు న్యూజిలాండ్పై 3-0 తేడాతో గెలిచి మంచి ఆత్మవిశ్వాసంతో ఉన్న నేపథ్యంలో బుమ్రా సారథ్యంలోని టీమ్ఇండియా మరింత జాగ్రత్తగా ఆడాలి.
- ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అప్పుడు ధోనీ నన్ను ఎత్తుకోవడం ఎంతో ఆనందం కలిగించింది..: రవీంద్ర జడేజా
ధోనీతో తనకున్న అనుబంధాన్ని ఓ ఇంటర్వ్యూలో రవీంద్ర జడేజా గుర్తు చేసుకున్నాడు. -
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం
సమయస్ఫూర్తి ప్రదర్శించడంలో ధోనీ తర్వాతే ఎవరైనా. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అతడు ఇచ్చిన సమాధానమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. -
హెన్రిచ్ క్లాసెన్.. సన్రైజర్స్కు భలే దొరికాడు
ఐపీఎల్ 17వ సీజన్లో హైదరాబాద్ వరుసగా రెండు మ్యాచుల్లోనూ దూకుడైన బ్యాటింగ్ చేసింది. అందుకు ప్రధాన కారణం హెన్రిచ్ క్లాసెన్. -
‘మిలిటరీ తరహా కోచ్’ అంటూ వీజ్ వ్యాఖ్యలు.. ఆండ్రి రస్సెల్ కౌంటర్
భారత్లో అత్యుత్తమ కోచ్ల్లో ఒకరైన చంద్రకాంత్ పండిత్పై నమీబియా ఆటగాడు చేసిన కామెంట్లు సంచలనంగా మారాయి. వాటిని కొట్టిపడేస్తూ ఆండ్రి రస్సెల్ కీలక వ్యాఖ్యలు చేశాడు. -
కేరళలోనూ రియాన్ గురించే అడిగేవారు.. ఇప్పుడు 15 మంది కీలకమే: సంజూ
ఐపీఎల్ 17వ సీజన్లో రాజస్థాన్ దూకుడు ప్రదర్శిస్తోంది. వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. -
మా అమ్మ ఇక్కడే ఉన్నారు.. 4 ఏళ్లుగా నా కష్టాలను చూశారు: రియాన్ పరాగ్
రాజస్థాన్ ఆటగాడు రియాన్ పరాగ్ ఈ ఐపీఎల్ సీజన్లో అదరగొట్టేస్తున్నాడు. దిల్లీపై భారీ ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. -
హార్దిక్ సవాళ్ల ప్రయాణం..
ముంబయి ఇండియన్స్ నుంచి గుజరాత్ టైటాన్స్కు వెళ్లి కెప్టెన్గా నిరూపించుకున్నాడు హార్దిక్ పాండ్య. -
పరాగ్ ఫటాఫట్
ఆరంభంలో దిల్లీ అదరహో.. రాజస్థాన్ పరిస్థితి చూసి జాలి పడే పరిస్థితి.. కానీ ఇన్నింగ్స్ అయ్యేసరికి రాయల్స్దే పైచేయి! ఛేదన ఆరంభంలో దిల్లీదే ఆధిపత్యం.. తర్వాత రాజస్థాన్ జోరు.. మళ్లీ డీసీ పైచేయి.. అంతలోనే రాయల్స్ దూకుడు! -
క్వార్టర్స్లో సింధు
మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో పీవీ సింధు జోరు కొనసాగుతోంది. -
విహారికి షోకాజ్ నోటీసు
టీమ్ఇండియా టెస్టు క్రికెటర్ హనుమ విహారికి ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. -
ఐపీఎల్ అంటే క్రికెట్టేనా!
ఐపీఎల్ ఊహించని స్థాయిలో వృద్ధి చెందిందని, కొన్ని సార్లు ఈ లీగ్ అంటే క్రికెట్టేనా! అనే ఆశ్చర్యమూ కలుగుతుందని రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. -
నితిన్ అయిదోసారి..
భారత అంపైర్ నితిన్ మేనన్ అయిదోసారి ఐసీసీ ఎలైట్ ప్యానల్లో చోటు దక్కించుకున్నాడు. ఇం -
అమ్మో నైట్రైడర్స్ కోచ్
కోల్కతా నైట్రైడర్స్ కోచ్ చంద్రకాంత్ పండిత్ కోచింగ్ విధానాలపై ఆ జట్టు మాజీ ఆటగాడు, నమీబియా ఆల్రౌండర్ డేవిడ్ వీజ్ అసహనం వ్యక్తం చేశాడు. -
నీరజ్.. దోహా టోర్నీతో షూరూ
ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా ఈ సీజన్ను మే 10న ఆరంభమయ్యే డైమండ్ లీగ్ దోహా అంచె టోర్నీతో షురూ చేయనున్నాడు. -
బుమ్రాను ఎందుకు కొనసాగించలేదో?
సన్రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో ముంబయి ఇండియన్స్ హార్దిక్ పాండ్య బౌలింగ్ వ్యూహాలు అంతుచిక్కని విధంగా సాగాయని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అన్నాడు. -
సూర్య ఇంకొన్ని రోజులు!
సూర్యకుమార్ యాదవ్ ఐపీఎల్-17లో ముంబయి ఇండియన్స్కు అందుబాటులోకి రావడానికి ఇంకొన్ని రోజులు సమయం పడుతుందని సమాచారం. -
కోల్కతా జట్టులోకి 16 ఏళ్ల స్పిన్నర్
గాయంతో ఈ ఐపీఎల్ సీజన్కు దూరమైన ముజీబ్ ఉర్ రెహ్మాన్ స్థానాన్ని మరో అఫ్గాన్ స్పిన్నర్ అల్లా గజన్ఫర్తో కోల్కతా నైట్రైడర్స్ భర్తీ చేసింది. -
ఐపీఎల్ తొలిరోజు వీక్షకులు 16.8 కోట్లు
వీక్షణలో ఐపీఎల్-17 కొత్త రికార్డు నెలకొల్పింది. -
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు జరిగింది. ముజీబ్ స్థానంలో అల్లాహ్ ఘజన్ఫర్, ప్రసీధ్ కృష్ణ స్థానంలో కేశవ్ మహరాజ్ జట్టులోకి వచ్చారు.
తాజా వార్తలు (Latest News)
-
బిహార్లో తేలిన సీట్ల లెక్క.. 26 స్థానాల్లో ఆర్జేడీ, 9 చోట్ల కాంగ్రెస్
-
జనసేనలో చేరతానని నేను చెప్పలేదు: అనసూయ
-
కేజ్రీవాల్ కోసం మెసేజ్లు పంపండి.. వాట్సప్ నంబరు షేర్ చేసిన సతీమణి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
అప్పుడు ధోనీ నన్ను ఎత్తుకోవడం ఎంతో ఆనందం కలిగించింది..: రవీంద్ర జడేజా
-
కేసీఆర్ చేసిన మొదటి తప్పు అదే: మంత్రి కోమటిరెడ్డి