Jasprit Bumrah: ధోనీనే స్ఫూర్తి.. బుమ్రా కూడా అతడి లాగే..!
జస్ప్రిత్ బుమ్రా ఒక ఫాస్ట్ బౌలర్గా జట్టులోకి వచ్చి.. అనతికాలంలోనే మంచి పేరు సాధించి.. ప్రపంచంలోనే మేటి డెత్ ఓవర్ల స్పెషలిస్టుగా ఎదిగాడు...
జస్ప్రిత్ బుమ్రా ఫాస్ట్ బౌలర్గా జట్టులోకి వచ్చి.. అనతికాలంలోనే మంచి పేరు సంపాదించుకున్నాడు. ప్రపంచంలోనే మేటి డెత్ ఓవర్ల స్పెషలిస్టుగా ఎదిగాడు. అయితే, కొంత కాలంగా తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేక తీవ్ర ఇబ్బందులు పడిన అతడు ఇప్పుడు భారత టెస్టు క్రికెట్ పగ్గాలు అందుకున్నాడు. ఈ నేపథ్యంలో బుమ్రా గురించి ప్రత్యేక కథనం..
ధోనీనే స్ఫూర్తి..
బుమ్రా ఇంతకుముందెప్పుడూ, ఏ స్థాయిలో కెప్టెన్గా పనిచేయలేదు. ఇప్పుడు నేరుగా టీమ్ఇండియాకే నాయకత్వం వహించబోతున్నాడు. టీమ్ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ 2007లో భారత టీ20 జట్టుకు కెప్టెన్సీ చేపట్టకముందు ఆ బాధ్యతలు నిర్వర్తించలేదు. ఈ విషయాన్ని ధోనీనే స్వయంగా బుమ్రాకు చెప్పాడట. ఆ తర్వాత అంతర్జాతీయ స్థాయిలో మహీ గొప్ప సారథిగా ఎదిగాడు. ప్రపంచ క్రికెట్లో మరే సారథికీ సాధ్యంకాని మూడు ఐసీసీ ట్రోఫీలు సాధించి ఎవరూ తనకు సాటిలేరని నిరూపించుకున్నాడు. ఇప్పుడు బుమ్రా కూడా అదే బాటలో పయనించాలని చూస్తున్నాడు. కొత్త బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధమేనని. అందుకు తన మాజీ సారథే స్ఫూర్తిగా నిలిచాడని బుమ్రా చెప్పాడు.
కపిల్ దేవ్ తర్వాత..
ఇక భారత దిగ్గజ సారథి కపిల్ దేవ్ తర్వాత టీమ్ఇండియా కెప్టెన్గా ఒక ప్రధాన ఫాస్ట్ బౌలర్ బాధ్యతలు చేపట్టడం ఇదే తొలిసారి. 1987లో చివరిసారి కపిల్ భారత జట్టు టెస్టు పగ్గాలు చేపట్టాడు. తర్వాత దిలిప్ వెంగ్సర్కార్, రవిశాస్త్రి, కృష్ణమాచారి శ్రీకాంత్, మహ్మద్ అజహరుద్దీన్, సచిన్ తెందూల్కర్, సౌరభ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్, వీరేందర్ సెహ్వాగ్, అనిల్ కుంబ్లే, మహేంద్రసింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ, అజింక్య రహానె, కేఎల్ రాహుల్, రోహిత్ శర్మలు ఆ బాధ్యతలు నిర్వర్తించారు. ఇందులో గంగూలీ మీడియం పేస్ వేయగలిగినా అతడు ప్రధాన పేసర్ కాదు. దీంతో కపిల్ తర్వాత ఆ బాధ్యతలు చేపడుతోన్న తొలి ఫాస్ట్ బౌలర్గా బుమ్రా రికార్డులకు ఎక్కనున్నాడు.
పంత్, రాహుల్లా కాకుండా..
టెస్టు క్రికెట్లో విరాట్ కోహ్లీ టీమ్ఇండియాను అత్యున్నత శిఖరాలకు చేర్చిన తర్వాత గతేడాది దక్షిణాఫ్రికా పర్యటనలో సిరీస్ కోల్పోయింది. ఈ నేపథ్యంలో అతడు ఆ బాధ్యతల నుంచి తప్పుకొన్నాడు. అనంతరం రోహిత్ శర్మ అన్ని ఫార్మాట్ల సారథిగా ఎంపికైనా వివిధ కారణాల చేత కొన్ని మ్యాచ్లకు ఆడలేకపోతున్నాడు. గాయాల సమస్య ఒకటైతే.. ఇప్పుడు కరోనాబారిన పడటం మరొకటి. దీంతో రోహిత్ అందుబాటులో లేని సమయాల్లో తాత్కాలిక కెప్టెన్లుగా వ్యవహరించిన కేఎల్ రాహుల్, రిషభ్ పంత్ పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. గతేడాది దక్షిణాఫ్రికా పర్యటనలోనే రాహుల్ ఒక టెస్టు, మూడు వన్డేలకు కెప్టెన్సీ చేసి ఒక్క మ్యాచ్ కూడా గెలిపించలేకపోయాడు. అతడి ప్రదర్శన కూడా ఏమాత్రం బాలేదు. మరోవైపు అదే జట్టుతో ఇటీవల స్వదేశంలో జరిగిన ఐదు టీ20ల సిరీస్లో పంత్ కెప్టెన్సీ చేశాడు. కానీ, తొలి రెండు మ్యాచ్ల్లో సరైన నిర్ణయాలు తీసుకోలేక తడబడ్డాడు. తర్వాత రెండు మ్యాచ్లు గెలిచాడు. అయితే ఇతర ఆటగాళ్లు అద్భుతంగా రాణించినా.. పంత్ బ్యాట్స్మన్గా తేలిపోయాడు. దీంతో బుమ్రా.. వాళ్లలా కాకుండా జట్టును ముందుండి నడిపించాలి.
అవసరమైతే కోహ్లీ నుంచి..
సహజంగానే బుమ్రా బౌలింగ్ యూనిట్కు పెద్ద అండగా నిలుస్తాడు. ఇప్పుడు జట్టు మొత్తాన్ని నడిపించడం కొత్త సవాలే. రోహిత్, రాహుల్ లాంటి టాప్ఆర్డర్ బ్యాట్స్మన్ లేకపోవడం.. కోహ్లీ అంతగా ఫామ్లో లేకపోవడం.. పుజారా కౌంటీ క్రికెట్లో రాణించినా కీలక పోరులో ఏమేరకు రాణిస్తాడో తెలియని పరిస్థితి నెలకొనడం.. పంత్ బ్యాటింగ్ కూడా కాస్త ఆందోళన కలిగిస్తున్న పరిస్థితుల్లో.. ఇప్పుడు ఆశలన్నీ బౌలింగ్ యూనిట్పైనే ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఏమాత్రం కెప్టెన్సీ అనుభవం లేని బుమ్రా జట్టును ఎలా నడిపిస్తాడన్నది ఆసక్తికరం. అయితే అతడు పంత్, రాహుల్లా తడబాటుకు గురికాకుండా ఉంటే మంచిది. అవసరమైతే కోహ్లీ లాంటి అనుభవజ్ఞుడి నుంచి సలహాలు, సూచనలు తీసుకోవడం ఉత్తమం. ఇప్పటికే టీమ్ఇండియా 2-1 తేడాతో ఈ సిరీస్లో ఆధిక్యంలో నిలవగా.. ఈ టెస్టు కూడా గెలిస్తే ఇంతకుముందు ఎప్పుడూ లేని విధంగా ఇంగ్లాండ్ గడ్డపై 3-1 తేడాతో చారిత్రక విజయం సాధించే సువర్ణావకాశం ఉంది. మరోవైపు రాహుల్ ద్రవిడ్ లాంటి మేటి ఆటగాడు కోచ్గా ఉండటం అతడికి కలిసొచ్చే అంశం. అయితే, ఇంగ్లాండ్ జట్టు ఇప్పుడు న్యూజిలాండ్పై 3-0 తేడాతో గెలిచి మంచి ఆత్మవిశ్వాసంతో ఉన్న నేపథ్యంలో బుమ్రా సారథ్యంలోని టీమ్ఇండియా మరింత జాగ్రత్తగా ఆడాలి.
- ఇంటర్నెట్ డెస్క్ ప్రత్యేకం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టీమ్ఇండియాది అదే జోరు.. ఆసియాకప్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు
ఆసియా కప్లో భారత మహిళల జట్టు వరుస విజయాలతో దూసుకెళ్తోంది. సెమీస్లో బంగ్లాను చిత్తు చేసి ఫైనల్కు చేరింది. -
సెమీస్లో అదరగొట్టిన భారత బౌలర్లు.. టీమ్ఇండియా లక్ష్యం 81
ఆసియా కప్ తొలి సెమీస్లో భారత బౌలర్లు అదరగొట్టారు. ప్రత్యర్థిని 80 పరుగులకే కట్టడి చేశాడు. -
ఒలింపిక్స్కు ముప్పేటలా ముప్పు.. భారీగా రక్షణ ఏర్పాటుచేసిన ఫ్రాన్స్
పారిస్ ఒలిపిక్స్ ఆరంభ వేడుకలు కొన్ని గంటల్లో ఉండటంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే రైళ్లలో గందరగోళం సృష్టించడంతో నిర్వాహకుల్లో ఆందోళన పెంచింది. ఒలింపిక్స్కు ఉగ్ర ముప్పు ఉందని పలు ఇంటెలిజెన్స్ హెచ్చరికలు ఉన్నాయి. -
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కొత్తింటికి రాహుల్ గాంధీ.. ఆఫర్ చేసిన హౌస్ కమిటీ!
-
ఎల్ఆర్ఎస్ అమలుకు కొత్త జిల్లాల వారీగా ప్రత్యేక బృందాలు: డిప్యూటీ సీఎం భట్టి
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
ఐఐటీ ఖరగ్పూర్ నుంచి.. సుందర్ పిచాయ్కి గౌరవ డాక్టరేట్
-
పేర్లు ప్రదర్శించమని బలవంతం చేయలేం: సుప్రీం
-
ఆ రాష్ట్రాలను విభజించే కుట్ర - మమతా బెనర్జీ