Sanju Samson: ఈ సెంచరీ శాంసన్ కెరీర్కు ఎంత వరకు లాభం?
ఫ్లెక్సిబిలిటీ ఉంది. ఇన్నింగ్స్ నిర్మించగలడు. ఫీల్డింగ్లోనూ అదరగొడతాడు. కానీ అంతర్జాతీయంగా అరంగేట్రం చేసిన ఎనిమిదేళ్లకు తొలి సెంచరీ సాధించాడు. మరి, ఈ సెంచరీ అతని కెరీర్ను పరుగులు పెట్టిస్తుందో.. లేదో చూడాలి.
పవర్ హిట్టింగ్తో.. భారీ షాట్లతో.. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని మార్చగల ఆటగాడతను. ఐపీఎల్లో ఎన్నో మెరుపు ఇన్నింగ్స్లాడాడు. మరోవైపు వన్డేల్లో కండీషన్స్కు తగ్గట్లు ఆటతీరు మార్చుకోగల నైపుణ్యం అతని సొంతం. అంతర్జాతీయ వన్డేల్లో అతని నిలకడే అందుకు నిదర్శనం. కానీ, తగినన్ని అవకాశాలు రాక.. వచ్చిన ఛాన్స్ను ఉపయోగించుకోలేక.. వెనుకబడ్డాడు. ఆ ఆటగాడే సంజు శాంసన్ (Sanju Samson). కానీ ఇప్పుడు దక్షిణాఫ్రికాతో చివరి వన్డేలో శతకంతో సత్తాచాటాడు. మరి ఒడిదొడుకులతో.. ఆగుతూ సాగుతున్న అతని కెరీర్ను ఈ సెంచరీ నిలబెడుతుందా? అతని ప్రయాణాన్ని పరుగులు పెట్టిస్తుందా?
అన్నీ ఉన్నా..
దేశవాళీ క్రికెట్లో కేరళ తరపున శాంసన్ నిలకడగా రాణిస్తున్నాడు. ఐపీఎల్ (IPL)లో ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals) జట్టులోనూ కీలక ఆటగాడిగా ఎదిగాడు. ఫస్ట్క్లాస్, లిస్ట్- ఎ, టీ20లు కలిపి దేశవాళీ క్రికెట్లో పదహారు సెంచరీలు చేశాడు. ఐపీఎల్లో 3 శతకాలు సహా ఇప్పటివరకూ 152 మ్యాచ్ల్లో 3,888 పరుగులు చేశాడు. ఇందులో 20 అర్ధ శతకాలున్నాయి. ఇలా దేశవాళీల్లో, ఐపీఎల్లో అతని ప్రదర్శన నిలకడగా ఉంది. కానీ అంతర్జాతీయ క్రికెట్లో మాత్రం ఆశించినట్లుగా రాణించలేకపోతున్నాడు. 2015లో అంతర్జాతీయ అరంగేట్రం చేసినా తొలి శతకం సాధించేందుకు ఎనిమిదేళ్లు పట్టింది. ఇప్పటివరకూ అతను 16 వన్డేల్లో 56.66 సగటుతో 510 పరుగులు చేశాడు. 24 టీ20ల్లో 19.68 సగటుతో 374 పరుగులు సాధించాడు.
అతని గురించే చర్చ..
క్రికెట్లో శాంసన్ పేరు మైదానం లోపల కంటే బయటే ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. అతని గురించి తరచూ చర్చలు జరుగుతూనే ఉంటాయి. పరిమిత ఓవర్ల క్రికెట్లో భారత జట్టులో అతని పేరు లేకపోతే, అది వెంటనే తీవ్రమైన టాపిక్గా మారుతుంది. ఇటీవల ప్రపంచకప్లో టీమ్ఇండియాలో అతనికి చోటు దక్కకపోవడం, అలాగే ఆ మెగా టోర్నీ తర్వాత ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్కు ఎంపిక కాకపోవడం తెలిసిందే. దీంతో శాంసన్ అనుకూల వర్గాలు గొంతెత్తాయి. ప్రతిభావంతుడైన శాంసన్కు ఎందుకు అవకాశాలు ఇవ్వడం లేదంటూ ప్రశ్నించాయి. బీసీసీఐ, సెలక్షన్ కమిటీ తీరుపై మండిపడ్డాయి. మరోవైపు ఇచ్చిన అవకాశాలను వృథా చేసుకుంటున్నాడన్నది మరో వర్గం వాదన. టీ20ల్లో అతని ప్రదర్శనే అందుకు రుజువు. ఇప్పటివరకూ భారత్ తరపున టీ20ల్లో శాంసన్ చెప్పుకోదగ్గ ప్రదర్శనే చేయలేదు. 21 సార్లు బ్యాటింగ్ చేసిన అతను కేవలం ఒక్క హాఫ్ సెంచరీ మాత్రమే చేయగలిగాడు. అంతర్జాతీయ క్రికెట్లో ఉండే ఒత్తిడిని అతను తట్టుకోవడం లేదంటూ, శాంసన్కు బదులు వేరే ఆటగాళ్లను ప్రోత్సాహించాలనే కామెంట్లూ వినిపిస్తూనే ఉంటాయి.
రాత మారేనా?
దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ సంజు శాంసన్ కెరీర్కు అతి పెద్ద పరీక్ష. ఈ సిరీస్లో విఫలమైతే మాత్రం అతను మళ్లీ జాతీయ జట్టుకు ఎంపికవడం కష్టమేనన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. తొలి వన్డేలో అతనికి బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. రెండో వన్డేలో 12 పరుగులే చేసి అవకాశాన్ని వృథా చేసుకున్నాడు. దీంతో శాంసన్ కథ ఇక అంతేననుకున్నారు. కానీ చివరి వన్డేలో అద్భుత శతకంతో శాంసన్ ఆశలు నిలబెట్టుకున్నాడు. దక్షిణాఫ్రికా గడ్డపై కఠినమైన పరిస్థితుల్లో సెంచరీతో రాణించాడు. ఈ సెంచరీ శాంసన్ కెరీర్కు అవసరమైన వేగాన్ని అందిస్తుందనడంలో సందేహం లేదు. కానీ జట్టులో ఉన్న పోటీని దాటి అతను నెగ్గుకురాగలడా? అన్నదే ఇక్కడ ప్రశ్న. సెంచరీ తర్వాత కండలను చూపిస్తూ ‘ఇదీ నా సామర్థ్యం’ అని శాంసన్ సంకేతాన్నిచ్చాడు. అయితే జట్టులో, బ్యాటింగ్ ఆర్డర్లో అతనికి ఓ నిర్దిష్టమైన ప్లేసంటూ లేదనే చెప్పాలి.
వన్డేల్లో పది ఇన్నింగ్స్ల్లో అతను 5 లేదా 6 ప్లేసులో బ్యాటింగ్ చేశాడు. కానీ దేశవాళీల్లో శాంసన్ వన్డౌన్లో బ్యాటింగ్కు వస్తాడు. ఇప్పుడు దక్షిణాఫ్రికాతో వన్డేలో అదే ప్లేసులో వచ్చి సెంచరీ చేశాడు. కానీ వన్డేల్లో సాధారణంగా ఆ ప్లేసు కోహ్లిది. అంటే కోహ్లి ఉండగా శాంసన్ వేరే ప్లేసులో ఆడాల్సిందే. అయితే కోహ్లి ఇటీవల ఎక్కువగా విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో శాంసన్ వన్డౌన్లో నిలకడగా రాణిస్తే.. కోహ్లి తర్వాత ఆ చోటు అతనిదే అని చెప్పాలి. మరి ఈ సెంచరీతోనైనా శాంసన్ రాత మారుతుందేమో చూడాలి.
-ఈనాడు క్రీడా విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
పారిస్ ఒలింపిక్స్ రికర్వ్ ఆర్చరీలో తన అద్భుత ప్రదర్శనతో మన తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ ఆకట్టుకుంటున్నాడు. -
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
అతడి బాణం గురి తప్పదు.. ఎవరీ బొమ్మదేవర ధీరజ్..?
-
మట్టిచరియల బీభత్సంతో పెను విషాదం.. ఇథియోపియాలో 257కి చేరిన మృతులు
-
ప్రపంచంలోని గొప్ప ప్రదేశాల్లో హైదరాబాద్ ‘మనం చాక్లెట్’!
-
మదనపల్లె ఘటనలో ఉద్యోగులపై వేటు తప్పదు: ఆర్పీ సిసోదియా
-
కమలాహారిస్కు ఒబామా దంపతుల మద్దతు
-
దిగొచ్చిన బంగారం ధర.. దుకాణాల్లో కొనుగోళ్ల జోష్..!