IPL 2024: లీగ్ స్టేజ్లో చివరి రోజు.. ‘నంబర్ 2’ ఎవరిది..?
ఇప్పుడు ప్లేఆఫ్స్ బెర్తుల ఆట లేదు. కానీ, ఇవాళ తలపడనున్న నాలుగు జట్లలో రెండింటికి ఈ మ్యాచ్లు అత్యంత కీలకం.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 17వ సీజన్ లీగ్ స్టేజ్ ఆఖరికి చేరుకుంది. ఇవాళ జరగనున్న రెండు మ్యాచ్లతో గ్రూప్ దశ ముగిసినట్లే. ఇప్పటికే ప్లేఆఫ్స్ ఖరారైనా సరే.. ఈ మ్యాచ్ల ఫలితాలు ముఖ్యమే. పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లకు ఓడినా మరో అవకాశం ఉంటుంది. ఇప్పటికే అగ్రస్థానం ఖాయం కాగా.. రెండో స్థానంలోకి వచ్చే అవకాశం హైదరాబాద్, రాజస్థాన్ జట్లకు మాత్రమే ఉంది.
హైదరాబాద్ X పంజాబ్..
ప్రస్తుతం పాయింట్ల పట్టికలో హైదరాబాద్ది మూడో స్థానం. ఈ జట్టు ఖాతాలో 15 పాయింట్లు ఉన్నాయి. తన చివరి లీగ్ మ్యాచ్ను పంజాబ్తో ఉప్పల్ వేదికగా మధ్యాహ్నం 3.30గంటలకు ఆడనుంది. ఇందులో పీబీకేఎస్ గెలిచినా పెద్దగా ఉపయోగం లేదు. ఈ మ్యాచ్లో పంజాబ్ను జితేశ్ శర్మ నడిపిస్తాడు. ఒక్కస్థానం పైకి ఎగబాకే అవకాశం మాత్రమే ఉంది. కానీ, సన్రైజర్స్ గెలిస్తే 17 పాయింట్లతో తాత్కాలికంగా రెండో స్థానంలోకి వస్తుంది. ఇదే ప్లేస్ ఖరారు కావాలంటే మాత్రం ఇంకాస్త సమయం వేచి చూడాలి. ఇవాళ రాత్రికి (7.30 గంటలకు ప్రారంభం) జరిగే మ్యాచ్లో రాజస్థాన్ ఓటమిని చవిచూడాలి. ఒకవేళ కేకేఆర్ X ఆర్ఆర్ మ్యాచ్ రద్దైతే నెట్రన్రేట్ కీలకంగా మారుతుంది.
రాజస్థాన్ X కోల్కతా
గువాహతి వేదికగా లీగ్ చివరి మ్యాచ్ జరగనుంది. ఇందులో కేకేఆర్ గెలిచినా.. ఓడినా తన తొలి స్థానానికి వచ్చే ప్రమాదం లేదు. కానీ, ఆర్ఆర్ విజయం సాధిస్తే మాత్రం రెండో స్థానంతో నాకౌట్లో ఆడుతుంది. అయితే, గత నాలుగు మ్యాచుల్లోనూ ఓడిపోయిన రాజస్థాన్ ప్లేఆఫ్స్కు ముందు విజయంతో వెళ్లాలనే లక్ష్యంతో బరిలోకి దిగనుంది. అయితే, అన్ని విభాగాల్లోనూ పటిష్ఠంగా ఉన్న కోల్కతాను ఢీకొట్టడం తేలికైన విషయం కాదు.
వర్షార్పణం అయితే..
ఈ రెండు మ్యాచ్లకూ వర్షం ముప్పు ఉన్నట్లు వాతావరణ శాఖ చెబుతోంది. అలా జరిగితే కోల్కతా 20 పాయింట్లు, రాజస్థాన్ 17, హైదరాబాద్ 16, బెంగళూరు 14 పాయింట్లతో నాకౌట్లో తలపడతాయి. అప్పుడు తొలి క్వాలిఫయర్లో మళ్లీ కేకేఆర్ - ఆర్ఆర్ మ్యాచ్ను చూస్తాం. గెలిచిన టీమ్ నేరుగా ఫైనల్కు చేరుతుంది. ఎలిమినేటర్లో ఎస్ఆర్హెచ్ - ఆర్సీబీ ఢీకొట్టుకుంటాయి. ఇందులో గెలిచిన జట్టు.. తొలి క్వాలిఫయర్లో ఓడిన టీమ్తో ఫైనల్ బెర్తు కోసం పోటీ పడనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
గౌతమ్ గంభీర్ టీమ్ ఇండియా కోచ్గా రావడం సానుకూల పరిణామమే అని మాజీ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. కాకపోతే, ఆటగాళ్లను అర్థం చేసుకోవడమే గౌతీ ముందున్న అతిపెద్ద సవాల్గా అభివర్ణించాడు. -
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Women's Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
దిగొచ్చిన బంగారం ధర.. దుకాణాల్లో కొనుగోళ్ల జోష్..!
-
పెద్దిరెడ్డి, మిథున్రెడ్డి మంచోళ్లు: మాజీ సీఎం జగన్
-
భారత్ ఆధ్వర్యంలో క్వాడ్ సదస్సుకు బైడెన్ హాజరవుతారు: శ్వేత సౌధం
-
రివ్యూ: ‘రాయన్’.. ధనుష్ 50వ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా?
-
గంభీర్ ఎదుట ముఖ్య కర్తవ్యం అదొక్కటే: మాజీ కోచ్ రవిశాస్త్రి
-
యశ్ ‘టాక్సిక్’లో బాలీవుడ్ భామ.. ఆ విషయం తాను చెప్పలేదంటూ పోస్ట్