Ashwin - Eliminator: పొత్తికడుపు గాయంతో బాధపడ్డా.. వయసు పెరుగుతోంది కదా: అశ్విన్
ఎలిమినేటర్ మ్యాచ్లో బెంగళూరును చిత్తు చేసి రాజస్థాన్ రెండో క్వాలిఫయర్లో అడుగు పెట్టింది. ఆర్ఆర్ విజయంలో రవిచంద్రన్ అశ్విన్ కీలక పాత్ర పోషించాడు.
ఇంటర్నెట్ డెస్క్: భారీ హిట్టర్లు ఉన్న బెంగళూరు జట్టును అడ్డుకోవడంలో పేసర్లు సందీప్ శర్మ, అవేశ్ ఖాన్ ఇబ్బంది పడ్డారు. వీరిద్దరూ ధారాళంగా పరుగులు సమర్పించారు. బౌల్ట్ నాణ్యమైన పేస్తో ఆకట్టుకున్నాడు. మణికట్టు మాంత్రికుడు చాహల్ (1/43) కూడా ప్రభావం చూపించలేదు. సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (2/19) పదునైన బౌలింగ్తో బెంగళూరును అడ్డుకున్నాడు. కీలకమైన గ్రీన్తోపాటు మ్యాక్స్వెల్ (0)ను ఔట్ చేసి రాజస్థాన్ పైచేయి సాధించేలా చేశాడు. అతడికే ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. క్వాలిఫయర్ 2కి దూసుకెళ్లిన తమ జట్టు గత ప్రదర్శనపై అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
‘‘మేం గత నాలుగు మ్యాచుల్లో ఓడిపోయాం. కొన్ని అంశాల్లో ఇబ్బంది పడ్డాం. ప్రత్యర్థుల ముందు భారీ స్కోర్లు ఉంచలేకపోయాం. బట్లర్ స్వదేశానికి వెళ్లిపోయాడు. హెట్మయెర్ ఈ మ్యాచ్కు ముందు గాయపడ్డాడు. ఇప్పుడీ విజయం మాకు అత్యంత కీలకం. ఇది ఆత్మవిశ్వాసం నింపింది. రెండో క్వాలిఫయర్లో మరింత ఉత్సాహంగా పోరాడతాం. ఈ సీజన్ తొలి అర్ధభాగంలో నా శరీరం అనుకున్నంతమేర సహకరించలేదు. అసౌకర్యంగా అనిపించింది. పొత్తికడుపులో గాయం ఇబ్బందికి గురి చేసింది. దాని నుంచి కోలుకుని వచ్చా. టెస్టు క్రికెట్ ఆడి నేరుగా ఇలాంటి మెగా లీగ్కు రావడం.. కుదురుకోవడం చాలా కష్టం. టీ20 ఫార్మాట్కు తగ్గట్టుగా బౌలింగ్ లయను అందుకోవడానికి కాస్త సమయం పట్టింది. ఒక్కసారి ఫ్రాంచైజీ కోసం కమిట్మెంట్ ఇచ్చినప్పుడు తీవ్రంగా శ్రమించైనా ఫలితం అందించాలి. ఈ మ్యాచ్లో బౌల్ట్ సరైన లెంగ్త్తో బౌలింగ్ ప్రారంభించాడు. స్వింగ్ను రాబట్టాడు. ఇక రెండో ఇన్నింగ్స్కు మంచు ప్రభావం ఉండే ఉంటుంది. మా బ్యాటర్లు కూడా అద్భుతమైన షాట్లతో బెంగళూరుపై ఆధిపత్యం ప్రదర్శించారు. అనుభవం కలిగిన క్రికెటర్లతోపాటు యువకులూ ఉండటం మా బలం. హెట్మయెర్ కీలక సమయంలో జట్టులోకి వచ్చాడు. రోవ్మన్ ఎలాంటి ఒత్తిడి లేకుండా బౌండరీలతో మ్యాచ్ను ముగించాడు’’ అని అశ్విన్ తెలిపాడు.
మరికొన్ని మ్యాచ్ విశేషాలు..
- ఐపీఎల్లో అత్యధిక విజయాలు సాధించిన రాజస్థాన్ కెప్టెన్ జాబితాలో షేన్ వార్న్ (31)తో సమంగా సంజూ శాంసన్ నిలిచాడు.
- ఐపీఎల్ ప్లేఆఫ్స్లో అత్యధిక ఓటములను చవిచూసిన తొలి జట్టు బెంగళూరు. 16 మ్యాచుల్లో పదింట్లో పరాజయంపాలైంది.
- ఒక్క ఐపీఎల్ సీజన్లో రాజస్థాన్ తరఫున అత్యధిక పరుగులు చేసిన మూడో బ్యాటర్ రియాన్ పరాగ్. ఈ ఎడిషన్లో అతడు 567 రన్స్ సాధించాడు. అన్క్యాప్డ్ ప్లేయర్ల లిస్ట్లోనూ అతడిది మూడో స్థానమే.
- సెకండ్ డౌన్ లేదా అంతకంటే కింది బ్యాటింగ్ ఆర్డర్లో వచ్చి అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాటర్ రియాన్. అతడి కంటే ముందు రిషభ్ పంత్ (579) ఉన్నాడు. మరో 13 పరుగులు చేస్తే పంత్ను రియాన్ అధిగమిస్తాడు.
- ఐపీఎల్లో ఒక్క హాఫ్ సెంచరీ కూడా లేకుండా అత్యధిక పరుగులు నమోదైన రెండో మ్యాచ్ ఇదే. బెంగళూరు 172 చేయగా.. రాజస్థాన్ 174 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ (45) టాప్ స్కోరర్.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ