Shami: ఆ క్యాచ్ చేజార్చా.. నా వంతు కోసం వేచి చూశా: షమీ
వన్డే ప్రపంచకప్లో (IND vs NZ) టీమ్ఇండియా ఫైనల్కు చేరుకోవడంలో మహమ్మద్ షమీ కీలక పాత్ర పోషించాడు. ఏడు పడగొట్టి న్యూజిలాండ్ బ్యాటింగ్ ఆర్డర్ను కుప్పకూల్చాడు.
ఇంటర్నెట్ డెస్క్: కీలక సమయంలో సులువైన క్యాచ్ను వదిలేయడంతో ఒక్కసారిగా వాంఖడే స్టేడియంలో (IND vs NZ) ప్రేక్షకులంతా సైలెంట్ అయిపోయారు. అప్పటికే క్రీజ్లో పాతుకుపోయిన కివీస్ కెప్టెన్ వికెట్ చేజారిందనే బాధ. ఆ క్యాచ్ను వదిలేసిన ఫీల్డర్ను విలన్గా చూసిన అభిమానులకు.. కాసేపట్లోనే అతడే తమ హీరోగా మారిపోయాడు. ఇప్పటికే అర్థమై ఉంటుంది కదా.. అతడే టీమ్ఇండియా పేసర్ షమీ (Shami). న్యూజిలాండ్తో జరిగిన సెమీస్లో బుమ్రా వేసిన స్లోబాల్ను అంచనా వేయడంలో విఫలమైన కేన్ మిడాన్లో క్యాచ్ ఇచ్చాడు. కానీ, అక్కడున్న ఫీల్డర్ షమీ దానిని వదిలిపెట్టేశాడు. అయితే, షమీనే కేన్తోపాటు టామ్ లేథమ్ను ఒకే ఓవర్లో పెవిలియన్కు పంపడంతో భారత అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు. మ్యాచ్ అనంతరం క్యాచ్ డ్రాప్పైనా షమీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
‘‘ఈ టోర్నీకి ముందు వరకు ఎక్కువగా పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడలేదు. అయితే, ఎప్పుడు అవకాశం వచ్చినా నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నా. చాలా మంది యార్కర్లు, స్లో బంతుల గురించే మాట్లాడుతుంటారు. కానీ, కొత్త బంతితోనూ వికెట్లు తీసేందుకు ప్రయత్నిస్తున్నా. ఆరంభంలో వికెట్లు తీస్తే ప్రత్యర్థిపై ఒత్తిడి పెరిగిపోతుంది. కివీస్తో మ్యాచ్లో కీలకమైన కేన్ విలియమ్సన్ క్యాచ్ను మిస్ చేశా. నాకే బాధేసింది. దీంతో బౌలింగ్లో నా వంతు కోసం ఎదురు చూశా. కివీస్ బ్యాటర్లు దూకుడుగా షాట్లు ఆడేస్తున్నారు. అయితే, వారిని కట్టడి చేసేందుకు బౌలింగ్ ప్రాథమిక సూత్రాలకు కట్టుబడి ఉన్నా. పిచ్ కూడా చాలా బాగుంది. కానీ, తేమ ప్రభావం వస్తుందేమోనని కంగారు పడ్డాం. ఇలాంటి సమయంలో స్లో వేసే బంతులు కూడా ప్రభావం చూపకపోవచ్చు. అందుకే, నేను శైలిలోనే బంతులను సంధించా. మేం 2015, 2019 సెమీస్లో ఓటములను చవిచూశాం. అయితే, ఈ సారి మాత్రం వదల్లేదు. ఇలాంటి అవకాశం మరోసారి వస్తుందనే ఆలోచన కూడా చేయడం లేదు’’ అని షమీ తెలిపాడు. ఏడు వికెట్లు తీసిన షమీనే ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కించుకున్నాడు.
రోహిత్ ఆరంభమే మాకు కలిసొచ్చింది: శ్రేయస్ అయ్యర్
‘‘భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఆరంభంలో దూకుడుగా ఆడాడు. అదే మాకు కలిసొచ్చే అంశం. శుభారంభాన్ని కొనసాగిస్తూ పరుగులు రాబట్టాం. అతడు ఫియర్లెస్ కెప్టెన్. దాంతో మిగిలిన వారిలోనూ అదే దూకుడు కనిపిస్తుంది. మేనేజ్మెంట్ కూడా ఎంతో మద్దతుగా నిలుస్తోంది. టోర్నీ ప్రారంభంలో నేను మంచి ఇన్నింగ్స్లు ఆడలేకపోయా. బయట నుంచి వచ్చే విమర్శలను ఏమాత్రం పట్టించుకోవద్దని సిబ్బంది మద్దతుగా నిలిచారు. బ్యాటింగ్పైనే దృష్టిపెట్టమని సూచించారు. ఒత్తిడి సమయంలోనూ ఎలా ఆడాలనేది తీవ్రంగా శ్రమించా. భారీగా అభిమానుల మధ్య ఇలాంటి పరిస్థితుల్లో ఆడటం ఎంతో సరదాగా ఉంటుంది. నెట్స్లోనూ నాణ్యమైన పేస్ బౌలింగ్తోపాటు స్పిన్నర్లను ఎదుర్కొంటూ సాధన చేశా. కొత్త బంతితో బుమ్రాను అడ్డుకోవడం చాలా కష్టం. అందుకే, నెట్స్లో బుమ్రా బౌలింగ్లోనూ ప్రాక్టీస్ చేశా. ఇదే ఇలా మ్యాచుల్లో రాణించడానికి సాయపడుతోంది’’ అని శ్రేయస్ అయ్యర్ వెల్లడించాడు. ఈ మ్యాచ్లో శ్రేయస్ (105) సెంచరీ సాధించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం