ICC: వరల్డ్ కప్ ‘ఫైనల్’ పిచ్ యావరేజ్.. వివాదాస్పదమైన భారత్-కివీస్ సెమీస్ ‘పిచ్’ రేటింగ్ ఎంతంటే?
భారత్లో జరిగిన వన్డే ప్రపంచ కప్ (ODI World Cup 2023) పిచ్ల రిపోర్ట్ను ఐసీసీ తాజాగా విడుదల చేసింది. ఇందులో టీమ్ఇండియా ఆడిన లీగ్లతోపాటు రెండు సెమీస్లు, ఫైనల్ మ్యాచ్ నివేదికలు ఉన్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్ (ODI World Cup 2023) క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించిన సంగతి తెలిసిందే. టీమ్ఇండియా వరుసగా పది మ్యాచ్లు గెలిచి ఫైనల్కు చేరింది. అయితే, తుది పోరులో ఆసీస్ విజేతగా నిలిచి కప్ను ఎగరేసుకుపోయింది. ఇరు జట్ల మధ్య జరిగిన ‘ఫైనల్’ కోసం వినియోగించిన పిచ్తోపాటు కీలక మ్యాచ్లకు సంబంధించిన పిచ్ల రేటింగ్ను ఐసీసీ తాజాగా విడుదల చేసింది. భారత్-ఆసీస్ ఫైనల్ మ్యాచ్ జరిగిన అహ్మదాబాద్ ‘పిచ్’కు ఐసీసీ యావరేజ్ రేటింగ్ ఇవ్వడం గమనార్హం. పిచ్ చాలా మందకొడిగా ఉన్నట్లు పేర్కొంది. అయితే అవుట్ ఫీల్డ్ మాత్రం ‘చాలా బాగుంది’ అని ఐసీసీ మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ వెల్లడించారు. తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా 50 ఓవర్లలో 240 పరుగులు మాత్రమే చేయగలిగింది. అనంతరం లక్ష్యఛేదనలో ఆసీస్ నాలుగు వికెట్లను కోల్పోయి 43 ఓవర్లలో విజయం సాధించింది. ట్రావిస్ హెడ్ 120 బంతుల్లోనే 137 పరుగులు చేశాడు.
వాంఖడే ‘గుడ్’
భారత్ - న్యూజిలాండ్ జట్ల మధ్య వాంఖడే వేదికగా తొలి సెమీస్ జరిగింది. అయితే, పిచ్ను మార్చారంటూ అంతర్జాతీయ పత్రికల్లో కథనాలు వెలువడటంతో.. ఐసీసీ అధికారులు స్పష్టత ఇచ్చారు. కొత్త పిచ్కు బదులు వాడిన పిచ్పై మ్యాచ్ను నిర్వహించారంటూ బీసీసీఐపై ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో ఆ పిచ్కు ఐసీసీ ‘బాగుంది’ అనే రేటింగ్ ఇచ్చింది. రెండో సెమీస్ జరిగిన కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్కు యావరేజ్ రేటింగ్ దక్కింది. ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా మధ్య రెండో సెమీస్ జరిగిన విషయం తెలిసిందే. స్వల్ప స్కోర్లు నమోదైన ఆ మ్యాచ్లో ఆసీస్ విజయం సాధించింది. దక్షిణాఫ్రికా 212 పరుగులకు ఆలౌట్ కాగా.. ఆస్ట్రేలియా కూడా స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు 47.2 ఓవర్లు తీసుకోవాల్సి వచ్చింది. ఐసీసీ రిఫరీ జవగళ్ శ్రీనాథ్ ఈడెన్ గార్డెన్స్ మైదానం అవుట్ ఫీల్డ్కు ‘వెరీ గుడ్’ రేటింగ్ ఇచ్చారు.
భారత లీగ్ మ్యాచ్లకు..
టీమ్ఇండియా దేశవ్యాప్తంగా తొమ్మిది మైదానాల్లో తొమ్మిది లీగ్ మ్యాచ్లను ఆడింది. కఠినమైన ప్రత్యర్థులు దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, పాకిస్థాన్, ఆస్ట్రేలియాను భారత్ ఓడించింది. కోల్కతా, లఖ్నవూ, అహ్మదాబాద్, చెన్నై మైదానాల్లో ఆ జట్లతో టీమ్ఇండియా తలపడింది. అయితే, ఆ పిచ్లన్నింటికీ ఐసీసీ ‘యావరేజ్’ రేటింగ్ ఇచ్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆ ఇద్దరు లేకపోవడం నష్టమే.. మరో 60 పరుగులు చేయాల్సింది: రుతురాజ్
మ్యాచ్ జరుగుతున్నప్పుడు పెద్దగా ఆందోళన పడని రుతురాజ్ టాస్ సమయంలో మాత్రం ఒత్తిడికి గురయ్యాడట. ఇదే విషయాన్ని స్వయంగా చెన్నై కెప్టెన్ వెల్లడించాడు. -
మ్యాక్సీ.. నీ మాయ ఏమైంది?
ఐపీఎల్లో ఇప్పటికే ఎన్నో మెరుపు ఇన్నింగ్స్లు ఆడిన గ్లెన్ మ్యాక్స్వెల్ (Glenn Maxwell) ఈసారి కూడా అలాగే అలరిస్తాడని ఫ్యాన్స్ ఆశించారు. కానీ మ్యాక్సీ పేలవ ఫామ్తో లీగ్ మధ్యలో తనకు తానుగా బ్రేక్ తీసుకుని షాక్ ఇచ్చాడు. -
‘ఇది మహాయుద్ధం’.. టీమ్ఇండియాకు అమితాబ్ స్పెషల్ మెసేజ్
T20 World Cup: టీ20 ప్రపంచకప్ కోసం భారత ఆటగాళ్లకు అమితాబ్ బచ్చన్ సందేశమిచ్చారు. తన కొత్త సినిమా ‘కల్కి’లోని అశ్వత్థామ అవతారంలో క్రికెటర్లలో ప్రేరణ నింపారు. -
ఫైనల్ ఓవర్లో సిక్స్.. ధోనీ రికార్డు మరింత పదిలం
MS Dhoni: బుధవారం పంజాబ్తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లో చెన్నై ఓడిపోయింది. అయితే, ధోనీ మాత్రం ఇప్పటి వరకు తన పేరిట ఉన్న ఓ రికార్డును ఈ మ్యాచ్తో మరింత పదిలం చేసుకున్నాడు. -
రస్మలై, బిర్యానీ మానేసి.. 16కిలోలు తగ్గి..
రిషబ్ పంత్.. పునరాగమన హీరో. ఘోర ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఇక మామూలుగా నడవడమే కష్టమనుకున్న దశ నుంచి, కెరీరే లేదనుకున్న స్థితి నుంచి కోలుకుని.. తిరిగి భారత జట్టులో చోటు సంపాదించడం ఎంతో స్ఫూర్తిదాయకం. -
చెన్నైకి పంజాబ్ పంచ్
పంజాబ్ కింగ్స్ అదుర్స్. వరుసగా నాలుగు ఓటముల అనంతరం కళ్లు చెదిరే బ్యాటింగ్తో గత మ్యాచ్లో కోల్కతాపై సంచలన విజయం సాధించిన ఆ జట్టు.. మరోసారి మెరిసింది. ఆల్రౌండ్ ఆధిపత్యంతో చెన్నై సూపర్కింగ్స్కు షాకిచ్చింది. -
రాజస్థాన్ను అడ్డుకునేనా?
వరుసగా నాలుగు విజయాలు.. రికార్డు స్కోర్లతో ఐపీఎల్లో జోష్ తీసుకొచ్చిన సన్రైజర్స్ హైదరాబాద్ ఒక్కసారిగా ఢీలాపడింది. వరుసగా రెండు పరాజయాలతో ప్రత్యర్థి జట్లకు కనీస పోటీ ఇవ్వలేని పరిస్థితికి చేరుకుంది. -
రింకు నిరాశ
మంచి ఫినిషర్గా పేరు తెచ్చుకున్న రింకు సింగ్ను టీ20 ప్రపంచకప్కు ఎంపిక చేయకపోవడం అభిమానులు, క్రికెట్ నిపుణులను షాక్కు గురి చేసింది. -
పోరాడి ఓడిన భారత్
థామస్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీ చివరి లీగ్ పోరులో భారత జట్టుకు చుక్కెదురైంది. ఇప్పటికే క్వార్టర్ఫైనల్లో అడుగుపెట్టిన భారత్.. గ్రూపు-సి ఆఖరి పోరులో 1-4తో ఇండోనేసియా చేతిలో ఓడింది. -
న్యూయార్క్కు పిచ్ల తరలింపు
టీ20 ప్రపంచకప్ ఆతిథ్యం కోసం అమెరికా ముస్తాబవుతోంది. న్యూయార్క్లో జరిగే మ్యాచ్ల కోసం డ్రాప్ ఇన్ పిచ్లను సిద్ధం చేస్తున్నారు. -
ఆసీస్ జట్టులో స్మిత్కు దక్కని చోటు
టీ20 ప్రపంచకప్లో పోటీపడే ఆస్ట్రేలియా జట్టును బుధవారం ప్రకటించారు. మిచెల్ మార్ష్ నేతృత్వంలోని 15 మంది సభ్యుల జట్టులో వెటరన్ బ్యాటర్ స్టీవ్ స్మిత్కు స్థానం దక్కలేదు. -
భారత జట్టుకు పారిస్ బెర్తే లక్ష్యం
పారిస్ ఒలింపిక్స్లో భారత రికర్వ్ జట్టు అర్హత సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు భారత ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ అన్నాడు. వ్యక్తిగత విభాగంలో ధీరజ్ ఒక్కడికే పారిస్ బెర్తు దక్కింది. -
మిగతా ఐపీఎల్కు మయాంక్ అనుమానం
ప్లేఆఫ్స్ గడువు సమీపిస్తున్న సమయంలో లఖ్నవూ సూపర్ జెయింట్స్కు పెద్ద ఎదురుదెబ్బ. యువ పేస్ సంచలనం మయాంక్ యాదవ్ మిగతా ఐపీఎల్కు అందుబాటులో ఉండటం అనుమానంగా కనిపిస్తోంది.