ICC: వరల్డ్ కప్ ‘ఫైనల్’ పిచ్ యావరేజ్.. వివాదాస్పదమైన భారత్-కివీస్ సెమీస్ ‘పిచ్’ రేటింగ్ ఎంతంటే?
భారత్లో జరిగిన వన్డే ప్రపంచ కప్ (ODI World Cup 2023) పిచ్ల రిపోర్ట్ను ఐసీసీ తాజాగా విడుదల చేసింది. ఇందులో టీమ్ఇండియా ఆడిన లీగ్లతోపాటు రెండు సెమీస్లు, ఫైనల్ మ్యాచ్ నివేదికలు ఉన్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్ (ODI World Cup 2023) క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించిన సంగతి తెలిసిందే. టీమ్ఇండియా వరుసగా పది మ్యాచ్లు గెలిచి ఫైనల్కు చేరింది. అయితే, తుది పోరులో ఆసీస్ విజేతగా నిలిచి కప్ను ఎగరేసుకుపోయింది. ఇరు జట్ల మధ్య జరిగిన ‘ఫైనల్’ కోసం వినియోగించిన పిచ్తోపాటు కీలక మ్యాచ్లకు సంబంధించిన పిచ్ల రేటింగ్ను ఐసీసీ తాజాగా విడుదల చేసింది. భారత్-ఆసీస్ ఫైనల్ మ్యాచ్ జరిగిన అహ్మదాబాద్ ‘పిచ్’కు ఐసీసీ యావరేజ్ రేటింగ్ ఇవ్వడం గమనార్హం. పిచ్ చాలా మందకొడిగా ఉన్నట్లు పేర్కొంది. అయితే అవుట్ ఫీల్డ్ మాత్రం ‘చాలా బాగుంది’ అని ఐసీసీ మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ వెల్లడించారు. తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా 50 ఓవర్లలో 240 పరుగులు మాత్రమే చేయగలిగింది. అనంతరం లక్ష్యఛేదనలో ఆసీస్ నాలుగు వికెట్లను కోల్పోయి 43 ఓవర్లలో విజయం సాధించింది. ట్రావిస్ హెడ్ 120 బంతుల్లోనే 137 పరుగులు చేశాడు.
వాంఖడే ‘గుడ్’
భారత్ - న్యూజిలాండ్ జట్ల మధ్య వాంఖడే వేదికగా తొలి సెమీస్ జరిగింది. అయితే, పిచ్ను మార్చారంటూ అంతర్జాతీయ పత్రికల్లో కథనాలు వెలువడటంతో.. ఐసీసీ అధికారులు స్పష్టత ఇచ్చారు. కొత్త పిచ్కు బదులు వాడిన పిచ్పై మ్యాచ్ను నిర్వహించారంటూ బీసీసీఐపై ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో ఆ పిచ్కు ఐసీసీ ‘బాగుంది’ అనే రేటింగ్ ఇచ్చింది. రెండో సెమీస్ జరిగిన కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్కు యావరేజ్ రేటింగ్ దక్కింది. ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా మధ్య రెండో సెమీస్ జరిగిన విషయం తెలిసిందే. స్వల్ప స్కోర్లు నమోదైన ఆ మ్యాచ్లో ఆసీస్ విజయం సాధించింది. దక్షిణాఫ్రికా 212 పరుగులకు ఆలౌట్ కాగా.. ఆస్ట్రేలియా కూడా స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు 47.2 ఓవర్లు తీసుకోవాల్సి వచ్చింది. ఐసీసీ రిఫరీ జవగళ్ శ్రీనాథ్ ఈడెన్ గార్డెన్స్ మైదానం అవుట్ ఫీల్డ్కు ‘వెరీ గుడ్’ రేటింగ్ ఇచ్చారు.
భారత లీగ్ మ్యాచ్లకు..
టీమ్ఇండియా దేశవ్యాప్తంగా తొమ్మిది మైదానాల్లో తొమ్మిది లీగ్ మ్యాచ్లను ఆడింది. కఠినమైన ప్రత్యర్థులు దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, పాకిస్థాన్, ఆస్ట్రేలియాను భారత్ ఓడించింది. కోల్కతా, లఖ్నవూ, అహ్మదాబాద్, చెన్నై మైదానాల్లో ఆ జట్లతో టీమ్ఇండియా తలపడింది. అయితే, ఆ పిచ్లన్నింటికీ ఐసీసీ ‘యావరేజ్’ రేటింగ్ ఇచ్చింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తూటా గురితప్పింది.. మిక్స్డ్ డబుల్స్లో నిరాశపర్చిన షూటర్లు
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజు భారత షూటర్లు నిరాశపర్చారు. మిక్స్డ్ డబుల్స్లో ఫైనల్కు చేరుకోలేకపోయారు. -
ఇప్పుడు చేసేద్దాం.. గంభీర్ పశ్చాత్తాప వ్యాఖ్యలపై సూర్య కామెంట్
Gautam Gambhir-Suryakumar Yadav: సూర్య విషయంలో విచారం వ్యక్తం చేస్తూ గతంలో గంభీర్ చేసిన వ్యాఖ్యలపై టీమ్ ఇండియా టీ20 కెప్టెన్ తాజాగా స్పందించాడు. -
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
-
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు