Cricket News: ప్లేయర్ ఆఫ్ ది మంత్ రేసులో వరల్డ్ కప్ హీరోలు.. టీ20 వరల్డ్ కప్ కొత్త లోగో!
ఇంటర్నెట్ డెస్క్: వన్డే వరల్డ్ కప్లో (ODI World Cup 2023) అత్యుత్తమ ప్రదర్శన చేసిన ముగ్గురు ఆటగాళ్లు ‘ప్లేయర్ ఆఫ్ ది మంత్’ అవార్డు రేసులో నిలిచారు. వచ్చే ఏడాది టీ20 ప్రపంచ కప్ల (T20 World Cup 2024) కోసం కొత్త లోగోను ఆవిష్కరణ.. రేసిజం పదం వాడిన పొరపాటుపై క్రికెట్ ఆస్ట్రేలియా క్షమాపణలు.. ఇలాంటి క్రికెట్ సంగతులు మీ కోసం..
షమీ, హెడ్, మ్యాక్స్వెల్.. ఎవరికి దక్కేను అవార్డు?
ప్రతి నెల అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఆటగాళ్లకు ఐసీసీ అవార్డును అందిస్తూ ఉంటుంది. ఈ క్రమంలో వన్డే ప్రపంచ కప్లో అద్భుతంగా ఆడిన ముగ్గురు ప్లేయర్లు ఈసారి నవంబర్ అవార్డు కోసం రేసులో నిలిచారు. వారిలో టీమ్ఇండియా నుంచి మహమ్మద్ షమీ, ఆసీస్ ఆటగాళ్లు ట్రావిస్ హెడ్, గ్లెన్ మ్యాక్స్వెల్ ఉన్నారు. నవంబర్లో జరిగిన వరల్డ్ కప్ మ్యాచుల్లో షమీ 15 వికెట్లు తీశాడు. అంతేకాకుండా మెగా టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గానూ ఘనత సాధించాడు.కేవలం 7 మ్యాచుల్లోనే 24 వికెట్లు పడగొట్టాడు. ఫైనల్లో సెంచరీతో అలరించిన ట్రావిస్ హెడ్ 120 బంతుల్లో 137 పరుగులు చేసి ఆసీస్ విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. మరో ఆటగాడు మ్యాక్స్వెల్ మూడు వన్డేల్లో 204 పరుగులు, రెండు వికెట్లు తీశాడు. అలాగే భారత్తో జరిగిన టీ20 సిరీస్లో సెంచరీ సాధించాడు.
బ్యాట్, బాల్, ఎనర్జీ.. పొట్టి కప్ కొత్త లోగోలు
సందడి చేసేందుకు టీ20 ప్రపంచ కప్ 2024 సిద్ధమవుతోంది. వచ్చే ఏడాది జూన్లో పురుషుల పొట్టి కప్ జరగనుండగా.. సెప్టెంబర్-అక్టోబర్ మధ్య మహిళల టీ20 ప్రపంచ కప్ ఉంటుంది. వరల్డ్ కప్లకు సంబంధించి ఐసీసీ కొత్త లోగోలను ఆవిష్కరించింది. ఈ సందర్భంగా ఐసీసీ మార్కెటింగ్ అండ్ కమ్యూనికేషన్స్ జీఎం క్లైయిర్ ఫర్లాంగ్ స్పందించారు. ‘‘అంతర్జాతీయంగా క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించడానికి పురుషుల, మహిళల ప్రపంచ కప్లు సిద్ధమవుతున్నాయి. కొత్తగా ఆవిష్కరించిన లోగోలు ఆకట్టుకుంటాయని ఆశిస్తున్నాం’’ అని తెలిపాడు.
అభిమానులకు క్రికెట్ ఆస్ట్రేలియా క్షమాపణలు
ప్రస్తుతం పాకిస్థాన్ జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది. మూడుటెస్టుల సిరీస్ ఆడేందుకు వెళ్లింది. వార్మప్ మ్యాచ్లో ప్రైమ్ మినిస్టర్ XI జట్టుతో పాకిస్థాన్ తలపడుతోంది. ఈ సందర్భంగా స్కోరు బోర్డుపై పాకిస్థాన్ జట్టును ఉద్దేశించి క్రికెట్ ఆస్ట్రేలియా (CA) పొరపాటున ఓ పదాన్ని వాడింది. దీంతో ఆస్ట్రేలియాకు చెందిన ఓ జర్నలిస్ట్ ఈ విషయాన్ని సీఏ దృష్టికి తీసుకెళ్లాడు. దీంతో వెంటనే ఆ పదాన్ని తొలగించిన సీఏ క్షమాపణలు చెబుతూ ప్రకటన జారీ చేసింది. ‘‘ఈ మ్యాచ్కు సంబంధించి గ్రాఫిక్ ఫీడ్ను డేటా ప్రొవైడర్ నుంచి తీసుకున్నాం. ఇంతకుముందెప్పుడూ ఈ టెక్నాలజీని పాకిస్థాన్ మ్యాచ్కు వినియోగించలేదు. అయితే, ఇది అత్యంత విచారకరమే. మాన్యువల్గా ఆ పొరపాటును సరిదిద్దాం’’ అని సీఏ వెల్లడించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
Asia Cup: మహిళల ఆసియా కప్ సెమీస్ పోరులో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. -
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
Paris Olympics 2024: కాసేపట్లో ఒలింపిక్స్ ప్రారంభం కానున్న అక్కడి రైల్ నెట్వర్క్పై దాడులు జరిగాయి. దాంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. -
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
Jasprit Bumrah: బౌలర్లూ జట్టును సమర్థంగా నడిపిన సందర్భాలున్నాయని అంటున్నాడు సీనియర్ పేసర్ బుమ్రా. కెప్టెన్గా తనను ఎంపిక చేయకపోవడంపై కీలక వ్యాఖ్యలు చేశాడు. -
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
Suryakumar Yadav: టీ20 కెప్టెన్సీ పెద్ద బాధ్యత అని, దాన్ని నిలబెట్టుకుంటానని అన్నాడు సూర్యకుమార్ యాదవ్. కొత్త కోచ్ గంభీర్తో తన బంధం ప్రత్యేకమైనదని చెప్పాడు. -
ఏదో ఒక పతకం కాదు.. పసిడి కొట్టడమే లక్ష్యం: గగన్ నారంగ్
ప్రతిసారి భారీ అంచనాలతో ఒలింపిక్స్కు వెళ్లడం.. కొన్ని పతకాలతో తిరిగి రావడం భారత్కు అలవాటుగా మారింది. కానీ, ఈసారి మాత్రం విభిన్నమైన పరిస్థితి ఉందని గగన్ నారంగ్ తెలిపారు. -
సింగారాల కోటలో బంగారాల వేట
దాదాపు 800 కోట్లు.. ఇదీ ప్రపంచ జనాభా!సుమారు 200.. ఇదీ ప్రపంచంలో ఉన్న దేశాల సంఖ్య! ఇంత పెద్ద ప్రపంచాన్ని, ఇన్ని దేశాల్ని ఒక చోట చేర్చి ఆటలాడించే అద్భుత వేదిక ఒలింపిక్స్! -
బాణం.. భలే ఆరంభం
పతకాల్లో గత రికార్డును అధిగమించాలనే పట్టుదలతో ఉన్న భారత్కు పారిస్ ఒలింపిక్స్లో శుభారంభం. రికర్వ్ ఆర్చరీలో భారత పురుషుల, మహిళల జట్లు నేరుగా క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించాయి. పురుషుల విభాగంలో తెలుగబ్బాయి బొమ్మదేవర ధీరజ్ అదిరే ప్రదర్శన చేశాడు. -
నిలిచిపోయేలా నిర్వహించాలని..
విశ్వ క్రీడా పండుగకు వేళైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా.. మెరుగైన భవిష్యత్కు బాటలు వేసేలా.. పారిస్ ఒలింపిక్స్ శుక్రవారం ఆరంభమవుతున్నాయి. ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి నదిలో ఆరంభ వేడుకలు జరగబోతున్నాయి. -
లిమ్.. ప్రపంచ రికార్డు
ఒలింపిక్స్లో రికార్డుల వేట మొదలైంది. ఆర్చరీ పోటీల తొలిరోజే వ్యక్తిగత విభాగంలో కొరియా అమ్మాయి లిమ్ సిహ్యోన్ ప్రపంచ రికార్డు సృష్టించింది. 694 పాయింట్లతో ఆమె అగ్రస్థానంలో నిలిచింది. -
ఫేవరెట్ భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ కీలక పోరుకు సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో బంగ్లాదేశ్తో భారత్ అమీతుమీ తేల్చుకోనుంది. -
స్వేచ్ఛను చాటే మస్కట్
ఫ్రిజెస్.. పారిస్ ఒలింపిక్స్ మస్కట్ పేరిది. ఫ్రాన్స్ చారిత్రక, సంప్రదాయ టోపీలైన ఫ్రిజియన్ క్యాప్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ మస్కట్కు రూపం ఇచ్చారు. ఈ టోపీలు స్వేచ్ఛ, విప్లవం, ఫ్రెంచ్రిపబ్లిక్కు సూచికలు. -
చాలా మెరుగయ్యా.. కోర్టులో చూస్తారు: సింధు
ఒలింపిక్స్లో హ్యాట్రిక్ పతకం సాధిస్తానని భారత స్టార్ షట్లర్ పి.వి.సింధు ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది. గత ఎనిమిది నెలలుగా బ్యాడ్మింటన్ దిగ్గజం ప్రకాశ్ పదుకొణె దగ్గర శిక్షణ తీసుకోవడం తన నమ్మకాన్ని పెంచిందని సింధు తెలిపింది. -
శ్రీలంక టూర్.. తిలక్ వర్మను తీసుకోవాలనుకున్న గంభీర్! కానీ..
శ్రీలంకతో జరగనున్న టీ20, వన్డే సిరీస్కు తిలక్ వర్మను ఎంపిక చేయాలని కోచ్ గౌతమ్ గంభీర్ భావించాడట.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆసియా కప్ సెమీస్.. భారత్ బౌలింగ్
-
ఒలింపిక్స్ వేళ.. ఫ్రాన్స్లో రైల్ నెట్వర్క్పై హింసాత్మక దాడులు
-
బౌలర్లూ కెప్టెన్సీ చేశారుగా.. జట్టు సారథి ఎంపికపై బుమ్రా కీలక వ్యాఖ్యలు
-
గూగుల్కు పోటీగా కొత్త సెర్చింజిన్.. తీసుకొచ్చిన చాట్జీపీటీ ఓనర్
-
రైటర్గా నాని.. జోరందుకున్న ప్రచారం
-
తెదేపా కొనసాగి ఉంటే 2021లోనే పోలవరం పూర్తయ్యేది: సీఎం చంద్రబాబు