Softsignal - ICC: ‘సాఫ్ట్ సిగ్నల్’కు మంగళం.. నిబంధనల్లో ఐసీసీ మార్పులు
క్రికెట్లో క్యాచ్ ఔట్ల విషయంలో వివాదాస్పదంగా మారిన ‘సాఫ్ట్ సిగ్నల్’కు ఐసీసీ మంగళం పాడింది. క్రికెట్ నుంచి ఈ నిబంధనను తొలగించింది.
దుబాయ్: క్రికెట్లో క్యాచ్ ఔట్ల విషయంలో వివాదాస్పదంగా మారిన ‘సాఫ్ట్ సిగ్నల్’కు ఐసీసీ మంగళం పాడింది. క్రికెట్ నుంచి ఈ నిబంధనను తొలగించింది. ఇన్ని రోజులు బంతిని ఆటగాళ్లు సరిగ్గా అందుకున్నారా? లేదా నేలకు తాకిందా? అనే అనుమానం ఉన్న క్యాచ్ల విషయంలో మైదానంలోని అంపైర్లు ఔట్ లేదా నాటౌట్ను ‘సాఫ్ట్ సిగ్నల్’గా చూపిస్తూ.. టీవీ అంపైర్ను తుది నిర్ణయం తీసుకోవాలని అడిగేవాళ్లు. రీప్లేలో పరిశీలించిన తర్వాత స్పష్టత లేకుంటే, గందరగోళ పరిస్థితుల్లో మైదానంలోని అంపైర్ తీసుకున్న ‘సాఫ్ట్ సిగ్నల్’ను సమర్థిస్తూ టీవీ అంపైర్ నిర్ణయం తీసుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. నాటౌట్లా కనిపించినప్పటికీ మైదానంలోని అంపైర్ ‘సాఫ్ట్ సిగ్నల్’ ఔట్గా ఇవ్వడం, టీవీ అంపైర్ దీన్ని సమర్థించడం చాలా సార్లు వివాదాస్పదమైంది. ఇకపై ఇలాంటి సాఫ్ట్ సిగ్నల్ ఉండదు. రనౌట్ మాదిరే నేరుగా టీవీ అంపైర్ను క్యాచౌట్ నిర్ణయం తీసుకోమని అడగొచ్చు. సౌరభ్ గంగూలీ సారథ్యంలోని పురుషుల క్రికెట్ కమిటీతో పాటు మహిళల క్రికెట్ కమిటీ చేసిన ప్రతిపాదనలకు సీఈసీ ఆమోదం తెలపడంతో ఐసీసీ ఈ మార్పు చేసింది.
‘‘సాఫ్ట్ సిగ్నల్ను తొలగించడమే ప్రధాన మార్పు. టీవీ అంపైర్ను నిర్ణయాలు కోరేటప్పుడు ఇకపై మైదానంలోని అంపైర్ల సాఫ్ట్ సిగ్నల్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నేరుగానే టీవీ అంపైర్ను సంప్రదించొచ్చు’’ అని ఐసీసీ ప్రకటించింది. ‘‘కొన్నేళ్లుగా క్రికెట్ కమిటీ సమావేశాల్లో సాఫ్ట్ సిగ్నల్ గురించి చర్చించాం. ఈ విధానం అనవసరమని కమిటీ అభిప్రాయపడింది. కొన్ని సార్లు రిప్లేలో స్పష్టత లేకపోవడంతో గందరగోళ పరిస్థితులు ఏర్పడుతున్నాయి’’ అని గంగూలీ తెలిపాడు. మరోవైపు ఫాస్ట్బౌలర్లను ఎదుర్కొనే బ్యాటర్లు, వికెట్లకు సమీపంలో ఉండే వికెట్ కీపర్, బ్యాటర్కు అత్యంత సమీపంలో ఉండే ఫీల్డర్లు హెల్మెట్లు తప్పనిసరిగా ధరించాలని ఐసీసీ సూచించింది. అంతే కాకుండా ఫ్రీ హిట్ బంతి స్టంప్స్ను తాకి వెళ్తే అప్పుడు పరుగులు తీసుకోవచ్చని కూడా స్పష్టం చేసింది. ఈ మార్పులు వచ్చే నెల 1న ఇంగ్లాండ్, ఐర్లాండ్ మధ్య ఆరంభమయ్యే టెస్టుతో అమల్లోకి వస్తాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం