Pak: భారత్ మా దేశానికి రాకపోతే.. మేం కూడా.. : పాక్ ప్రణాళికలను వివరించిన రమీజ్ రజా
వచ్చే ఏడాది ఆసియా కప్ పాక్ వేదికగా జరగనుంది. ఈ టోర్నీలో ఆడకూడదని భారత్ నిర్ణయించుకుంటే.. తమ వైఖరి ఎలా ఉంటుందో పాక్ క్రికెట్ బోర్డ్ చీఫ్ రమీజ్ రజా తెలిపాడు.
ఇంటర్నెట్ డెస్క్: దాయాది దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా పాక్తో.. భారత్ ద్వైపాక్షిక సిరీస్లు ఆడటం లేదన్న సంగతి తెలిసిందే. కేవలం ఐసీసీ ఈవెంట్లలో.. తటస్థ వేదికల్లో మాత్రమే పాక్తో టీమ్ఇండియా తలపడుతోంది. అయితే వచ్చే ఏడాది ఆసియా కప్ పాక్ వేదికగా జరుగుతుండటంతో.. ఈ టోర్నీలో భారత్ పాల్గొనడంపై కొంతకాలంగా చర్చ జరుగుతోంది. ఒకవేళ భారత్ తమ దేశంలో ఆడకపోతే.. తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయో పాక్ క్రికెట్ బోర్డ్ చీఫ్ రమీజ్ రజా తెలిపాడు.
ఆసియా కప్లో భారత్ ఆడకపోతే.. భారత్లో జరిగే 2023 వన్డే ప్రపంచకప్లో తాము ఆడబోమని రమీజ్ తేల్చి చెప్పాడు. వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్ టోర్నీకి ముందే 2023 ఆసియా కప్ జరగనుంది. ఆసియా కప్ కోసం భారత్.. పాక్కు రావొద్దని నిర్ణయం తీసుకుంటే.. ఈ విషయంలో తమ వైఖరి దృఢంగా ఉందని రమీజ్ స్పష్టం చేశాడు.
గత కొంత కాలంగా పాక్ క్వాలిటీ క్రికెట్ ఆడుతోందని.. భారత్ను రెండు సార్లు ఓడించామని రమీజ్ గుర్తు చేశాడు. ‘మా నిర్ణయం చాలా కచ్చితంగా ఉంది.. వాళ్లు(భారత్) ఇక్కడికి వస్తే.. మేం ప్రపంచకప్ ఆడటానికి అక్కడికి వెళ్తాం. వాళ్లు రాకపోతే.. మేమూ వెళ్లం. పాక్ లేకుండానే మెగా టోర్నీ ఆడనివ్వండి. వచ్చే ఏడాది ప్రపంచకప్లో పాక్ ఆడకపోతే.. ఆ టోర్నీని ఎవరు చూస్తారు?. మేం ఆటలో దూకుడు విధానాన్ని అనుసరిస్తున్నాం. మా జట్టు మంచి ప్రదర్శన ఇస్తోంది. జట్టు మంచి ఆటను ఆడినప్పుడే పాక్ క్రికెట్ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని నేను ఎప్పుడూ చెబుతుంటాను. బిలియన్ డాలర్ల ఎకానమీ కలిగిన బోర్డు ఉన్న జట్టును పాక్ నెలల వ్యవధిలోనే రెండుసార్లు ఓడించింది’ అని ఓ ఉర్దూ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వూలో పీసీబీ చీఫ్ తెలిపాడు. పాకిస్థాన్లో ఆసియా కప్ ఆడబోమంటూ.. బీసీసీఐ కార్యదర్శి జై షా చేసిన వ్యాఖ్యలు పాక్లో ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే టీమిండియాపై గతకొంతకాలంగా విమర్శలు చేస్తోన్న రమీజ్.. తాజాగా మరోసారి ఈ విషయంపై స్పందించారు.
2009లో గడాఫీ స్టేడియం బయట శ్రీలంక ఆటగాళ్లపై ఉగ్రదాడి అనంతరం.. ఆ దేశంలో క్రికెట్ ఆడటం ప్రపంచ దేశాలు మానేశాయి. అక్కడ 2009లో నిర్వహించిన ఆసియా కప్పే చివరి మల్టీ నేషనల్ ఈవెంట్. ఆ తర్వాత పరిస్థితులు మారడంతో 2015లో జింబాబ్వే, 2017లో శ్రీలంక అక్కడ పర్యటించింది. ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియా కూడా ఆ దేశంలో ద్వైపాక్షిక సిరీస్ ఆడింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
Paris Olympics 2024: 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ క్వాలిఫికేషన్ పురుషుల విభాగంలో షూటర్లు సరబ్జోత్ సింగ్, అర్జున్ చీమా నిరాశపర్చారు. -
తూటా గురితప్పింది.. మిక్స్డ్ డబుల్స్లో నిరాశపర్చిన షూటర్లు
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజు భారత షూటర్లు నిరాశపర్చారు. మిక్స్డ్ డబుల్స్లో ఫైనల్కు చేరుకోలేకపోయారు. -
ఇప్పుడు చేసేద్దాం.. గంభీర్ పశ్చాత్తాప వ్యాఖ్యలపై సూర్య కామెంట్
Gautam Gambhir-Suryakumar Yadav: సూర్య విషయంలో విచారం వ్యక్తం చేస్తూ గతంలో గంభీర్ చేసిన వ్యాఖ్యలపై టీమ్ ఇండియా టీ20 కెప్టెన్ తాజాగా స్పందించాడు. -
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి